breaking news
sathish jarkiholi
-
ఆ విషయంపై స్పందించను : మంత్రి
యశవంతపుర : మాజీ మంత్రి రమేశ్ జారకిహొళెని బుజ్జగించే విషయం ముగిసిన అధ్యాయమని అయన సోదరుడు, అటవీశాఖ మంత్రి సతీశ్ జారకిహొళె స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం పతనమైతే విధానసభకు ఎన్నికలు అనివార్యమని ఆయన చేసిన వ్యాఖ్యలు అశ్చర్యాన్ని కలిగించాయి. లోకసభ ఎన్నికలలో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలకు ఘోర పరాభావాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి రెండు పార్టీల నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సతీశ్ జారకిహొళె చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగంలో ప్రకంపనలను రేపుతున్నాయి. ఆయన సోమవారం బెళగావి సాంబ్రా విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి కొందరు మంత్రులు రాజీనామా చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సీఎం కుమారస్వామి నేతత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ, మాజీ మంత్రి రమేశ్ జారకీహొళె కలవటంపై తాను స్పందించన్నారు. -
మంత్రి ఇంట్లో 12 కిలోల బంగారం.. రూ.112కోట్లు
బెంగళూరు: కర్ణాటకలో ఐటీ అధికారులు అవాక్కయారు. ఓ మంత్రి ఇంటిపై జరిపిన ఐటీ సోదాల్లో లెక్కచూపని సొమ్మును చూసి ఖిన్నులయ్యారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్న సతీశ్ జర్కీహోలి అక్రమాస్తులు కూడ బెట్టినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం తెలుసుకున్న అధికారులు సోమవారం ఆయన ఇళ్లు, బంధువుల ఇళ్లు ఇతర ఆస్తులున్న ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.12 కిలోల బంగారం, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో లెక్క చూపని డబ్బు దాదాపు రూ.112 కోట్లు ఉన్నట్లు గుర్తించి షాకయ్యారు. ప్రస్తుతానికి మంత్రి కుటుంబ సభ్యులను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.