-
మాతా శారదాదేవి
ప్రాచీన ఆదర్శాలు–ఆధునిక జీవన విధానాలను సమన్వయం చేసుకున్న సరస్వతి ఆమె. ఒకవైపు ఇంటి వ్యవహారాలు చూస్తూ, కుటుంబంలోని ఒడిదుడుకులనే తపస్సుగా స్వీకరించిన సాధారణ గృహిణి ఆమె. బడికి వెళ్ళి పాఠాలు నేర్వలేదు. పుస్తకాలు చదవలేదు. కానీ ఆమెతో మాట్లాడిన గొప్పమేధావులు సైతం ఆమె ఆధ్యాత్మిక జ్ఞానానికి అబ్బురపోయేవారు. ఆవిడే శారదాదేవి. రామకృష్ణ పరమహంస ధర్మపత్ని. వీరిద్దరిది భౌతికమైన సంబంధం లేని అన్యోన్య దాంపత్యం. తామరాకుపై నీటిబొట్టులా సంసారంలో ఉంటూనే దాని ప్రభావం తమ మీద పడకుండా చూసుకున్నారు వీరిరువురూ. రామకృష్ణులను తన ఆధ్యాత్మిక పురోగతికి సాయపడే గురువుగా శారదాదేవి తలిస్తే, ఆమెను సాక్షాత్తూ కాళీమాతగా భావించేవారు రామకృష్ణులు. రామకృష్ణ పరమహంసను గురువుగా స్వీకరించినవారంతా శారదాదేవిని మాతృమూర్తిగా ప్రేమించారు. జగమంత కుటుంబం సాధకుడైన భర్తకు కాళీమాతలా, అతని శిష్యుకు తల్లిలా భాసించిన శారదాదేవి... మాతృమూర్తి అన్న మాటకు మరో నిర్వచనాన్ని ఇచ్చారు. తనకు పిల్లలు లేరనే లోటు లేకుండా శిష్యులనే తన సంతానంగా భావించి వారి ఆలనాపాలన చూసుకునేది శారదాదేవి.. భౌతికంగా రామకృష్ణులు దూరమయ్యాక ఏం చేయాలో, ఎటు వెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న శిష్యగణానికి శారదామాత తగిన ధైర్యాన్ని అందించారు. రామకృష్ణుని శిష్యులందరికీ కొత్త ఆశగా చిగురించారు. ఎలాంటి అధ్యాత్మిక సలహాకైనా, సందేహ నివృత్తికైనా శారదాదేవి దగ్గరకి చేరేవారు వారంతా. రామకృష్ణుల సాన్నిహిత్యంతో తనకు కలిగిన యోగానుభవాలను వారికి చెబుతూ ఓపికగా వారి సందేహాలను తీర్చేది శారదాదేవి అమ్మ నోట మాటలు–ఆణిముత్యాలు ధ్యానం ఆవశ్యకతను వివరిస్తూ ‘‘క్రమం తప్పక ధ్యానం చేస్తూ ఉంటే మనస్సు నిశ్చలమై ఒక స్థాయికి చేరి, ఇక ధ్యానంతో పనిలేని స్థితికి వస్తారు. తీవ్రమైన గాలులు మేఘాలను చిన్నాభిన్నం చేసినట్టు, భగవంతుడి నామం మనోమాలిన్యాలను తొలగిస్తుంది. అందుకే నామజపం ఒక సాధనగా అభ్యసించాలి’’ అని చెప్పేవారు. అలాగే మీకు మనశ్శాంతి కావాంటే ఎదుటివారి తప్పులు వెతకడం మానండి. మీలోని తప్పులను సరిదిద్దుకోండి. ఎవ్వరూ పరాయివారు కాదు. ప్రపంచమంతా మనదే’’. అంటూ సందేశాన్ని అందించారు. – అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని, వేదపండితులు, (నేడు శారదా దేవి జయంతి) -
ఏజెంట్ శిఖరం
ఎల్ఐసీలో రాణిస్తున్న మహిళ =నాలుగేళ్లుగా ఎండీఆర్టీకి అర్హత =తాజాగా కోర్టు ఆఫ్ ది టేబుల్కు... =కమీషన్ రూపేణా ఏడాదికి రూ.25 లక్షలు ఎన్జీవోస్ కాలనీ, న్యూస్లైన్ : గుండెపోటుతో తండ్రి వీరస్వామి అకాల మరణం చెందడం కుటుంబాన్ని కుం గదీసినా... ధైర్యాన్ని కూడగట్టుకుని ఇద్ద రు చెల్లెలు, సోదరుడు, తల్లి భారతీదేవికి పెద్ద దిక్కుగా నిలిచింది సీర్లవంచ శారదాదే వి. తండ్రి మృతి సమయంలో ఉపాధి కార్యాలయం నుంచి వచ్చిన కాల్లెటర్తో ఎల్ఐసీ లో ఏజెంట్గా చేరి కుటుంబ పోషణ బాధ్యత లు మీద వేసుకుంది. ఇంటర్ చదువు తూ... అకుంఠిత దీక్షతో పాలసీలు చేయిస్తూ జీవిత బీమా సంస్థలో అనతికాలంలోనే ప్రత్యేకతను చాటుకుంది. బాధలు దిగమిం గుతూ ఏజెంట్గా కెరీర్ మొదలు పెట్టిన తొ మ్మిది నెలల కాలంలోనే ద్విచక్రవాహనం పొందేం దుకు అర్హత సాధించిందంటే... ఆ మెలోని పట్టుదలను ఇట్టే గ్రహించవచ్చు. అంతేకాదు జీవిత బీమా సంస్థలో అత్యుత్తమ రికార్డులు సాధిస్తూ... తన రికార్డులను తానే బద్దలు కొ డుతూ మిగతా ఎల్ఐసీ ఏజెంట్లకు స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలుస్తోంది శారదాదేవి. కోర్ట్ ఆఫ్ ది టేబుల్కు 8వ ఏజెంట్... వరంగల్ ఎల్ఐసీ డివిజన్లో ఎండీఆర్టీ సాధించిన మహిళా ఏజెంట్ శారదాదేవి కావడం విశేషం. ఏజెంట్గా రాణించడంతో ఆమెను చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వయిజర్గా నియమించారు. దీంతో ఆమె వ్యక్తిగతంగా బీమా చేయిస్తుండడంతోపాటు మరో 18 మంది ఏజెంట్లను నియమించుకుని విస్తృతంగా పాలసీలు చేయించారు. ఇలా ఒకే సంవత్సరంలో రూ.25 లక్షలకు పైగా కమీషన్ పొంది కోర్ట్ ఆఫ్ ది టేబుల్కు వరంగల్ డివిజన్ నుంచి ఎంపికైన తొలి ఏజెంట్గా రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్తోపాటు క ర్ణాటక రాష్ట్రాలు కలిగిన సౌత్ సెంట్రల్ జోన్లో ఎల్ఐసీకి 17 డివిజన్లు, 324 బ్రాంచీలున్నాయి. వీటిలో నుంచి కోర్ట్ ఆఫ్ ది టేబుల్కు 8వ ఏజెంట్గా శారదా దేవి ఎంపికై వరంగల్ ఎల్ఐసీ డివిజన్కు గర్వకారణంగా నిలిచింది. ఉన్నత చదువులు అభ్యసించినా... 2004లో ఎల్ఐసీ ఏజెంట్గా కెరీర్ ప్రారంభించిన శారదాదేవి... 2006లో మొగుళ్లపల్లి మండలం మొట్లగూడానికి చెందిన రమేష్ను వివాహమాడింది. వారికి ఇద్దరు కుమార్తెలు శ్రీవైష్ణవి, శ్రీహర్ష ఉన్నారు. ఎమ్మెస్సీ మ్యాథ్స్ చదివి ఉన్నత స్థాయి ఉద్యోగం చేసే అర్హత ఉన్నప్పటికీ.. శారదాదేవి ఎల్ఐసీ ఏజెంట్గా కొనసాగుతూ వస్తోంది. ఎల్ఐసీ జీవితాన్ని ఇచ్చింది... ఎల్ఐసీ నాకు జీవితాన్నిచ్చింది. కష్టాల్లో అండగా నిలిచింది. కుటుంబానికి ఆసరాగా నిలిచింది. చెల్లె, తమ్ముడు విద్యావంతులై జీవితంలో స్థిరపడడం నాకెంతో తృప్తినిచ్చింది. భర్త వ్యాపారంలో నష్టపోయినపుడు తమకు ధైర్యాన్నించ్చింది ఈ ఎల్ఐసీ ఏజెన్సీనే. దీంతో నా భర్తకు కూడా ఏజెంట్గా చేర్పించాను. నా ఇద్దరు కూతుళ్లు డాక్టర్, కలెక్టర్ అయినా.. వారిద్దరిని ఎల్ఐసీ ఏజెంట్గా చేర్పిస్తా. ఉన్నత చదువు చదివి ఏజెంట్గా చేయడమేమిటని బాధపడ్డా. ఏం చేస్తున్నామనేది కాదు... చేసిన దానిలో విజయం సాధించడం ముఖ్యం. ఆ విజయం నీవే సాధించావని స్నేహితులు అనడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. నా భర్త రమేష్ సహకారంతో నేను ఈ విజయాలను సాధిస్తూ వస్తున్నా. మొగుళ్లపల్లి మండలం మొట్లగూడెం గ్రామంలో వరుసగా రెండేళ్లు వంద శాతం పాలసీలు చేయించి, భీమాగ్రామ్గా ఎంపిక చేయించాను. దీంతో రెండు సంవత్సరాలు ఎల్ఐసీ ఆ గ్రామానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఈ మొత్తానికి తాము కొంత కలిపి గ్రామంలో రెండు బోర్లు వేయించి, నీటి కొరతను తీర్చాం. - సీర్లవంచ శారదాదేవి, ఎల్ఐసీ ఏజెంట్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
పోలింగ్ రోజున ‘ర్యాపిడో’ ఉచిత సేవలు
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement