-
Santosham OTT Awards Photos: అంగరంగ వైభవంగా 'సంతోషం' ఓటీటీ అవార్డ్స్ (ఫొటోలు)
-
ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? నాగార్జునతో అప్పుడలా ఇప్పుడేమో
ఈమెని మీరు కచ్చితంగా గుర్తుపట్టలేరు. ఎందుకంటే అప్పుడెప్పుడో 2002లో తెలుగులో ఫస్ట్ సినిమా చేసింది. అది కూడా నాగార్జునతో. కానీ బ్యాడ్ లక్. అదృష్టం కలిసి రాలేదు. సినిమా హిట్ కాలేదు. అయితేనేం మరో సినిమలో అవకాశమొచ్చింది. అదీ ఫెయిలైంది. దీంతో తెలుగు దర్శకనిర్మాతలు ఈమెని పట్టించుకోలేదు. మధ్యలో ఓ తెలుగు మూవీలో గెస్ట్ రోల్ చేసింది అంతే. అలాంటి ఆమె ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఇంతకీ ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు గ్రేసీ సింగ్. ఈ పేరు ఎక్కడో విన్నట్లు, ఈమెని ఎక్కడో చూసినట్లు ఉంది కదా! అవును మీలో కొందరు కరెక్ట్గానే గెస్ చేశారు. 'సంతోషం' సినిమాలో నాగార్జున పక్కన హీరోయిన్గా చేసింది ఈమెనే. దిల్లీలో పుట్టి పెరిగిన ఈమె.. చిన్నప్పుడే భరతనాట్యం, ఒడిస్సీ లాంటి క్లాసికల్ డ్యాన్స్ నేర్చకుంది. అలా డాన్స్ గ్రూప్తో ప్రదర్శనలు ఇస్తూ గుర్తింపు తెచ్చుకుంది. పదిహేడేళ్లకే ఓ సీరియల్లో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. 19 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చేసింది. (ఇదీ చదవండి: ఆ రూమర్స్పై 'భోళా శంకర్' నిర్మాత ఆగ్రహం.. చిరు ఎప్పుడూ!) అయితే 2001లో ఆమిర్ ఖాన్ 'లగాన్' సినిమా గ్రేసీ సింగ్కి కాస్త పేరు తీసుకొచ్చింది. తెలుగులో ఒకే ఏడాది(2002)లో 'సంతోషం', 'తప్పు చేసి పప్పుకూడు' సినిమాలు చేసింది కానీ కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్కి వెళ్లిపోయింది. 2010లో మరోసారి టాలీవుడ్లో 'రామరామ కృష్ణ', 'రామ్ దేవ్' అనే చిత్రాల్లో యాక్ట్ చేసింది గానీ బ్యాడ్ లక్. దీంతో మళ్లీ హిందీ, పంజాబీలో 2015 వరకు సినిమాలు చేసింది. ఆ తర్వాత సీరియల్స్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ఈమె నటిగా చాలా పేరు తెచ్చుకున్నప్పటికీ డ్యాన్స్ మాత్రం అస్సలు విడిచిపెట్టలేదు. మొన్నీమధ్య ప్రధాని నరేంద్ర మోదీ ముందు బ్రహ్మకుమారీస్ తరఫున ఫెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అప్పట్లో అందంగా ఉన్న గ్రేసీ.. వయసు పెరిగేకొద్ది చాలా మారిపోయింది. తాజాగా ఆమె ఫొటోలు చూసి తెలుగు ప్రేక్షకులు కాస్త తికమక పడ్డారు. ఎవరో గుర్తొచ్చి కింద కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Gracy Singh (@iamgracysingh) View this post on Instagram A post shared by Brahma Kumaris (@brahmakumaris) (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న రానా తమ్ముడు! అమ్మాయి ఎవరంటే?) -
ఘనంగా సంతోషం అవార్డ్స్ కార్యక్రమం (ఫొటోలు)
-
డిసెంబర్లో ‘సంతోషం’
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అందచేస్తూ వస్తున్న అనేక అవార్డులలో ‘సంతోషం’ అవార్డ్సు ఒకటి. ‘సంతోషం’ సినీ వారపత్రిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే ‘సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్’కి తేదీ ఖరారు అయింది. డిసెంబర్ 26న హైదరాబాద్లో ‘21వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022’ వేడుకలు జరగనున్నాయి. సౌత్ ఇండియా లోని నాలుగు భాషల సినిమాలకు అవార్డులు అందిస్తూ వస్తున్నారు ‘‘తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషలకు అవార్డులు అందించనున్నాం. ఈ వేడుకలో భాగంగా 12 గంటలపాటు నాన్స్టాప్ వినోదం ఉంటుంది’’ అని సంతోషం పత్రికాధినేత, నిర్మాత సురేష్ కొండేటి అన్నారు. -
లిరిక్స్ మారిస్తే కానీ షూట్ చేయమన్నారు : ఆర్పీ పట్నాయక్
నాగార్జున హీరోగా దశరథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'సంతోషం'. గ్రేసీ సింగ్, శ్రియా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇక ఈ సినిమాలోని ప్రతీ పాట సూపర్ హిట్టే. 2002లో విడుదలైన ఈ సినిమా ఇటీవలె 20ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సంతోషం మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'దేవుడే దిగివచ్చినా' సాంగ్ కంపోజింగ్ చాలా విచిత్రంగా జరిగింది. ముందు వేరే పాట ఇచ్చాను. కానీ ఆ పాటకి ఎలా కంపోజ్ చేయాలో తెలియడం లేదని రాజు సుందరం మాస్టర్ షూటింగ్ ఆపేశారు. లిరిక్స్ మారిస్తేనే చేస్తానని చెప్పారు. దీంతో చాలా టెన్షన్ పడిపోయాను. నేను వాష్ రూమ్కి వెళ్తే డైరక్టర్ దశరద్ బయటి నుంచి గడియ పెట్టి బంధించాడు. పల్లవి చెబితేనే గడియ తీస్తానన్నాడు. అదే టెన్షన్లో 'దేవుడే దిగివచ్చినా' అనే పల్లవి చెప్పాను. దీంతో మిగతా లైన్స్ వచ్చేస్తాయిలే అని దశరధ్ గడియ తీశాడు. అలా లిరిక్స్ మార్చి షూటింగ్ చేశాం' అంటూ చెప్పుకొచ్చారు. -
సంతోషం ఆగదు
‘‘సంతోషం’ సినీ వారపత్రిక నేటితో 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. పత్రికాధినేత సురేష్ కొండేటి ప్రతి ఏటా ‘సంతోషం’ అవార్డుల వేడుకని ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేడుక గురించి సురేష్ మాట్లాడుతూ –‘‘సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ ఎప్పుడు అనేది ప్రతి ఏటా ఆగస్టు 2న ప్రకటించడం, అదే రోజు కర్టెన్రైజర్ ఫంక్షన్ కూడా చేయడం తెలిసిందే. కరోనా వల్ల ఈసారి ఈ ఫంక్షన్ కాస్త ఆలస్యం అవుతుంది. అంతేకానీ సంతోషం వేడుక ఆగదు. కచ్చితంగా ఉంటుంది. సామాజిక దూరం పాటిస్తూ తక్కువ మందితో ఫంక్షన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఎప్పుడు? ఎక్కడ? అనేది అతి త్వరలోనే ప్రకటిస్తాం. ప్రతి ఏడాది ఈ ఫంక్షన్లో పేద కళాకారులకు సహాయం చేస్తున్నాం. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న చిత్ర పరిశ్రమలోని కొంతమందికి సహాయం చేసేలా ఈ ఏడాది ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్
-
సంతోషంగా...
‘‘రాష్ట్ర ప్రభుత్వం గతంలో సినిమా అవార్డులు ఇచ్చేది. రాను రాను మరచిపోయింది. కొన్ని ప్రైవేటు సంస్థలు అవార్డులు ఇచ్చినా కొద్దికాలం ఇచ్చి ఆపేశారు. సురేశ్ కొండేటి పద్నాలుగేళ్లగా అవార్డులు ఇస్తున్నాడు’’ అని దాసరి నారాయణరావు అన్నారు. ‘సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్’ వేడుకలు ఆదివారం జరిగాయి. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినిమా పరిశ్రమ నటీనటులకు, టెక్నీషియన్లకు అవార్డులు అందించారు. సంతోషం లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ అవార్డును గిరిబాబు, తాళ్లూరి రామేశ్వరికి ఇచ్చారు. ఏయన్నార్ స్మారక అవార్డు ను మురళీమోహన్, జీవన సాఫల్య పురస్కారా న్ని జయప్రద, అల్లు రామలింగయ్య స్మారక అవార్డును పృధ్వీ, డి. రామానాయుడు స్మారక అవార్డును ఎడిటర్ మోహన్ అందుకున్నారు. ఉత్తమ హీరోగా ప్రభాస్, నటిగా అనుష్క, నూతన హీరోగా అఖిల్, నూతన హీరోయిన్గా హెబ్బాపటేల్, ఉత్తమ చిత్రంగా ‘రుద్రమదేవి’, దర్శకుడిగా కొరటాల శివ, నిర్మాతలు గా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విలన్గా రానా, సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్.. ఇలా ఇతర విభాగాల్లో పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులను అవార్డుకి ఎంపిక చేశారు. -
సో మచ్ టు సే...సంతోషం
సినిమా వెనుక స్టోరీ - 3 లంచ్ బ్రేక్. బెనర్జీ, దశరథ్ ఇద్దరూ భోంచేస్తున్నారు. మధ్యలో ఏవో పిచ్చాపాటీ కబుర్లు. ‘‘నీ దగ్గర కథలేమైనా ఉన్నాయా?’’ యథాలాపంగా అడిగారు బెనర్జీ. ‘‘ఓ... చాలా ఉన్నాయ్ సార్. మీరు చేతులు వాష్ చేసుకు రండి. ఇప్పటికిప్పుడు ఓ కథ చెప్తా’’ అన్నాడు దశరథ్.‘నువ్వు-నేను’ షూటింగ్ స్పాట్ అది. తేజ డెరైక్టర్. దశరథ్ అసిస్టెంట్ రైటర్ కమ్ అసోసియేట్ డెరైక్టర్. నటుడు బెనర్జీకి ఇండస్ట్రీలో పరిచయాలెక్కువ. టాలెంట్ను ఎంకరేజ్ చేసే గుణమున్నవాడు కాబట్టి, దశరథ్ని తీసుకెళ్లి నిర్మాతలు కేఎల్ నారాయణ, ఎస్. గోపాలరెడ్డిలకు పరిచయం చేశాడు. వాళ్లిద్దరూ కలసి పెట్టిన దుర్గా ఆర్ట్స్ టాప్ బేనర్. ‘క్షణక్షణం, హలో బ్రదర్, దొంగాట, ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు’ అన్నీ సూపర్ హిట్సే. వాళ్లు మంచి స్టోరీ కోసం వెతుకుతున్నారు. దశరథ్ వచ్చాడు... ‘వన్ హౌస్’ కథ చెప్పాడు. సింగిల్ సిట్టింగ్లో ఓకే. స్మాల్ బడ్జెట్... సింగిల్ లొకేషన్... థర్టీ డేస్ షూటింగ్... హీరో తరుణ్ ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. కాల్ షీట్స్ ఫుల్ టైట్. ఫోర్ మంత్స్ తర్వాతే షూటింగ్ పెట్టుకోవాలి. అందుకే మధ్య మధ్యలో ‘నువ్వు-నేను’ వర్క్కు అటెండ్ అవుతున్నాడు దశరథ్. కేఎల్ నారాయణ, గోపాలరెడ్డిలకు ఈ సినిమాతో పాటు ఇంకో సినిమా కూడా లైన్లో ఉంది. నాగార్జున డేట్స్ రెడీ. కానీ కథే లేదు. ఎవరెవరో రైటర్స్ వస్తున్నారు... చెబుతున్నారు... వెళుతున్నారు. దశరథ్ దగ్గర ఓ యాక్షన్ కథ ఉంది. ఈ ఇద్దరికీ చెప్పాడు. నచ్చేసింది. స్థలం దొరికితే ఇల్లు కట్టడం ఎంతసేపు! నాగార్జున దగ్గరకు కథ వెళ్లింది. అంతా ఓకే. కానీ డైలమా. షాజీ కైలాస్ డెరైక్షన్లో ‘శ్రీరామ్’ అనే యాక్షన్ సినిమా కమిటయ్యాడు నాగ్. ఒకేసారి రెండు యాక్షన్ సినిమాలంటే కష్టం. ‘‘ఏదైనా ఫ్యామిలీ కథ ఉంటే చూడమనండి’’ చెప్పాడు నాగ్. హీరో చెప్పాడంటే ఇక తిరుగేముంది! దశరథ్, రైటర్ గోపీమోహన్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరూ ఓ రెస్టారెంట్లో కూర్చున్నారు. ‘‘గోపీ! ఇది మనకు గోల్డెన్ చాన్స్. నాగార్జున గారికి అర్జంట్గా మంచి ఫ్యామిలీ కథ చేయాలి మనం’’ చెప్పాడు దశరథ్ ఉద్వేగంగా. ఇద్దరూ ఏవేవో అనుకున్నారు. ఆ రాత్రి దశరథ్కి నిద్ర పట్టలేదు. నాగ్కి మంచి కథ చేయాలి. ‘హమ్ దిల్ దే చుకే హై సనమ్’ హిందీ సినిమా గుర్తొచ్చింది. అందులో అజయ్ దేవగణ్ క్యారెక్టరైజేషన్ ఎక్స్లెంట్. అలా ఉండాలి నాగ్ క్యారెక్టరైజేషన్. బుర్రలో లైట్స్ ఆన్. వారంలో లైన్ రెడీ. నాగ్కి చెబితే ఫ్లాట్. ఎస్... తనకు రైట్ టైమ్లో రైట్ సబ్జెక్ట్. పూర్తి స్క్రిప్టు చేయమని నాగ్ ఆదేశం.దశరథ్ ఆ పనిలో ఉన్నాడు. మొత్తానికి బౌండ్ స్క్రిప్ట్ రెడీ. నాగ్ మళ్లీ విన్నాడు. కానీ ఏం మాట్లాడలేదు. నచ్చలేదా? దశరథ్లో డౌట్. ‘నువ్వు - నేను’ కోసం ‘గాజువాక పిల్లా...’ పాట షూట్ చేస్తున్నారు. బోలెడంత మంది స్టూడెంట్స్... హంగామా. దశరథ్ చాలా బిజీగా ఉన్నాడు. అసోసియేట్ కదా! ‘‘ప్లీజ్ కాల్ మీ అర్జంట్’’ అంటూ గోపాలరెడ్డి దగ్గర నుంచీ పేజర్ మెసేజ్. లంచ్ బ్రేక్లో కాల్ చేశాడు దశరథ్. ‘‘కంగ్రాట్స్! నాగార్జున గారికి కథ బాగా నచ్చేసింది. నిన్నే డెరైక్ట్ చేయమంటున్నారు’’ చెప్పారు గోపాలరెడ్డి. దశరథ్ ఉలిక్కిపడ్డాడు. ‘‘ఏంటి సార్... మీరనేది?’’ ‘‘అవును దశరథ్! నాగార్జునగారు ఆగస్టు నుంచి డేట్లు కూడా ఇచ్చేశారు. నువ్వు రెడీ అవ్వు’’ అన్నారు గోపాలరెడ్డి. దశరథ్కి కాళ్లూ చేతులూ ఆడడం లేదు. ఏదో అనుకుంటే, ఇంకేదో అవుతోంది. తనకిది నిజంగా బంపర్ ఆఫరే! మరి తరుణ్ సినిమా? ‘‘లేదు లేదు... తరుణ్తో మేం మాట్లాడతాం. నీకేమీ ఇబ్బంది ఉండదు’’ అని గోపాలరెడ్డి భరోసా ఇచ్చారు. అయినా దశరథ్లో టెన్షన్ తగ్గలేదు. ‘‘సార్..! నాగార్జున లాంటి పెద్ద హీరోతో ఇప్పటికిప్పుడు సినిమా అంటే కష్టం. నా వల్ల కాదు. కథ వరకూ తీసుకోండి... ఇచ్చేస్తాను’’ అని చెప్పేశాడు.నాగార్జున దాకా వెళ్లింది విషయం. ఆయనకు దశరథ్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్. తానెంతమంది కొత్త డెరైక్టర్లను చూడలేదు! మొదట్లో ఇలానే బెరుకు ఉంటుంది. ‘‘దశరథ్ రియల్ ప్రాబ్లమేంటో కనుక్కోండి’’ - మళ్లీ నాగ్ ఆదేశం. ‘‘నా మీద నాకు కాన్ఫిడెన్స్ రావాలి. నవంబర్ అయితే ఓకే. ఈలోగా నేనూ రెడీ అవుతా’’ అని చెప్పేశాడు దశరథ్. నాగ్ లాంటి స్టార్ హీరో అన్నాళ్లు ఆగుతాడా? కానీ ఆగాడు. కథ అంతలా నచ్చేసింది మరి. టైటిల్ కూడా బాగా కుదిరింది. ‘సంతోషం’. గోపీమోహన్ పెట్టాడు. ఇద్దరు హీరోయిన్లు కావాలి. ‘లగాన్’ ట్రయిలర్ రిలీజైంది ఫ్రెష్గా. ‘రాధా కైసాన జలే...’ అంటూ హీరోయిన్ గ్రేసీసింగ్ కవ్విస్తోంది. గ్రేసీ అయితే గ్రేస్ఫుల్గా ఉంటుందనిపించింది దశరథ్కు. ఈలోగా ‘లగాన్’ రిలీజై, బ్లాక్బస్టర్ అయిపోయింది. గ్రేసీకి పెద్ద క్రేజ్. అంత సులువుగా డేట్లు దొరుకుతాయా? దొరికేశాయ్. కథ నచ్చేసింది మరి! మరి ఇంకో హీరోయిన్? రకరకాల ఆప్షన్లు. ఈ వెతుకులాట ఇలా ఉండగా పబ్లిసిటీ డిజైనర్ కృష్ణ ఆఫీసుకెళ్లాడు దశరథ్. ఏదో పోస్టర్ డిజైన్ చేస్తున్నాడు కృష్ణ. ఉషాకిరణ్ మూవీస్ వాళ్ల సినిమా ‘ఇష్టం’. హీరోయిన్ కొత్తమ్మాయి. క్యూట్గా ఉంది. కొత్తావకాయలా ఉంది. కానీ మరీ టీనేజ్ గాళ్లా కనబడుతోంది. నాగ్ పక్కన సూటవుతుందా? ఫొటోసెషన్ పెట్టారు. అంతా ఓకే. సెకండ్ హీరోయిన్గా శ్రీయ సెలక్ట్. ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ ఉంది. ఇంట్రస్టింగ్ యాక్టర్ ఎవరైనా కావాలి. ప్రభుదేవా పేరు సూచించారు గోపాలరెడ్డి. అతనుంటే సెకండాఫ్లో మంచి డాన్స్ సాంగ్ కూడా పెట్టొచ్చని ఐడియా. ప్రభుదేవా ఓకే అన్నాడు. త్రివిక్రమ్, చంద్రసిద్ధార్థ్, ఆర్పీ పట్నాయక్, దశరథ్, సునీల్... వీళ్లంతా ఓ గ్యాంగ్. సోమాజీగూడా ‘ట్రైలక్’ రెస్టారెంట్... వీళ్ల అడ్డా. అక్కడే వీళ్ల కెరీర్కు బీజాలు పడ్డాయి మరి. ఆర్పీ, దశరథ్ అక్కడే కూర్చుని పాటల గురించి మాట్లాడుకునేవారు. చంద్రసిద్ధార్థ్ రాగానే ‘‘ చందూ బాయ్..! పదండి గండిపేటకు వెళ్దాం’’ అని తొందరపెట్టేసేవారు. ఆ గ్యాంగ్లో చంద్రసిద్ధార్థ్ ఒక్కడికే కారు. మిగతా వాళ్లందరికీ బైక్లు. ఆ ట్రావెలింగ్లోనే మ్యూజిక్ సిట్టింగ్స్. ఓ సిట్యుయేషన్లో ఇంగ్లిషు పాట పెడదామనుకున్నారు. ఆర్పీ ఏదో ట్యూన్ చెబుతున్నాడు. కారు డ్రైవ్ చేస్తున్న చంద్రసిద్ధార్థ్ చాలా క్యాజువల్గా ‘సో మచ్ టు సే...’ అంటూ పాడేస్తున్నాడు. ‘‘ఈ పాట ఎందులోది?’’ అడిగాడు ఆర్పీ. ‘‘నువ్వు కట్టిన ట్యూన్కి నేను క్యాజువల్గా లిరిక్ చెప్పానంతే’’ అని భుజాలెగరేశాడు చంద్రసిద్ధార్థ్. ఆర్పీ చిన్నపిల్లాడిలా సంబరపడిపోతూ ‘‘చందూ గారూ..! ఈ ఇంగ్లిషు పాట మీరే రాయలి’’ అన్నాడు. అలా డెరైక్టర్ చంద్రసిద్ధార్థ్తో ఆ ఇంగ్లిషు పాట రాయించేశారు స్క్రిప్ట్ బాగా వచ్చింది. కానీ క్లైమాక్స్ ఏదో కొడుతోంది. డైలాగ్స్లో ఇంకా ఏదో నింపాలి. దశరథ్కి త్రివిక్రమ్ గుర్తొచ్చాడు. చిన్న మీటింగ్. క్లైమాక్స్ ప్యాట్రన్ చెప్పాడు దశరథ్. పెన్నూ పేపర్ పట్టుకోకుండా త్రివిక్రమ్ ఒక ఫ్లోలో డైలాగులు చెప్పేశాడు. అదిరింది... క్లైమాక్స్ అదిరింది. దశరథ్కి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. 2001 నవంబర్ 15. ఊటీలో ఫస్ట్ షాట్ తీశారు. షూటింగ్ స్పీడ్గా సాగుతోంది. నాగార్జున, గ్రేసీసింగ్ మీద పాట. రాజు సుందరం కొరియోగ్రఫీ. ఆర్పీ వేడివేడిగా పాట చేసుకొచ్చాడు. ‘‘గల గల గోదారిలా... కిలకిలా రావే చెలి...’’ అంటూ పాట ప్లే అవుతోంది.రాజు సుందరం మొహం చిట్లించాడు. ‘‘ఛా... ఇదేం పల్లవి... నాకు నచ్చలేదు...’’. దశరథ్ గుండెల్లో రాయిపడింది. ఇదేంట్రా బాబూ... కొరియోగ్రాఫర్కి కూడా పాట నచ్చాలా? ఏం చెయ్యాలి? తప్పదు. రాజు సుందరం టాప్ కొరియోగ్రాఫర్ కదా! ఆర్పీకి, దశరథ్కి ఒకటే రూమ్. ఇద్దరూ రాత్రంతా నిద్రపోలేదు. కొత్త పల్లవి కావాలి. లిరిక్ రైటర్ కులశేఖర్కి కాల్ చేస్తే అవుటాఫ్ కాలింగ్ ఏరియా. ఇద్దరూ ఆ మాటా ఈ మాటా అనుకుంటూ పల్లవి రాసేశారు. ‘‘దేవుడే దిగివచ్చినా స్వర్గమే నాకిచ్చినా షాజహాన్ తిరిగొచ్చినా తాజ్మహల్ రాసిచ్చినా ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా...’’ రాజు సుందరం పల్లవి విని అదిరిందన్నాడు. సునీల్ ఫ్రెండు కాబట్టి మంచి క్యారెక్టర్ ఇవ్వాలి. కానీ ఏదో కొడుతోంది. సునీల్తో అదే చెప్పాడు దశరథ్. ‘‘అయితే ఓ పని చేద్దామా? నేను ప్రభుదేవాకు డాన్సు నేర్పించే సీన్ క్రియేట్ చెయ్. బల్బు పెడుతున్నట్టు, ట్యాప్ తిప్పుతున్నట్టు స్టెప్స్ నేర్పిస్తా... ఎలా ఉంది ఐడియా’’ అన్నాడు సునీల్. అందరికీ నచ్చేసింది. అప్పటికప్పుడు అనుకుని అప్పటికప్పుడు తీసేశారు సీన్. 2002 మే 9. ‘సంతోషం’ రిలీజ్. సూపర్హిట్ టాక్. ఇది కలో, నిజమో దశరథ్కి ఇంకా అర్థం కావడం లేదు. ఏదో ట్రాన్స్లోనే ఉన్నాడతను. వరసపెట్టి ఫోన్లు.. మెసేజ్లు... గ్రీటింగ్స్... బొకేలు... ఆ రోజు మధ్యాహ్నం ఇంట్లో లంచ్ చేస్తున్నాడు దశరథ్. ఫోన్ మోగింది. ‘‘కంగ్రాట్స్’’... అవతల మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఆయన చెప్పాడంటే తిరుగే ఉండదు. దశరథ్ మనసు నిండిపోయింది... సంతోషంతో! - పులగం చిన్నారాయణ మీ ఫ్యూచర్ టీచర్: ‘నేను ఒక మనిషిని చంపాను’ ఈ వాక్యాన్ని భవిష్యత్ కాలం లో చెప్పండి. చింటూ: మీరు జైలుకు వెళతారు. వెరీ ఇంట్రెస్టింగ్ ఠి నాగార్జునకు ‘సంతోషం’తో ఉత్తమ నటునిగా నంది అవార్డు లభించింది. చిరంజీవి (‘ఇంద్ర’ సినిమా)తో కలసి ఈ పురస్కారాన్ని పంచుకున్నారు. ఇలా ఇద్దరు నటులకు కలిపి, ఉత్తమ నటునిగా నంది అవార్డు ఇవ్వడం ఇదే ఫస్ట్ టైమ్. తరుణ్తో చేద్దామనుకున్న ‘వన్ హౌస్’ స్క్రిప్టుతో ఆ తర్వాత గోపీమోహన్ డెరైక్షన్ చేయాలనుకున్నారు. ఉదయ్కిరణ్ను హీరోగా అనుకున్నారు. కుదర్లేదు. -
రేపు సంతోషం సౌత్ ఫిలిం అవార్డ్స్ వేడుక
సిటీ బ్యూరో: ‘‘ పన్నెండేళ్లుగా పాఠకుల ఆదరాభిమానాలు పొందుతూ ‘సంతోషం’ పత్రిక విజయవంతంగా కొనసాగుతోంది. ఎంతో ఉత్సాహంతో పదమూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. అలాగే, పదకొండేళ్లుగా ‘సంతోషం’ ఫిల్డ్ అవార్ట్స్ వేడుకను ఘనంగా చేస్తున్నాం. శనివారం పన్నెండో సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ వేడుకను మరింత వైభవంగా చేయబోతున్నాం. జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఈ వేడుక జరుగుతుంది’’ అని ‘సంతోషం’ సినీ వారపత్రిక అధినేత సురేష్ కొండేటి చెప్పారు. గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పలువురు చిత్రరంగ ప్రముఖులు పాల్గొంటారన్నారు. పలు హిట్ సాంగ్స్కు ఆరుగురు కథానాయికలు డాన్స్ చేస్తారన్నారు. డాన్స్ మాస్టర్ జానీ ఆధ్వర్యంలో ప్రాక్టీస్ జరుగుతోందన్నా రు. కామెడీ స్కిట్స్తో పాటు రకరకాల ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పారు. అవార్డు వేడుకకు సంబంధించిన ట్రైలర్ను శ్రద్ధాదాస్, షీల్డ్ను జానీ మాస్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మీనాక్షీ దీక్షిత్, ఎస్తేర్ పాల్గొన్నారు. -
సంతోషం 12వ వార్షికోత్సవంలో ప్రణిత, హంసానందిని
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రోటీ చేసి, భోజనం వడ్డించిన ప్రధాని మోదీ - వీడియో
ఓటేసి మా బాధ్యత పూర్తి చేశాం(ఫొటోలు)
తెలంగాణలో ఓటేసిన రాజకీయ ప్రముఖులు (ఫొటోలు)
ఏపీ ఎన్నికల ఓటింగ్ పై కొమ్మినేని విశ్లేషణ
ఓటు హక్కు వినియోగించుకున్న YSRCP నేతలు
Obstructing field: జడ్డూ కావాలనే చేశాడా?.. సీఎస్కే కోచ్ స్పందన ఇదే!
సూపర్ మామ్: తన క్యూటీస్తో నయన తార స్పెషల్ వీడియో వైరల్
స్టేజీపై నటిస్తూ కన్నుమూసిన ప్రముఖ నటుడు
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ప్రతి ఓటరు మీ హక్కును వినియోగించుకోండి: మురుగుడు లావణ్య
తప్పక చదవండి
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- శ్రీనగర్లో రికార్డులను అధిగమించనున్న ఓటింగ్ శాతం?
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్!
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
- నయవంచనకు చెక్ పెడదాం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement