breaking news
Sankarthi
-
అలా చెప్పడానికి ఆయనెవరూ..
సాక్షి, గుడివాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ గుడివాడలో జరిగే సంక్రాంతి వేడుకలకు రావడం ఆనందంగా ఉందన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు సీఎం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వర్షాలు సమృద్ధిగా కురిసి.. పంటలు బాగా పండాయని చెప్పారు. కాటికి కాలు చాపిన వయసులో కూడా చంద్రబాబు తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను సంక్రాంతి పండుగను చేసుకోవద్దని చెప్పడానికి చంద్రబాబు ఎవరని ధ్వజమెత్తారు. ఆయన సంక్రాంతి చేసుకోకపోతే రాష్ట్ర ప్రజలు చేసుకోకూడదా అంటూ కొడాలి నాని నిప్పులు చెరిగారు. చదవండి: సంక్రాంతి వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ -
పండగ పూట టికేట్ల దోపిడీ
-
గోదారోళ్ల పందెం కొళ్ళు
-
ఫాంహౌస్లో సీఎం సంక్రాంతి సంబురాలు
జగదేవ్పూర్: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు తన కుటుంబ సభ్యులతో కలసి ఫాంహౌస్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. బుధవారం మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లి గ్రామ సమీపంలో గల ఫాంహౌస్కు కేసీఆర్, తన సతీమణి, మనవ డు, మనవరాళ్లతో వచ్చిన విషయం విదితమే. అదేరోజు సాయంత్రం మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత కూడా వచ్చారు. గురువారం వీరంతా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఫాంహౌస్కు వచ్చి కేసీఆర్కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ తన కుమారుడుతో కలసి గాలిపటాలు ఎగురవేశారు. వ్యవసాయ క్షేత్రంలో పర్యటించిన సీఎం పంటలను గురించి అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం హైదరాబాద్కు వెళ్లారు. కాగా, సంక్రాంతి సందర్భంగా సీఎంకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు ఆ అవకాశం దక్కకపోవడంతో వెనుదిరిగారు. నేడు దూలపల్లికి కేసీఆర్ : తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం రంగారెడ్డి జిల్లాలోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీని సందర్శించున్నారు. రాష్ట్ర స్థాయి అటవీశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావే శాన్ని సీఎం అక్కడే నిర్వహిస్తారు. అలాగే తెలంగాణ అటవీశాఖ అధికారిక లోగోను ఆవిష్కరిస్తారు. -
పామాయిల్ లేనట్టే..
=డీడీ తీయొద్దని పౌర సరఫరాల శాఖ ఆదేశాలు =పిండి వంటలకు దూరంకానున్న సామాన్యులు బాలసముద్రం, న్యూస్లైన్ : సంక్రాంతి ముంగిట సామాన్యులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నాసిరకం గోధుమపిండి పంపిణీతో విమర్శలు ఎదుర్కొంటున్న సర్కారు... తాజాగా పామారుుల్ సరఫరా చేయలేక చేతులెత్తేసింది. దీంతో పండుగ వేళ సామాన్యులకు పిండి వంటలు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పెరిగిన ధరలతో నిత్యావసర సరుకులు కొనలేక పేద, మధ్య తరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రేషన్ సరుకుల్లో కోత పెడుతుండడంపై వారు మండిపడుతున్నారు. డీడీ తీయకండి... రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసే అన్ని సరుకులకు సంబంధించి ప్రతి నెల 15 నుంచి 20వ తేదీ వరకు డీడీలు చెల్లించాలి. అయితే జనవరి కోటాకు సంబంధించి పామాయిల్ మినహా మిగిలిన వస్తువులకు డీడీలు తీయాలంటూ రేషన్ డీలర్లకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ చివరి నిమిషంలో అయినా... పరిస్థితిలో మార్పు వస్తుందని అంతా ఎదురుచూశారు. అయితే అధికారుల నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెలలో పామాయిల్ సరఫరా కష్టమేనని తెలుస్తోంది. గత నెలలోనూ కోతే... జిల్లాలో ప్రభుత్వం ప్రతి నెలా 2,113 రేషన్ దుకాణా ల ద్వారా 9.80 లక్షల పామారుుల్ ప్యాకెట్లను పేదలకు అందజేస్తోంది. గతనెలలో పూర్తి కోటా ప్రకారం పామాయిల్ను సరఫరా చేయలేదు. అరవై శాతం కో తతో కేవలం 3.98 లక్షల ప్యాకెట్లు సరఫరా చేసింది. తాజాగా ఈ నెలలో మొత్తం కోటాకు కోత పెట్టింది. నాసిరకం గోధుమపిండి, చింతపండు రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న తొమ్మిది వస్తువుల్లోగోధుమపిండి పూర్తిగా నాసిరకంతో ఉం టోంది. పురుగులతో కూడిన పిండిని కొనుగోలు చేసేందుకు రేషన్ లబ్ధిదారులు జంకుతున్నారు. దీం తో కొన్ని నెలలుగా రేషన్ షాపుల్లో నిల్వలు పేరుకుపోయూయి. దీనికి సంబంధించి జనవరి కోటాలో 30 శాతం మేరకు మాత్రమే డీడీలు వచ్చాయి. చింతపండుదీ ఇదే పరిస్థితి. రేషన్ దుకాణాల్లో చింతపండు అమ్మకం 10 శాతం దాటడం లేదు. -
సంక్రాంతికి ఆర్టీసీ అదనపు బస్సులు
నిజామాబాద్ నాగారం,న్యూస్లైన్: సంక్రాంతి వస్తోంది... సెలవులు వస్తున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏరూట్లో అధికంగా ప్రయాణికులు ప్రయణిస్తున్నారో.. ఆ రూట్లలో అదనంగా బస్సులను నడపడానికి చర్యలు చేపట్టింది. జిల్లానుంచి దూర ప్రాంతాలకు బస్సులను కేటాయిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులకు సంక్రాం తి సెలవులు రావడంతో వారి సౌకర్యార్థం బస్సులను అదనంగా ఏర్పాటు చేయడంలో నిమగ్నమైంది. జిల్లాకు అదనంగా 190 బస్సులు.. సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ ఆదాయం వచ్చే జిల్లా రూట్లలో ఆర్టీసీ యాజమాన్యం అదనంగా 190 బ స్సులను కేటాయించింది. ముఖ్యంగా హైదరాబాద్, కామారెడ్డి, గుంటూరు, ఆర్మూర్ తదితర ప్రాం తాలకు ఎక్కువ మొత్తంలో బస్సులను కేటాయించింది ఆర్టీసీ. అవసరమైతే మరిన్ని బస్సులను కూడా ప్రయాణికుల కోసం కేటాయిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజ ర్ కృష్టకాంత్ తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని జనవరి 9 నుంచి 15వరకు ప్రత్యేక బస్సులను నడుపుతామని న్యూస్లైన్కు ఆయన వివరించారు. ప్రస్తుతం తెల్లవారుజామున ఇంద్ర, గరుడ బస్సులు నడపడం లేదన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెల్లవారుజామున ఈ ట్రిప్పులను సైతం నడిపేందుకు ఏర్పా ట్లు చేస్తున్నామన్నారు.ప్రయాణికుల సంఖ్య ఆధారం గా అప్పటికప్పుడు తరలించేందుకు 10 బస్సులను సైతం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. సికింద్రాబాద్, జూబ్లీ బస్టాండ్లో, నిజామాబాద్ బస్టాండ్లో రద్దీని పరిశీలించి నిర్ణయాలు తీసుకునేలా ఉన్నతాధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్ఎం చెప్పారు. -
వంటకీ...వొంటికీ...
చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. చక్కనమ్మ కాకపోతే మాత్రం? చిక్కితే అందంగా ఉండరా ఏంటి?! ఉంటారు. కానీ, చిక్కడం అంత ఈజీనా చెప్పండి. వాకింగ్లు, వర్కవుట్లు, డైటింగులు... ఎన్ని చెయ్యాలి!! చెయ్యగలితే ఓకే... చెయ్యలేకపోతే మాత్రం.... ఈ సీజనంతా... సంక్రాంతి వరకు... చిక్కుడు ఐటమ్స్ని లాగించేయండి! చిక్కుడు వంకాయ, చిక్కుడి పచ్చడి, చిక్కుడు తీపి కూర... చిక్కుడు కారం, చిక్కుడు ఫ్రై... మీ ఇష్టం. చిక్కుడు ఎందులోనైనా చక్కగా కలిసిపోతుంది. అంతేకాదు, మిమ్మల్ని అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. చిక్కుడులో ఒక ఫిట్నెస్ గురు ఉన్నారు. ఒక ఫిజీషియన్ ఉన్నారు. ఇద్దరినీ మించి... ఓ మంచి వంట మాస్టర్ కూడా!! చిక్కుడు ఆవకాయ కావలసినవి: చిక్కుడుకాయలు - కిలో; పప్పు నూనె - పావు కిలో; కారం - 100 గ్రా; ఉప్పు - 100 గ్రాములకు కొద్దిగా తక్కువ; ఆవపిండి - 100 గ్రా; మెంతులు - టేబుల్ స్పూను; చింతపండు - పావుకిలో తయారి: చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి, ఈనెలు తీయాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, చిక్కుడుకాయలను అందులో వేసి బాగా వేయించి తీసేయాలి ఒక పాత్రలో ఆవపిండి, ఉప్పు, కారం, మెంతులు, చింతపండు, కొద్దిగా నూనె వేసి కలపాలి వేయించి ఉంచుకున్న చిక్కుడుకాయలను జతచేసి బాగా కలపాలి చివరగా నూనె పోసి గాలిచొరని పాత్రలో ఉంచి, మూడవ రోజు తిరగ కలపాలి ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది (ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కనుక, తగు పరిమాణంలో తయారుచేసుకుంటే మంచిది) పచ్చికారం కూర కావలసినవి: చిక్కుడుకాయలు - పావు కిలో; అల్లం - చిన్న ముక్క; పచ్చిమిర్చి - 4; ఎండుమిర్చి - 2; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; పసుపు - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - టేబుల్ స్పూను; కరివేపాకు - ఒక రెమ్మ; కొత్తిమీర - కొద్దిగా; మిరప్పొడి - టీ స్పూను తయారి: ముందుగా చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి రెండు ముక్కలుగా చేసుకోవాలి బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వరుసగా వేసి వేయించాలి చిక్కుడుకాయ ముక్కలు వేసి బాగా కలిపి, ఉప్పు జత చేసి మూత పెట్టాలి (మూత పెట్టడం వల్ల కూర మెత్తగా ఉంటుంది) బాగా ఉడుకు పట్టిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలపాలి చివరగా మిరప్పొడి, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి. చిక్కుడుకాయ బంగాళదుంపకూర కావలసినవి: చిక్కుడుకాయలు - అరకిలో; బంగాళదుంపలు - పావుకిలో; ధనియాల పొడి - అర టీ స్పూను; జీలకర్ర పొడి - అర టీ స్పూను; పల్లీలపొడి - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత; కారం - టేబుల్ స్పూను; నూనె - 3 టేబుల్స్పూన్లు తయారి: ముందుగా చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి, ఈనెలు తీసి ముక్కలు చేయాలి బంగాళదుంపలను ఉడికించి, పైన పొట్టు తీసి ముక్కలు చేయాలి బాణలిలో నూనె వేసి కాగాక బంగాళదుంపముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు వేసి, ఉప్పు జతచేసి బాగా కలిపి మూత ఉంచాలి పది నిముషాలయ్యాక ధనియాల పొడి, జీలకర్ర పొడి, పల్లీలపొడి, కారం వేసి బాగా కలిపి ఐదు నిముషాలుంచి దించేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే రుచిగా ఉంటుంది. చిక్కుడు కాయ పచ్చడి కావలసినవి: చిక్కుడుకాయలు - పావుకిలో; చింతపండు- కొద్దిగా; ఎండుమిర్చి - 4; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; మెంతులు - అర టీ స్పూను; పసుపు - కొద్దిగా; ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత; కొత్తిమీర - కొద్దిగా; నూనె - 2 టీ స్పూన్లు తయారి: బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వరసగా వేసి దోరగా వేగాక తీసి పక్కన ఉంచాలి అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక చిక్కుడుకాయముక్కలు (చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి, ముక్కలుగా చేయాలి) వేసి కొద్దిగా వేగిన తర్వాత, ఉప్పు, చింతపండు, పసుపు, ఇంగువ వేసి బాగా కలిపి మూత పెట్టాలి ముక్కలు బాగా మెత్తబడ్డాక బాణలి దించేయాలి మిక్సీలో ముందుగా పోపు వేసి మెత్తగా చేయాలి చిక్కుడుకాయ ముక్కలు, కొత్తిమీర జతచేసి మరోమారు మిక్సీ పట్టి తీసేయాలి. వంకాయ చిక్కుడుకాయ కూర కావలసినవి: వంకాయలు - పావుకిలో; చిక్కుడుకాయలు - అరకిలో; అల్లం - చిన్నముక్క; పచ్చిమిర్చి - 6; ఎండుమిర్చి - 5; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత; నూనె - 2 టీ స్పూన్లు; కొత్తిమీర - కొద్దిగా; కరివేపాకు - 2 రెమ్మలు; పాలు - 2 టేబుల్ స్పూన్లు తయారి: వంకాయలను శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి చిక్కుడుకాయలను కడిగి ఈనెలు తీసి, పెద్ద ముక్కలు చేయాలి బాణలి లో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వరుసగా వేసి వేయించాలి కరివేపాకు వేసి వేగాక, వంకాయముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, వేసి కలిపి మూత పెట్టాలి కూర దగ్గర పడిన తర్వాత పాలు జత చేసి మరోమారు కలిపి కొద్దిగా మగ్గించాలి అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. చిక్కుడుకాయ వేపుడు కావలసినవి: చిక్కుడుకాయలు - పావు కిలో; ఉప్పు - తగినంత; మిరప్పొడి - టేబుల్ స్పూను; నూనె - రెండు టేబుల్ స్పూన్లు తయారి: ముందుగా చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీయాలి బాణలిలో నూనె వేసి కాగాక చిక్కుడుకాయలను వేసి బాగా కలిపి మూత ఉంచాలి. (మధ్యమధ్యలో కలుపుతుండాలి) పావు గంట తర్వాత ఉప్పు, కారం వేసి కలిపి రెండు నిముషాలు ఉంచి దించేయాలి. చిక్కుడుకాయ తీపికూర కావలసినవి: చిక్కుడుకాయలు - అర కిలో; శనగపప్పు - టేబుల్ స్పూను; మినప్పప్పు - టేబుల్ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; ఎండుమిర్చి - 8; చింతపండుగుజ్జు - టేబుల్ స్పూను; బెల్లం తురుము - 2 టేబుల్ స్పూన్లు; బియ్యప్పిండి - టేబుల్ స్పూను; పసుపు - చిటికెడు; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా తయారి: చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి పెద్దపెద్ద ముక్కలు చేయాలి బాణలిలో నూనె వేసి స్టౌ మీద ఉంచి కాగాక, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వరసగా వేయాలి చిక్కుడుకాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి బాగా ఉడుకుపట్టాక బెల్లం తురుము, చింతపండు గుజ్జు, బియ్యప్పిండి, పసుపు వేసి కలిపి ఐదు నిముషాలు ఉంచి దించేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. కర్టెసీ: కల్యాణలక్ష్మి, హైదరాబాద్ సేకరణ: డా.వైజయంతి ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ పందిరి చిక్కుడును ప్రాచీనకాలం నుంచి పండిస్తున్నారు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో దీన్ని విస్తారంగా పండిస్తున్నారు. ఇప్పుడిప్పుడే చిక్కుడు ఉత్తరభారతదేశంలోకి కూడా వ్యాపించింది ప్రతి వంద గ్రాముల చిక్కుడు కాయలలో 48 క్యాలరీల శక్తి ఉంటుంది చిక్కుడును ఆహారంలో ఎక్కువ తీసుకుని, వరి అన్నం తక్కువ తీసుకుంటే డయాబెటిస్ను 25 శాతం నియంత్రించవచ్చని కోస్టారికా అధ్యయనంలో తెలిపింది వారంలో కనీసం మూడు కప్పుల చిక్కుడు తినగలిగితే ఆరోగ్యానికి ఎంతో మేలు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలతో పోరాడ తాయి. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా చూస్తాయి సన్నబడాలని డైటింగ్ చేసేవాళ్లు చిక్కుడును అధికంగా తింటే మంచిది అరకప్పు చిక్కుళ్లలో 7 గ్రాముల ప్రొటీన్లు లభ్యమవుతాయి. వీటిని కూరలలోనే కాదు సూపులూ, ఇతర టిఫిన్ల తయారీలోనూ ఉపయోగించవచ్చు బీకాంప్లెక్స్లోని ఎనిమిది రకాల విటమిన్లు వీటిలో లభిస్తాయి కాలేయం, చర్మం, కళ్లు, వెంట్రుకలు వంటి అనేక భాగాలకు చిక్కుడు నుంచి శక్తి అందుతుంది.