breaking news
sankara vijayendra saraswathi
-
70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర
సాక్షి, చెన్నై: జయేంద్ర సరస్వతి శివక్యైం పొందడంతో కంచి కామకోటి మఠం 70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర సరస్వతికి పట్టాభిషేకం చేయనున్నారు. ఈయన అసలు పేరు శంకరనారాయణన్. 1969 మార్చి 18న జన్మించారు. తిరువళ్లూరు జిల్లా ఆరణి సమీపంలోని పెరియపాళయం గ్రామం ఆయన స్వస్థలం. 1983 మే 29న పోలూరులో ఆధ్యాత్మిక గురువయ్యారు. జయేంద్ర సరస్వతితో కలసి అడుగులు వేశారు. వివాదాల్లోనూ, కారాగారవాసంలోనూ తోడుగానే నిలబడ్డారు. మేఘాలయ వరకు పర్యటించి ఆధ్యాతిక బోధనలు చేశారు. పెడదారి పడుతున్న యువతను సన్మార్గంలో నడిపించడంతో పాటు విద్యా ప్రమాణాల పెంపు, దేశంలో సాంస్కృతిక, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, కొరవడుతున్న నైతిక, మానవీయత విలువల్ని రక్షించే రీతిలో ఆయన పయనం సాగించారు. యువకుల్లో చైతన్యం లక్ష్యంగా ఎక్కువ సమయాన్ని కేటాయించారు. పురాతన సాహిత్యాన్ని కాపాడడం, భారతీయ, విదేశీ భాషల్లో భక్తుల కోసం అనేక ప్రచురణలను తీసుకొచ్చారు. పంచ భూతాల్లో పృథ్వీ క్షేత్రం.. కాంచీపురం దక్షిణ భారతంలో ఉన్న శివ ఆరాధనలో పంచ భూతాల్లో పృథ్వీ క్షేత్రంగా కాంచీపురం అలరారుతోంది. ఈ క్షేత్రంలోని కంచి కామకోటి పీఠానికి విశిష్ట చరిత్ర ఉంది. ఆది శంకరాచార్య చేతుల మీదుగా ఆవిర్భవించిన ఈ మఠం ద్వారా హిందూ మత సేవలో రెండు దశాబ్దాలకు పైగా జయేంద్ర సరస్వతి నిమగ్నమయ్యారు. భౌగోళికంగా భూమి(కాంచీపురం), ఆకాశం(కడలూరు జిల్లా చిదంబరం), గాలి( చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి), అగ్ని(తిరువణ్ణామలై), నీరు(తిరువన్నై కోయిల్) క్షేత్రాలను పిలుస్తుంటారు. వీటన్నింటి సమ్మేళనంతో శ్రీ కంచి కామకోటి పీఠం ఆవిర్భవించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ మఠానికి తల భాగంగా శంకరాచార్య వారిని అభివర్ణిస్తుంటారు. క్రీ.శ 482లో ఆది శంకర భగవత్పదచార్య స్వామి ఈ మఠాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ కామకోటి పీఠం సంప్రదాయంగా కామాక్షి అమ్మవారిని సూచిస్తుంటుంది. కామకోటి దుర్గాదేవిని సూచిస్తుంది. శ్రీ శంకర భగవత్పాడ(శ్రీశంకరాచార్య) స్వామి వారు కంచిలో స్థిరపడుతూ తన కంటూ ఓ సొంత నివాసంగా ఈ మఠాన్ని నెలకొల్పారు. ఆయన అడుగు జాడల్లో శిష్యులైన శ్రీ సురేశ్వర చార్య, సర్వజ్నాత్మాన్, సత్య భోదేంద్ర సరస్వతి, జ్ఞానందేంద్ర సరస్వతి, సుధానందేంద్ర సరస్వతి వంటి పీఠాధిపతుల నేతృత్వంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణలో ఈ పీఠం ముందుకు సాగింది. ఇది వరకు ఉన్న 68 మంది పీఠాధిపతులతో పోల్చితే, జయేంద్ర సరస్వతి ఈ పీఠం పరిరక్షణకు, హిందూ ధర్మ ప్రచారంలో విశిష్ట సేవల్ని అందించారు. ఆధ్యాత్మికమే కాదు, విద్య, వైద్య, సేవాపరంగానూ ఈ మఠాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన ఘనత ఆయనదే. -
ఆధ్యాత్మికత అలవర్చుకోవాలి
పెద్దాపురం : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత అలవర్చుకుని, దైవచింతనతో ఉండాలని కంచి కామకోటి పీఠం ఉత్తరాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి అన్నారు. కార్తిక మాసం పంచారామ క్షేత్ర పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చిన ఆయన మంగళవారం సాయంత్రం ప్రముఖ పారిశ్రామిక వేత్త మట్టే శ్రీనివాస్, మందవిల్లి శ్రీనివాస ముత్యాలు గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో విజయేంద్ర సరస్వతి మాట్లాడుతూ లోకం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని ఆకాక్షించారు. «ఆధ్యాత్మిక భావాలు, దైవచింతన కల్గి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కంచి మహా సంస్థానం అధ్యక్షలు చంద్రాభట్ల గణపతి శాస్త్రీ, ఆధ్యాత్మిక గురువులు, అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో పూజలు సామర్లకోట : స్థానిక ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో కంచి కామకోటి పీఠం ఉత్తరాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి మంగళవారం రాత్రి పూజలు చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా పెద్దాపురం నుంచి వచ్చిన ఆయనకు ఆలయ కమిటీ నాయకులు స్వాగతం పలికారు. ఆయన ఆలయంలో పూజలు చేశారు. కంచికామకోటి పీఠం సభ్యులు చంద్రాభట్ల చింతామణి గణపతి శాస్త్రి, పతంజలి శాస్త్రి, విజయేంద్రసరస్వతి శిషులు పాల్గొన్నారు. అనంతరం వేట్లపాలెం గ్రామంలోని రామకృష్ణ సేవా సమితిని సందర్శించారు.