-
Smriti Irani: ఆ అయిదు రోజులు... అయితే ఏంటీ!
మెనుస్ట్రుయేషన్కు సంబంధించిన విషయాలు బహిరంగంగా మాట్లాడడానికి సంకోచించే రోజుల్లో, శానిటరీ యాడ్స్లో నటించడానికి నటీమణులు ససేమిరా అనే రోజుల్లో కెరీర్ తొలి అడుగుల్లో శానిటరీ ప్యాడ్ యాడ్ లో నటించింది స్మృతి ఇరానీ. అది తన తొలి యాడ్. ‘అది ఫ్యాన్సీ యాడ్ కాదు. వదిలేయ్’ ‘ఈ యాడ్ చేస్తే తక్కువ చేసి చూస్తారు. నటిగా అవకాశాలు రావు’ అని అందరూ భయపెట్టారు. కానీ వాటిని పట్టించుకోకుండా ఆ యాడ్లో నటించింది స్మృతి. 25 సంవత్సరాల క్రితం నాటి ఆ వీడియోను స్మృతి ఇరానీ(ప్రస్తుతం కేంద్రమంత్రి) ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే వైరల్ అయింది. ఆ వీడియోలో... పీరియెడ్స్, వాటిపై ఉండే అపోహలు... మొదలైన వాటి గురించి స్మృతి ఇరానీ మాట్లాడింది. ‘ఆ అయిదు రోజులు. అయితే ఏంటీ? పీరియెడ్స్ అంటే వ్యాధి కాదు. ప్రతి మహిళకు ఉండే సహజ లక్షణం. నేను, మా అమ్మ, మీరు... లక్షలాదిమంది భారతీయ మహిళల కోసం శానిటరీ ప్యాడ్లు ఉన్నాయి...’ అంటూ సాగే స్మృతి మాటలకు ఆ రోజుల్లో ఎలాంటి స్పందన వచ్చిందో తెలియదుగానీ ఇప్పుడు మాత్రం వైరల్ అవుతోంది. ‘ఇది తప్పనిసరిగా గుర్తుచేసుకోదగిన జ్ఞాపకం’ అని తన వీడియో గురించి కాప్షన్ రాసింది స్మృతి ఇరానీ. ‘ఈరోజుల్లో శానిటరీ ప్యాడ్ యాడ్లు చేయడానికి నటీమణులు సంకోచించడం లేదు. కాని ఆరోజుల పరిస్థితి వేరు. ఆ రోజులు నాకు ఇంకా బాగా గుర్తు ఉన్నాయి. పీరియెడ్స్ గురించి మాట్లాడడానికి ఇబ్బంది పడే రోజుల్లో ధైర్యంగా స్మృతి ఆ యాడ్ చేయడం అభినందనీయం’ అంటూ ఒక యూజర్ కామెంట్ సెక్షన్లో స్పందించారు. -
అంతా చెత్తమయం
* రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం * పట్టణాల్లో పేరుకుపోతున్న టన్నుల కొద్దీ చెత్త * చెత్తకుండీలు నిండి రోడ్లపాలవుతున్న వ్యర్థాలు * మంత్రులు, కార్మిక నేతల రెండో దఫా చర్చలూ విఫలం * సమ్మె కొనసాగిస్తామని కార్మిక నేతల ఉద్ఘాటన రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ను చెత్త ముంచెత్తింది. ‘గ్రేటర్’ వరంగల్ చెత్తమయమైంది. చిన్నాపెద్ద నగరాలు, పట్టణాలు మురికి కూపాలయ్యాయి. అంతటా టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయింది. చెత్త కుండీలు, డంపర్ బిన్లు నిండి వ్యర్థాలు రోడ్లు, వీధులను ఆక్రమిస్తున్నాయి. పారిశుద్ధ్య పరిరక్షణ కోసం రాత్రింబవళ్లు చెమటోడ్చే కార్మికులు చేపట్టిన సమ్మెతో రెండు రోజుల్లోనే పట్టణ పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. మరోవైపు సమె విరమణ కోసం ప్రభుత్వ ప్రయత్నాలు మళ్లీ విఫలమయ్యాయి. దీంతో సమ్మెను విరమించే ప్రసక్తే లేదని, ఆందోళనలను ఉధృతం చేస్తామని కార్మిక ఐక్య సంఘాలు పునరుద్ఘాటించాయి. సాక్షి, హైదరాబాద్: కనీస వేతనాల పెంపుతోపాటు 16 డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారంతో మూడో రోజుకు చేరుకుంది. ఫలితంగా జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని 67 నగర, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలపై సమ్మె ప్రభావం తీవ్రంగా పడింది. రెండు రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు విధులను బహిష్కరించడంతో పట్టణాల్లో కుప్పలుతెప్పలుగా చెత్త పేరుకుపోతోంది. కార్మికులతో సమ్మె విరమింపజేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ప్రతిష్టంభన తొలగిపోలేదు. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి మంగళవారం మధ్యాహ్నం సచివాలయంలో కార్మిక సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులతో జరిపిన రెండో దఫా చర్చలూ విఫలమయ్యాయి. కార్మికుల డిమాండ్లపై చర్చ లేకుండానే ఈ భేటీ ముగిసింది. సమ్మెను విరమించి వస్తే చర్చలు జరుపుతామని మంత్రులు పేర్కొనగా అందుకు కార్మిక నేతలు ససేమిరా అన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని చర్చల అనంతరం కార్మిక నేతలు ఉద్ఘాటించారు. ‘మా చేతుల్లో ఏమీ లేదు. మేము చర్చించలేం, సీఎం వస్తేనే మాట్లాడతామని మంత్రులు పేర్కొన్నారు. డిమాండ్ల పరిష్కారంపై మంత్రులు ఏ ప్రతిపాదన చేయలేదు. సమ్మె విరమిస్తేనే చర్చలు జరుపుతామన్నారు. దీనిని మేము అంగీకరించం’ అని చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ ఆయన అందుబాటులో లేరని కాలయాపన చేయడం తగదన్నారు. సమ్మెను ఉధృతం చేసేందుకు బుధవారం నుంచి జిల్లా, డివిజన్ స్థాయిల్లో ఆందోళనలు చేపడుతామన్నారు. సమ్మెలో టీఆర్ఎస్కేవీ... అధికార పార్టీ టీఆర్ఎస్ అనుంబంధ కార్మిక సంఘం టీఆర్ఎస్కేవీ సైతం బుధవారం నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మెలో పాల్గొననుంది. టీఆర్ఎస్కేవీ-జీహెచ్ఎంఈయూ నేతలు మంగళవారం ఈ మేరకు ప్రకటన చేశారు. గత రెండు రోజులుగా సమ్మెలో పాల్గొంటున్న సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, ఏఐయూటీయూసీ, టీఎన్టీయూసీల నేతృత్వంలోని జేఏసీ కార్మికుల కనీస వేతనాన్ని రూ. 14,170కు పెంచాలని డిమాండ్ చేస్తుండగా టీఆర్ఎస్కేవీ మాత్రం ఆ మొత్తాన్ని రూ.16,500కు పెంచాలని డిమాండ్ చేస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement