-
చైతన్యంతోనే బడుగులకు రాజ్యాధికారం
- బలహీన వర్గాలను పావులుగా వాడుకుంటున్న టీడీపీ - సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్ రామకృష్ణ - ముగిసిన ప్రజా చైతన్య బస్సు యాత్ర అనంతపురం న్యూటౌన్ : తెలుగుదేశం ప్రభుత్వ ప్రజాకంటక విధానాలపై ఉద్యమిస్తామని సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్ కె.రామకృష్ణ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల సమస్యలపై చేపట్టిన ప్రజాచైతన్య బస్సుయాత్ర ముగింపు సభ శనివారం సాయంత్రం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో వేదిక జిల్లా కన్వీనర్ జగదీష్ అధ్యక్షతన నిర్వహించారు. సభలో రామకృష్ణ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలను టీడీపీ పావులుగా ఉపయోగించుకుంటోందన్నారు. మంత్రి వర్గంలో ఎస్టీలు, ముస్లింలకు చోటు కల్పించకపోవడం శోచనీయమన్నారు. రానున్న రోజుల్లో ఆయా వర్గాల వారిని మంత్రి వర్గంలోకి తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాజ్యాధికారమే లక్ష్యంగా బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు చైతన్యంతో ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన కేరళ వ్యవసాయ శాఖ మంత్రి సునీల్కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై పూర్తి నిర్లక్ష్య ధోరణిలో ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ఒకే రకమైన అజెండాను అమలు చేయడానికి అణగారిన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. అదేవి«ధంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు, బీసీ సంక్షేమ సంఘం రాయలసీమ జిల్లాల అధ్యక్షులు రమేష్ గౌడ్, సామాజిక హక్కుల వేదిక నాయకులు సత్యనారాయణమూర్తి, మైనార్టీ నాయకులు డాక్టర్ మైనుద్దీన్, జాఫర్, బీసీ సంఘం నాగభూషణం తదితరులు బీసీ, ఎస్సీలపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఆకట్టుకున్న ‘వందేమాతరం’ ముగింపు సభకు మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన ‘వందేమాతర గీతం’ సభికులను అమితంగా ఆకట్టుకుంది. అలాగే ప్రజా నాట్యమండలి కళాకారులు, ప్రాచీన కళారూపాల ప్రదర్శనలతో, ఆటపాటలతో పలు చైతన్య గీతాలను అద్భుతంగా ఆలపించి అలరించారు. అంతకుముందు స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సామాజిక హక్కుల వేదిక నేతలు ర్యాలీగా సభాస్ధలికి చేరుకున్నారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన రజక సంఘం నాయకులు కమ్మన్న, దేవేంద్రప్ప, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు ప్రసాద్, మహిళా సమాఖ్య నేతలు జయలక్ష్మి, దుర్గాభవానీ, కురుబ సంఘం బోరంపల్లి ఆంజనేయులు, బంజారా నేతలు కైలాష్నాయక్, ముస్లిం మైనార్టీ నాయకులు ఇమామ్, బాషా తదితరులు పాల్గొన్నారు. -
జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ కల్పించాలి
హిందూపురం అర్బన్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కులాల వారికి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని సామాజిక హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ డి.జగదీష్ అన్నారు. గురువారం స్థానిక ఐఎంఏ హాలులో వివిధ కులసంఘాల నాయకులతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 85 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు అనుగుణంగా రిజర్వేషన్లు లేకపోవడంతో 15 శాతం ఉన్న అగ్రకులాల వారే 50 శాతం ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించకోవడంతో ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా సామాజిక హక్కుల వేదిక శంఖారావం పూరించిందన్నారు. ఈమేరకు జనవరి 26న మొదలైన బస్సు యాత్ర మార్చి 4న హిందూపురం, 7న అనంతపురంలో బహిరంగ సభతో ముగుస్తుందన్నారు. వేదిక కార్యనిర్వాహక కార్యదర్శి జాఫర్, కురుబ సంఘం రాయలసీమ అధ్యక్షుడు బోరంపల్లి ఆంజినేయులు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, సీపీఐ డివిజన్ కార్యదర్శి సురేష్, వాల్మీకి సంఘంఅధ్యక్షుడు వెంకటచలపతి, సాధుశెట్టి సంఘం అధ్యక్షుడు వెంకటస్వామి, ఎమ్మార్పీఎస్, వివిధ కులసంఘాల నాయకులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement