breaking news
sahastra
-
Sahastra Incident: క్రికెట్ బ్యాట్ దొంగిలించేందుకే బాలుడు వెళ్లాడు: సీపీ మహంతి
-
నెల క్రితమే ప్లాన్.. హత్య అలా జరిగింది: సీపీ మహంతి
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. దొంగతనం కోసం నెల రోజుల ముందే ప్లాన్ చేసినట్టు చెప్పుకొచ్చారు. బాలిక హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు స్పష్టం చేశారు. బ్యాట్ కోసం ఇదంతా జరిగినట్టు తేలిందన్నారు. కూకట్పల్లి సహస్ర హత్య కేసుకు సంబంధించి సీపీ అవినాష్ మహంతి వివరాలను వెల్లడించారు. ఈ సందర్బంగా సీపీ మహంతి మాట్లాడుతూ..‘ఈనెల 18వ తేదీన బాలిక హత్య జరిగింది. మూడు రోజుల వరకు సరైన క్లూ దొరకలేదు. శుక్రవారం బాలుడిని పట్టుకున్నాం. పక్కింట్లో ఉన్న 14 ఏళ్ల బాలుడే సహస్రను హత్య చేశాడు. క్రికెట్ బ్యాట్ దొంగలించేందుకే సహస్ర ఇంటికి బాలుడు వెళ్లాడు. బ్యాట్ తీసుకుని వెళ్తుంటే సహస్ర చూసింది. వెంటనే దొంగ దొంగ అని అరిచింది. దీంతో, సహస్రను బెడ్రూంలోకి తోసి ఆమెపై కత్తితో దాడి చేశారు. బాలికను తోసేసి కళ్లు మూసుకుని కత్తితో పొడిచాడు. ఇంట్లో ఎవరూ లేరు అనుకుని దొంగతనానికి వెళ్లాడు.. కానీ, బాలిక ఉండేసరికి ఆమెపై దాడి చేశాడు. ఈ కేసులో బాలుడిని ప్రశ్నిస్తే విచారణను తప్పుదారి పట్టించే సమాధానాలు చెప్పాడు. బాలిక హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నాం. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు ఉన్నాయి. దొంగతనానికి సంబంధించి ప్లాన్ మొత్తం ఓ నోట్లో రాసుకున్నాడు. దొంగతనం కోసం నెల రోజుల ముందే ప్లాన్ చేశాడు. బ్యాట్ కోసం సహస్ర తమ్ముడితో ఒకసారి గొడవ పడ్డాడు. నిందితుడికి క్రైమ్ సీన్స్ చూసే అలవాటు ఉంది. క్రైం సినిమాల ద్వారా ఎలా తప్పించుకోవాలో తెలుసుకున్నాడు. ఓటీటీలో క్రైమ్ సినిమాలు, సీన్స్ చూసి ప్రభావితం అయ్యాడు. ఈ ఘటనలో తల్లికి అనుమానం వస్తే ఆమెపై ప్రామిస్ చేసి బాలుడు నమ్మించాడు. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు దొరికాయి. కత్తిని బాలిక ఇంట్లోనే కడిగేశాడు. రక్తపు మరకులు ఉన్న బట్టలను వాషింగ్ మెషీన్లో వేశాడు. చాలా సంక్లిష్టమైన కేసు ఇది. విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. పిల్లల ప్రవర్తన పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. నిందితుడిని జువైనల్ హోంకు తరలించాం. నిందితుడి కోసం ఐదు బృందాలు గాలించాయి’ అని చెప్పుకొచ్చారు. బాలిక తండ్రి ఆవేదన.. మరోవైపు.. బాలిక సహస్ర తండ్రి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఆ అబ్బాయికి కొంచెం కూడా భయం లేదు. అతడిని ఉరిశిక్ష వేస్తేనే నా కూతురు ఆత్మ శాంతి. అతను బాలుడు కాదు.. మేజర్ ఆలోచన చేశాడు. అతను మేజర్. పక్కా ప్లాన్ ప్రకారమే నా కూతుర్ని హత్య చేశాడు. పోలీసులనే పక్క దారి పట్టించే ప్రయత్నం చేశాడు. నా కూతురిని చంపేసి నా కొడుకును ఓదార్చుతున్నాడు. ఇతనే చంపాడని నేను కూడా నమ్మలేదు. అసలు ఈ భూమి మీద అతడు ఉండకూడదు. ప్రభుత్వం అతడిని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. -
కూకట్పల్లి కేసు.. ప్లాన్ ప్రకారమే హత్య.. విచారణలో విస్తుపోయే నిజాలు!
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సహస్ర హత్య కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే సహస్రను హత్య చేసినట్టు తెలుస్తోంది. యూట్యూబ్లో క్రైమ్ సీన్స్ చూసి బాలిక హత్య. ఈ సందర్భంగా బాలుడు సైకోలా ప్రవర్తించినట్టు సమాచారం. పోలీసుల విచారణలో క్రిమినల్ ఇంటెలిజెంట్గా వ్యవహరించిన బాలుడు. హత్య చేసి ఆధారాలు మాయం చేయడం నేర్చుకున్న తెలిసింది. మరోవైపు.. బాలిక సహస్ర తండ్రి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఆ అబ్బాయికి కొంచెం కూడా భయం లేదు. అతడిని ఉరిశిక్ష వేస్తేనే నా కూతురు ఆత్మ శాంతి. అతను బాలుడు కాదు.. మేజర్ ఆలోచన చేశాడు. పక్కా ప్లాన్ ప్రకారమే నా కూతుర్ని హత్య చేశాడు. పోలీసులనే పక్క దారి పట్టించే ప్రయత్నం చేశాడు. అతడిని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. సహస్ర హత్య కేసులో నిందితుడైన బాలుడిని జువైనల్ హోంకు తరలించారు పోలీసులు. అంతకుముందు అతడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన వివరాలను సీపీ వెల్లడించనున్నారు.ఇది కూడా చదవండి: సహస్ర హత్యపై సీపీ మహంతి.. సంచలన విషయాలు వెల్లడి.. ఇక, కూకట్పల్లి దయార్గూడలో ఈ నెల 18న సహస్ర (11) అనే బాలికను పదో తరగతి బాలుడు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులను తప్పుదోవపట్టిస్తూ, ముప్పతిప్పలు పెట్టిన నిందితుడు.. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు ఇచ్చిన సమాచారంతో చిక్కాడు. క్రికెట్ బ్యాట్ చోరీ కోసం వచ్చిన అతడు.. బాలిక చూడటంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. కేసు విచారణలో భాగంగా బాలానగర్, కూకట్పల్లి పోలీసులు, ఎస్వోటీ సిబ్బంది నాలుగు రోజులుగా వందలాది సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడం.. సాఫ్ట్వేర్ ఉద్యోగి..‘హత్య జరిగిన రోజు ఓ బాలుడు గోడదూకి అపార్ట్మెంట్లోకి రావడాన్ని గమనించానంటూ’ కూకట్పల్లి పోలీసులకు సమాచారమివ్వడంతో ఆ దిశగా విచారించారు.అనంతరం బాలుడిని ప్రశ్నించడంతో నిజం అంగీకరించినట్టు సమాచారం. ‘హత్య చేసింది తానేనని, హత్య అనంతరం కత్తిని అక్కడే కడిగి ఇంటికి తీసుకొచ్చి రిఫ్రిజిరేటర్పై ఉంచానని, రక్తపు మరకలు అంటిన టీషర్ట్ను వాషింగ్ మెషిన్లో వేశానని’ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. ఇక, అంతకుముందు దొంగతనం ఎలా చేయాలి.. ఎలా తప్పించుకోవాలో ఆన్లైన్లో శోధించాడు. ఈ వివరాలన్నీ బాలుడు కాగితంపై రాసుకున్నట్లు సమాచారం. -
సహస్ర బాబాయే సూత్రధారి...
కనిగిరి/విజయవాడ: ప్రకాశం జిల్లాలో గురువారం కిడ్నాప్ అయిన చిన్నారి సహస్ర కేసును పోలీసులు ఛేదించారు. కనిగిరిలో నిన్న సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న సహస్రను సొంత బాబాయే కిడ్నాప్ చేశాడు. దీంతో సహస్ర తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా వారు 24 గంటలు గడవకముందే కిడ్నాప్ డ్రామాకు తెరదించి చిన్నారిని రక్షించారు. కృష్ణాజిల్లా విజయవాడలో కిడ్నాపర్లను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు కావడంతో చిన్నారి అమ్మమ్మ ఇంటి దగ్గర ఉందని, అక్కడ ఆడుకుంటుండగా కిడ్నాప్ చేశారు. ఇంటి ముందు ఆడుకుంటుండగా బ్లాక్ పల్సర్ బైక్పై హెల్మెట్లు పెట్టుకుని వచ్చిన ఇద్దరు వ్యక్తులు చిన్నారిని కిడ్నాప్ చేశారు. అనంతరం కిడ్నాపర్లు చిన్నారి తల్లిదండ్రులకు పలుమార్లు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారని, అయితే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పవద్దని బెదిరించారు. దీంతో సహస్ర తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా కిడ్నాపర్లను పోలీసులు పట్టుకుని, చిన్నారిని క్షేమంగా విడిపించారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో తమ చిన్నారి క్షేమంగా బయటపడిందని సహస్ర తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఆర్థిక లావాదేవీల కారణంగానే సహస్రను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. -
చేతులెలా వచ్చాయి ‘తల్లీ’?
-
చేతులెలా వచ్చాయి ‘తల్లీ’?
సంపులో తోసి చిన్నారుల హత్య కన్నతల్లి దుశ్చర్య మతిస్థిమితం లేకనే.. ఎల్బీనగర్లో విషాదం నాగోలు: అమ్మ ఎత్తుకుంటే... లాలిస్తుందని భావించారా చిన్నారులు. గోరు ముద్దలు తినిపిస్తుందని తల్లి ఒడికి చేరితే... మృత్యు ఒడికి పంపించింది. అప్పటి వరకూ తమ కళ్ల ముందే కేరింతలు కొడుతూ .. .. ముద్దు మాటలతో అలరించిన చిట్టి తల్లులు అంతలోనే విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఎల్బీనగర్లో మంగళవారం కలకలం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివీ... నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం మాజీ సర్పంచ్ నేటి యాదగిరి, పద్మలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరు ఎల్బీనగర్ చంద్రపురి కాలనీ రోడ్ నెం-5లో ఉంటున్నారు. పెద్ద కుమార్తె నిర్మలకు చౌటుప్పల్ మండలం అంతమ్మగూడెంకు చెందిన వస్పరి మల్లేష్తో ఆరేళ్ల క్రితం పెళ్లి చేశారు. మామ యాదగిరి, మల్లేష్ ఎల్బీనగర్లో బోర్వెల్స్తో పాటు ఇసుక లారీల వ్యాపారం చేస్తున్నారు. కొంతకాలంగా బయట అద్దెకు ఉంటున్న మల్లేష్ ఇటీవల కుటుంబంతో అత్తవారింటికి వచ్చారు. వీరికి అక్షర (2), సహస్ర (7 నెలలు) అనే పిల్లలు ఉన్నారు. కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవు. నిర్మలకు హైబీపీ, ఫిట్స్ ఉండడంతో వివిధ ఆస్పత్రులలో చికిత్స చేయించారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు చనిపోతానంటూ తల్లిదండ్రులు, భర్తతో నిర్మల చెప్పేదని పోలీసులు తెలిపారు. మంగళవారం భర్త, తండ్రి పని మీద బయటకు... తల్లి పద్మ ఆస్పత్రికి వెళ్లారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నల్లా నీరు వచ్చింది. ఈలోగా ఫిట్స్. దురద, హైబీపీ ఎంతకూ తగ్గకపోవడంతో నిర్మల ఇద్దరు పిల్లలను చంపి, ఆత్మచేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో నీరు పట్టుకునేందుకు సంపు మూతను తెరిచారు. ఇంట్లో అద్దెకు ఉన్నవారు మంచినీరు పట్టుకున్న తర్వాత... నిద్రిస్తున్న పిల్లలు సహస్ర, అక్షరలను నిర్మల సంపులో వేసింది. తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న సమయంలో బయటి నుంచి వచ్చిన తల్లి పద్మ సంపు దగ్గర ఎందుకు నిలబడ్డావని కుమార్తెను ప్రశ్నించింది. దీంతో ఆమె సంపు మూత వేసి ఇంట్లోకి వెళ్లింది. ఇంట్లో పిల్లలు కనిపించకపోవడం... ఎక్కడ ఉన్నారని తల్లి అడగడంతో సంపులో వేశానని తెలిపింది. దీంతో పద్మ పెద్దగా కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న కృష్ణారెడ్డి వచ్చి సంపులోకి దిగి పిల్లలను బయటకు తీశారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ సంఘటనతో స్థానికులు, కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. విషయం తెలుసుకున్న తండ్రి మల్లేష్, తాత యాదగిరి, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని విగతజీవులైన చిన్నారులను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. పరిసర కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిర్మలను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం చేయవద్దు పిల్లలను ఎందుకు చంపావని భార్యను పదే పదే అడిగి.. విలపించిన మల్లేష్ తాము ఎవరిపైనా ఫి ర్యాదు చేయబోమని తెలిపాడు. తన పిల్లలను పోస్టుమార్టం చేయవద్దని పోలీసులను వేడుకున్నాడు. మానసిక పరిస్థితి బాగా లేనందునే... నిర్మలకు హైబీపీ, ఫిట్స్తో పాటు మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతోనే పిల్లలను చంపి.. ఆత్మహత్యకు యత్నించిందని ఎల్బీనగర్ ఏసీపీ పి.సీతారాం తెలిపారు. తాను చనిపోతే పిల్లలను ఎవరు చూస్తారంటూ కుటుంబ సభ్యులను తరచూ ప్రశ్నించేదని చెప్పారు. పూర్తి వివరాలు సేకరిస్తామని ఏసీపీ వివరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: చిన్నారుల మృతిపై స్పందించిన బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అనూరాధరావు మాట్లాడుతూ నిజానిజాలు తెలుసుకుని బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.