breaking news
	
		
	
  Sahara case investigation
- 
      
                   
                                 127 ట్రక్కుల్లో 3 కోట్ల పత్రాలు.. సెబీకి పంపిన సుబ్రతా రాయ్.. కారణం ఇదేనా?సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్ అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. ఆయన మరణం దాదాపు మూడు కోట్ల మంది పెట్టుబడిదారులు చేసిన మదుపుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. సహారా ఇండియా గ్రూప్ సంస్థ వెబ్సైట్ ప్రకారం.. ఈ సంస్థకు 9 కోట్ల మంది పెట్టుబడిదారులు, వినియోగదారులు ఉన్నారు. రూ.2.59 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వేల క్యాంపస్లు, 30,970 ఎకరాల భూములు ఉన్నట్లు సహారా ఇండియా వెబ్సైట్ చెబుతోంది. సెబీ చర్యల కారణంగా సుబ్రతా రాయ్ నిర్మించుకున్న సామ్రాజ్యం పతనం అవడం మొదలైంది. సహారా సంస్థ రియల్ఎస్టేట్ పెట్టుబడుల కోసమంటూ మూడు కోట్ల మందికి పైగా పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ.25వేల కోట్ల రూపాయలను సమీకరించడంపై కేసు నమోదైంది. 2011లో ఇన్వెస్టర్ల డబ్బును తిరిగి చెల్లించాలని సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్ఐఆర్ఈఎల్), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్హెచ్ఐసీఎల్) అనే రెండు సంస్థలను సెబీ ఆదేశించింది. అందుకు సంబంధించిన వివరాలు అడిగిన నేపథ్యంలో సహారా గ్రూప్ నుంచి 127 ట్రక్కులను సెబీ కార్యాలయానికి పంపి సుబ్రతా రాయ్ వార్తల్లో నిలిచారు. ఆ ట్రక్కుల్లో మూడు కోట్ల దరఖాస్తు పత్రాలు, రెండు కోట్ల రిడంప్షన్ ఓచర్లు ఉన్నాయి. నిర్ణత గడువులోగా రూ.10 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోతే 2014 మార్చి 4న సుబ్రతా రాయ్ జైలుకి వెళ్లారు. రూ.5 వేల కోట్లు నగదు రూపంలో, మిగతా రూ.5 వేల కోట్లు బ్యాంకు గ్యారంటీ రూపంలో హామీ ఇస్తేనే ఆయన విడుదల సాధ్యమవుతుందని కోర్టు స్పష్టం చేసింది. రాయ్ రెండేళ్ల జైలు జీవితం అనంతరం పెరోల్పై విడుదలయ్యారు. ఇదీ చదవండి: ‘ఎక్స్’ సమాచారాన్ని నమ్మలేం.. జిమ్మీ వేల్స్ ఆసక్తికర వ్యాఖ్యలు సెబీకు దాదాపు రూ.25వేల కోట్లు డిపాజిట్ చేసినట్లు గతంలో సుబ్రతారాయ్ ప్రకటించారు. కానీ కంపెనీ పెట్టుబడిదారులకు సెబీ తిరిగి సొమ్ము చెల్లించలేదని రాయ్ ఆరోపించారు. సెబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2023 మార్చి 31 నాటికి పెట్టుబడిదారులకు ఇచ్చేందుకు మొత్తం రూ.25,163 కోట్లు నిర్ణయించినప్పటికీ రూ.138 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించింది. రెండు సహారా గ్రూపు సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి భారీగా డబ్బు సేకరించేటప్పుడు వివిధ నిబంధనలను ఉల్లంఘించారు. మార్చి 31 నాటికి తమకు 20వేల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. 17500 దరఖాస్తులకు సంబంధించిన డబ్బును వాపసు చేశామని సెబీ తెలిపింది. సరైన రుజువులు సమర్పించని కారణంగా మిగతావాటిని చెల్లించలేదని వివరించింది. సెబీ లేవనెత్తిన ప్రశ్నలపై బాండ్ హోల్డర్ల నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడంతో వాటిని నిలిపేసినట్లు సమాచారం.
- 
      
                   
                                 రాయ్ పెరోల్ రద్దు..!
 సహారా తరఫు న్యాయవాది వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్
 * సంస్థ క్షమాపణలతో రూలింగ్ పునఃసమీక్షకు ఆమోదం
 * లొంగిపోడానికి వారం గడువు; తాజా బెయిల్ పిటిషన్కు ఓకే
 న్యూఢిల్లీ: సహారా కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో శుక్రవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సహారా తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది రాజీవ్ థామన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు, తక్షణం సహారా చీఫ్ సుబ్రతారాయ్, డెరైక్టర్లు ఇరువురి పెరోల్ను రద్దు చేస్తున్నట్లు రూలింగ్ ఇచ్చింది. 
 
 అయితే ఈ వార్త తెలిసిన వెంటనే గ్రూప్, గ్రూప్ తరఫు మరో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అప్రమత్తమయ్యారు. జరిగిన తప్పుకు క్షమాపణలు చెబుతున్నట్లు ఉన్నత న్యాయస్థానానికి విన్నవించారు. థావన్ను తమ న్యాయవాదిగా తొలగిస్తున్నట్లూ తెలిపారు. థావన్ వాదనలను సహారా తరఫుగా భావించరాదని వేడుకున్నారు. దీనితో కొంత శాం తించిన సుప్రీంకోర్టు తాజా బెయిల్ పిటిషన్ దాఖలుకు సహారాకు అనుమతి ఇచ్చింది. అప్పటికప్పుడు రాయ్, ఇరువురు డెరైక్టర్లను కస్టడీలోకి తీసుకోవాలని తొలుత ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం, ఈ లొంగుబాటు గడువునూ వారం పాటు పొడిగించింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే...
 
 * తల్లి మరణంతో మే నెలలో పెరోల్ పొందిన రాయ్, అప్పటి నుంచీ తాను బెయిల్కు చెల్లించాల్సిన రూ.10,000 కోట్లలో కొంత మొత్తాన్ని చెల్లిస్తూ, పెరోల్ను కొనసాగించుకుంటున్నారు. ఇలా ఇప్పటికి రూ.352 కోట్లు చెల్లించారు. శుక్రవారంతో పెరోల్ ముగిసింది.
 * సెప్టెంబర్ 30 వరకూ పెరోల్ గడువు పొడిగింపునకు రూ.300 చెల్లించాలని సుప్రీం సూచించింది.
 * ఈ సందర్భంగా సహారా తరఫు న్యాయవాది థావన్ (మరో న్యాయవాది కపిల్ సిబాల్ జ్వరంతో కోర్టుకు హాజరుకాలేదు) తమకు ఏ విషయాలూ తెలియజేయకుండా, మార్కెట్ రెగ్యులేటర్ సహారా ఆస్తుల జప్తు ప్రక్రియను నిర్వహిస్తోందని, ఆయా అంశాల్లో తమ ప్రమేయాన్నీ సెబీ అనుమతించాలని అన్నారు. ఇప్పటికే కట్టాల్సిన రూ.300 కోట్లు కన్నా అదనంగా రూ.52 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్న థావన్, తదుపరి ఉత్తర్వుకు ముందు కేసు గురించి వినాలన్నారు.
 * ఇందుకు కోర్టు స్పందిస్తూ... ‘మీరు తప్పనిసరిగా అన్ని విషయాల్లో సహకరించాలి. లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. మేము ఏమి చేయాలో మీరు చెప్పడం తగదు’ అని వ్యాఖ్యానించింది.
 * దీనికి స్పందించిన థావన్ న్యాయస్థానం మాటలను తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు తగదని, సమ్మతం కాదని అన్నారు.
 * ‘కోర్టు పట్ల, వ్యవస్థ పట్ల ఏ మాత్రం గౌరవం లేని వ్యాఖ్యలుగా’ వీటిని పరిగణించిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం, దీనిని సహారా తరఫు మాటలుగానే భావించి తక్షణం రాయ్, మరో ఇరువురి పెరోల్ను రద్దు చేసింది.
 * ఇది తెలిసి కోర్టులో సహారా తరఫున తక్షణం కపిల్ సిబల్ క్షమాపణలు తెలిపారు.
 * దీనితో శాంతించిన న్యాయస్థానం రాయ్, డెరైక్టర్ల లొంగుబాటుకు వారం గడువు ఇచ్చింది. రాయ్ బెయిల్కు సంబంధించి తాజా పిటిషన్ను దాఖలు చేయాలనీ సూచించింది. అప్పటి వరకూ రాయ్ జైలులోనే ఉండాలని సూచించింది.


