breaking news
S. Srinivasa reddy
-
'ఆయనకు ఏకలవ్య శిష్యుడిని'
రాజమండ్రి : తాను దర్శకత్వం వహించిన ఢమరుకం చిత్రం తనకు మంచి పేరు తెచ్చిందని ప్రముఖ సినీ దర్శకుడు సబ్బెళ్ళ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రావులపాలెంలోని స్నేహితుడు పడాల రామిరెడ్డి ఇంటికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. *జిల్లాలోని బలభద్రపురం మా స్వస్థలం. అయితే పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం వెలగలవారిపాలెంలో స్థిరపడ్డాం. ఇలా ఉభయ గోదావరి జిల్లాలతో నాకు మంచి అనుంబంధం ఉంది. *1984లో సినీరంగ ప్రవే శం చేశాను. చాలామంది డెరైక్టర్ల వద్ద అసిస్టెంటుగా పని చేశాను. *పశ్చిమ గోదావరి జిల్లా నత్తా రామేశ్వరానికి చెందిన స్నేహితులు ఆనందరెడ్డి, ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, రామలింగేశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డి నిర్మాతలుగా.. 1996లో తొలిసారి ఆలీ హీరోగా ఆషాఢం పెళ్ళికొడుకు చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. *ఇప్పటివరకూ తొమ్మిది చిత్రాలకు దర్శకత్వం చేశాను. ఆషాఢం పెళ్ళికొడుకు; సుమన్, భానుప్రియలతో ఫిబ్రవరి 14 నెక్లస్ రోడ్; శివాజీ, లయలతో అదిరిందయ్యా చంద్రం; శివాజీ, కృష్ణభగవాన్, లయలతో టాటా బిర్లా మధ్యలో లైలా; శ్రీకాంత్, వేణు మీరాజాస్మిన్లతో యమగోల మళ్ళీ మొదలైంది; అల్లరి నరేష్, ఫర్జానాలతో బొమ్మన బ్రదర్స్ - చందన సిస్టర్స్; కుబేరులు వీళ్ళకి అన్ని అప్పులే; నాగార్జున, అనుష్కలతో ఢమరుకం; ఇటీవల మామ మంచు అల్లుడు కంచు చిత్రాలకు దర్శకత్వం వహించాను. *నాగార్జునతో చేసిన ఢమరుకం చిత్రం మంచి పేరు తెచ్చింది. నాగార్జున కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించింది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఈ సినిమాకోసం మూడేళ్లు కష్టపడి స్క్రిప్ట్ వర్క చేశాం. *త్వరలో రెండు సినిమాలు సెట్స్పైకి వెళ్లనున్నాయి. ఢమరుకం స్థాయిలో ఒక భారీ బడ్జెట్ మూవీ కూడా ఉంటుంది. వివరాలు త్వరలో తెలుస్తాయి. *దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంటరీలను రూపొందించే అవకాశం నాకు కలిగింది. దానికోసం సినిమాలను వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్ అంటే నాకు అంత అభిమానం. *రావులపాలేనికి చెందిన పడాల రామిరెడ్డి, మేడపాటి రామిరెడ్డి నాకు మంచి మిత్రులు. అక్కాబావలది పక్కనే ఉన్న కొమరాజులంక గ్రామం. *ఈవీవీ సత్యనారాయణ నాకు ఇష్టమైన దర్శకుడు. ఆయనతో కలసి పని చేసే అవకాశం రాలేదు కానీ ఆయనను గురువుగా భావిస్తాను. ఒకరకంగా చెప్పాలంటే నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడిని. -
బడ్జెట్లో బాలలకు అధిక నిధులు కేటాయించాలి
హైదరాబాద్సిటీ (పద్మారావునగర్): తెలంగాణ బడ్జెట్లో బాలల కోసం అధిక నిధులు కేటాయించాలని అప్స స్వచ్చంధ సంస్ధ స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అప్స డెరైక్టర్ ఎస్. శ్రీనివాస్ రెడ్డి, స్పీకర్ మధుసూదనచారి, తెలంగాణ బీజేపీ శాసన సభాపక్ష నాయకుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్లను కలిసి వినతి పత్రం సమర్పించారు. దేశంలో రాష్ట్రంలో 40శాతం బాలలు ఉన్నారన్నారు. అయితే వారి కోసం నిధులు భారీ ఎత్తున కేటాయించాలన్నారు. భావి భారత పౌరులైన బాలల విద్యా..వికాసానికి బాటలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించాలని...ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చి నాణ్యమైన విద్యను అందించాలని చెప్పారు. బాలల ఆధారిత బడ్జెట్ను రూపకల్పన తొలి బడ్జెట్ చైల్డ్ ఫ్రెండ్లీ బడ్జెట్ ద్వారా ఇతర రాష్ట్రాలకు అదర్శంగా నిలువాలని స్పీకర్ మధుసూదనచారి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్లకు సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. బాలల సమస్యలపై అసెంబ్లీలో చర్చజరగాలన్నారు. బాలల హక్కుల కోసం పనిచేస్తున్న ప్రతినిధులతో కలిసి అసెంబ్లీలోని వివిధ పక్షాల నాయకులను కలిసి వినతి పత్రం అందజేస్తామని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో అప్స ప్రతినిధులు శివరాణి, రమేష్ తదితరులు పాల్గొన్నారు