breaking news
Rythu Vedika
-
‘టి ఫైబర్’తో రైతు వేదికలకు ఇంటర్నెట్..
సాక్షి, హైదరాబాద్: టి ఫైబర్పై ఐటీ మంత్రి కేటీఆర్ పలు కీలక నిర్ణ యాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘టి ఫైబర్’ప్రాజెక్టు ద్వారా రైతు వేదికలను ఇంటర్నెట్తో అనుసంధానించి ప్రతి రైతుకూ మేలు జరిగేలా చూడాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు ఇప్పటికే ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని ఐదు రైతు వేదికలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చినట్లు చెప్పారు. గురువారం హైదరాబాద్లో జరిగిన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ (టి ఫైబర్) బోర్డు సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పరిధిని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు విస్తరించాలని, ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి అన్ని గ్రామపంచాయతీలను ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా అనుసంధానించాలని సూచించారు. ఫైబర్గ్రిడ్ ప్రాజెక్టు పనుల పురోగతి మంత్రి ఆరా తీశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు ఈ ఏడాది జూన్ నుంచి ప్రాధాన్యతాక్రమంలో కనెక్షన్లు ఇవ్వాలన్నారు. సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రాస్, మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్రెడ్డి, టీ ఫైబర్ ఎండీ సుజయ్ కారంపూరి పాల్గొన్నారు. చదవండి: 2 నెలల్లోనే తారస్థాయికి -
కేసీఆర్ కోసం ప్రాణం ఇచ్చేందుకు సిద్ధం
సాక్షి, వరంగల్: ‘నలభై ఏండ్ల నా రాజకీయ జీవితంలో అందరూ నన్ను వాడుకున్నారు. ఏ ఒక్కరూ కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ దయవల్ల నాకు మంత్రి పదవి వచ్చింది. ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధమే’అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం కొడకండ్లలో రైతువేదిక ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో మంత్రి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని బాగు చేసుకుంటున్నానని, రాజకీయంగా తగిన గుర్తింపు, స్థాయినిచ్చిన కేసీఆర్ ఆశీర్వాదం తనకు ఎల్లప్పుడూ ఉండాలని పేర్కొన్నారు. కేసీఆర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, కేసీఆర్ ప్రాణం ఉన్నంత వరకు మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితి రాదని నమ్ముతున్నానని విశ్వాసం వ్యక్తం చేశారు. కాకతీయులను మించిన మహానుభావుడు తెలంగాణ రాష్ట్రంలో అసాధ్యాలను సుసాధ్యం చేసిన అపర భగీరథుడు, కాకతీ య రాజులను మించిన మహానుభావుడు కేసీఆర్.. అని మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావు సీఎంను కొనియాడారు. అహర్నిశలు ప్రజల సంక్షేమం కోసం శ్రమిస్తున్న సీఎంని మనందరం గుండెల్లో పెట్టుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జనగామ అంతా కరువు ప్రాంతంగా ఉండేదని, తాను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పు డు చెరువులు, కాల్వలు, ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని, ఎస్సారెస్పీ ఎండిపోయి తుమ్మ చెట్లు మొలిచాయని, దేవాదుల పూర్తికాలేదని గుర్తుచేశారు. రైతుల పేరు చెప్పుకుని గతంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఏమీ చేయలేదని, సాగునీరు, విద్యుత్ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో దేవాదుల పూర్తి చేసుకుని చెరువులను నింపుకున్నామని, ఎస్సారెస్పీ కాల్వకు నీళ్లు వస్తున్నాయని, దండగన్న వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నామని పేర్కొన్నారు. రైతుబిడ్డ సీఎం కావడంవల్లనే ఇదంతా సా«ధ్యమైందని, రైతుల జీవితాల్లో కేసీఆర్ గొప్ప మార్పు తీసుకొచ్చారన్నారు. సీఎం కేసీఆర్ దయవల్ల పాలకుర్తి నియోజకవర్గానికి సాగునీరు వచ్చిందని తెలిపారు. కొత్త ఒరవడికి శ్రీకారం సాక్షి, జనగామ: రైతు వేదికల నిర్మాణంతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం. ఇది భారతదేశ చరిత్రలోనే నిలిచి పోయే రోజు. అన్నం పెట్టే రైతన్నను ఏడు దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోలేదు. కారణజన్ముడైన కేసీఆర్.. రైతులు అడగక ముందే అన్నీ ఇస్తున్నారు. రైతు వేదిక ప్రారంభం సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘట్టం. రక్తం పారిన నేలలో సీఎం కేసీఆర్ నీళ్లు పారిస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1.45 కోట్ల ఎకరాల పంట పండుతోంది. రైతు పండించే ప్రతీ గింజ, తెల్లని పత్తిలో కేసీఆర్ కనిపిస్తున్నారు. కవి దాశరథి చెప్పినట్లుగా ఇప్పుడు కరువు కాటకాలు కనిపించడం లేదు. కృష్ణా, గోదావరి జలాలతో తెలంగాణ సమాజం కన్న కలలను సీఎం నిజం చేస్తున్నారు. – సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయాన్ని పండుగ చేశారు కొందరు ముఖ్యమంత్రులు వ్యవసాయాన్ని దండగ చేస్తే కేసీఆర్ పండుగ చేశారు. రైతు పక్షపాతి, రైతు ప్రేమికుడు కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 2,601 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ వస్తే కరెంటు రాదని కొందరు ఎద్దేవా చేశారు. కానీ కేసీఆర్ చొరవతో 24 గంటల కరెంటు వస్తోంది. 1.65 లక్షల మంది రైతు బంధు సైనికులకు బాధ్యత వహించడమే కాకుండా సీఎంకు దగ్గరగా ఉండే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. – పల్లా రాజేశ్వర్రెడ్డి, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు -
రైతు రాజ్యమే లక్ష్యం
సాక్షి, వరంగల్: ‘కొడకండ్లలో రైతువేదికను ప్రారంభిస్తే రాజ్యం తెచ్చినంత సంతోషంగా ఉంది. తెలం గాణలో రైతురాజ్యం సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యం’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. చైతన్యదీపికలుగా రైతు వేదికలు పనిచేస్తాయని, ఇవి రైతు విప్లవానికి నాంది అవు తాయని చెప్పారు. దేశంలో ఎక్కడా రైతులకు సంఘాలు, వేదికలు లేవని, కేవలం రైతులను సంఘటితం చేయడం, వారి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రూ.600 కోట్లతో 2,601 రైతు వేదికల్ని నిర్మించామని తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్లలో క్లస్టర్ స్థాయిలో నిర్మించిన రైతువేదికను సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఐదువేల మందితో ఏర్పాటుచేసిన ‘ఆత్మీయ రైతు సమ్మేళనం’ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘రైతు వేదిక నా గొప్ప కల. రైతాంగం ఒకచోట కూర్చొని మాట్లాడు కోవాలి. నియంత్రిత సాగుపై మాట్లాడినట్లే చర్చ చేయాలి. రైతు వేదిక ఒక ఆటంబాంబు. ఒక శక్తి’ అని సీఎం పేర్కొన్నారు. ‘ధరణి పోర్టల్, రైతు వేదికలు, రైతుబంధు, రైతుబీమా వట్టిగా పెట్ట లేదు. రైతులందరూ సంఘటితం కావాలనే ఉద్దేశం తోనే వీటన్నింటినీ చేపట్టాం. రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలి. కూరగాయలు, ధాన్యం ధరలు దళారుల చేతుల్లోకి పోవద్దు. వీటన్నింటిలో కీలకపాత్ర పోషించే రైతు వేదికలు దేశానికి ఆదర్శంగా నిలవబోతున్నాయి. తెలంగాణలో రైతురాజ్యం వచ్చి తీరుతది. తెలంగాణ రైతాంగమంతా కొన్ని విషయాలను సీరియస్గా తీసుకోవాలి. నేను సీఎం అయ్యేనాటికి వ్యవసాయ శాఖను చంపేశారు. కానీ ఇప్పుడు అన్ని పోస్టులు భర్తీ చేశాం. వ్యవసాయ శాఖ అద్భుతంగా పనిచేస్తోంది’ అని సీఎం అన్నారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్. చిత్రంలో పల్లా రాజేశ్వర్రెడ్డి, మంత్రులు నిరంజన్రెడ్డి, సత్యవతి రాథోడ్, దయాకర్రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే రాజయ్య తదితరులు రైతువేదికలు రైతు ప్రగతి కేంద్రాలు రైతులంతా సంఘటితమై సాగులోని లాభనష్టాలు, వాడే పురుగుమందులు, మార్కెట్లో డిమాండ్, పంటను క్రమపద్ధతిలో మార్కెట్కు తరలించడం వంటివి రైతువేదికలో చర్చించుకోవాలని సీఎం సూచించారు. వీటిలో రైతుబంధు సమితి సభ్యులు కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. ప్రపంచం మొత్తమ్మీద ప్రభుత్వం రైతులకు వేదికలు నిర్మించడం తెలంగాణలోనే జరిగిందన్నారు. రైతువేదికల్లో టీవీలు ఏర్పాటుచేసి సీఎం, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తల సూచనలు నేరుగా రైతులకు అందిస్తామని తెలిపారు. ఛత్తీస్గఢ్లోని రాయిపూర్ రైతులు స్వచ్ఛందంగా సంఘం ఏర్పాటుచేసుకోవడంతో తక్కువ ధరకు ఎరువులు, పంట విక్రయ సమయంలోనూ మంచి ధర సాధిస్తున్నారన్నారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ ‘దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ పథకాలను రైతుల కోసం అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతుల నుంచి ఎటువంటి దరఖాస్తు రాకుండానే వారి సంక్షేమంపై ఆలోచించి రైతుబంధు, రైతుభీమా వంటి పథకాలను ప్రవేశపెట్టాం’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘రైతుబంధు ద్వారా ఇప్పటివరకు రైతుల ఖాతాలో నేరుగా సుమారు రూ.28 వేల కోట్లు జమ చేశాం. కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు ఆగదు. ఏటా రూ.1,200 కోట్లు ఖర్చుచేసి రైతుకు భద్రత కల్పించేందుకు రైతుబీమా అమలు చేస్తున్నాం. దేశంలో పూర్తిస్థాయిలో మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం మనదే. దేశవ్యాప్తంగా కొనుగోలు చేసిన ధాన్యంలో 55% వాటాతో తెలంగాణ రికార్డు సృష్టించింది అని కేసీఆర్ వివరించారు. భూమి కౌలు, ఇల్లు కిరాయి ఒకటే.. రైతుల భూహక్కులను సంపూర్ణంగా రక్షించేందుకు, వారి సమస్యలు తొలగించేందుకు వీలుగా ధరణి పోర్టల్ రూపొందించామని సీఎం తెలిపారు. ‘పట్టాదారు రైతుల సంరక్షణ మా అజెండా. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఎట్టి పరిస్థితుల్లో పట్టాదారు పాస్ పుస్తకాల్లో అనుభవదారుడు కాలమ్ రాయబోము. అనుభవదారుడిగా ఒక వ్యక్తి మూడేళ్లుంటే అతడికి భూమిపై హక్కు వస్తుంది. కోర్టులో కేసులువేసి అసలుదారుడిని ఇబ్బంది పెడుతున్నారు. పట్టణాల్లో ఇల్లు కిరాయికి ఇచ్చే సమయంలోనూ కిరాయిదారు అనే ప్రస్తావన పత్రాల్లోనూ, మరెక్కడా ఉండదు. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాల్లో సైతం అవసరం లేదు. భూమి కౌలుకివ్వడం ఇంటిని కిరాయికివ్వడం వంటిదే’ అని సీఎం వివరించారు. పల్లె ప్రగతి ద్వారా 12,751 గ్రామ పంచాయతీలకు ప్రతీనెలా సకాలంలో నిధులు విడుదల చేస్తుండడం, సర్పంచ్లు, పంచాయతీ సిబ్బంది తీసుకుంటున్న చర్యలతో ప్రజారోగ్యం మెరుగుపడుతోందన్నారు. రైతు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి కేంద్ర ప్రభుత్వం పూర్తి రైతు వ్యతిరేక వైఖరి అవలంభిస్తుందని, రైతులంతా దీనిపై సమష్టిగా ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతులపై కేంద్రానికి ప్రేమ లేదన్నారు. ప్రపంచంలోని దేశాలు రైతులకు సబ్సిడీలు ఇస్తుంటే మన కేంద్ర ప్రభుత్వం మాత్రమే అందించవద్దని చెబుతోందన్నారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్సీఐ భయంకరమైన ఆంక్షలు విధించిందని, ధాన్యం కేవలం రూ.1,888కే కొనుగోలు చేయాలని, అధిక ధరకు కొంటే తాము సేకరించబోమంటూ దుర్మార్గ వైఖరి అవలంభిస్తుందన్నారు. ఎఫ్సీఐ నిబంధనతో సన్న వడ్లకు వెంటనే అధిక ధర ప్రకటించలేకపోతున్నామని, తప్పనిసరిగా మరోమార్గంలో ఆయా రైతులకు అధిక లాభం కలిగేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టం సైతం పూర్తి రైతు వ్యతిరేకంగా ఉందన్నారు. నూతన వ్యవసాయ చట్టాన్ని టీఆర్ఎస్, తెలంగాణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. సదరు దుర్మార్గపు చట్టం నుంచి రక్షించుకోవడానికి రైతు వేదికలు అవసరమైన సమయంలో తమ పాత్ర పోషించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. యాసంగిలోనూ సహకరించండి వానాకాలంలో నియంత్రిత సాగుకు సహకరించిన రైతులు యాసంగిలోనూ సంపూర్ణంగా సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కేంద్ర రైతు వ్యతిరేక విధానాలతో మక్క పంటకు మద్దతు ధర లభించడం లేదని, అయినా కేంద్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మక్కలపై సుంకం 50% నుంచి 15% తగ్గించిందని సీఎం మండిపడ్డారు. వానాకాలంలో మక్కల సాగు బాగా తగ్గినా సాగు చేసిన కొందరు నష్టపోవద్దని రూ.600 కోట్లు నష్టం వస్తున్నా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. యాసంగిలో మాత్రం మక్క కాకుండా, కంది, శనగలు, పామాయిల్ వంటివి సాగు చేస్తే ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని భరోసానిచ్చారు. త్వరలోనే తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు నీరందిస్తామని తెలిపారు. దళితులు, గిరిజనుల అభివృద్ధికి సైతం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి అమలుచేస్తామని, ఇప్పటికే రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించి మంచి విద్య అందిస్తున్నామని సీఎం వెల్లడించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమం, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, ప్రభుత్వ విప్ బి.వెంకటేశ్వర్లు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్రెడ్డి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్, జనగామ జిల్లా కలెక్టర్ కె.నిఖిల, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది కిరికిరిగాళ్ల ముచ్చట ‘నియంత్రిత సాగు విధానంతో రైతులకు లాభం చేకూర్చాలని మేం పనిచేస్తుంటే కొంతమంది దుర్మార్గంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ దొంగ ముచ్చట్లు చెబుతున్నాడు. కిరికిరిగాళ్ల ముచ్చట్లు ఎట్ల ఉంటయో షబ్బీర్ అలీ కథ చూస్తే అర్థమైతది. షబ్బీర్ అలీ అనే కాంగ్రెస్ నాయకుడికి మెదక్ జిల్లా నార్సింగి మండలం జాప్తి శివనూరులోని సర్వే నంబర్ 408 నుంచి 413 వరకు భూములు ఉన్నాయి. అందులో వరి పంట కోసి గడ్డి కాలపెట్టిండు. సీఎం సన్నరకం పెట్టమంటే పెట్టిన.. నష్టపోయానని ఆయన ఫాంహౌస్లో పనిచేసే ఎలక్ట్రీషియన్ గణేశ్తో చెప్పించిండు. ఇదీ షబ్బీర్ అలీ కథ. ఇంత దొంగ ముచ్చట్లా? సోషల్ మీడియా కాదు.. యాంటీ సోషల్ మీడియా అయిపోయింది. ప్రతిపక్షాలకు దొంగ మాటలు మాట్లాడటం అలవాటైనా గుండెల నిండా నిజాయితీ ఉన్న సీఎంను ఎవరూ ఏం చేయలేరు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పింఛన్లపై బీజేపీవి అబద్ధాలు ‘బీజేపీ నాయకులు పింఛన్ల విష యంలో పచ్చి అబద్ధాలు మాట్లాడు తున్నారు. పెన్షన్లకు కేంద్రం అధిక మొత్తంలో డబ్బు చెల్లిస్తున్నట్లు ఎవడైనా మొగోడు రుజువుచేస్తే ఒక్కటే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతా. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ వాళ్లు గెలిచేది లేదు.. పీకేది లేదు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నాయకులు ఘోరాతి ఘోరమైన అబద్ధాలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో 38.65 లక్షల మందికి అన్ని రకాల పెన్షన్లు ఇస్తున్నాం. ఈ పెన్షన్లలో కేంద్రం గుండుగుత్తగా 7 లక్షల మందికి మాత్రమే ఇస్తుంది. అదీ రూ.200 మాత్రమే. సంవత్సరానికి కలిపి కేంద్రం ఇచ్చేది రూ.105 కోట్లు అయితే రాష్ట్రం రూ.10 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్లు ఇస్తోంది. ఈ లెక్కలన్నీ ‘కాగ్’ అధికారికంగా విడుదల చేసింది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
నిరూపిస్తే.. రాజీనామా చేస్తా : సీఎం కేసీఆర్
సాక్షి, జనగామ : తెలంగాణలో 38,64,751 మందికి పెన్షన్లు ఇస్తున్నామని, అందులో కేంద్ర ప్రభుత్వం కేవలం 6.95 లక్షల మందికే పెన్షన్లు అందిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శనివారం ఆయన జనగామ జిల్లా కొడకండ్లలో తొలి రైతు వేదికను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. పెన్షన్ల విషయంలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. (చదవండి : ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నా : కేసీఆర్) కేంద్రం కేవలం మనిషికి రూ.200 చొప్పున మాత్రమే పింఛన్లు అందిస్తే.. బీజేపీ నేతలు మాత్రం రూ.1600 చొప్పున ఇస్తోందని అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ప్రతి ఒక్కరికి రూ.2,016 చొప్పున పెన్షన్లు అందిస్తుందని గుర్తు చేశారు. పెన్షన్ల విషయంలో తాను చెప్పేది అబద్దమని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని బీజేపీ నేతలకు కేసీఆర్ సవాల్ విసిరారు. -
ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నా : కేసీఆర్
సాక్షి, జనగామ : రైతు పెద్దవాడే కానీ కూర్చొని మాట్లాడుకునేందుకు స్థలమే లేదని, అందుకే రైతు వేదికలను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో తొలి రైతు వేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం జనగాం జిల్లా కొడకండ్లలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతు వేదిక ఏర్పాటు వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యాయం అన్నారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా రైతులకు ఒక వేదిక లేదని, తెలంగాణాలోనే తొలిసారి రైతుల కోసం భవనాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఉద్యమ సమయంలో రైతుల బాధలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతులను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. (చదవండి : రైతన్నకు ‘వేదిక’) ఇతర దేశాల్లో మాదిరి మన దేశంలో రైతులకు సబ్సిడీ అందడం లేదని విమర్శించారు. రాష్ట్రాలకు అందించాలనుకున్నా కేంద్రం ఆక్షలు అడ్డుపతున్నాయని ఆరోపించారు. ధాన్యానికి ఎక్కువ ధరలు ఇస్తామంటే ఎఫ్సీఐ వడ్లు కొనుగోలు నిలిపివేసిందన్నారు. రైతులను నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ధాన్యం సన్నవైనా, దొడ్డవైనా రూ.1,880లకే కొనుగోలు చేస్తామని ఎఫ్సీఐ చెబుతోందని, అంత కంటే ఎక్కువైతే ధాన్యం సేకరించేదే లేదని ఆంక్షలు విధించిందని గుర్తు చేశారు. కేంద్రం రైతులకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. కేంద్రంపై రైతులు పిడికిలి పట్టి ఉద్యమించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచే ఉద్యమం ప్రారంభం కావాలన్నారు. రైతు సంఘటితం కావడానికి రైతు వేదిక ఉపయోగపడాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.