breaking news
Ruchir Sharma
-
విపక్షాలు ఏకమైతే మోదీకి సవాలే..
న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి ప్రధాని పగ్గాలు చేపట్టే అవకాశాలు 2017లో 99 శాతం నుంచి ప్రస్తుతం 50 శాతానికి తగ్గాయి. మోదీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవుతుండటంతో ఆయన మళ్లీ ప్రధాని అయ్యే అవకాశాలు సన్నగిల్లాయని న్యూయార్క్కు చెందిన ఆర్థిక విశ్లేషకులు, కాలమిస్ట్ రుచిర్ శర్మ అంచనా వేశారు. విపక్షాలు వేర్వేరుగా పోటీ చేయడంతో 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 31 శాతం ఓట్లు దక్కాయని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికలు పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో జరుగుతాయని, 2017లో యూపీ ఎన్నికల ఫలితాల ఆధారంగా మోదీ తిరిగి ప్రధాని అయ్యే అవకాశాలు 99 శాతం ఉన్నాయనే అంచనా వెల్లడైందని, ప్రస్తుతం ఇది 50 శాతానికి పడిపోయిందని తెలిపారు. గతంలో నిట్టనిలువునా చీలిన విపక్షాలు ఇప్పుడు ఏకమవుతున్న క్రమంలో ఎన్నికలు ఏ ఒక్కరికీ అనుకూలంగా ఏకపక్షంగా జరిగే అవకాశం లేదని చెప్పారు. భారత్లో ప్రజాస్వామ్య పరంపరపై రుచిర్ శర్మ రాస్తున్న డెమొక్రసీ ఆన్ రోడ్ ఫిబ్రవరి 2019లో పాఠకుల ముందుకు రానుంది. 1990ల నుంచి భారత్లో పలు ఎన్నికలను ఆయన విశ్లేషిస్తూ వచ్చారు. యూపీలో బీఎస్పీ, ఎస్పీల మధ్య పొత్తు కుదిరితే రాష్ట్రంలో ఆ కూటమి అన్ని సీట్లనూ స్వీప్ చేస్తుందని శర్మ చెప్పుకొచ్చారు. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో విపక్షాల పొత్తు బీజేపీని దెబ్బతీస్తుందని, విపక్షాలు విడిగా పోటీ చేస్తే బీజీపీకి లాభిస్తుందని పేర్కొన్నారు. యూపీలో ఓటింగ్ను ఇప్పటికీ కుల సమీకరణలే నిర్ధేశిస్తున్నాయన్నారు. -
రత్నాలుగా ఉన్నప్పుడే...పీఎస్యూలను అమ్మేయాల్సింది
♦ ప్రైవేటు కంపెనీలు నిర్వీర్యం చేస్తుంటే చూస్తూ ఉన్నారు ♦ ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ రుచిర్శర్మ... న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూ)ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ రుచిర్ శర్మ తప్పుబట్టారు. పీఎస్యూలను లాభసాటిగా ఉన్నప్పుడే వాటిని ప్రభుత్వం అమ్మేసి ఉండాలని అభిప్రాయపడ్డారు. అలా చేయకపోగా, ప్రైవేటు కంపెనీలు వాటిని నిర్వీర్యం చేస్తూ ఉంటే ప్రభుత్వం కళ్లప్పగించి చూసిందని విమర్శించారు. ‘ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నేషన్స్: టెన్ రూల్స్ ఆఫ్ చేంజ్ ఇన్ పోస్ట్ క్రైసిస్ వరల్డ్’ పేరుతో రుచిర్ శర్మ తాజాగా రాసిన పుస్తకంలో ఈ మేరకు భారత ప్రభుత్వ విధానాలను విశ్లేషించారు. ప్రైవేటీకరణ అనే అసంబద్ధ విధానాన్ని ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ‘‘పీఎస్యూలను విక్రయించలేదు. అలా అని వాటిని సంస్కరించనూ లేదు. దీనికి బదులు ప్రైవేటు కంపెనీలు పీఎస్యూలను బలహీనపరుస్తూ ఉంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించింది’’ అని మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ముఖ్య వ్యూహకర్త రుచిర్ శర్మ అన్నారు. పుస్తకంలోని ప్రధాన అంశాలు: 30 ఏళ్ల క్రితం భారతీయులు గగనతలంలో ప్రయాణించాలంటే ఎయిర్ ఇండియా సంస్థ ఒక్కటే ఆధారం. కానీ, ప్రైవేటు ఎయిర్లైన్ సంస్థల రాకతో ఎయిర్ ఇండియా వాటా 25 శాతం కంటే దిగువకు పడిపోయింది. ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యంతో టెలికామ్ మార్కెట్ను ఏలి నేడు నష్టాల్లో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పరిస్థితిని కూడా ఆయన వర్ణించారు. దూకుడుగా ఉండే ప్రైవేటు టెలికాం కంపెనీలతో పోటీ పడలేక బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ క్రమంగా క్షీణించిపోయారు. మోదీ పానలలో సానుకూలతలు... లోపాలు ప్రధాని మోదీ సైతం ‘దేశ సంప్రదాయ విధానమైన కాలానుగుణంగా మార్పు’ విధానానికే కట్టుబడి ఉన్నారని శర్మ పేర్కొన్నారు. ఇంధన సబ్సిడీలను తగ్గింపు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోటీ వాతావరణం వంటి కొన్ని సానుకూల చర్యలను మోదీ చేపట్టినట్టు ప్రశంసించారు. అయితే, ప్రభుత్వ బ్యాంకింగ్ రంగం 75% రుణాలను నియంత్రిస్తుండడాన్ని ప్రధాన అవరోధంగా పేర్కొన్నారు. భారత్లో తయారీ విధానంలోనే ప్రాథమిక లోపం ఉందని, సాధారణ ఫ్యాక్టరీల ఏర్పాటు గురించి మోదీ మాట్లాడడం లేదన్నారు.