-
ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఉద్యోగుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలతోపాటు అలవెన్సులు కూడా కలిపి చెల్లించాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ‘పే ఇన్ టు’లో డ్యూటీ బేస్డ్ అలవెన్సులను జీతాలతోపాటు కలిపి చెల్లించనుంది. ఈ మేరకు ఖజానా శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. 2024 జనవరి నుంచి ఈ విధానం అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే నెల నైట్ అవుట్, డే అవుట్ అలవెన్సులు, ఓవర్ టైమ్ అలవెన్సులను జీతాలతోపాటు చెల్లించనున్నారు. దాంతో దాదాపు 50వేలమంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత నైట్ అవుట్, డే అవుట్, ఓటీ అలవెన్సులు విడిగా చెల్లిస్తున్నారు. ఆ విధంగా కాకుండా విలీనానికి ముందు ఉన్నట్టుగానే జీతాలతోపాటు చెల్లించాలని ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం అలవెన్సులను జీతాలతోపాటు చెల్లించాలని నిర్ణయించింది. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 2017 పీఆర్సీ బకాయిలు, ఎస్ఆర్బీఎస్ ట్రస్ట్కు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా త్వరలోనే దశలవారీగా చెల్లించాలని నిర్ణయించింది. పదోన్నతులకు త్వరలో మార్గదర్శకాలు ప్రభుత్వంలో విలీనానికి (2020 జనవరి 1కి) ముందు నుంచి ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్న వారికి పదోన్నతుల కల్పనకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం త్వరలోనే జారీ చేయనుంది. ఆ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 1,026 మందికి పదోన్నతులు కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక ఆర్టీసీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలపై అప్పీల్ చేసుకునేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని కూడా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఆర్టీసీలో ఉద్యోగ నిర్వహణకు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నిర్వహణకు ఉన్న వ్యత్యాసాలను పరిగణలోకి తీసుకోవాలని విన్నవించారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా క్రమశిక్షణ చర్యలు అమలు చేస్తే ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. క్రమశిక్షణ చర్యలపై ఆర్టీసీ ఉద్యోగులు అప్పీల్ చేసేందుకు.. తదనంతరం సత్వరం పరిష్కరించేలా విధి విధానాలను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దానిపై రూపొందించిన ముసాయిదాను న్యాయశాఖ పరిశీలనకు పంపారు. త్వరలోనే క్రమశిక్షణ చర్యలపై ప్రత్యేకంగా అప్పీళ్లకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేయనుంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలతోపాటు అలవెన్సులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. ఉద్యోగుల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. – పల్లిశెట్టి దామోదరరావు, రాష్ట్ర అధ్యక్షుడు, ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగులకు ప్రయోజనకరం ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లపై సాను కూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. డ్యూటీబేస్డ్ అలవెన్సులను ప్రతి నెల జీతాలతోపాటు చెల్లించడం ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – పీవీ రమణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, వై.శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నేషనల్ మజ్దూర్ యూనియన్ -
ఆర్టీసీ చైర్మన్ భవనంపై సర్కారు కన్ను?
స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు * ఇటీవల స్వయంగా సీఎం వచ్చి పరిశీలన * ప్రస్తుతం పోలీసు పహారాలో భవనం * అత్యంత విలువైన ప్రాంతంలో ఉండటంతో వాణిజ్యపరంగా ఆర్టీసీకి ఉపయోగపడే వీలు * తీవ్ర నష్టాల్లో ఉన్నందున దాన్ని వాణిజ్య అవసరాలకు వాడుకోవాలంటున్న ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్: నష్టాలు... అప్పులు.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆర్టీసీ జీతాల కోసం ది క్కులు చూస్తుండగా... దాని అధీనంలో ఉన్న అత్యంత విలువైన భూమిపై సర్కారు కన్నేసింది. ఇందులో విలాసవంతమైన భవనంతోపాటు చుట్టూ ఖాళీ స్థలం ఉండటంతో దాన్ని స్వాధీనం చేసుకొని ఇతర అవసరాలకు వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) చైర్మన్ కోసం తార్నాకలో ప్రధాన రహదారిపై విశాలమైన భవంతి ఉంది. దాని చుట్టూ దాదాపు రెండెకరాల స్థలం ఉంది. స్వయంగా సీఎం కేసీఆర్ ఇటీవల ఉన్నట్టుండి ఆ భవన పరిశీలనకు వచ్చారు. ఆయన గతంలో టీడీపీ ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఇదే భవనాన్ని అధికారిక నివాసంగా వినియోగించుకున్నారు. సీఎం ఉన్నట్టుండి భవన పరిశీలనకు రావటంతో అధికారులు కూడా విస్మయం చెందారు. ఆ తర్వాత రోడ్లు భవనాల శాఖ అధికారులు హడావుడిగా అందులో కొన్ని మరమ్మతులు కూడా చేపట్టారు. రెండు రోజుల పాటు సీఎం అందులో సమావేశాలు నిర్వహించి వెళ్లిపోయారు. దాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా వాడుకోవాలని అప్పట్లో భావించినట్లు సమాచారం. అయితే రెండెకరాలే ఉండటంతో క్యాంపు కార్యాలయానికి అనుకూలంగా ఉండదని రోడ్లు భవనాల శాఖ తేల్చింది. సీఎం కొత్త క్యాంపు కార్యాలయాన్ని ఐఏఎస్ అధికారుల సంఘం స్థలంలో నిర్మించనున్నందున ఈ భవనాన్ని మరోరకంగా వాడుకోనున్నట్టు సమాచారం. రైల్వే నుంచి స్వాధీనం నిజాం హయాంలో ఆర్టీసీ, రైల్వే ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇది ఆ సంస్థ అధీనంలో ఉండేది. ఆ తర్వాత రైల్వే-ఆర్టీసీ విడిపోయి ఆస్తులు పంచుకున్నప్పుడు ఈ స్థలం ఆర్టీసీ పరమైంది. 4 దశాబ్దాలుగా దాన్ని ఆర్టీసీ చైర్మన్ అధికారిక నివాసంగా వినియోగిస్తున్నారు. కేసీఆర్ సహా కొందరు మంత్రులు, ఆర్టీసీ ఎండీలు కూడా దాన్ని నివాసభవనంగా వినియోగించుకున్నారు. ఉమ్మడి ఆర్టీసీ చివరి చైర్మన్ ఎం.సత్యనారాయణరావు కూడా దాన్ని వినియోగించుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో చైర్మన్ పదవి భర్తీ కాకపోవటంతో కొంతకాలంగా ఇది ఖాళీగా ఉంది. కేసీఆర్ దాన్ని పరిశీలించినప్పటి నుంచి అందులో పోలీసు పికెటింగ్ కొనసాగుతోంది. వాణిజ్య అవసరాలకు ఉపయోగం ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందే క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ స్థలాలను వాణిజ్య సముదాయాలుగా మార్చాలనే ప్రయత్నం జరిగింది. ఆర్టీసీ క్రాస్రోడ్డులోని బస్భవన్ సమీపంలోని ఖాళీస్థలాన్ని ఓ బడా సం స్థకు ఇందుకోసం కేటాయించినా ఆ తర్వాత ఆ ప్రయత్నం విఫలమైంది. భవిష్యత్తులో మళ్లీ అలాంటి యత్నాలు చేయాలనే యోచనలో ఆర్టీసీ ఉంది. అదే పట్టాలెక్కితే తార్నాకలోని ఈ చైర్మన్ భవనం ఉన్న స్థలం బాగా ఉపయోగపడుతుందని ఆర్టీసీ ఉద్యోగులంటున్నారు. గతంలోనే ఓ మంత్రి ప్రయత్నం... కొన్ని నెలల క్రితం నగరానికి చెందిన ఓ మంత్రి ఈ భవనాన్ని నివాసం, క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని యత్నించారు. ఆర్టీసీ అధికారులనూ సం ప్రదించారు. కానీ అది ఆర్టీసీ చైర్మన్ కోసం కేటాయించింది కావటంతోపాటు అత్యంత విలువైన ప్రాంతంలో ఉన్నం దున ఇవ్వలేమని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో మంత్రి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement