breaking news
RTC garage
-
గుడివాడ ఆర్టీసీ డిపో గ్యారెజ్ నిర్మాణం పూర్తి: కొడాలి నాని
సాక్షి, కృష్ణ: గుడివాడ ఆర్టీసీ డిపో గ్యారెజ్ నిర్మాణం పూర్తి అయినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని వెల్లడించారు. గ్యారెజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కొడాలి నాని మాట్లాడుతూ.. రేపు(సోమవారం) బస్టాండ్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు వచ్చే నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు. పులివెందుల తర్వాత రూ. 20 కోట్లతో బస్టాండ్ నిర్మిస్తున్నది గుడివాడలోనే అని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు టీడీపీ నేత చంద్రబాబు నాయడుపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఈ మేరకు కొడాలి నాని మాట్లాడుతూ.. తండ్రి కొడుకులు మాట్లాడితే గుడివాడ మాదే అంటారు. అసలు ఏం చేశారని ఫైర్ అయ్యారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కట్టి గుడివాడ దాహార్తిని తీర్చిన వ్యక్తి వైఎస్ఆర్ అని చెప్పారు. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు గుడివాడలో ఫ్లైఓవర్ ఎందుకు కట్టలేదని ఎద్దేవాచేశారు. సీఎం జగన్ చొరవతోనే ఆ పనులు మొదలు పెట్టామని చెప్పారు. మాటిమాటికి గుడివాడ నాదే అని చంద్రబాబు సిగ్గులేకుండా చెబుతాడన్నారు. ఆనాడు వైఎస్ఆర్ చలువతో సేకరించిన 77 ఎకరాల్లోనే పేదలకు ఇళ్లు కడుతున్నాం అన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి జగన్ రూ. 540 కోట్లు కేటాయించాం. అలాగే చంద్రబాబు తన పాలనలో ఆర్టీసీ కార్మికులు చనిపోతే వారి కుటుంబాలను గాలి కొదిలేశాడని మండిపడ్డారు. దాదాపు 2300 ఆర్టీసీ కుటుంబాలను గాలికొదిలేసిన వ్యక్తి చంద్రబాబు. ఆయనకు తన కులానికి చెందిన వాళ్లే ముఖ్యం. ప్యాకేజ్ పడేస్తే పక్క రాష్ట్రం నుంచి వాళ్లే కావాలి అంటూ రజనీ కాంత్ని ఉద్దేశించి చురకలంటించారు. అయినా రజనీకాంత్ మూడు రోజులు షూటింగ్ చేస్తే నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటాడని విమర్శించారు. ఈ చంద్రబాబు మంగళవారం వస్తే కనబడడని హైదరాబాద్లోని ఆస్పత్రికి వెళ్తాడని అన్నారు. అసలు ఏ విషయం పరంగా చూసిన జగన్కు చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ కొడాలి నాని ఘాటుగా విమర్శలు గుప్పించారు. (చదవండి: ‘పవన్ను బ్లాక్మెయిల్ చేసేందుకు రజినీకాంత్ రంగంలోకి!’) -
సిటీ బస్సు వచ్చేస్తోంది
మార్చి నుంచి నడిపేందుకు కసరత్తు కడపకు రానున్న 40 బస్సులు ఆర్టీసీ బస్టాండు సమీపంలో మరో గ్యారేజీ రూ.4.50 కోట్ల పనులకు టెండర్లు ప్రయాణికులకు తప్పనున్న ‘ఆటో’ కష్టాలు కడప : కడప నగర వాసుల ప్రయాణ కష్టానికి త్వరలో ‘బ్రేక్’ పడనుంది. ఆటోల ప్రయూణాలతో విసిగిపోరుున ప్రయూణికులకు మార్చి నుంచి మంచిరోజులు రానున్నాయి. సిటీ బస్సుల రాకతో నగర రోడ్లు కొత్త కళను సంతరించుకోనున్నారుు. నగరాలలో సిటీ బస్సులు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సంకల్పించిన నేపధ్యంలో కడపకు కూడా ప్రత్యేక సిటీ బస్సులు రానున్నాయి. మార్చి తొలి వారంనుంచే సిటీ బస్సులను తిప్పాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొదట ప్రస్తుతం ఉన్న బస్టాండునుంచే వీటిని నడపాలని అధికారులు నిర్ణరుుంచారు. జవహర్లాల్ నెహ్రూ అర్బన్, రూరల్ మేనేజ్మెంట్ కింద సుమారు 40 బస్సులను కడపకు కేటారుుంచారు. ఈ బస్సులు రావడమే అలస్యం నగరంలో తిప్పాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. రూట్లపై అధికారుల కసరత్తు సిటీ బస్సులు నడపాల్సిన రూట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. నగరంతోపాటు చుట్టుపక్కల గ్రామాలు (నగరంతో ఎక్కువ అనుబంధం ఉండేవి) కలిసేలా కసరత్తు చేస్తున్నారు. రాజంపేట రూట్లోని ఒంటిమిట్ట, పులివెందుల రోడ్డులోని పెండ్లిమర్రి, ప్రొద్దుటూరురోడ్డులోని చెన్నూరు, రాయచోటిరోడ్డులోని ఎన్టీపీసీ, ఎర్రగుంట్ల రోడ్డులోని కమలాపురం వరకు నడపాలని ప్రాథమికంగా నిర్ణయూనికి వచ్చారు. దీంతో పాటు నగరంలో దేవునికడప, రిమ్స్, రైల్వేస్టేషన్, పాత బస్టాండు, అల్మాస్పేట, బిల్టప్, అప్సర సర్కిల్, చిన్నచౌకు, ఐటీఐ సర్కిల్ తదితర ప్రాంతాలను గుర్తిస్తున్నారు. రూట్లను సిద్ధం చేసి అందుకు సంబంధించి బస్టాప్ల ఏర్పాట్లపై కూడా త్వరలోనే అధికారులు చర్చించి నిర్ణయానికి రానున్నారు. ప్రతినిత్యం లక్షలాది సంఖ్యలో కడపలో వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు రాకపోకలు సాగిస్తున్న నేపధ్యంలో సిటీ బస్సుల రాకతో చాలా వరకు ప్రయోజనం ఒనగూరనుంది. కడపలో మరో ఆర్టీసీ గ్యారేజ్ ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఖాళీ స్థలంలో మరో గ్యారేజి నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకు సంబంధించి ఆర్టీసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్న ప్రాంతంలోనే గ్యారేజీని నిర్మించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. గ్యారేజీ నిర్మాణానికి సుమారు రూ.4.20 కోట్లు కేటాయించారు. అందుకు సంబంధించి హైదరాబాదులో టెండర్లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఈనెల 9వ తేదీన టెండర్లను ఓపెన్ చేసి కాంట్రాక్టు ఖరారు చేయనున్నారు. ప్రయాణికులకు తప్పనున్న ‘ఆటో’ కష్టాలు ఆటోలలో అధిక ఛార్జీలతో సతమతమవుతున్న ప్రయాణికులకు త్వరలోనే కష్టాలు తొలిగిపోనున్నాయి. సాధారణ రూట్లలో తీసుకుంటున్న ఆటో ఛార్జి రూ.10లే అయినా ప్రధాన రహదారిలోని ఇంటి వద్దకు వెళ్లాలంటే అధిక మొత్తంలో వసూలు చేస్తున్న నేపధ్యంలో కొంతమేర సిటీ బస్సుల రాకతో సమస్య తొలిగిపోతుందని పలువురు భావిస్తున్నారు.