breaking news
Rs.9 Crores
-
జిల్లాకు రూ.9 కోట్లు మంజూరు
సంఘానికి రూ.60 వేల లోన్లు జిల్లా గొర్రెల పెంపకం సహకార సంఘం ఛైర్మెన్ మల్శెట్టియాదవ్ పెద్దశంకరంపేట: ఎన్సీడీసీ ద్వారా జిల్లాకు రూ.9 కోట్లు మంజూరైనట్లు జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్ మల్శెట్టియాదవ్ అన్నారు. బుధవారం పేటలో మండల గొర్రె కాపరుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్సీడీసీ ద్వారా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రైతులకు లోన్లు ఇస్తున్నారని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి గ్రామంలో గొర్రెలకాపరులకు 25 ఎకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం 559 జీఓను అమలు చేయాలన్నారు. ప్రతి సంఘానికి రూ.60 వేల లోన్లు ఇస్తున్నామన్నారు. ఇందులో రూ.20 వేల సబ్సిడీ ఉంటుందన్నారు. ప్రతి గ్రామంలో ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్నట్లుగా గొర్రెలకాపరులకు కూడా 100 శాతం సబ్సిడీపై షెడ్లు నిర్మించుకునేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మండల గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు గోరుగంటి గంగారాం, శేఖర్, సాయిలు, బుచ్చయ్య, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. -
అన్నవరంలో రూ.9 కోట్లతో అన్నదాన భవనం
అన్నవరం (తూర్పుగోదావరి జిల్లా) : అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భక్తులకు అన్నదానం నిర్వహించేందుకు రూ.9 కోట్లతో మూడంతస్తుల భవనాన్ని(జీ ప్లస్ త్రీ) నిర్మించేందుకు దేవాదాయశాఖ కమిషనర్ అనుమతించారని ఈఓ నాగేశ్వరరావు గురువారం తెలిపారు. దేవస్థానంలో రూపొందించిన మాస్టర్ప్లాన్ ప్రకారం కమిషనర్ అనుమతించిన తొలి నిర్మాణం ఇదేనని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్లో వంటశాల, మూడంతస్తుల్లో భక్తులు భోజనం చేసేందుకు హాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం సీఆర్ఓ కార్యాలయం దిగువన హాలులో అన్నదానం చేస్తున్నామని, ఈ భవనం నిర్మాణమైతే భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ప్రస్తుతం దేవస్థానంలో రోజుకు కనీసం 1,500 మంది నుంచి గరిష్టంగా ఐదు వేల మంది వరకూ అన్నదానం చేస్తున్నారు.