-
వైఎస్ జగన్ పాత్రలో జీవా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా నటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్తో ‘యాత్ర’ (2019) సినిమాని తెరకెక్కించిన దర్శకుడు మహీ వి. రాఘవ్ ప్రస్తుతం ‘యాత్ర 2’కి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ‘రంగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో జీవాను జగన్ మోహన్ రెడ్డి పాత్రకు సంప్రదించారు మహీ. ఈ చిత్రంలో నటించడానికి జీవా సుముఖత వ్యక్తపరిచారు. ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ కథ సాగుతుంది. జగన్ పాదయాత్ర నుంచి ప్రారంభమై సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ సినిమా ముగుస్తుంది. ప్రస్తుతం ప్రీ ్ర΄÷డక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 3న మొదలవుతుంది. 2024 ఫిబ్రవరిలో ‘యాత్ర 2’ సినిమా విడుదల కానుంది. కాగా మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా?’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. -
చిరంజీవి భోళా శంకర్ లో నా రోల్ ఇదే...
-
Rakul Preet Singh: చేయాలనుకున్నవే చేస్తున్నా!
సినిమాల్లో తాను పోషించే పాత్రల మధ్య భిన్నత్వాన్ని ప్రదర్శించే అవకాశం లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అంటున్నారు హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్. ప్రస్తుతం తనకు లభిస్తున్న పాత్రల గురించి రకుల్ మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు నేను చేస్తున్న సినిమాల్లోని పాత్రలు వేటికవే భిన్నంగా ఉంటాయి. ప్రేక్షకులు కూడా చూసిన పాత్రల్లో చూడాలని అనుకోవడంలేదు. నేనూ చేసిన పాత్రలే చేయాలనుకోను. చేయాలనుకున్నవే చేస్తున్నాను. అయితే నేను ఏ పాత్రలు చేయాలనుకుంటున్నానో అవే వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. కెరీర్లో కొంతదూరం ముందుకు వెళ్లిన తర్వాత ఒకరోజు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఫలానా సినిమాలు చేశానని నాకు సంతృప్తి కలగాలి. ఇందుకోసమే ప్రయత్నిస్తున్నాను’’ అని పేర్కొన్నారు రకుల్. మరాఠీ దర్శకుడు తేజస్ దియోస్కర్ తెరకెక్కిస్తున్న చిత్రంలో కండోమ్ టెస్టర్ పాత్ర చేయనున్నారు రకుల్. ‘‘కొన్ని సమస్యలను సున్నితంగానే హైలైట్ చేయాలి. దర్శకుడు చెప్పిన స్టోరీలైన్, నా పాత్ర నచ్చడంతో ఈ సినిమా అంగీకరించాను. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టాలని అనుకుంటున్నాం’’ అని రకుల్ అన్నారు. ఆయుష్మాన్ ఖురానా ‘డాక్టర్ జీ’, జాన్ అబ్రహాం ‘ఎటాక్’, అజయ్ దేవగన్ ‘మేడే’, ‘థ్యాంక్ గాడ్’ వంటి హిందీ చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తూ బీ టౌన్లో ఫుల్ఫామ్లో ఉన్నారు రకుల్. -
శ్వేతాబసుకు ఊహించని ఆఫర్!
ముంబై: కొత్త బంగారులోకం సినిమా నటి, వ్యభిచారం కేసులో అరెస్టయి కష్టాల్లో ఉన్నశ్వేతాబసు ప్రసాద్కు ఊహించని అవకాశం రానుంది. బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా తన తరువాతి చిత్రంలో శ్వేతాబసుకు ఆఫర్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. హన్సల్ ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపారు. 'నా తరువాతి చిత్రంలో శ్వేతాబసుకు ఆఫర్ ఇవ్వాలని భావిస్తున్నాను. మక్దీ చిత్రంలో ఆమె బాగా నటించారు' అని మెహతా ట్వీట్ చేశారు. వ్యభిచారం కేసుకు సంబంధించి ఆమెను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని సూచించారు. ఆమె ఫొటోలను ప్రచురించడం ఆపాలని ట్వీట్ చేశారు. సహచర నటులు అదితి రావు, ఉపేన్ పటేల్ శ్వేతాబసుకు మద్దతుగా ట్వీట్లు చేశారు. హైదరాబాద్లోని ఓ లాడ్జిలో శ్వేతాబసు వ్యభిచారం కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం హైదరాబాద్లోని రెస్య్కూ హోంలో ఉంటోంది. తనకు సినిమాల్లో అవకాశాలు లేకపోవడం, మరో మార్గం లేక డబ్బుల కోసం వ్యభిచార వృత్తిలోకి దిగానని శ్వేతాబసు పోలీసులకు చెప్పింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement