breaking news
Rohini Acharya
-
లాలూ కుటుంబానికి వరుస షాకులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఘోర ఓటమి నుంచి తేరుకోక ముందే ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి వరుస షాకులు తగులుతున్నాయి. ఓవైపు ఇంటి పోరుతో సతమతమవుతున్న తరుణంలో.. ఇప్పుడు అధికారిక బంగ్లాలు ఖాళీ చేయాలనే నోటీసులు ఆ ఫ్యామిలీకి తలనొప్పిగా మారింది.తిరిగి అధికారంలోకి వచ్చిన నితీశ్ ప్రభుత్వం.. లాలూ కుటుంబానికి ఊపిరి సలపనివ్వడం లేదు. ఆయన సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవికి పట్నాలోని 10 సర్క్యులర్ రోడ్లోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయమని నోటీసులు జారీ చేసింది. గత 20 ఏళ్లుగా లాలూ కుటుంబం ఈ బిల్డింగ్లోనే ఉంటోంది. ఆర్జేడీ కార్యకలాపాలు, కీలక సమావేశాలు, ప్రెస్మీట్లు వగైరా.. ఈ బంగ్లా నుంచే నిర్వహించేవారు. ఈ పరిణామంపై లాలూ తనయ రోహిణి ఆచార్య స్పందించారు. సుశాసన్ బాబు(నితీశ్ కుమార్ను ఉద్దేశిస్తూ..) ప్రభుత్వం లాలూ కుటుంబాన్ని అవమానించడంపైనే దృష్టిసారించినట్లు కనిపిస్తోందని ఓ ట్వీట్ చేశారు. బంగ్లా నుంచి బయటకు పంపినా.. బిహారీల గుండెల్లోంచి లాలూను బయటకు పంపించలేరని అన్నారామె. ఈ క్రమంలో.. ఆయన హోదా, వయసుకైన ప్రభుత్వం గౌరవం ఇస్తే బాగుండేదేమో అని అభిప్రాయపడ్డారు. మరోవైపు.. ఇది రబ్రీదేవికే పరిమితం కాలేదు. లాలూ తనయుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ను కూడా ఎం స్ట్రాండ్ రోడ్ బంగ్లా 26లోని బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు పంపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తేజ్ ప్రతాప్ ప్రస్తుతం ఈ నివాసంలోనే ఉంటున్నాడు. తాజాగా కొలువుదీరిన ఎన్డీయే సర్కార్లోని మంత్రి లకేంద్ర కుమార్ రోషన్కు ఆ బంగ్లా కేటాయించినట్లు సమాచారం. రాజకీయ పరాజయం, కుటుంబ అంతర్గత విభేదాలు, ఇప్పుడు నివాస సమస్య.. వెరసి మూడు కలసి యాదవ్ కుటుంబాన్ని కుదిపేస్తున్నాయి. ఆర్జేడీ నేతలు దీనిని నోటీసుల వ్యవహారాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తున్నారు. బీజేపీ మాత్రం ఆ విమర్శను తోసిపుచ్చుతోంది. లాలూ కుటుంబం బంగ్లాను ఖాళీ చేయాల్సిందేనని.. తమ ప్రభుత్వం ఆ పని చేసి తీరుతుందని అంటోంది. అధికార వర్గాలు మాత్రం "నిబంధనల ప్రకారం" ఈ చర్య తీసుకున్నామని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై బిల్డింగ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ అధికారి శివ్రంజన్ స్పందిస్తూ.. రబ్రీదేవి ప్రస్తుతం ఉన్న హోదా ప్రకారం వేరే కేటగిరీ బంగ్లా కేటాయించినట్లు స్పష్టత ఇచ్చారు. కొత్తగా హార్డింగ్ రోడ్లోని 39 నంబర్ సెంట్రల్ పూల్ బంగ్లాను ఆమెకు కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె బిహార్ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న సంగతి తెలిసిందే. నితీశ్ కుమార్ నేతృత్వంలో బిహార్ ప్రభుత్వం తాజాగా కొలువుదీరింది. ఇందులో.. 13 మంది మంత్రులకు అధికారిక బంగ్లాలను కేటాయిస్తున్నారు. లాలూ పెద్ద కొడుకు అయిన తేజ్ ప్రతాప్ యాదవ్ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత విషయాలను(ప్రియురాలితో ఉన్న ఫొటోను) నెట్టింట పెట్టి పార్టీ పరువు తీశారని ఆర్జేడీ అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో.. సొంతంగా పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడారాయన. ఈ క్రమంలో ఇప్పుడు అధికారిక బంగ్లాను సైతం ఖాళీ చేయాల్సి రావడం గమనార్హం. మరోవైపు.. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, అవమానాలు, సోదరుడు తేజస్వి యాదవ్తో విబేధాల నేపథ్యంతో రాజకీయాలకు రోహిణి ఆచార్య గుడ్బై చెప్పారు. అంతేకాదు పరిస్థితుల ప్రభావం దృష్ట్యా కుటుంబానికి కూడా దూరంగా ఉంటానని ప్రకటించారామె. -
దమ్ముంటే కిడ్నీ దానమిచ్చి చర్చకు రండి: రోహిణి ఆచార్య ఫైర్
పట్నా: ఆర్జేడీ సుప్రీం నేతగా పార్టీ శ్రేణుల గుండెల్లో నిలిచిపోయిన లాలూ ప్రసాద్ యాదవ్కు ఒక కిడ్నీ దానంచేసే దమ్ములేని వాళ్లు నాపై నిందలు వేస్తున్నారని లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తండ్రి మీద అచంచల ప్రేమతో తన కిడ్నీ చేస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తుండటంపై ఆమె అసహనం వ్యక్తంచేశారు.కిడ్నీలు విఫలమై ఆస్పత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్న వాళ్లకు కిడ్నీని దానం ఇచ్చాకే నాపై విమర్శలు చేయాలని విమర్శలు చేసే వాళ్లకు ఆమె దీటైన సవాల్ విసిరారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘లాలూపై మొసలి కన్నీరు కార్చేవాళ్లు వెంటనే ఆస్పత్రులకు వెళ్లి ఒక కిడ్నీ దానంచేసి రావాలి. అప్పుడు నాది మురికి కిడ్నీ యా కాదా అనే చర్చకు కూర్చోవాలి. తండ్రికి దానమిచ్చిన కూతురి కిడ్నీని మురికిది అంటూ హేయమైన వ్యాఖ్యానాలు చేసే వాళ్లు తొలుత కిడ్నీ ఇచ్చి లాలూ పట్ల తమ నిజమైన విధేయతను చాటుకోవాలి. హరియాణా మహాపురుషుడు, మద మెక్కిన పాత్రికేయులు ముందు కిడ్నీ ఇవ్వాలి’’ అని అన్నారు.తేజస్వీ యాదవ్ సన్నిహిత నేత రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్నుద్దేశిస్తూ హరియాణా మహా పురుషుడు అని రోహిణి వ్యాఖ్యానించారు. ‘‘ఒక బాటిల్ రక్తం దానం చేస్తే శరీరం కృషించిపోయే వాళ్లు కూడా కిడ్నీ దానంపై ప్రసంగాలిస్తారా?’’అని రోహిణి ఆగ్రహం వ్యక్తంచేసింది. మురికి కిడ్నీ ఇచ్చావంటూ సొంత కుటుంబ సభ్యులు(తేజస్వీ యాదవ్) ఇంట్లోంచి తరిమేశారని, వాళ్లతో బంధం తెంచుకున్నానని రోహిణి ఇటీవల వ్యాఖ్యానించడం తెల్సిందే. తన సోదరిని అవమానించిన వాళ్ల అంతు చూస్తానని లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. -
ఎవరీ సంజయ్, రమీజ్?
'వాళ్లే నన్ను నా కుటుంబం నుంచి దూరం చేశారు. దారుణంగా అవమానించి పుట్టించి నుంచి వెళ్లగొట్టారు' అంటూ తేజస్వీ యాదవ్ సన్నిహితులు సంజయ్ యాదవ్, రమీజ్లపై లాలూ ప్రసాద్ రెండో కుమార్తె రోహిణీ ఆచార్య తీవ్ర ఆరోపణలు చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కూడా కారణం వారేనని ప్రకటించారు. లాలూ కుటుంబంలో చిచ్చు రేగడానికి కారణమైన సంజయ్ యాదవ్, రమీజ్ ఎవరు, ఎక్కడి వారు, వారి బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదో తెలుసుకునేందుకు నెటిజనులు ఆన్లైన్లో శోధిస్తున్నారు.ఎవరీ సంజయ్ యాదవ్?సంజయ్ యాదవ్ (Sanjay Yadav) ఆర్జేడీ తరపున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. తేజస్వీ యాదవ్కు అత్యంత సన్నిహితుడైన రాజకీయ సలహాదారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాన్ని రూపొందించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఆర్జేడీ పార్టీ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం హరియాణాకు చెందిన సంజయ్ 2010లో తొలిసారిగా తేజస్వీని కలిశాడు. 2012లో దాణా కుంభకోణంలో లాలూపై అభియోగాలు మోపిన సమయంలో.. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఒక కార్యక్రమంలో తేజస్వీకి సంజయ్ను పరిచయం చేశారు. అప్పటి నుంచి వారి బంధం కొనసాగుతోంది. ఢిల్లీలో ఉద్యోగం వదిలేసి పట్నాకు వచ్చేశారు. మొదట్లో ఆర్జేడీ సోషల్ మీడియా వ్యవహారాలు చూసేవారు.ఆర్జేడీలో తేజస్వీ యాదవ్ బలం పెరగడంతో సంజయ్ కూడా త్వరగా ఎదిగాడు. ఆయనకు రాజకీయ వ్యూహకర్తగా, సలహాదారుగా ఉంటూ పార్టీలో కీలకంగా మారారు. గతేడాది ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయడాన్ని లాలూ పెద్ద కుమార్తె, పాటలీపుత్ర ఎంపీ మీసా భారతి (Misa Bharti) తీవ్రంగా వ్యతిరేకించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టిక్కెట్లు అమ్ముకున్నారని ఆర్జేడీ మదన్ షా తీవ్రమైన ఆరోపణలు చేశారు. సంజయ్ను తేజస్వీ గుడ్డిగా నమ్మారని వాపోయారు. కాగా, సీనియర్ నేతలకు, తేజస్వీకి మధ్య గ్యాప్ పెంచారన్న ఆరోపణలు కూడా సంజయ్పై పార్టీ వర్గాల్లో బలంగా ఉంది.ఎవరీ రమీజ్?రోహిణీ ఆచార్య ప్రస్తావించిన రమీజ్ నేమత్ ఖాన (Rameez Nemat Khan).. తేజస్వీ యాదవ్కు చిరకాల స్నేహితుడు. వీరిద్దరినీ క్రికెట్ కలిపింది. ఇద్దరు కలిసి ఢిల్లీ, జార్ఖండ్లో క్రికెట్ ఆడారు. 2008-09 మధ్య కాలంలో జార్ఖండ్ అండర్ 22 జట్టుకు రమీజ్ కెప్టెన్గా వ్యవరించాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం తర్వాత బలపడింది. దీంతో 2016లో అధికారికంగా రమీజ్ ఆర్జేడీలో చేరాడు. తేజస్వీ యాదవ్ వ్యక్తిగత సోషల్ మీడియాను నిర్వహించడంతో సహా పలు కీలక బాధ్యతలు చేపట్టాడు.చదవండి: లాలూ ఫ్యామిలీ.. ఎందుకిలా?39 ఏళ్ల రమీజ్ ఉత్తరప్రదేశ్లోన బలరాంపూర్ ప్రాంతానికి చెందిన వారు. అదే ప్రాంతానికి చెందిన మాజీ ఎంపీ రిజ్వాన్ జహీర్ అల్లుడు. రమీజ్ భార్య జెబా రిజ్వాన్ తులసీపూర్ అసెంబ్లీ స్థానం నుండి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. మొదట కాంగ్రెస్ అభ్యర్థిగా, తరువాత జైలులో ఉన్నప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తులసీపూర్ నగర పంచాయతీ మాజీ ప్రెసిడెంట్ ఫిరోజ్ పప్పు హత్య కేసులో రిజ్వాన్ జహీర్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఇదే కేసులో రమీజ్, జెబా కూడా 2022లో అరెస్ట్ అయ్యారు. తర్వాత బెయిల్పై వీరిద్దరూ విడుదలయ్యారు. -
డర్టీ కిడ్నీ ఆరోపణలు : ఆర్జేడీ నేత రోహిణి ఆచార భర్త ఎవరో తెలుసా?
పట్నా:ఒకపుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న తండ్రి కిడ్నీ దానం చేసి వార్తల్లో నిలిచిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఇపుడు మరోసారి సంచలనంగా మారారు.బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఇలా వెలువడ్డాయో లేదో, తన కుటుంబంతో సంబంధాలను తెంచుకుని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు లాలూ కుటుంబంపై ఆర్జేడీ నేత రోహిణీ ఆచార్య పలు ఆరోపణలు చేశారు. మరోవైపు టికెట్ కోసం ‘డర్టీ కిడ్నీ’రాజకీయాలు అంటూ కుటుంబసభ్యులు ఆమెపై మండిపడ్డారు. అసలే ఓటమి భారంతో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలు రచ్చకెక్కడం ఆర్జేడీకి పెద్ద తలనొప్పిగా మారింది.దీనిపై స్పందించిన రోహిణి తన భర్త, ముగ్గురు పిల్లల్ని చూసుకోవడం కంటే కిడ్నీ దానం చేసి తండ్రిని కాపాడుకోవడం మీదనే దృష్టిపెట్టడం తన పాపమైపోయిందని సోషల్ మీడియా పోస్ట్లో వాపోయింది. ఎవరూ తన లాంటి తప్పు చేయకూడదని ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అసలు రోహిణి కుటుంబం ఏమిటి, భర్త ఎవరనేది నెట్టింట చర్చనీయాంశంగా మారింది. రోహిణి ఆచార్య భర్త ఎవరు?రోహిణి భర్త సమరేష్ సింగ్, కుమార్తె అనన్య ,ఇద్దరు కుమారులు ఆదిత్య , అరిహంత్లతో కలిసి సింగపూర్ నివసిస్తుంది. 2002లో సమరేష్ సింగ్తో రోహిణి వివాహం జరిగింది. ముంబైలో ఒకప్పుడు సీనియర్ ఆదాయపు పన్ను అధికారిగా పనిచేసిన దివంగత రణవిజయ్ సింగ్ కుమారుడే సమరేష్. పెళ్లి తరువాత రోహిణి, సమరేష్ జంట మొదట అమెరికాకు వెళ్లారు ప్రస్తుతం సింగపూర్లో ఉన్నారు. సమరేష్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్లో బిఎ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్లో మాస్టర్స్ ,INSEAD (ఇన్స్టిట్యూట్ యూరోపీన్ డి'అడ్మినిస్ట్రేషన్ డెస్ అఫైర్స్)బిజినెస్ స్కూల్లో ఎంబీఏ (ఫైనాన్స్) చేశారు. ప్రస్తుతం, సమరేష్ సింగపూర్లోని ఎవర్కోర్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్,మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన గతంలో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్లో సీనియర్ ఉద్యోగిగా పనిచేశారు.(ఆర్బీఐ, సీబీఐ అంటూ.. 6 నెలల్లో రూ. 32 కోట్లు!)కాగా మరోవైపు రోహిణికి బీజేపీ అండగా నిలవడం విశేషం. కుమార్తె నుంచి కిడ్నీ స్వీకరించి బతికి బట్ట కట్టిన లాలూ, కొడుకు తేజస్వికి అనుకూలంగా వ్యవహరించారంటూ తన విమర్శలను ఆర్జేడీపై ఎక్కుపెట్టింది. పార్టీలోని అరాచకమే కుటుంబంలో కూడా కనిపిస్తోందని బిహార్ ఉపముఖ్యమంత్రి విజయ్ సిన్హా కూడా యాదవ్ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. తమ సొంత కుటుంబాన్నే ఐక్యంగా ఉంచుకోలేని వారు, ఇక రాష్ట్రాన్నేం పాలిస్తారంటూ ఎద్దేవా చేశారు. -
Lalu Family: అతిపెద్ద రాజకీయ కుటుంబం..
'సమోసాలో ఆలు ఉన్నంత కాలం.. బిహార్లో లాలూ ఉంటాడని..' బిహార్ రాజకీయ భీష్ముడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) తరచుగా అంటుండే వారు. ఇప్పుడు సొంత కూతుళ్లే ఆయనను వదిలేసి వెళ్లిపోతున్నారు. తమ్ముడి మాయలో పడి తమను చిన్నచూపు చూస్తున్నారని తండ్రిని వేలెత్తి చూపిస్తున్నారు. తమకు గౌరవం లేని ఇంట్లో ఉండబోమంటూ తెగేసి చెబుతున్నారు.చిన్న తమ్ముడు తేజస్వీ వైఖరి కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఘోర పరాజయం ఎదురైందని లాలూ రెండో కుమార్తె రోహిణీ ఆచార్య (rohini acharya) సంచలన ఆరోపణలు చేశారు. అతడి కారణంగా సొంత ఇంట్లోనే తనకు అవమానం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన చెందారు. పుట్టింటితో తెగతెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. రోహిణి చెల్లెళ్లు చందా సింగ్, రాగిణి యాదవ్, రాజ్యలక్ష్మి యాదవ్ కూడా పట్నాలోని పుట్టింటిని వదిలేసి ఢిల్లీకి వెళ్లిపోయారు. అటు పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ కూడా ఈ వ్యవహారంపై స్పందించాడు. తన అక్కను అవమానించిన వారిని వదిలిపెట్టబోనంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇంతా జరుగుతున్నా కుటుంబ పెద్ద లాలూ ప్రసాద్ ఇప్పటివరకు స్పందించలేదు.చాలా సంవత్సరాలు పాటు బిహార్ రాజకీయాలను శాసించిన లాలూ ప్రసాద్.. తన సొంత కుటుంబంలో అలజడిని ఎలా ఎదుర్కొంటారోనని జనం చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం వివరాలు తెలుసుకునేందుకు నెటిజనులు సోషల్ మీడియాలో తెగ శోధిస్తున్నారు. లాలూ కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకునేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి 1973లో పెళ్లి చేసుకున్నారు. వీరికి మొత్తం 9 మంది సంతానం. వీరిలో ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. తేజస్వీ యాదవ్ (tejashwi yadav) అందరి కంటే చిన్నవాడు.1. మీసా భారతిలాలూ, రబ్రీదేవి దంపతుల పెద్ద కుమార్తె. ఎంబీబీఎస్ చదివిన ఆమె రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 49 ఏళ్ల మీసా భారతి ప్రస్తుతం పాటలీపుత్ర నుంచి లోక్సభ ఎంపీగా ఉన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో మీసా యాక్ట్ కింద లాలూ జైలుపాలయ్యారు. దీంతో తన పెద్ద కూతురికి మీసా అని పెట్టారు లాలూ.2. రోహిణీ ఆచార్యతన తండ్రికి కిడ్నీ దానం చేయడం ద్వారా వెలుగులోకి వచ్చారు లాలూ రెండో కుమార్తె రోహిణీ ఆచార్య. సింగపూర్లో ఎంబీబీఎస్ చదివిన సమరేశ్ సింగ్ను పెళ్లి చేసుకున్నారు. తాజాగా రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. పుట్టింటితో సంబంధాలు తెంచుకుంటున్నట్టు బహిరంగంగా ప్రకటించారు.3. చందా సింగ్లాలూ మూడో కుమార్తె అయిన చందా సింగ్.. ప్రజా జీవితంలో లేరు. మిగతా తోబుట్టువులతో పోలిస్తే ఆమె బయట కనిపించింది చాలా తక్కువ. పైలట్ విక్రం సింగ్ను ఆమె వివాహం చేసుకున్నారు.4. రాగిణి యాదవ్ఇంజినీరింగ్ విద్య పూర్తి చేయకుండానే మధ్యలో వదిలేశారు లాలూ నాలుగో కుమార్తె అయిన రాగిణి యాదవ్. సమాజ్వాదీ పార్టీకి చెందిన రాహుల్ యాదవ్ను ఆమె పెళ్లాడారు.5. హేమ యాదవ్లాలూ ప్రసాద్ 5వ కుమార్తె అయిన హేమ యాదవ్ బీటెక్ వరకు చదివారు. వినీత్ యాదవ్ను వివాహం చేసుకున్నారు. ఈమె కూడా పబ్లిక్లో ఎక్కువ కనబడరు.6. అనుష్క రావుఅనుష్కను కుటుంబ సభ్యులు ముద్దుగా దన్ను అని పిలుస్తుంటారు. ఇంటీరియర్ డిజైనింగ్, న్యాయ విద్య చదివారు. హరియాణా రాజకీయ కుటుంబానికి చెందిన చిరంజీవ్ రావుతో ఆమె పెళ్లి జరిగింది.7. రాజ్యలక్ష్మిలాలూ ప్రసాద్ చిన్న కుమార్తె అయిన రాజ్యలక్ష్మి ప్రైవేటు యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేశారు. రాజకీయ కుటుంబానికి తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ను వివాహం చేసుకున్నారు.8. తేజ్ ప్రతాప్ యాదవ్లాలూ ప్రసాద్ పెద్ద కొడుకైన తేజ్ ప్రతాప్ ఇంటర్మీయట్ వరకు చదువుకున్నారు. రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. బిహార్ రాష్ట్ర మంత్రిగా గతంలో పనిచేశారు. బాధ్యతా రహిత ప్రవర్తన కారణంగా తండ్రి ఆగ్రహానికి గురయ్యారు. దీంతో కుటుంబం, పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. జనశక్తి జనతాదళ్ పేరుతో పార్టీ పెట్టి, తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. కుటుంబ గొడవల నేపథ్యంలో అక్క రోహిణీ ఆచార్యకు బాసటగా నిలిచారు.9. తేజస్వీ యాదవ్అందరికంటే చిన్నవాడైన తేజస్వీ యాదవ్ రాజకీయాల్లో లాలూ వారసుడిగా చెలామణి అవుతున్నారు. కేవలం పదకొండో తరగతి వరకు మాత్రమే చదివిన తేజస్వీ.. రాజకీయంగా మాత్రం అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. బిహార్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన భార్య పేరు రాజశ్రీ యాదవ్. వీరికి ఇద్దరు సంతానం. చదవండి: డర్టీ కిడ్నీ అంటూ దూషించారు -
లాలూ ఫ్యామిలీలో లుకలుకలు.. ఇంటిని వీడిన కుమార్తెలు
-
డర్టీ కిడ్నీ అంటూ దూషించారు.. చెప్పుతో కొట్టబోయారు
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో కలహాలు మరింతగా రచ్చకెక్కాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైన నేపథ్యంలో లాలూ కుమార్తె రోహిణీ ఆచార్య శనివారం పుట్టింటితో తెగదెంపులు చేసుకుంటున్నట్లు, రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం తెల్సిందే. మహాగఠ్ బంధన్ సీఎం అభ్యర్థి కూడా అయిన తేజస్వీ యాదవ్ సన్నిహితులు సంజయ్ యాదవ్, రమీజ్లే తన నిర్ణయా నికి కారణమని ఆమె ఆరోపించారు. ఆదివారం ఆమె మరోసారి సామాజిక మాధ్యమ వేదికగా తనకు ఎదురైన చేదు అనుభవాలను ఏకరువు పెట్టారు. పుట్టింట్లో తనను నానాదుర్భాషలాడారని, ఇంట్లోంచి బయటకు నెట్టివేయడంతోపాటు చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారని రోహిణీ ఆచార్య సంచలన ఆరోపణలు చేశారు. ‘నిన్న ఒక సోదరి, ఒక వివాహిత, ఒక తల్లికి అవమానం జరిగింది. నానా దుర్భాషలాడారు. మురికిదాన్నంటూ తిట్టారు. చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారు. ఆత్మ గౌరవం విష యంలో రాజీప డబోను’అని ఆమె తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తల్లిదండ్రులను, తోబుట్టువులను వదిలేసి బయటకు వచ్చేశా. పుట్టింటి నుంచి నన్ను వాళ్లు దూరం చేశారు. నన్ను అనాథను చేశారు’అంటూ ఆమె ఉద్విగ్నంతో పోస్ట్ చేశారు. ‘నాన్న లాలూకు కిడ్నీ ఇవ్వాలని చెప్పారు. ఇచ్చాను. అయితే, బదులుగా నేను కోట్లాది రూపాయలు డబ్బులతోపాటు, లోక్సభ టికెట్ తీసుకున్నట్లు ప్రచారం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన లాంటి కుమార్తె, సోదరి మరెవరికీ ఉండరని, తాను నడిచిన బాటలో మరెవరూ నడవలేరని రోహిణి పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘నాకు కుటుంబమంటూ లేదు. తేజస్వీ యాదవ్, సంజయ్ యాదవ్, రమీజ్ల గురించి మీరడగొచ్చు. వాళ్లే నన్ను నా కుటుంబం నుంచి వేరు చేశారు. వాళ్లు బాధ్యతలు స్వీకరించేందుకు ఇష్టపడటం లేదు. బిహార్లోఅంత ఘోరమైన ఫలితాలు రావడానికి కారణమెవరని దేశ ప్రజలే అడుగుతున్నారు. అందుకు కారణం సంజయ్ యాదవ్, రమీజ్ అంటూ పేర్లు వెల్లడించడంతో వాళ్లు నన్ను అవమానించారు, దూషించారు. పుట్టింటి నుంచి వెళ్లగొట్టారు’అని ఆమె ఆరోపించారు.ఆమె బాటలో మరో ముగ్గురురోహిణీ ఆచార్య సంచలన ప్రకటన, నిర్ణయం నేపథ్యంలో ఆదివారం లాలూ కుటుంబంలో విభేదాలు మరింతగా ముదిరినట్లు సమాచారం. లాలు కుమార్తెలు రాజ్యలక్ష్మి, రాగిణి, చందా అనే వారు కూడా పట్నాలోని నివాసాన్ని వీడి తమ పిల్లలతో కలిసి ఢిల్లీకి వెళ్లిపోయారు. రెండు రోజులుగా కుటుంబంలో జరుగుతున్న పరిణామాలతో వారు కలత చెందినట్లు చెబుతున్నారు. కాగా, ఈ పరిణామాలపై లాలూ కుటుంబం స్పందించలేదు. ఈ వివాదమంతా తేజస్వీయాదవ్ కేంద్రంగానే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించడం లేదు. దీంతో, లాలూ దంపతులతోపాటు ఆ ఇంట్లో మిసా భారతి మాత్రమే ఉన్నట్లు సమాచారం.నా గుండె బద్దలైంది: తేజ్ ç్ర³తాప్రోహిణీ ఆచార్య ఆరోపణల నేపథ్యంలో మరో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. పార్టీతోపాటు కుటుంబం నుంచి బహిష్కరణకు గురైన రోహిణి సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. తన సొంత పార్టీ జనశక్తి జనతాదళ్ సోషల్ మీడియా అకౌంట్లో ఆయన..‘నా గుండె ముక్కలైంది. నాపై ఎన్ని దాడులు జరిగినా ఓర్చుకున్నా. కానీ, నా సోదరికి జరిగిన అవమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. సోదరి రోహిణికి జరిగిన అన్యాయానికి తగు రీతిలో బదులు తీర్చుకుంటానన్నారు. ‘నాన్నా, మీరు సరేనని ఒక్క మాట అంటే చాలు.. బిహార్ ప్రజలు ఈ కుట్ర దారులను పాతిపెడతారు. ఇది ఒక కుమార్తె మర్యాదకు, బిహార్ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం’అని తేజ్ ప్రతాప్ వ్యాఖ్యానించారు. లాలూ, రబ్డీ దేవి దంపతులకు ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖుల్లో అతిపెద్ద కుటుంబం లాలూదే. -
‘నాన్నకు కిడ్నీ ఇచ్చి చెడ్డదాన్నయ్యాను!’
పాట్నా: గోరుచుట్టుపై రోకటి పోటులా అన్న చందంగా తయారైంది ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆర్జేడీ ఘోర పరాభవంతో సతమతమవుతున్న లాలూకు ఇప్పుడు కుటుంబ వ్యవహారం మరింత తలనొప్పిగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం లాలూ కుమార్తె, ఆర్జేడీ నేత రోహిణి ఆచార్య రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో తన కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు. ‘తేజస్వీ ఆయన సహాయకులే నన్ను బయటకు పంపారు. అసభ్యకరంగా తిట్టారు. చెప్పులతో కొట్టేందుకు ప్రయత్నించారు. నా ఆత్మగౌరవం విషయంలో నేను రాజీపడను. నన్ను అనాథను చేశారని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం తరువాత ప్రతీ ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో పార్టీ (ఆర్జేడీ) ఇలా ఎందుకు ఓడిపోయింది? అని. ఈ పరాజయానికి కారణం ఎవరు? కానీ మీరు సంజయ్ యాదవ్, రమీజ్ పేర్లు తీస్తే చాలు.. వెంటనే ఇంటి నుంచి బయటకు తోసేస్తారు. అవమానిస్తారు, దుర్భాషలాడతారు. నన్ను కూడా అలాగే చేశారు. నన్ను కుటుంబం నుంచి బహిష్కరించారు. నాకంటూ కుటుంబం లేదు. మీరు ఏదైనా అడగాలి అనుకుంటే తేజస్వీ యాదవ్, సంజయ్ యాదవ్, రమీజ్ అడగండి. వాళ్లందరూ ఒక్కటై.. నన్ను నా కుటుంబం నుంచి వేరు చేశారు’ అని సింగపూర్ వెళుతూ పాట్నా ఎయిర్పోర్టులో మీడియా ఎదుట వాపోయారు. కుటంబంలో కిడ్నీ చిచ్చు 2022లో తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్కు రోహిణీ ఆచార్య కిడ్నీ దానం చేశారు. రోహిణీ వాస్తవానికి కిడ్నీ దానం చేయలేదనే ఆరోపణలు,పుకార్లు లాలూ కుటుంబసభ్యుల మధ్య చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది.ఇదే అంశంపై రోహిణీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘నా తండ్రికి కిడ్నీ దానం చేసి నేను చెడ్డదాన్నయ్యాను. నా అనుకున్న నా వాళ్లే నాపై దూర్భషలాడారు. నా మురికి కిడ్నీని నాన్నకు మార్పిడి చేయించానని, ప్రతి ఫలంగా కోట్ల రూపాయల డబ్బుతో పాటు ఎంపీ టికెట్ను తీసుకున్నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నేను పాపం చేశాను. నా భర్త, నా ముగ్గురు పిల్లల కంటే నా తండ్రే నాకు ఎక్కువ అనుకున్నా. అందుకే నా తండ్రికి కిడ్నీ దానం చేయాల్సి వస్తే నా భర్తను,పిల్లల్ని,నా అత్తమామల అనుమతి కూడా తీసుకోలేదు. నా దేవుడు, నా తండ్రి లాలూని కాపాడుకోవడానికి కిడ్నీ ఇచ్చాను. అలలాంటి ఇప్పుడు వాళ్లకు నేను చెడ్డదాన్నయ్యాను’ అని ట్వీట్లో విచారం వ్యక్తం చేశారు. కాగా లాలూ కుటుంబంలో తాజాగా పరిణామాలు బిహార్ రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది. రోహిణి ఆచార్య ఆరోపణలు, ఆమె కుటుంబంతో విభేదాలు, పార్టీ పరాజయం ఇవన్నీ కలిపి ఆర్జేడీ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. রোহিনী আচার্যকে ত্যাজ্য করার অভিযোগ যাদব পরিবারের বিরুদ্ধে | Rohini Acharya#rjd #rjdnews #biharelection2025 #biharelectionresults #biharnews #laluprasadyadav #tejashwiyadav #eisamay #eisamayonline pic.twitter.com/fvSRBJsjU6— Ei Samay (@Ei_Samay) November 16, 2025 -
ఆర్జేడీలో ట్విస్ట్.. రమీజ్ ఎవరంటే?
పాట్నా: బిహార్లో ఆర్జేడీ ఓటమి తర్వాత పార్టీకి సంబంధించిన పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య.. తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నానని, కుటుంబంతోనూ సంబంధాలను తెంచుకుంటున్నానని ప్రకటన చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ సందర్బంగా ‘నేను రాజకీయాలను వదిలేస్తున్నా. నా కుటుంబానికి దూరంగా జరుగుతున్నా. ఈ పని చేయాలని నాకు సంజయ్ యాదవ్, రమీజ్ సూచించారు. నిందలన్నీ నేనే భరిస్తా’ అని శనివారం ఎక్స్లో ఆమె పేర్కొన్నారు.రమీజ్ ఎవరు? ఈ నేపథ్యంలో సంజయ్ యాదవ్, రమీజ్పై కొత్త చర్చ మొదలైంది. కాగా, రమీజ్ ఆలం ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్కు చెందిన వ్యక్తి. జార్ఖండ్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. అతని గురించి రాజకీయ వర్గాలలో చాలా తక్కువగా తెలుసు. తేజస్వీ యాదవ్, సంజయ్ యాదవ్కు రమీజ్ సన్నిహితుడు. అయితే, రమీజ్పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. గ్యాంగ్స్టర్ అనే మార్క్ అతడిపై ఉంది. ఓ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మరోవైపు.. అతని మామ ఉత్తరప్రదేశ్లోని అగ్ర నేరస్థుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. రమీజ్ ప్రస్తుతం బెయిల్పై బయటకు వచ్చినట్లు తెలిసింది. అయితే వారిద్దరూ రోహిణికి ఏం సూచించారనేది స్పష్టంగా తెలియడం లేదు. వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.తేజ్ ప్రతాప్ ఎఫెక్ట్.. వృత్తిరీత్యా వైద్యురాలైన రోహిణి, లాలు సారథ్యంలోని ఆర్జేడీలో గతంలో క్రియాశీలకంగా ఉన్నారు. తన భర్త, పిల్లలతో సింగపూర్లో ఆమె స్థిరపడ్డారు. 2022లో తండ్రి లాలూకి తన కిడ్నీ దానం చేయడం ద్వారా అప్పట్లో వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఆ సమయంలో అదంతా డ్రామా అంటూ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. అయితే దానిని నిరూపించాలంటూ విమర్శకులకు ఆమె ఘాటు కౌంటర్ ఇచ్చారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆమె సరన్ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ రాజీవ్ ప్రతాప్ రూడీ చేతిలో ఓడారు.ఆ ఓటమి తర్వాత కూడా ఆమె రాజకీయంగా క్రియాశీలకంగానే వ్యవహరించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సింగపూర్ నుంచి వచ్చి మరీ ఆమె సోదరుడు తేజస్వీ యాదవ్తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో హర్యానాకు చెందిన ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్తో ఆమెకు విబేధాలు మొదలయ్యాయి. తన సోదరుడిని, తనను సైతం పక్కన పెడుతూ పార్టీ వ్యవహారాల్లో సంజయ్ అతి జోక్యం చేసుకోవడాన్ని ఆమె భరించలేకపోయారు. ఓటర్ అధికార్ యాత్రలోనూ సంజయ్ వ్యవహార శైలిని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఆ సమయంలో తేజస్వి సోదరికి మద్ధతుగా నిలవకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక, మరో సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ను పార్టీ నుంచి బహిష్కరించడంతోపాటు, కుటుంబం నుంచి వెలివేస్తున్నట్లు లాలూ ప్రకటించడం తెల్సిందే. భార్యతో విడాకుల వ్యవహారం కోర్టులో ఉండగా ఓ మహిళతో అతడు సంబంధం నడుపుతుండటం లాలూకు నచ్చలేదు. అయితే, ఈ నిర్ణయంపై రోహిణి అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. -
రాజకీయాలకు గుడ్బై!
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్య ప్రకటించారు. అంతేకాదు, తమ కుటుంబంతో సంబంధాలను తెంచుకుంటున్నట్లు కూడా ఆమె స్పష్టం చేశారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలవడం తెల్సిందే. ఈ నేపథ్యంలో రోహిణి చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘నా సోదరుడు తేజస్వీ యాదవ్ సన్నిహితులు సంజయ్ యాదవ్, రమీజ్ ఆలం సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా. తప్పంతా నాపైనే వేసుకుంటున్నా’అని ఆమె శనివారం ఎక్స్లో పేర్కొన్నారు. వృత్తిరీత్యా వైద్యురాలైన రోహిణి, లాలు సారథ్యంలోని ఆర్జేడీలో గతంలో క్రియాశీలకంగా ఉన్నారు. जनसेवा एक अनवरत प्रक्रिया है, एक अंतहीन यात्रा है!इसमें उतार चढ़ाव आना तय है। हार में विषाद नहीं, जीत में अहंकार नहीं!राष्ट्रीय जनता दल गरीबों की पार्टी है, गरीबों के बीच उनकी आवाज़ बुलंद करते रहेगी!@yadavtejashwi @laluprasadrjd— Rashtriya Janata Dal (@RJDforIndia) November 15, 2025లాలూ తనయ అయిన రోహిణి ఆచార్య డాక్టర్ కూడా. తన భర్త, పిల్లలతో సింగపూర్లో ఆమె స్థిరపడ్డారు. 2022లో తండ్రి లాలూకి తన కిడ్నీ దానం చేయడం ద్వారా అప్పట్లో వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఆ సమయంలో అదంతా డ్రామా అంటూ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. అయితే దానిని నిరూపించాలంటూ విమర్శకులకు ఆమె ఘాటు కౌంటర్ ఇచ్చారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆమె సరన్ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ రాజీవ్ ప్రతాప్ రూడీ చేతిలో ఓడారు.ఆ ఓటమి తర్వాత కూడా ఆమె రాజకీయంగా క్రియాశీలకంగానే వ్యవహరించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సింగపూర్ నుంచి వచ్చి మరీ ఆమె సోదరుడు తేజస్వీ యాదవ్తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో హర్యానాకు చెందిన ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్తో ఆమెకు విబేధాలు మొదలయ్యాయి. తన సోదరుడిని, తనను సైతం పక్కన పెడుతూ పార్టీ వ్యవహారాల్లో సంజయ్ అతిజోక్యం చేసుకోవడాన్ని ఆమె భరించలేకపోయారు. ఓటర్ అధికార్ యాత్రలోనూ సంజయ్ వ్యవహార శైలిని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఆ సమయంలో తేజస్వి సోదరికి మద్ధతుగా నిలవకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. 2024 లోక్సభ ఎన్నికల్లో బిహార్లోని సరన్ నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. ఎన్నికలకు ముందే ఈమె ఎక్స్లో తండ్రి లాలూ, సోదరుడు తేజస్వీ యాదవ్లను అన్ఫాలో చేశారు. మరో సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ను పార్టీ నుంచి బహిష్కరించడంతోపాటు, కుటుంబం నుంచి వెలివేస్తున్నట్లు లాలూ ప్రకటించడం తెల్సిందే. భార్యతో విడాకుల వ్యవహారం కోర్టులో ఉండగా ఓ మహిళతో అతడు సంబంధం నడుపుతుండటం లాలూకు నచ్చలేదు. అయితే, ఈ నిర్ణయంపై రోహిణి అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో సొంతంగా పార్టీ ప్రకటించిన తేజ్ ప్రతాప్.. పార్టీ అభ్యర్థులను కూడా బరిలోకి దించారు. కానీ, స్వయంగా ఓటమి పాలైన తేజ్ ప్రతాప్, ఏ ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయారు. ఈ పరిణామాల నడుమ శనివారం ఆమె ఈ మేరకు ఎక్స్లో పోస్టులు పెట్టినట్లుగా భావిస్తున్నారు. కుటుంబంలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కినట్లుగా చెబుతున్నారు. తండ్రి లాలూకు రోహిణి 2022లో తన కిడ్నీని దానం చేశారు. రోహిణి వాస్తవానికి కిడ్నీ దానం చేయలేదనే పుకార్లు, ఆరోపణలే ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్నట్లు చెబుతున్నారు.


