breaking news
rocky
-
ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. భారత సంతతి ఆటగాళ్లకు చోటు
భారత అండర్-19 జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్ల యూత్ వన్డే సిరీస్ను 2-3 తేడాతో కోల్పోయిన ఇంగ్లండ్ యువ జట్టు.. ఇప్పుడు టెస్టు సిరీస్లో తలపడేందుకు సిద్దమైంది. భారత్-ఇంగ్లండ్ అండర్-19 జట్ల మధ్య రెండు మ్యాచ్ల యూత్ టెస్టు సిరీస్ జూలై 12 నుంచి ప్రారంభం కానుంది.ఈ క్రమంలో మొదటి టెస్టు కోసం తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా వార్విక్షైర్కు చెందిన హంజా షేక్ ఎంపికయ్యాడు. గతేడాది శ్రీలంక పర్యటనలో ఇంగ్లండ్ జట్టును హంజా షేక్ లీడ్ చేశాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా టూర్కు దూరంగా ఉన్న షేక్.. తిరిగి మళ్లీ జట్టులోకి పునరాగమనం చేశాడు.ఇక అతడి డిప్యూటీగా తంజీమ్ అలీ వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో ఇంగ్లండ్ దిగ్గజాలు ఆండ్రూ ఫ్లింటాఫ్, మైఖేల్ వాన్ కుమారులు రాకీ ఫ్లింటాఫ్, ఆర్చీ వాన్ చోటు దక్కించుకున్నారు. భారత్తో జరిగిన వన్డే సిరీస్లో రాకీ ఫ్లింటాఫ్ ఆకట్టుకున్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఒక సెంచరీ, అర్ధ సెంచరీతో సహా 222 పరుగులు చేశాడు.దీంతో టెస్టు జట్టులో కూడా అతడి స్దానాన్ని పదిలం చేసుకున్నాడు. డర్హామ్ ఎడమచేతి వాటం పేసర్ జేమ్స్ మింటోకు కూడా సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఈ 15 మంది సభ్యుల జట్టులో భారత సంతతికి చెందిన ఆర్యన్ సావంత్, ఎక్ష్ సింగ్, జై సింగ్లకు చోటు దక్కింది. ఇక ఈసిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.భారత అండర్-19 జట్టుఆయుష్ మ్హత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్, ఆర్ ఎస్ అంబ్రిష్, సింగ్క్ చౌహాన్, హెనిల్ పటేల్, యుధాజిత్ మోల్ రాఘవ్, ప్రణమ్జెత్ గుహ, ప్రణమ్జెత్ గుహ, డి. దీపేష్, నమన్ పుష్పక్ఇంగ్లండ్ అండర్-19 జట్టుహంజా షేక్ (వార్విక్షైర్ - కెప్టెన్), తజీమ్ అలీ (వార్విక్షైర్), జయద్న్ డెన్లీ (కెంట్), రాకీ ఫ్లింటాఫ్ (లాంకాషైర్), అలెక్స్ ఫ్రెంచ్ (సర్రే), అలెక్స్ గ్రీన్ (లీసెస్టర్షైర్), జాక్ హోమ్ (వర్సెస్టర్షైర్), బెన్ మాయెస్ (హాంప్షైర్), సెబాస్టియన్ మోర్గాన్ (హాంప్షైర్), జేమ్స్ మింటో (డర్హామ్), థామస్ రెవ్ (సోమర్సెట్), ఆర్యన్ సావంత్ (మిడిల్సెక్స్), ఏకాంష్ సింగ్ (కెంట్), జయ్ సింగ్ (యార్క్షైర్), ఆర్చీ వాన్ (సోమర్సెట్)చదవండి: ‘ఒక్క మ్యాచ్కే తప్పిస్తారా?.. అతడి కోసం నితీశ్ రెడ్డి త్యాగం చేయాల్సింది’ -
సునామీ శతకంతో విరుచుకుపడ్డ వైభవ్.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
భారత యువ క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. నాలుగో యూత్ వన్డేలో ఇంగ్లండ్ అండర్-19 జట్టును చిత్తు చేసింది. ఏకంగా 55 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది.వోర్సెస్టర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ అండర్-19 జట్టు.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే విఫలం కాగా.. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi), వన్డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా (Vihaan Malhotra) దుమ్ములేపారు. వైభవ్ సునామీ శతక ఇన్నింగ్స్వైభవ్ కేవలం 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మొత్తంగా 78 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 143 పరుగులు సాధించాడు. అయితే, బెన్ మేయ్స్ బౌలింగ్లో జోసెఫ్ మూర్స్కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ సునామీ శతక ఇన్నింగ్స్కు తెరపడింది.ఇక విహాన్ 121 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్స్ల సాయంతో 129 పరుగులు సాధించాడు. మిగతా వారిలో కెప్టెన్ అభిజ్ఞాన్ ముకుంద్.. 23 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. రాహుల్ కుమార్, హర్వన్ష్ పంగాలియా డకౌట్ అయ్యారు. కనిష్క్ చౌహాన్ (2), ఆర్ఎస్ అంబరీష్ (9), దీపేశ్ దేవేంద్రన్ (3) విఫలం కాగా.. యుధాజిత్ గుహ 15, నమన్ పుష్పక్ 2 పరుగులతో అజేయంగా నిలిచారు.ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది.రాకీ ఫ్లింటాఫ్ అద్భుత సెంచరీ వృథాఇంగ్లండ్ బౌలర్లలో జాక్ హోమ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. సెబాస్టియన్ మోర్గాన్ మూడు వికెట్లు తీశాడు. బెన్ మేయ్స్, జేమ్స్ మింటో చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఇక భారత్ విధించిన 364 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 308 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు బెన్ డాకిన్స్ (67), జోసెఫ్ మూర్స్ (52) అర్ధ శతకాలు బాదగా.. రాకీ ఫ్లింటాఫ్ అద్భుత సెంచరీ (91 బంతుల్లో 107) వృథాగా పోయింది. భారత బౌలర్లలో నమన్ పుష్పక్ మూడు వికెట్లు, ఆర్ అంబరీష్ రెండు వికెట్లు కూల్చి ప్రత్యర్థిని దెబ్బకొట్టగా.. దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇరుజట్ల మధ్య నామమాత్రపు ఐదో యూత్ వన్డే సోమవారం వోర్సెస్టర్లోనే జరుగనుంది.ఇక ఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లింది భారత జట్టు. మొదటి, మూడు, నాలుగో యూత్ వన్డేల్లో గెలిచిన 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. చదవండి: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. -
ఈ చిత్రంలో దాగున్న చిన్నారిని గుర్తుపట్టగలరా?
ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో నీలి ఆకాశంలో రాతిబండలు కనిపిస్తున్నాయి. కాని దానిలో రెండు గోధుమ రాళ్ల మధ్య ఓ చిన్నారి దాక్కుంది. అది కూడా పర్పుల్ కలర్(ఊదారంగు) టాప్ ధరించి రెండు చేతులు పైకి ఎత్తి ఉన్నట్లు కనిపిస్తుంది. చాలా ఓపికతో కనిపెటండి. మొదట చూస్తున్నప్పుడూ కాస్త గందరగోళం కనిపించిన కొద్ది సేపటి తర్వాత ఆ ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. ట్రై చేయండి. ఈ చిత్రానికి వేల వ్యూస్, లైక్లు వచ్చాయి. మీరు కూడా తెలివిగా ట్రై చేసి కనుక్కొండి. లేదంటే కింద క్లియర్గా కనిపించే ఇమేజ్లో చూడండి మీకే తెలుస్తుంది ఆ చిన్నారి ఎక్కడ ఉన్నది. (చదవండి: స్కూల్ నిర్మించడం కోసం ఆ రైతు ఏం చేశాడంటే..) -
'ఎవరినీ వదిలిపెట్టం'
పట్నా: చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని బిహార్ సీఎం నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. జేడీ(యూ) మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవి కుమారుడు రాకీ కుమార్ యాదవ్ నడిరోడ్డుపై హత్యకు పాల్పడిన ఉదంతంపై ఆయన స్పందించారు. ఈ ఘటనలో రాకీ కుమార్ బాడీగార్డును సస్పెండ్ చేసి, అరెస్ట్ చేసినట్టు తెలిపారు. డిపార్ట్ మెంటల్ పరంగా ఇప్పటికే చర్య తీసుకున్నారని, అతడిపై క్రిమినల్ కేసు కూడా పెట్టనున్నారని చెప్పారు. ఎవరినీ వదిలిపెట్టేది లేదని, దోషులను చట్టం ముందు నిలబెడతామని అన్నారు. తన కుమారుడు పోలీసుల ముందు లొంగిపోతాడని మనోరమా దేవి తెలిపారు. దోషిగా తేలితే అతడిపై చట్టంగా చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. కాగా, పరారీలో ఉన్న తన కుమారుడితో మాట్లాడలేదని రాకీ తండ్రి బిందీ యాదవ్ తెలిపారు. పోలీసులు తన ఫోన్ లాక్కున్నారని, తన కొడుకుతో ఎలా మాట్లాడగలనని ఆయన ప్రశ్నించారు. -
కస్టమర్ను చితక్కొట్టిన బౌన్సర్లు
న్యూఢిల్లీ: పబ్కు వచ్చిన ఓ కస్టమర్ను వెంటాడి మరీ చితక్కొట్టిన వైనం ఢిల్లీని గుర్గావ్లో చోటుచేసుకుంది. బౌన్సర్ల సాయంతో వినియోగదారుడిపై యాజమాన్యం వాళ్లే దాడికి దిగి తీవ్రంగా గాయపర్చిన వీడియో ఒకటి నెట్లో హల్ చల్ చేస్తోంది. దాదాపు గంట పాటు కొనసాగిన ఈ అమానుషం హాట్ టాపిక్ గా మారింది. మార్చి 17వ తేదీ రాత్రి ఇయాన్ పబ్కి వెళ్లిన రాకీ (24) డ్యాన్స్ చేస్తున్న క్రమంలో తూలి పక్కనే ఉన్న బౌన్సర్లపై పడ్డాడు. అంతే అగ్రహానికి గురైన బౌన్సర్లు రాకీపై పంచ్లతో విరుచుకుపడ్డారు. ఆరుగురు వ్యక్తులు అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. దెబ్బలకు తాళలేక కిందపడిపోయినా వాళ్ల అరాచకం ఆగలేదు. విచక్షణరహితంగా దాడిచేశారు. పారిపోవడానికి ప్రయత్నించిన రాకీని కొంత దూరం పాటు వెంటాడి మరీ దాడి కొనసాగించారు. షాపింగ్ మాల్ ఆవరణలో 50 నిమిషాల పాటు కొనసాగిన వారి ఆగడాలు సీసీ టీవీ ఫుటేజిలో రికార్డయ్యాయి. ఈ సంఘటనపై రాకీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని సమాచారం. అయితే పబ్ యాజమాన్యం వాదన మరోలా ఉంది. రాకీ, అతని స్నేహితులు మద్యం సేవించి అమర్యాదకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తోంది. -
రాకీ హ్యండ్సమ్ రీమేక్ ప్లాన్లో 'రామ్ చరణ్'
-
ఇద్దరు కుర్ర హీరోలు.. కుమ్మేశారు
ఇద్దరు హీరోలు.. ఇద్దరూ కుర్రాళ్లే.. కేవలం వాళ్లిద్దరే కలిసి అనేకమంది సైనికులను రక్షించారు. బీఎస్ఎఫ్ దళానికి చెందిన కానిస్టేబుల్ శుభేందురాయ్, రాకీ.. వీళ్లిద్దరు చూపించిన అసమాన ధైర్య సాహసాల వల్లే అనేకమంది జవాన్ల ప్రాణాలు పోకుండా ఆగాయి. ఉగ్రవాదుల్లో ఒకడు అక్కడికక్కడే హతం కాగా, మరొకడు సజీవంగా పట్టుబడ్డాడు. బుధవారం నాడు శుభేందురాయ్ 30 మంది సిబ్బందితో కూడిన బస్సు నడుపుతున్నాడు. అంతలో.. ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదులు వచ్చి ఎదురుగా నిలబడ్డారు. వాళ్ల దగ్గర భారీస్థాయిలో ఆయుధాలున్నాయి. ఒకడు కొండమీద పొజిషన్ తీసుకుని ఫైరింగ్ మొదలుపెట్టగా, రెండోవాడు బస్సును ఆపి ముందునుంచి కాల్చాడు. శుభేందురాయ్ గాయపడ్డాడు గానీ, ఉగ్రవాది నోమన్ బస్సులోకి రాకుండా ఆపాడు. డోరువద్దే వేలాడుతూ.. ఉగ్రవాదిని ఆపేశాడు. దాంతో నోమన్ బస్సు చుట్టూ తిరుగుతూ అన్నివైపులా కాలుస్తూ రెండోవైపు నుంచి బస్సులోకి ఎక్కే ప్రయత్నం చేశాడు. అప్పుడు బస్సు ముందుసీట్లో కూర్చున్న కానిస్టేబుల్ రాకీ లేచాడు. తన వద్ద ఉన్న ఇన్సాస్ రైఫిల్తో నోమన్ను ఎడా పెడా కాల్చిపారేశాడు. ఆ దెబ్బకు మ్యాగజైన్లో ఉన్న మొత్తం 40 బుల్లెట్లూ ఖాళీ అయిపోయాయి. నోమన్ చచ్చిపోతూ.. ఓ గ్రెనేడ్ను బస్సు డోరు వద్ద వదిలేశాడు. ఈలోపు అతడు తన ఏకే47తో కాల్చడంతో కానిస్టేబుళ్లు శుభేందు రాయ్, రాకీ ఇద్దరూ మరణించారు. అయితేనేం.. బస్సులో ఉన్న మొత్తం జవాన్లందరి ప్రాణాలూ కాపాడారు. ఆ ఉగ్రవాదులే లోనికి వచ్చి ఉంటే.. తమవద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలతో మొత్తం అందరినీ హతమార్చి ఉండేవాళ్లేమో! మరో జవాను కూడా ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఇదంతా చూసిన నావేద్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ అలియాస్ ఖాసింఖాన్ అక్కడినుంచి పారిపోయాడు. కానీ, అతడిని గ్రామస్థులు పట్టుకుని భద్రతా దళాలకు అప్పగించారు. కసబ్ తర్వాత సజీవంగా దొరికిన ఏకైక పాక్ ఉగ్రవాది ఇతడే. అయితే అతడు తమ దేశస్థుడు కాడని పాక్ చెబుతున్న సంగతి తెలిసిందే.