breaking news
Rising Stars
-
‘ఫైనల్’ లక్ష్యంగా భారత్ ‘ఎ’ బరిలోకి
దోహా: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ క్రికెట్ టి20 టోర్నీలో జోరు మీదున్న భారత ‘ఎ’ జట్టు ఫైనలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. నేడు బంగ్లాదేశ్ ‘ఎ’తో జరిగే సెమీఫైనల్లో టాప్ ఫామ్లో ఉన్న ఓపెనింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి బ్యాటర్ల సహకారం లభిస్తే చాలు భారత్ విజయానికి ఢోకా ఉండదు. ఈ టోర్నీలో వైభవ్ 201 పరుగులతో అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. కానీ మిగతా బ్యాటర్లలో కెపె్టన్ జితేశ్ శర్మ సహా నమన్ ధీర్, ప్రియాన్‡్ష ఆర్య, నేహల్ వధేరాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఇప్పటివరకు ఏ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు. కీలకమైన సెమీస్లో వీరంతా బాధ్యత కనబరిస్తేనే బంగ్లాపై విజయం సాధించవచ్చు. లేదంటే ఊహించని ఫలితం ఎదురైనా ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ టోర్నీలో భారత్లాగే బంగ్లాదేశ్ కూడా దీటుగా రాణించింది. అఫ్గానిస్తాన్ ‘ఎ’, శ్రీలంక ‘ఎ’ జట్లను కంగుతినిపించిన బంగ్లా... భారత్తో క్లిష్టమైన పోరుకు సై అంటోంది. పేసర్ రిపొన్ మోండల్, లెఫ్టార్మ్ స్పిన్నర్ రకీబుల్ హసన్ల నుంచి భారత బ్యాటర్లకు సవాళ్లు ఎదురవొచ్చు. భారత బౌలర్లలో గుర్జప్నీత్, స్పిన్నర్ హర్‡్ష దూబేలు నిలకడగా ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. కీలకమైన సెమీస్లోనూ వీరి జోరు కొనసాగాలని జట్టు ఆశిస్తోంది. శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్ ‘ఎ’తో శ్రీలంక ‘ఎ’ తలపడుతుంది. ఈ రెండు సెమీఫైనల్స్లో చిరకాల ప్రత్యర్థులు గెలిస్తే... ఆదివారం జరిగే ఫైనల్ సమరం దాయాదుల మధ్యే జరిగే అవకాశముంది. భారత్ ‘ఎ’ జట్టు: జితేశ్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ నేహల్, నమన్ ధీర్, సూర్యాన్ష్ రమణ్దీప్, హర్ష్ దూబే, అశుతోష్, యశ్ ఠాకూర్, గుర్జప్నీత్, వైశాక్. బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు: అక్బర్ అలీ (కెప్టెన్), హబీబుర్, యాసిర్ అలీ, జీషాన్, అరిఫుల్ ఇస్లామ్, రకీబుల్, మహిదుల్, అహ్మద్ రేహాన్, రిపొన్ మోండల్, అబు హిదార్, గఫార్, అబ్రార్. -
వైభవ్ సూర్యవంశీ ఫెయిల్.. అయినా సెమీస్కు భారత్
దోహా: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్లో సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. గ్రూప్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో జితేశ్ శర్మ సారథ్యంలోని భారత ‘ఎ’ జట్టు 6 వికెట్ల తేడాతో ఒమన్ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. వసీమ్ అలీ (45 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరవగా... కెపె్టన్ హమ్మద్ మీర్జా (16 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడాడు. భారత ‘ఎ’ జట్టు బౌలర్లలో గుర్జపనీత్ సింగ్, సుయాశ్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టగా... విజయ్ కుమార్ వైశాక్, హర్‡్ష దూబే, నమన్ ధిర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత ‘ఎ’ జట్టు 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్ష్ దూబే (44 బంతుల్లో 53 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ శతకంతో ఆకట్టుకోగా... నమన్ ధీర్ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధనాధన్ షాట్లతో అలరించాడు. ఐపీఎల్ స్టార్లు వైభవ్ సూర్యవంశీ (12), ప్రియాన్ష్ ఆర్య (10) ఎక్కువసేపు నిలవలేకపోయారు. నేహల్ వధేరా (23) ఫర్వాలేదనిపించాడు. గ్రూప్లో ఆడిన మూడు మ్యాచ్ల్లో 2 విజయాలు, ఒక పరాజయంతో 4 పాయింట్లతో భారత ‘ఎ’ జట్టు ముందంజ వేసింది. -
భారత్ ‘ఎ X పాక్ ‘ఎ’
దోహా: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మరోసారి పోరుకు రంగం సిద్ధమైంది. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా నేడు భారత్ ‘ఎ’, పాకిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. యూఏఈతో జరిగిన మ్యాచ్లో 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్స్లతో 144 పరుగులు చేసిన భారత టీనేజ్ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి ఉంది. సెప్టెంబర్ లో యూఏఈలో జరిగిన ఆసియా కప్ టి20 టోర్నీలో పాకిస్తాన్, భారత ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకోలేదు. మరి ఈ మ్యాచ్లో జితేశ్ శర్మ నాయకత్వంలోని భారత ‘ఎ’ జట్టు సభ్యులు కూడా పాకిస్తాన్ ‘ఎ’ ఆటగాళ్లతో కరచాలనం చేసే అవకాశం కనిపించడంలేదు. -
‘రైజింగ్ స్టార్స్’ నాగరాజు, రాకేశ్
రాహుల్, రేహన్లు కూడా సాక్షి, హైదరాబాద్: ఎయిర్టెల్ సంస్థ నిర్వహించిన ‘సాకర్ రైజింగ్ స్టార్స్’ శిబిరంలో నగరానికి చెందిన నలుగురు కుర్రాళ్లు మెరిశారు. నాగరాజు, రాకేశ్, రాహుల్, రేహన్లు హైదరాబాద్ నుంచి ఫైనల్ సెలక్షన్ ట్రయల్స్కు ఎంపికయ్యారు. ఈ తుది ఎంపిక ప్రక్రియ ఈ నెల 20 నుంచి గోవాలో రెండు రోజుల పాటు జరుగనుంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో అండర్-16 విభాగంలో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరాల నుంచి మొత్తం 23 మంది ప్రతిభావంతులను ఎంపిక చేశారు. ఈ జాబితా నుంచి తుది 11 మంది కుర్రాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేస్తారు. తుది జట్టులో ఒక గోల్కీపర్ ఉంటాడు. ఈ జట్టును గోవాలోనే ఈ నెల 21న ప్రకటిస్తారు. వీరికి ప్రఖ్యాత ఫుట్బాల్ క్లబ్ అయిన మాంచెస్టర్ యునెటైడ్ కోచ్లు ఆటలో మెళకువలు నేర్పిస్తారు. ఇంగ్లండ్లోని మాంచెస్టర్ యునెటైడ్ సాకర్ స్కూల్లో వారం పాటు ఈ శిబిరం జరుగుతుంది. హైదరాబాద్తో పాటు కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, గువాహటి, గోవా నగరాల్లో ఎయిర్టెల్ రైజింగ్ స్టార్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.


