breaking news
rishit
-
షేక్ రషీద్కు 10 లక్షల నజరానా... రిషిత్ రెడ్డికి ఎంతంటే!
U 19 World Cup Winner India:- విశాఖ స్పోర్ట్స్: భారత జట్టు అండర్–19 ప్రపంచకప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్కు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) రూ. 10 లక్షల నజరానా ప్రకటించింది. రషీద్ భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఏసీఏ అధ్యక్షుడు శరత్చంద్ర రెడ్డి, కోశాధికారి గోపినాథరెడ్డి, ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ వేణుగోపాలరావు, సీఈవో శివారెడ్డి ఆకాంక్షించారు. మరోవైపు ప్రపంచకప్లో భారత జట్టుకు స్టాండ్బై ప్లేయర్గా ఉన్న హైదరాబాద్ యువ క్రికెటర్ రిషిత్ రెడ్డికి రూ. 10 లక్షలు అందజేస్తామని హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్ ప్రకటించారు. చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
ఊయలే ఉరితాడైంది..
ఎంపీపీ అధ్యక్షురాలి తనయుడి మృతి దండేపల్లి : ఊయల తాడు ఉరి తాడుగా మారి పదేళ్ల బాలుడిని బలితీసుకుంది. ఊయలూగుతుండగా ప్రమాదవశాత్తు తాడు మెడకు బిగుసుకుని దండేపల్లి ఎంపీపీ అధ్యక్షురాలు గోళ్ల మంజుల, రాజమల్లుల కుమారుడు రిషీత్(10) మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. ఎంపీపీ అధ్యక్షురాలు గోళ్ల మంజుల గ్రామసభలో పాల్గొనడానికి వెళ్లారు. ఆమె భర్త రాజమల్లు ఓ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లాడు. వారి కుమారుడు రిషీత్ మేదరిపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఆందోళన నేపథ్యంలో సోమవారం పాఠశాలకు బంద్ కావడంతో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్నాడు. ఇంటి ఆవరణలోని ఊయలలో నిలబడి ఊగుతూ ప్రమాదవశాత్తు కిందికి జారాడు. దీంతో ఊయల తాడు మెడకు చుట్టుకుని బిగుసుకు పోరుుంది. దీంతో ఊపిరాడక రిషీత్ చనిపోయూడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలుడు ప్రాణాలు కోల్పోయూడు. పక్కింటి వాళ్లు వచ్చి చూడగా రిషీత్ ఊయల తాడుకు చనిపోయి కనిపించాడు. ఈ విషయం రాజమల్లుకు తెలియజేయడంతో వెంటనే ఆయన వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే చనిపోరుునట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యూరు. రిషీత్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు వచ్చి కంటతడిపెట్టారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, దండేపల్లిని మంచిర్యాల జిల్లాలోనే ఉంచాలని చేపడుతున్న ఆందోళనలో భాగంగా సోమవారం మండలంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. బడి లేకపోవడంతో రిషీత్ ఇంటివద్దే ఉండిపోయాడు. తండ్రి ఇదే ఆందోళనలో పాల్గొనడానికి వెళ్లగా.. తల్లి గ్రామసభకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది.