-
ఈ కొత్త కుబేరుడు- ఆసియాలోనే టాప్
న్యూఢిల్లీ, సాక్షి: ప్రస్తుత కేలండర్ ఏడాది(2020) చివర్లో కొత్త కుబేరుడు ఆవిర్భవించాడు. వ్యక్తిగత సంపద 77.8 బిలియన్ డాలర్లకు చేరడంతో చైనాకు చెందిన జాంగ్ షంషాన్ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచినట్లు బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజాగా పేర్కొంది. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టినట్లు తెలియజేసింది. ప్రస్తుతం ముకేశ్ వ్యక్తిగత సంపద 76.9 బిలియన్ డాలర్లుగా వెల్లడించింది. వెరసి జాంగ్ ప్రపంచ కుబేరుల జాబితాలో 11వ ర్యాంకును పొందగా.. ముకేశ్ అంబానీ ఆ వెనుకే నిలిచినట్లు పేర్కొంది. ఇతర వివరాలు చూద్దాం.. చదవండి: (2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!) జాక్ మా.. 5వ ప్లేస్ ప్రయివేట్ బిలియనీర్ కావడంతో మీడియాలో తక్కువగా కనిపించే 66 ఏళ్ల జాంగ్ కెరీర్ జర్నలిజం, పుట్టగొడుగుల పెంపకం, ఆరోగ్య పరిరక్షణ రంగాలతో పెనవేసుకుంది. ఈ ఏడాదిలోనే జాంగ్ సంపద అత్యంత వేగంగా వృద్ధి చెందింది. 2020లో 70.9 బిలియన్ డాలర్ల సంపద జమయ్యింది. దీంతో జాంగ్ వ్యక్తిగత సంపద 77.8 బిలియన్ డాలర్లను తాకింది. ఇందుకు ప్రధానంగా వ్యాక్సిన్ తయారీ కంపెనీ బీజింగ్ వాంటాయ్ బయోలాజికల్ ఫార్మసీ ఎంటర్ప్రైజస్ను ఏప్రిల్లో లిస్టింగ్ చేయడం సహకరించింది. అంతేకాకుండా బాటిల్డ్ వాటర్ కంపెనీ నాంగ్ఫు స్ర్పింగ్ కంపెనీ హాంకాంగ్లో పబ్లిక్ ఇష్యూకి రావడం కూడా దీనికి జత కలసింది. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన వాంటాయ్ షేర్లు 2,000 శాతం దూసుకెళ్లగా.. నాంగ్ఫు షేర్లు సైతం 155 శాతంపైగా ర్యాలీ చేశాయి. దీంతో ఒక్క వాంటాయ్ కారణంగానే ఆగస్ట్కల్లా జాంగ్ సంపదకు 20 బిలియన్ డాలర్లు జమయ్యింది. వెరసి తొలిసారి చైనాయేతర దేశాలలోనూ జాంగ్ పేరు వినిపిస్తున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు సరదాగా వ్యాఖ్యానించారు. (2021: ముకేశ్ ఏం చేయనున్నారు?) ముకేశ్ స్పీడ్ నిజానికి 2020లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద సైతం వేగంగా బలపడింది. పెట్రోకెమికల్స్ తదితర డైవర్సిఫైడ్ బిజినెస్లు కలిగిన ఆర్ఐఎల్ను డిజిటల్, టెక్నాలజీ, ఈకామర్స్ దిగ్గజంగా రూపొందించడంతో ముకేశ్ సంపద 18.3 బిలియన్ డాలర్లమేర ఎగసింది. తాజాగా 76.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక దశలో అంటే ఈ ఏడాది జూన్కల్లా ఆర్ఐఎల్ గ్రూప్ షేర్ల పరుగు కారణంగా ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో నాలుగో ర్యాంకుకు సైతం చేరారు. కాగా.. ఇతర ఆసియా కుబేరుల్లో పిన్డ్యువోడ్యువో అధినేత కొలిన్ హువాంగ్ 63.1 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో మూడో ర్యాంకులో నిలిచారు. టెక్ దిగ్గజం టెన్సెంట్ చీఫ్ పోనీ మా 56 బిలియన్ డాలర్లతో తదుపరి స్థానాన్ని కైవసం చేసుకోగా.. ఈకామర్స్ దిగ్గజం అలీబాబా సహవ్యవస్థాపకుడు జాక్ మా 51.2 బలియన్ డాలర్లతో ఐదో ర్యాంకును పొందారు. జాక్ మాకు షాక్ చైనా నియంత్రణ సంస్థలు ఇటీవల యాంట్ గ్రూప్ సంస్థలపై యాంటీట్రస్ట్ నిబంధనల్లో భాగంగా దర్యాప్తును చేపట్టడంతో జాక్ మా సంపదకు సుమారు 10 బిలియన్ డాలర్లమేర చిల్లు పడింది. దీంతో సంపద రీత్యా జాక్ మా వెనకడుగు వేశారు. కాగా.. బాటిల్డ్ వాటర్ బిజినెస్లో మార్కెట్ లీడర్గా నిలుస్తున్న నాంగ్ఫు స్ప్రింగ్ పటిష్ట క్యాష్ఫ్లోలను సాధించగదని సిటీగ్రూప్ వేసిన అంచనాలు ఈ కంపెనీకి జోష్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్న వార్తలతో వాంటాయ్ షేరు సైతం జోరందుకున్నట్లు తెలియజేశారు. వెరసి జాంగ్ ఆసియా కుబేరుడిగా అవతరించినట్లు వివరించారు. -
5జీ టెక్నాలజీను వెంటనే అనుమతించండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ టెక్నాలజీని త్వరితగతిన అనుమతించమంటూ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు వీలుగా పాలసీ నిర్ణయాలను సాధ్యమైనంత త్వరగా తీసుకోవలసిందిగా అభ్యర్థించారు. దేశంలో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ జోరందుకునేందుకు పలు సూచనలను చేశారు. మూడు రోజుల భారత్ మొబైల్ కాంగ్రెస్ సదస్సు 2020 ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, టెలికం మంత్రి రవిశంకర ప్రసాద్ వద్ద డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ పలు అంశాలను ప్రస్తావించారు. వివరాలు ఇలా.. చౌక ఫోన్లతో వచ్చే ఏడాది(2021) ద్వితీయార్థానికల్లా దేశంలో 5జీ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవలసి ఉంది. ఇదేవిధంగా అందుబాటు ధరల్లో 5జీ స్మార్ట్ ఫోన్లను అందించేందుకు వీలు కల్పించవలసి ఉంది. ఇందుకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలను సాధ్యమైనంత త్వరగా తీసుకోవలసిందిగా కోరుతున్నాను. ప్రధాని మోడీజీ డిజిటల్ మిషన్ కారణంగా కోవిడ్-19 వల్ల ఎదురైన కష్టకాలంలోనూ దేశం బలంగా నెగ్గుకురాగలిగింది. ఆన్లైన్లోనే విద్య, షాపింగ్, ఆఫీసులు, ఆరోగ్యం తదితర పలు కార్యక్రమాలు కొనసాగాయి. ఇందుకు దేశమంతటా విస్తరించిన 4జీ నెట్వర్క్ మౌలిక సదుపాయాలు సహకరించాయి. అయితే ఇప్పటికీ 30 కోట్లమంది ప్రజలు 2జీ నెట్వర్క్కే పరిమితమై ఉన్నారు. చౌక ధరల్లో స్మార్ట్ఫోన్లకు తెరతీయడం ద్వారా మరింతమంది ప్రజలకు డిజిటల్ సేవలు అందించేందుకు వీలుంటుంది. ప్రభుత్వ సహకారం కారణంగా టెలికం పరిశ్రమ పలు సర్వీసులను అందించగలిగింది. కోవిడ్-19 కట్టడికి త్వరలో చౌక ధరలోనే వ్యాక్సిన్లను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నందున 2021లో పరిస్థితులు చక్కబడతాయని విశ్వసిస్తున్నాను. దీంతో ఆర్థిక రికవరీతోపాటు.. జీడీపీ వృద్ధి బాట పట్టేవీలుంది. తద్వారా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించే దిశలో పరుగుపెట్టనుంది. జియో ముందుంటుంది ప్రస్తుతం ప్రపంచంలో భారత్ సైతం డిజిటల్ కనెక్టెడ్ దేశాల జాబితాలో ముందుంటోంది. దీనిని కొనసాగిస్తూ ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికన 5జీ సేవలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతోపాటు.. అందుబాటు ధరలో సర్వీసులు, స్మార్ట్ఫోన్లకు అవకాశం కల్పించవలసి ఉంది. తద్వారా 2021 ద్వితీయార్థానికల్లా రిలయన్స్ జియో ద్వారా 5జీ విప్లవానికి బాటలు వేయగలం. దీంతో దేశీయంగా 5జీ నెట్వర్క్, హార్డ్వేర్, టెక్నాలజీ పరికరాల తయారీకి ఊపు లభిస్తుంది. ప్రధాని మోడీజీ ఆవిష్కరించిన ఆర్మనిర్భర్ భారత్ విజన్లో జియో 5జీ సర్వీసులు భాగంకావడం ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్కు ఊపు నిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. జియో ప్లాట్ఫామ్స్ ద్వారా ఆధునిక సాంకేతితతో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఆర్థిక, వాణిజ్య విభాగాలలో కొత్తతరహా సర్వీసులను అందిస్తున్నాం. హార్డ్వేర్ తయారీ కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దేందుకు మరిన్ని చర్యలు చేపట్టవలసి ఉంది. ఇప్పటికే మంత్రివర్యులు రవిశంకర ప్రసాద్ కృషి నేపథ్యంలో గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలు దేశానికి తరలివచ్చి హార్డ్వేర్ తయారీపై దృష్టిపెడుతున్నాయి. పూర్తిస్థాయిలో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సాధించేందుకు దేశీయంగా తయారీని బలపరుచుకోవలసి ఉంది. తద్వారా దిగుమతులపై ఆధారపడటానికి చెక్ పెట్టవచ్చు. -
15% వాటాకు రూ. 63,000 కోట్లు!
న్యూఢిల్లీ: అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్లో 15 శాతం వాటాను విక్రయించే ప్రణాళికల్లో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నట్లు తాజాగా అంచనాలు వెలువడుతున్నాయి. బుధవారం పీఈ సంస్థ సిల్వర్ లేక్కు 1.75 శాతం వాటాను విక్రయించేందుకు డీల్ కుదుర్చుకున్న విషయం విదితమే. ఇందుకు సిల్వర్ లేక్ రూ. 7,500 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో డిజిటల్ అనుబంధ విభాగమైన రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసిన కంపెనీలకు రిలయన్స్ రిటైల్లోనూ వాటాలను ఆఫర్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రిలయన్స్ జియోలో ఇప్పటికే సిల్వర్ లేక్ రూ. 10,202 కోట్లను ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేసింది. ఇదే విధంగా జియోలో ఇన్వెస్ట్ చేసిన సౌదీ సంస్థలు రిలయన్స్ రిటైల్లో వాటాపై కన్నేసినట్లు తెలుస్తోంది. 15 శాతం వాటాకు సై రిలయన్స్ రిటైల్లో 15 శాతం వాటాలను విక్రయించాలని పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యోచిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. తద్వారా రూ. 63,000 కోట్లను సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు ఊహిస్తున్నాయి. సిల్వర్ లేక్ డీల్తో రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. కాగా.. రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసిన సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(పీఐఎఫ్), అబుధబీకి చెందిన ముబదాలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, అబుధబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(ఏడీఐఏ), ఎల్కేటర్టన్సహా.. పీఈ దిగ్గజం కేకేఆర్.. రిలయన్స్ రిటైల్లో వాటా కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. షేరు జూమ్ రిలయన్స్ రిటైల్లో 15 శాతం వాటా విక్రయం ద్వారా రూ. 63,000 కోట్లవరకూ సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు వెలువడిన వార్తలు రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్కు జోష్నిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 3 శాతం ఎగసి రూ. 2,223ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం! కన్సాలిడేషన్ గత నెలలో కిశోర్ బియానీ సంస్థ ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన రిటైల్, హోల్సేల్ బిజినెస్లను ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ రిటైల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 24,713 కోట్ల డీల్ను కుదుర్చుకుంది. తద్వారా దేశీ రిటైల్ రంగంలో కన్సాలిడేషన్ ద్వారా రిలయన్స్ గ్రూప్.. రిటైల్ బిజినెస్ను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్(వాల్మార్ట్)కు పోటీగా జియో మార్ట్ ద్వారా రిలయన్స్ రిటైల్ వేగంగా విస్తరిస్తున్నట్లు వివరించారు. 2006లో ప్రారంభమైన రిలయన్స్ రిటైల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11,806 స్టోర్లను కలిగి ఉంది. చదవండి: ము‘క్యాష్’ రిటైల్ స్వారీ..! -
జియో మీట్ : 10 లక్షలు దాటిన డౌన్లోడ్స్
ముంబై: రిలయన్స్ జియో ఇటీవల ఆవిష్కరించిన వీడియో కాలింగ్ యాప్ జియో మీట్కు భారీ ఆదరణ లభిస్తోంది. యాప్ లాంఛ్ అయిన మూడురోజుల్లోనే 10 లక్షలమందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో ఆ దేశానికి చెందిన 59 యాప్లపై కేంద్రం నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వదేశీ యాప్లకు భారీ డిమాండ్ నెలకొంది. అయితే వీడియో కాలింగ్ సర్వీస్తో కూడిన యాప్ను లాంచ్ చేస్తామని గత ఏప్రిల్లోనే జియా రిలయన్స్ కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. (రిలయన్స్ జియోలో ఇంటెల్- జియోమీట్ యాప్) జియో మీట్ యాప్ను ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, యాపిల్ ఐఓఎస్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 720పీ వీడియో క్వాలిటీతో పాటు 100 మంది ఒకేసారి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనే అవకాశం ఉండటం దీని ప్రత్యేకత. జూమ్ యాప్కి ధీటుగా వచ్చిన జియో మీట్కి ఇప్పటికే భారీ ఆదరణ లభిస్తుంది. ‘వినియోగదారుల సమాచారం భద్రంగా ఉంటుంది. మీ గోప్యతకు భంగం వాటిల్లనివ్వం. పూర్తి పారదర్శకతతో పనిచేస్తాం’ అంటూ జియా మీట్ వెబ్సైట్లో ప్రత్యేకంగా రాసుకొచ్చారు. ఒకవేళ దీనికి సంబంధించి ఏమైనా సందేహాలున్నా మీ అభిప్రాయాలను grievance.officer@jio.comకు పంపాల్సిందిగా కోరింది. (జియోలో మరో భారీ పెట్టుబడి) -
రిలయన్స్ జియోలో ఇంటెల్- జియోమీట్ యాప్
పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ జియోలో మరో విదేశీ దిగ్గజం ఇన్వెస్ట్ చేస్తోంది. గ్లోబల్ సెమీకండక్టర్ దిగ్గజం ఇంటెల్ కార్ప్.. రిలయన్స్ జియోలో 0.39 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 1895 కోట్లను వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో డిజిటల్, టెలికం విభాగమైన రిలయన్స్ జియోలో 25.1 శాతం వాటా విక్రయం ద్వారా మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 1.17 లక్షల కోట్లను సమీకరించినట్లయిందని విశ్లేషకులు తెలియజేశారు. ఇప్పటిపకే రిలయన్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 9.99 శాతం వాటాను సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 43,574 కోట్లు వెచ్చించింది. 100 మందికి వీలుగా రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ వీడియో కాన్ఫరెన్సింగ్కు వీలు కల్పించే యాప్ను ప్రవేశపెట్టింది. జియోమీట్ పేరుతో వీడియో కాలింగ్ యాప్ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. ప్లే స్టోర్తోపాటు యాప్ స్టోర్లోనూ జియోమీట్ అందుబాటులో ఉంటుందని తెలియజేసింది. ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఈ యాప్ ద్వారా 100 మందివరకూ వీడియో కాన్ఫరెన్సింగ్లో పాల్గొనవచ్చని తెలియజేసింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ల ద్వారా ఉచితంగా ఈ యాప్ను వినియోగించుకోవచ్చని వివరించింది. గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ఫాక్స్ ద్వారా వినియోగదారులు వీడియో కాన్ఫరెన్సింగ్కు హాజరుకావచ్చని తెలియజేసింది. 11 వారాల్లో 12 కంపెనీలు గత 11 వారాల్లో రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్లో మొత్తం 12 కంపెనీలు పెట్టుబడులకు క్యూ కట్టాయి. తద్వారా జియో ప్లాట్ఫామ్స్ మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం 25.09 వాటాను విక్రయించింది. వెరసి రూ. 1,17,588 కోట్లకుపైగా సమకూర్చుకుంది. ఇటీవల జియో ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేసిన ఇతర కంపెనీలలో జనరల్ అట్లాంటిక్, సిల్వర్లేక్ పార్టనర్స్, విస్టా, ముబడాలా, కేకేఆర్, సౌదీ సావరిన్ వెల్త్ ఫండ్ పీఐఎఫ్ తదితరాలు చేరాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement