breaking news
regularisation issue
-
క్రమబద్ధీకరణకు అర్హులెవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ముందడుగు పడింది. క్రమబద్ధీకరణకు అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల ప్రతిపాదనలను శాఖల వారీగా వెంటనే పంపాలని ఆర్థిక శాఖ అన్ని శాఖలకు లేఖలు రాసింది. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన 11 వేల కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్ధీకరించేం దుకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వనుంది. వాస్తవా నికి 2016 ఫిబ్రవరి 26న కూడా ఇదే తరహాలో ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం అన్ని శాఖల అధిపతులను కోరింది. కానీ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను వ్యతిరేకిస్తూ కొం దరు హైకోర్టును ఆశ్రయించడంతో 2017 ఏప్రిల్ 26న కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కార ణంగా ఈ ప్రక్రియకు అంతరాయం కలిగింది. అయితే 2021 డిసెంబర్ 7న హైకోర్టు రిట్ పిటిషన్ను కొట్టేస్తూ కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కూడా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని, ఇకపై కాం ట్రాక్టు పద్ధతిలో నియామకాలు ఉండబోవని ప్రక టించారు. -
ఏళ్ల తరబడి దినసరి బతుకులే
సాక్షి, పాడేరు (విశాఖపట్నం): ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోని వసతిగృహాల్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్లు రెగ్యులరైజేషన్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలంటూ అనేక సార్లు పోరాట చేశారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ ఉన్నతాధికారుల నుంచి ప్రతిపాదనలు మినహా గత ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వీరి గోడు అరణ్యరోదనగా మిగిలిపోయింది. ఏజెన్సీ 11 మండలాల్లోని 122 ఆశ్ర మ ఉన్నత పాఠశాలల వసతిగృహాలు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలకు అనుసంధానంగా 49 పోస్టుమెట్రిక్ హాస్టళ్లను గిరిజన సంక్షేమశాఖ నిర్వహిస్తోంది. వీటిలో ఏటా 44వేల మంది గిరిజన విద్యార్థులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆశ్రమోన్నత పాఠశాలల వసతిగృహాల్లో 360 నుంచి 500 మంది వరకు ఒక్కోదానిలో ఉంటున్నారు. విద్యార్థుల సంఖ్యకనుగుణంగా సిబ్బంది లేరు. ఒక్కో హాస్టల్లో ముగ్గురేసి ఉంటున్నారు. ఒక హాస్టల్కు కుక్, కమాటీ, వాచ్మెన్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఆశ్రమ వసతిగృహాలకు స్వీపర్ పోస్టులు మంజూరు కాలేదు. 500 మంది విద్యార్థులున్న హాస్టళ్లలో సిబ్బంది, వర్కర్ల కొరత సమస్య ఎక్కువగా ఉంటోంది. ఇటువంటి వాటిల్లో కనీసం ఆరుగురు వర్కర్లు ఉండాలి. ఉన్న ముగ్గురుతోనే నెట్టుకొస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరు అనారోగ్యానికి గురైనా ఆ రోజు విద్యార్థులకు సకాలంలో భోజనం అందని దుస్థితి నెలకొంటోంది. ప్రస్తుతం ఈ వసతిగృహాల్లో రెగ్యులర్ వర్కర్లు 125 మంది మాత్రమే ఉన్నారు. డైలీవేజ్పై 107 మంది, ఔట్సోర్సింగ్పై 248 మంది పనిచేస్తున్నారు. మంజూరైన వర్కర్ పోస్టుల్లో ఇంకా 80 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. కనీస వేతనానికి దూరం.. ఒక్కరోజు కూడా విరామం లేకుండా హాస్టళ్లలో పనిచేస్తున్న వీరు కనీస వేతనానికి నోచుకోవడం లేదు. ప్రస్తుతం ఆశ్రమాల్లో పనిచేస్తున్న 107 మంది డైలీవేజ్ వర్కర్లకు కలెక్టర్ గెజిట్ ప్రకారం నెలకు రూ.12,400లు, ఔట్సోర్సింగ్పై పనిచేస్తున్న 248 మంది క్యాజువల్ వర్కర్లకు 151 జీవో ప్రకారం నెలకు రూ.12వేల వేతనం పొందుతున్నారు. వీరితో పాటు సమానంగా వసతిగృహాల్లో విధులు నిర్వర్తించే రెగ్యులర్ వర్కర్లకు సీనియారిటీని బట్టి నెలకు సుమారు రూ.25వేలు నుంచి రూ. 50వేలు వరకు వేతనం పొందుతున్నారు. ఇలా దీర్ఘకాలంగా డైలీవేజ్పై పనిచేస్తున్న వర్కర్లకు సర్వీస్ క్రమబ ద్దీకరణ విషయంలో, వేతనాల చెల్లింపులో తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ వర్కర్లలో ఎవరైనా అనారోగ్యంతో మరణిస్తే వారి కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రయోజనం చేకూరడంలేదు. ఉపాధి కల్పించడం లేదు. ఇలా వీరు దిక్కుతోచని స్థితితో ఎదుగూబొదుగూ లేకుండా ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్నారు. వర్కర్లకు పనిభారం.. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో వర్కర్లకు పనిభారం ఏటేటా పెరిగిపోతోంది. ఖాళీలను భర్తీ చేయకపోవడం, పిల్లల సంఖ్య పెరగడంతో ఉన్నవారిపై పని ఒత్తిడి పడుతోంది. నాలుగైదేళ్లలో ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు కొత్తగా ఆంగ్ల మాద్యమంలో విద్యార్థులను చేర్చుకున్నారు. కొన్ని యూపీ స్కూళ్లను హైస్కూళ్లుగా అప్గ్రేడ్ చేశారు. ఇందుకు తగ్గట్టుగా వర్కర్ పోస్టులు అదనంగా మంజూరు కాలేదు. దీనికి తోడు విద్యార్థులకు పెట్టే మెనూ కూడా పెంచారు. ఉదయం అల్పాహారంతో పాటు రెండు పూటలా భోజనం, సాయంత్రం స్నాక్స్ వండి వడ్డించడంతో వర్కర్లపై పనిభారం పడుతోంది. డైలీవేజ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలి.. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేయాలి. జీవో నంబర్ 212 ప్రకారం అర్హత కలిగిన డైలీవేజ్ వర్కర్లు 100 మందికి పైగా ఉన్నాం. మృతి చెందిన డైలీవేజ్ వర్కర్ల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం లేదు. తాము పర్మినెంట్కు నోచుకోకపోవడం వల్ల చాలా నష్టపోతున్నాం. అన్ని విధాల మాకు అన్యాయం జరుగుతోంది. వేసవి సెలవుల్లో డ్యూటీలు, వేతనాలు ఉండవు. జీతాలు ప్రతినెలా సక్రమంగా అందడం లేదు. విద్యార్థులు ఎక్కువగా ఉన్న హాస్టళ్లలో వర్కర్లను పెంచాలి. –పి.బాలన్న, డైలీవేజ్ వర్కర్, సీఏహెచ్ స్కూల్, తలారిసింగి రెగ్యులరైజేషన్కు ప్రతిపాదించాం 212 జీవో ప్రకారం అర్హులైన డైలీవేజ్ వర్కర్ల రెగ్యులరైజేషన్కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. హాస్టళ్లలో ఖాళీలను భర్తీ చేయాలని కోరాం. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న హాస్టళ్లలో ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక వర్కర్ చొప్పున అదనంగా వర్కర్లను నియమించేందుకు ప్రతిపాదించాం. –జి.విజయ్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్, ఐటీడీఏ, పాడేరు. -
కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ మరింత జాప్యం!
- హైకోర్టులో కేసు కొలిక్కి రాకపోవడమే కారణం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ మరింత ఆలస్యం కానుంది. సర్వీసు క్రమబద్ధీకరణ విషయంలో హైకోర్టులో కేసు పరిష్కారానికి మరింత ఎక్కువ సమయం పట్టనుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 3,687 మంది కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాల పెంపునకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. వారికి ప్రస్తుతం చెల్లిస్తున్న రూ. 18 వేల వేతనాన్ని రూ. 27 వేలకు పెంచుతూ ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపింది. ఇందుకు ఆర్థిక శాఖ నుంచి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలోనే ఆయా లెక్చరర్లకు వేతనాలు పెరగనున్నాయి. అనంతరం డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్లకూ వేతనాలు పెంచే అవకాశం ఉందని బోర్డు వర్గాల సమాచారం. క్రమబద్ధీకరణ అంత సులభమా? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలులో భాగంగా ఉద్యోగుల క్రమబద్ధీకరణకు 2015లోనే జీవో 16 జారీ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఓయూ నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో క్రమబద్ధీకరణ జరగలేదు. వాస్తవానికి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం కుదరదని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అమలులో ఉన్న సర్వీసు నిబంధనలు, నోటిఫికేషన్ ఆధారంగానే క్రమబద్ధీకరణ చేయవచ్చని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం 2015లో క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టింది. 2014 జూన్ 2 నాటికి సర్వీసులో కొనసాగుతూ అన్ని అర్హతలు ఉండి, మంజూరైన పోస్టుల్లో పని చేస్తున్న వారి వివరాలను పంపాలని జిల్లాల అధికారులకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్టే విధించాలంటూ నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించగా ఈ అంశాన్ని తేల్చేవరకు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఇవ్వబోమని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. దీంతో హైకోర్టు స్టే ఇవ్వలేదు. 50 శాతం పెంపునకే మొగ్గు క్రమబద్ధీకరణ ప్రక్రియ ఆలస్యమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో 14ను జారీ చేసింది. గతంలో దివంగత సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆ కేడర్లో కనీస వేతనాలివ్వాలని జారీ చేసిన జీవో 3ను సవరించి జీవో 14ను జారీ చేసింది. కనీస వేతనంతోపాటు ప్రస్తుత వేతనంలో 50% పెంచాలని, ఆ రెండింటిలో ఏది తక్కువైతే దాన్ని వర్తింపజేయాలని పేర్కొంది. కానీ 50% వేతనా ల పెంపునకే బోర్డు మొగ్గు చూపుతోంది.