breaking news
readership surveys
-
ఇదీ సాక్షి పాఠకుల సంఖ్య
పాఠకుల సంఖ్య.....93,41,000 సాక్షి, హైదరాబాద్ : సాక్షి దినపత్రికను ప్రతిరోజూ 93.41 లక్షల మంది పాఠకులు చదువుతున్నారని ఇండియన్ రీడర్షిప్ సర్వే (ఐఆర్ఎస్)–2017 తేల్చింది. ఈ సర్వేలో ప్రాంతీయ, హిందీ పత్రికలే అగ్రస్థానంలో నిలిచాయి. ఇంగ్లిష్ పత్రికలను వెనక్కి నెట్టి టాప్–10 స్థానాలను ఇవే కైవసం చేసుకున్నాయి. హిందీ పత్రికల పాఠకుల సంఖ్యలో ఏకంగా 45 శాతం వృద్ధి నమోదైంది. 7 కోట్ల పైచిలుకు పాఠకులతో దైనిక్ జాగరణ్ మొదటి స్థానంలో, 5.23 కోట్లతో హిందుస్థాన్, 4.6 కోట్లతో అమర్ ఉజాలా పత్రికలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. రీడర్షిప్ స్టడీస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్ఎస్సీఐ), మీడియా రీసెర్చ్ యూజర్స్ కౌన్సిల్(ఎంఆర్యూసీ)లు తాజాగా ఈ సర్వే ఫలితాలను వెల్లడించాయి. గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా పత్రికలు కొత్తగా 11 కోట్ల మంది పాఠకులను సంపాదించుకున్నాయి. 2014 ఐఆర్ఎస్ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం పాఠకుల సంఖ్య 29.5 కోట్లు కాగా ప్రస్తుతం అది 40.7 కోట్లకు చేరింది. కొత్తగా చేరిన ఈ పాఠకులు పట్టణ ప్రాంతాల్లో 4 కోట్లు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 7 కోట్లు ఉండటం గమనార్హం. అలాగే 12 ఏళ్లు పైబడిన వారిలో పాఠకుల సంఖ్య 9 శాతం పెరిగినట్టు తేలింది. ‘‘ఈ అంకెలు ప్రింట్ రంగానికి మున్ముందు ఉజ్వల భవిష్యత్ ఉందనడానికి అద్దం పడుతున్నాయి’’ అని ఎంఆర్యూసీ చైర్మన్ ఆశిష్ భాసిన్ పేర్కొన్నారు. -
ఆర్ఎస్సీఐ చైర్మన్గా సీవీఎల్ శ్రీనివాస్
ముంబై: రీడర్షిప్ స్టడీస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్ఎస్సీఐ) చైర్మన్గా గ్రూప్ఎం సౌత్ ఆసియా సంస్థ సీఈవో సి.వి.ఎల్.శ్రీనివాస్ నామినేట్ అయినట్లు ఆర్ఎస్సీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటివరకు కొనసాగిన హర్ముస్జీ కామా నుంచి చైర్మన్గా శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారని, రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. వివిధ పత్రికల రీడర్షిప్ సర్వేలు నిర్వహించే ‘ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ)’, ‘మీడియా రీసెర్చ్ యూజర్స్ కౌన్సిల్ (ఎంఆర్యూసీ)’ సంస్థలు ఉమ్మడిగా రీడర్షిప్ స్టడీస్ను చేపట్టాలనే అవగాహనకు రావడంతో ఆర్ఎస్సీఐ ఏర్పాటైంది. ఇందులో వివిధ పత్రికలు, ప్రకటనల ఏజెన్సీల ప్రతినిధులు, ప్రకటనలు ఇచ్చే సంస్థల ప్రతినిధులు కలిపి 20 మంది సభ్యులు ఉంటారు. ఆర్ఎస్సీఐ పాలకమండలి ఇండియన్ రీడర్షిప్ సర్వే కోసం ఎన్.పి.సత్యమూర్తి ఆధ్వర్యంలో ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్ఎస్సీఐ చైర్మన్గా శ్రీనివాస్ ఎంపిక పట్ల ఏబీసీ చైర్మన్ శశిసిన్హా హర్షం వ్యక్తం చేశారు. 2016 రీడర్షిప్ సర్వేకు ఆయన సరైన మార్గదర్శకత్వం చూపగలరని పేర్కొన్నారు.