-
ఏనుగు..సైకిల్.. హస్తం!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ 1978లో చీలిపోయిన తర్వాత ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్(ఐ) కోసం ఏనుగు, సైకిల్, హస్తం గుర్తులు పరిశీలనకు రాగా, ఇందిర ‘హస్తం’ గుర్తుకు ఆమోద ముద్ర వేశారని పొలిటికల్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ తెలిపారు. ఇటీవలే విడుదలైన తన పుస్తకం ‘బ్యాలెట్– టెన్ ఎపిసోడ్స్ దట్ హావ్ షేప్డ్ ఇండియాస్ డెమొక్రసీ’లో కిద్వాయ్ వివరించారు. కాంగ్రెస్(ఐ) ఏర్పాటుతో ఇందిర ‘ఆవు–దూడ’ గుర్తును వదులుకోవాల్సి వచ్చిందని కిద్వాయ్ ఈ పుస్తకంలో తెలిపారు. ‘అప్పటి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బూటా సింగ్ తమకు కొత్త ఎన్నికల గుర్తు కేటాయించాలని ఈసీకి లేఖ రాశారు. దీంతో ఏనుగు, హస్తం, సైకిల్ గుర్తుల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలని ఈసీ సూచించింది. ఈ సమయంలో ఇందిర ఆంధ్రప్రదేశ్లో పార్టీ నేత పీవీ నరసింహారావుతో సమావేశమై ఉన్నారు. ఎన్నికల గుర్తుపై తుది నిర్ణయం తీసుకోలేని సింగ్.. ఇందిరకు వెంటనే ఫోన్ చేశారు. హస్తం గుర్తును ఎంపిక చేద్దామని సూచించారు. అయితే సాంకేతిక కారణమో లేక సింగ్ ఉచ్ఛారణ సరిగ్గా లేకపోవడంతోనో ఫోన్లో ఇందిరకు హాత్(హస్తం) అన్న పదం హాథీ(ఏనుగు)గా విన్పించింది. బూటా సింగ్ ఏనుగు గుర్తునే మళ్లీ మళ్లీ సిఫార్సు చేస్తున్నారని ఆగ్రహించిన ఇందిర.. చివరికి ఫోన్ను పీవీ నరసింహారావు చేతికిచ్చా రు. బహుభాషా పండితుడైన నరసింహారావు రిసీవర్ అందుకున్న వెంటనే సింగ్ చెబుతున్నదేంటో అర్థం చేసుకున్నారు. హాత్ అనడం ఆపి పంజా అనాలని పీవీ ఆయనకు ఫోన్లో గట్టిగా జవాబిచ్చారు. చివరికి పీవీ అసలు విషయాన్ని ఇందిరకు చెప్పడంతో హస్తం గుర్తుకు ఆమె అంగీకరిం చారు’ అని కిద్వాయ్ వివరించారు. -
2016లో సోనియా రిటైర్మెంట్?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 2016 సంవత్సరంలో రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా? తన 70వ పుట్టినరోజు నుంచి క్రియాశీల రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తోంది సీనియర్ జర్నలిస్ట్, రచయిత రషీద్ కిద్వాయి రాసిన ‘24 అక్బర్ రోడ్’ పుస్తకం. గత పుట్టినరోజు నాడు(డిసెంబర్ 9, 2012) పార్టీ సీనియర్ నేతలకు తన రిటైర్మెంట్ ఆలోచన గురించి సోనియా చెప్పారని, దాంతో కంగుతిన్న ఆ నేతలు పార్టీ బాధ్యతలు రాహుల్గాంధీ తీసుకునేంత వరకు ఆ నిర్ణయం వాయిదా వేసుకోవాలని కోరినట్లు అందులో వెల్లడించారు. దాంతో అప్పట్నుంచి పార్టీలో, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు తీసుకోవాలంటూ పార్టీ సీనియర్ నేతలతోపాటు ప్రధాని మన్మోహన్సింగ్ రాహుల్పై ఒత్తిడి తెచ్చారని దానికి ఆయన ససేమిరా అన్నారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. రాహుల్ అనాసక్తి పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగిస్తోందని, అందువల్ల కేబినెట్లో బెర్త్ కానీ, పార్టీ ఉపాధ్యక్ష పదవి కానీ తీసుకోవాలని ప్రధాని కోరారని వెల్లడించారు. దాంతో రాహుల్ పార్టీలో కీలక బాధ్యతలు తీసుకునేందుకే మొగ్గు చూపారని తెలిపారు. అలా ఈ సం వత్సరం జనవరి 19న జైపూర్లో జరిగిన పార్టీ ‘చింతన్ శిబిర్’లో రాహుల్కు పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించారని వివరించారు. అయినా సోనియా రిటైర్మెంట్ నిర్ణయం పార్టీ వర్గాలకు ఇప్పటికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని పేర్కొంది. మరోవైపు, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలోకి వెళ్లాలని కూడా రాహుల్ తీవ్రంగా ఆలోచించారని, అయితే ఆ ఆలోచనను పార్టీ మొగ్గలోనే తుంచేసిందని ఆ పుస్తకం వెల్లడించింది. కేవ లం ఒక్క రాష్ట్రానికే పరిమితం చేస్తే రాహుల్ను భవి ష్యత్ ప్రధాని చేయాలన్న ప్రణాళికకు విఘాతం కలుగుతుందేమోనని పార్టీ ఆలోచించిందని పేర్కొంది. ఆ ఎన్నికల్లో 28 సీట్లు గెలుచుకుని కాం గ్రెస్ దారుణ ఓటమి పాలైన విషయం తెలిసిందే.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement