breaking news
Ranji trophy matches
-
కమ్మేసిన పొగమంచు:మ్యాచ్లు రద్దు!
న్యూఢిల్లీ: గతకాలంగా ప్రపంచ కాలుష్యనగరాల్లో ప్రధానంగా నిలిచిన ఢిల్లీలో.. గత మూడ్రోజులుగా పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయి. దుమ్ము, ధూళి, పొగ, రసాయనాలు ప్రమాదస్థాయిని మించిపోయాయి. దాంతో ఢిల్లీ ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. ఈ సెగ క్రికెట్ మ్యాచ్లనూ వీడలేదు. పొగమంచు కారణంగా నగరంలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో, కర్నైల్ సింగ్ స్టేడియంలో శనివారం జరగాల్సిన మ్యాచ్లు రద్దయ్యాయి. ఈ వాయు కాలుష్యం ఊపిరిత్తుల సమస్యతో పాటు, కంటి చూపుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆటగాళ్లు మ్యాచ్లు ఆడటానికి వెనకడుగు వేశారు. గ్రూప్-ఎలో భాగంగా బెంగాల్-గుజరాత్ జట్ల మధ్య ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఒక మ్యాచ్, గ్రూప్-సిలో త్రిపుర-హైదరాబాద్ జట్ల మధ్య కర్నైల్ సింగ్ స్టేడియంలో మరో మ్యాచ్ తొలి రోజు ఆట రద్దయ్యింది. వాహనాలు వెదజల్లుతున్న వాయువులతోపాటు నగరం చుట్టుపక్కలున్న పరిశ్రమలనుంచి వస్తున్న కాలుష్యం ఢిల్లీ నగరంపై తీవ్ర ప్రభావం చూపుతుంటే, ఇటీవల జరిగిన దీపావళి పండగ కూడా వాయు కాలుష్యానికి ఆజ్యం పోసింది. స్టేడియాల్లో కనుచూపు మేర ఏమీ కనిపించక పోగా, గాలిలో కూడా నాణ్యత లోపించడంతో తొలి రోజు మ్యాచ్ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. నిన్న సాయంత్రం నాలుగు గంటల వరకూ వాతావరణాన్ని పలుమార్లు పరీక్షించిన తరువాత మ్యాచ్ లను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అయితే ఆదివారం రెండో రోజు ఆట కూడా సాగే అవకాశం దాదాపు కనబడుట లేదు. ఇప్పటికే త్రిపుర-హైదరాబాద్ జట్ల మధ్య జరగాల్సిన రెండో రోజు ఆటను రద్దు చేశారు. -
తటస్థ వేదికల్లో రంజీ ట్రోఫీ
► దులీప్లో జోనల్ పద్ధతికి స్వస్తి ► బీసీసీఐ సాంకేతిక కమిటీ నిర్ణయం బెంగళూరు: వచ్చే సీజన్ నుంచి రంజీ ట్రోఫీ మ్యాచ్లను తటస్థ వేదికలపై జరిపేందుకు బీసీసీఐ సాంకేతిక కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే దులీప్ ట్రోఫీలో కొనసాగుతున్న ఇంటర్ జోనల్ పద్ధతికి స్వస్తి పలకనున్నారు. దీని స్థానంలో సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన నాలుగు ఆలిండియా స్థాయి జట్లను ఆడించనున్నారు.సౌరవ్ గంగూలీ నేతృత్వంలో జరిగిన సాంకేతిక కమిటీ సమావేశంలో బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే కూడా పాల్గొన్నారు. దేశవాళీ క్రికెట్లో మరింత పోటీతత్వం పెంచాలనే ఉద్దేశంతో తటస్థ వేదికల నిర్ణయం తీసుకున్నట్టు కమిటీ పేర్కొంది. ఇక 2016-17 దులీప్ ట్రోఫీ సీజన్లో రౌండ్ రాబిన్ పద్ధతిలో తలపడేందుకు నాలుగు జట్లను సెలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది. అలాగే మొత్తం టోర్నీ డే అండ్ నైట్లో జరుగుతుంది. స్టార్ ఆటగాళ్లతో పాటు టెస్టు జట్టులో చోటును ఆశిస్తున్న వారికి కూడా ఫ్లడ్లైట్ల వెలుతురులో గులాబి బంతితో ఆడే అవకాశం దక ్కనుందని కమిటీ సభ్యులొకరు తెలిపారు. ఈ ప్రతిపాదనలను బోర్డు వర్కింగ్ కమిటీ ముందుంచనున్నారు.