breaking news
Ranam -2
-
మరో యుద్ధం
గోపీచంద్ హీరోగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘రణం’ చిత్రానికి సీక్వెల్గా ‘రణం-2’ రానుంది. ‘అమ్మ’ రాజశేఖర్ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ఈ చిత్రాన్ని గోపనబోయిన శ్రీనివాసయాదవ్ నిర్మించారు. ఈ సినిమా మే 15 న విడుదల కానుంది. ‘అమ్మ’ రాజశేఖర్ మాట్లాడుతూ-‘‘ ఈ సినిమా కోసం మూడే ళ్లగా శ్రమిస్తున్నాను. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రంలో దివంగత శ్రీహరిగారి పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది’’ అని నిర్మాత చెప్పారు. -
మాస్ టచ్తో...
‘అమ్మ’ రాజశేఖర్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన ‘రణం’ ఎంతటి విజయం సాధించిందో ప్రేక్షకులకు తెలిసిందే. ప్రస్తుతం ‘రణం-2’ పేరుతో ‘అమ్మ’ రాజశేఖర్ హీరోగా, ఆయన దర్శకత్వంలోనే ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీనివాస్ యాదవ్ నిర్మాత. నిధి కథానాయిక. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘అన్ని వాణిజ్య హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నా పాత్ర మాస్ టచ్తో ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: శ్రీధర్.