breaking news
Ranabaali Movie
-
ఎన్నో పోరాటాలు చేశాం: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబరు 11న విడుదల కానుంది. ఇదిలా ఉంటే... సోమవారం (జూన్ 29) రాహుల్ సంకృత్యాన్ పుట్టినరోజు.ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ– ‘‘మనం (రాహుల్ని ఉద్దేశించి) ‘టాక్సీవాలా’ సినిమా చేసి తొమ్మిదేళ్లవుతోంది. ఇన్నేళ్లలో మనం జీవితంలో ఎంతో మారిపోయాం. అర్థవంతమైన కథలు రాయాలనే తపన, వాటిని అందంగా తెరకెక్కించాలనే ఇష్టం నీలో ఏమాత్రం తగ్గలేదు. మనం కలిసి చేసింది రెండు చిత్రాలే అయినా ఎన్నో పోరాటాలు చేశాం. మొదటి చిత్రానికి ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ అందుకున్నాం. ‘రణబాలి’తో మరో విజయం సాధించాలి’’ అని రాసుకొచ్చారు. -
విజయ్ దేవరకొండపై రూమర్స్.. స్పందించిన మైత్రి నిర్మాత
గత రెండు రోజులుగా హీరో విజయ్ దేవరకొండ రణబాలి మూవీపై రూమర్స్ వినిపిస్తున్నాయి. హీరో విజయ్ నిర్మాతలకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా ఈ రూమర్స్పై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత యలమంచిలి రవి స్పందించారు. అలాంటి వార్తలు పూర్తి ఫేక్ అని కొట్టిపారేశారు. షూటింగ్ సమయంలో మాకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని వెల్లడించారు. విజయ్ కేవలం పని మీదే శ్రద్ధ పెడతారని రవి క్లారిటీ ఇచ్చారు.కాగా.. రణబాలి షూట్ కోసం విజయ్ ఎక్కువగా కారవాన్లు డిమాండ్ చేయడమే కాకుండా.. అసిస్టెంట్స్ కూడా ఎక్కువమంది ఉండాలని కోరాడని వార్తలొచ్చాయి. ఇప్పటికే ఈ విషయంపై విజయ్ టీమ్ కూడా స్పందించింది. ఇలాంటి ఫేక్ న్యూస్ రాసేవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రకటన విడుదల చేశారు.కాగా.. రాయలసీమ బ్యాక్డ్రాప్లో రణబాలి మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. కీలక సన్నివేశాలను రాయలసీమలోని చారిత్రక ప్రాంతాల్లో తెరకెక్కించారు. బ్రిటిష్ కాలం నాటి స్టోరీ కావడంతో అందుకు తగ్గట్టుగానే షూట్ చేస్తున్నారు. -
విజయ్ దేవరకొండ రణబాలి.. ఆ ప్రచారంపై చర్యలు తీసుకోండి..!
ప్రస్తుతం విజయ్ దేవరకొండ రణబాలి షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ మూవీని రాయలసీమ బ్యాక్డ్రాప్లో రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ సినిమాపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరుగుతోంది.తాజాగా విజయ్ దేవరకొండ వస్తోన్న దుష్ప్రచారంపై ఆయన టీమ్ స్పందించింది. రణబాలి మూవీ నిర్మాతలకు భారం పెరిగేలా వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. విజయ్ 50 నుంచి 60 మంది అసిస్టెంట్స్ కావాలని.. మినిమం 5 లేదా ఆరు క్యారవాన్స్ అడుగుతున్నారని డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ డిమాండ్స్ భరించలేక మైత్రీ సంస్థ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదు చేసిందంటూ తప్పుడు పోస్టులు చేస్తున్నారు. కొన్ని సంస్థలు ఇలాంటి వార్తలు రాసి పోస్టులు చేస్తున్నారు. దీంతో ఇవన్నీ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ టీమ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య వార్తలు నమ్మవద్దని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసింది. విజయ్ ఎప్పుడూ ప్రొడ్యూసర్స్ మంచిని కోరే హీరోగానే ఉన్నాడని వెల్లడించింది. ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి పోస్టులు చేస్తున్న వారిపై తమ సంస్థల పేర్లు, లోగోలు ఫోర్జరీ చేస్తున్నందుకు ఆయా సంస్థలపై సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకుని చట్టపరంగా శిక్షించాలని విజయ్ టీమ్ కోరింది. -
సీమ రమ్మంది... స్టోరీ ఉందంది
రాయలసీమ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇంకా ఎన్నో సినిమాలు చేయొచ్చంటూ రచయితలను–దర్శకులను ‘సీమ రమ్మంది... స్టోరీ ఉందంది’. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, విడుదలకు సిద్ధమైన ‘రాయలసీమ’ బ్యాక్డ్రాప్ సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.నవ్వుల కోలాటం వచ్చే సంక్రాంతికి థియేటర్స్లో నవ్వుల కోలాటం అంటున్నారు అనిల్ రావిపూడి. వెంకటేశ్, కల్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘వెంకీఅనిల్5 అండ్ ఎన్కేఆర్ఏఆర్2’ (వర్కింగ్ టైటిల్) అనే ఎంటర్టైనింగ్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్ నేడు ఆరంభం కానుంది.‘కత్తిలాంటి ఐడియా’ అంటూ ఓ వినోదాత్మక కాన్సెప్ట్ వీడియోను ఆదివారం రిలీజ్ చేసి, ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ డ్రామాగా ఉంటుందని ఈ వీడియోతో స్పష్టం చేశారు అనిల్ రావిపూడి. ఈ చిత్రానికి ‘జనవరి 13న రిలీజ్, బామ్మర్ది బాల్రెడ్డి’ అనే టైటిల్స్ను పరిశీలిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. జీ స్టూడియోస్, సురేష్ ప్రోడక్షన్స్, అర్చనల సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.ప్రేమ కోసం లెనిన్ ‘ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు’ అనే క్యాప్షన్తో ‘లెనిన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తన ప్రేమ కోసం లెనిన్ ఏ స్థాయిలో పోరాటం చేస్తాడో ఈ క్యాప్షన్ స్పష్టం చేస్తోంది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో ప్రేమ, కుటుంబం, రాజకీయ అంశాలతో రూరల్ యాక్షన్ డ్రామాగా ‘లెనిన్’ సినిమా రూపొందింది. ఈ చిత్రకథలో ‘ప్రేమ’ ప్రధానాంశంగా ఉంటుందని ఆ మధ్య విడుదలైన ‘సోల్ ఆఫ్ లెనిన్’ వీడియో కూడా స్పష్టం చేసింది.లెనిన్పాత్రలో అక్కినేని అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్గా మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ఇది. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించనంత మాస్ లుక్లో ఈ చిత్రంలో అఖిల్ కనిపించనున్నారు. రాయలసీమ కుర్రాడిగా ఒదిగి΄ోవడానికి అఖిల్ చిత్తూరు యాసలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. తనపాత్రకు డబ్బింగ్ కూడా చె΄్పారు. జూలై 10న ‘లెనిన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.యోధుడు రణబాలి అది 19వ శతాబ్దం... ముఖ్యంగా 1854 – 1878 మధ్యకాలం. బ్రిటిష్పాలనలో కరువు కాటకాలతో రాయలసీమ అల్లాడుతోంది. అప్పుడే జనాల్లోంచి ఓ యువకుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. బ్రిటిష్వారిపై ఆ యోధుడు తిరగబడ్డాడు. ఈ కథతో రూపొందుతున్న చిత్రం ‘రణబాలి’. ఇందులో యోధుడు రణబాలిపాత్రను విజయ్ దేవరకొండ, అతనికి జోడీగా జయమ్మపాత్రలో రష్మిక మందన్నా నటిస్తున్నారు.రాయలసీమ ప్రజలు చేసిన పోరాటాలు, తిరుగుబాట్ల ఆధారంగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం నాటి రాయలసీమ యాసలో శిక్షణ తీసుకోవడమే కాకుండా, గుర్రపు స్వారీలోనూ శిక్షణ పొందారు విజయ్ దేవరకొండ. ఈపాన్ ఇండియా చిత్రం సెప్టెంబర్ 11న రిలీజ్ కానుంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొరియన్ దెయ్యం వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ‘కొరియన్ కనకరాజు’. రితికా నాయక్ కథానాయికగా నటించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. ముఖ్యంగా అనంతపురం బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఈ చిత్రంలో కనకరాజు అనేపాత్రలో వరుణ్ తేజ్ నటిస్తున్నారని తెలిసింది. ఓ కొరియన్ దెయ్యానికి, కనకరాజుకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది మాత్రం సినిమాలో చూడాలి. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.మంగాపురంలో ప్రేమసూపర్స్టార్ కృష్ణ మనవడు, మహేశ్బాబు సోదరుడు రమేశ్బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘శ్రీనివాసా మంగాపురం’. రవీనాటాండన్ కుమార్తె రాషా తడానీ ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రధానంగా తిరుపతికి దగ్గర్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో సాగుతుంది.ఈ విలేజ్ లవ్స్టోరీ సినిమాలో శ్రీనుపాత్రలో జయకృష్ణ, మంగపాత్రలో రాషా నటిం చారు. సి. అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా జూలై 9న రిలీజ్ కానుంది. ఇంకా సాయిదుర్గా తేజ్ హీరోగా రోహిత్ కేపీ దర్శకత్వంలో కె. నిరంజన్రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’తోపాటు రాయలసీమ నేపథ్యంలో రానున్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
రణబాలిలో రాక్షసుడు.. విజయ్ దేవరకొండ అరుదైన ఘనత..!
విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలితో బిజీగా ఉన్నారు. రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో వస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీని రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ విషయాన్ని డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు, మమ్మీ మూవీ విలన్ అర్నాల్డ్ వోస్లో ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ మూవీలో సర్ థియోడర్ హెక్టర్ అనే ప్రతినాయకుని పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ స్వయంగా వెల్లడించారు. జూన్ 16న అర్నాల్డ్ వోస్లో పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేశారు. రణబాలిలో అర్నాల్ట్ లుక్ పోస్టర్ను పంచుకున్నారు. నా చిన్నప్పుడు చూసిన సినిమాలలో 'మమ్మీ' నాకు ఎంతో ఇష్టమైన చిత్రమని రాసుకొచ్చారు. అందులోని ప్రతి పాత్ర నాకు నచ్చిందన్నారు. కానీ అన్నింటికన్నా ముఖ్యంగా రాక్షసులు నిజంగా ఉండగలరని నమ్మేలా చేసింది మాత్ర.. ఆ సినిమాలోని ప్రతినాయకుడైన అర్నాల్డ్ వోస్లోనే అని ప్రశంసలు కురిపించారు.అర్నాల్డ్ ఎంట్రీతో విజయ్ దేవరకొండ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఇద్దరు ప్రముఖ హాలీవుడ్ స్టార్స్తో నటించిన టాలీవుడ్ హీరోగా రికార్డ్ సృష్టించారు. గతంలో విజయ్ హీరోగా వచ్చిన లైగర్ మూవీలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్తో కలిసి నటించారు. ఇప్పుడు రణబాలిలో అర్నాల్డ్ వోస్లో ఎంట్రీతో ఏ హీరోకు సాధ్యం ఇద్దరు గ్లోబల్ స్టార్స్తో నటించిన అరుదైన రికార్డ్ సాధించారు. కాగా.. రణబాలి ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. Mummy was one of my all-time favorite films growing up. I loved every character in it, but above all, it was the villain who made me truly believe that monsters could exist.Many years later, when I sat down to write one of my favorite villain characters ever- The Monster in… pic.twitter.com/8NXX90U4HX— Rahul Sankrityan (@Rahul_Sankrityn) June 16, 2026 -
విజయ్-రష్మికల ‘రణబాలి’.. 100 రోజుల షూటింగ్ పూర్తి!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ‘రణబాలి’ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ సినిమా రూపొందుతోంది.తాజాగా ‘రణబాలి’ సినిమా సక్సెస్ ఫుల్ గా వంద రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవలే గండికోటలో షెడ్యూల్ చిత్రీకరణ జరిపారు. వారం రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ రూపొందించారు. ఇప్పటిదాకా ఈ చిత్రానికి సంబంధించిన 90 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఔట్ పుట్ పూర్తి సంతృప్తికరంగా వచ్చిందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ లోని ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సీక్వెన్సులు మూవీ లవర్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ‘రణబాలి’ సినిమా సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కు అన్ని సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. -
గండికోటలో...
విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నాల పెళ్లయి ముచ్చటగా మూడు నెలలైంది. అయితే ఈ ఇద్దరూ పెళ్లయిన తర్వాత జస్ట్ చిన్న బ్రేక్ మాత్రమే తీసుకుని, షూటింగ్స్తో బిజీ అయ్యారు. ఇక ఈ ఇద్దరూ జంటగా సిల్వర్ స్క్రీన్పై ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కనిపించిన విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్లో రానున్న మూడో సినిమా ‘రణబాలి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్తోనే విజయ్–రష్మిక బిజీగా ఉన్నారు.ఈ చిత్రం షూటింగ్ వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని గండికోటలో జరుగుతోంది. కోట ముఖద్వారం దగ్గర, ధాన్యాగారంలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గత ఆదివారం గండికోటలో ఆరంభమైన ఈ చిత్రం షెడ్యూల్ నేటితో ముగుస్తుందని సమాచారం. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ రూపొందుతోంది.ఈ చిత్రం కోసం విజయ్ దేవరకొండ స్టాలియన్ అనే బ్రీడ్కు చెందిన గుర్రాలను స్వారీ చేయడం నేర్చుకున్నారు. ‘‘ఇది చాలా కఠినమైన ట్రైనింగ్. స్టాలియన్ బ్రీడ్ గుర్రాలను స్వారీ చేయడం అంత ఈజీ కాదు’’ అని ఆ మధ్య విజయ్ దేవరకొండ పుట్టినరోజు (మే 9) సందర్భంగా యూనిట్ పేర్కొంది. చిత్రబృందం పేర్కొన్నట్లే... విజయ్ చాలా ప్రయత్నాలు చేసి, సక్సెస్ఫుల్గా హార్స్ రైడింగ్ చేయడం ఆ గ్లింప్స్లో కనిపించింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్ – అతుల్, కెమెరా: నీరవ్ షా. -
విజయ్ దేవరకొండ రణబాలి.. గండికోటలో గుర్రపు స్వారీ..!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ మూవీ రణబాలి. ఈ మూవీని రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ కథ బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే కర్నూల్, నంద్యాల జిల్లాలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ జరిగింది.ప్రస్తుతం రణబాలి షూటింగ్ కడప జిల్లాలోని గండకోటలో జరుగుతోంది. రాయలసీమ కథకు తగినట్లుగా యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా కోట ముఖద్వారం వద్ద, ధాన్యాగారంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ముఖ్యంగా గుర్రపు స్వారీ చేసే యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Grand Canyon of India Gandikota Maa Rayalaseema Ela anipinchindi anna @TheDeverakonda ❤️#VijayDevaraKonda #Ranabali https://t.co/NVMZTfLF9a pic.twitter.com/ALGkWAr9Fb— Narasimha NTR 🦚 (@NarasimhaNTR_) June 2, 2026 -
జయమ్మ కోసం రణబాలి శుభాకాంక్షలు
నటి రష్మిక మందన్న పుట్టినరోజు సందర్బంగా రణబాలి మూవీ టీమ్ ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. ఆమెకు శుభాకాంక్షలు చెబుతు మేకింగ్ వీడియోను షేర్ చేసింది. ఈ క్రమంలో రష్మిక భర్త విజయ్ దేవరకొండ కూడా ఆ వీడియోను షేర్ చేస్తూ ఐ లవ్ యూ జయమ్మ అని క్యాప్షన్ ఇచ్చారు. వీరిద్దరి పెళ్లి తర్వాత ఈ చిత్రం రానున్నడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.టాక్సీవాలా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ మరోసారి హిట్ కొట్టేందుకు బలమైన కథన రెడీ చేసుకున్నాడు. టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తోంది. 1854 - 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనలను ఆధారం చేసుకుని ఈ మూవీ రానుంది. మాతృభూమి కోసం తెల్లదొరలపై తిరుగుబాటు చేసే యోధుడిగా విజయ్ కనిపించనున్నారు. -
నాలో సీమ ఫీలింగ్ ఉంది: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ అనంతపురంలో ముగిసింది. అక్కడి స్థానికులు విజయ్–రష్మిక జంట మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపించారని, బైక్ ర్యాలీలతో అభిమానులు విజయ్ పట్ల అభిమానం చాటుకున్నారని యూనిట్ పేర్కొంది. అలాగే తన రాయలసీమ ఫ్యాన్స్ని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మీట్లో కలిశారు. రాయలసీమకు ఎప్పుడొచ్చినా తన సొంతూరుకి వచ్చినట్లుగా అనిపిస్తోందని, తన లోపల సీమ ఫీలింగ్ ఉందని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.రష్మిక... బ్యాక్ టు జపాన్వచ్చే నెల జపాన్ వెళ్లనున్నారు రష్మికా మందన్నా. ‘క్రంచీ రోల్ అనిమే అవార్డ్స్–2026’ టెన్త్ ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవం మే 23న టోక్యోలో జరగనుంది. ఈ వేడుకకు రష్మికా మందన్నా ఓ ప్రజెంటర్గా హాజరు కానున్నారు. అయితే ‘క్రంచీ రోల్ అనిమే’ అవార్డు వేడుకలో ఆమె పాల్గొనడం ఇదేం తొలిసారి కాదు. 2024లో ఆమె ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని, ‘బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్’ విభాగంలో విజేతకు అవార్డును అందించారు. ఇలా ‘క్రంచీ రోల్ అనిమే’ అవార్డ్స్ ప్రదానోత్సవంలో ఓ ప్రజెంటర్గా పాల్గొన్న తొలి ఇండియన్ యాక్టర్గా నిలిచారామె. మళ్లీ వచ్చే నెలలో జపాన్ వెళ్లనున్నారు. ఇక మొత్తం 32 విభాగాల్లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగుతుంది. తాజాగా నామినేషన్స్ను ప్రకటించారు. ఈ క్రమంలోనే అవార్డుల ప్రజెంటర్స్ పేర్లను కూడా ప్రకటించారు నిర్వాహకులు. ఈ జాబితాలో రష్మికా మందన్నా పేరు ఉంది. -
రాయలసీమలో రణబలి షూటింగ్.. వీడియో వైరల్
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న హిస్టారికల్ యాక్షన్ మూవీ రణబలి. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనలో జరిగిన యధార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఏపీలోని నంద్యాల జిల్లాలో జరుగుతోంది.తాజాగా ఈ మూవీ షూటింగ్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. విజయ్ దేవరకొండ గుర్రంపై వస్తున్న వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'ముండమోపి నాకొడకా.. యాడుండువ్ రా.. నీ ఇళ్లలోకి వచ్చినా..రాప్పా సంపుదువ్ కానీ..' అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ వింటే ఫుల్ మాస్ యాక్షన్ మూవీగానే తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో వస్తోన్న కథ కావడంతో ఎక్కువ శాతం రాయలసీమ ప్రాంతంలో తెరెకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. Proper Rayalaseema Dialogues &Proper Rayalaseema Houses.నాకొడకా.. యాడుండువ్ రా.. నీ ఇళ్లలోకి వచ్చినా..Mass 💥 #RanaBali pic.twitter.com/UCPAarktV6— low battery🪫 (@low__battery287) April 2, 2026 -
'రణబాలి' పోస్టర్ వెనుక ఎమోషనల్ స్టోరీ: దర్శకుడు
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి సందర్భంగా రణబాలి నుంచి ఒక పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. వారిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో నెట్టింట వైరల్ అయింది. పోస్టర్లో వారిద్దరి లుక్ చాలా ఓల్డ్ గెటప్లో ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, దీని వెనుక దాగిన ఆసక్తికరమైన స్టోరీని చిత్ర దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ షేర్ చేశారు. రణబాలి నుంచి తాజాగా విడుదలైన పోస్టర్ కేవలం ఒక సినిమాకు సంబంధించినది మాత్రమే కాదని తెలిపారు. ఈ పోస్టర్ రూపకల్పనలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయని చెప్పారు. పాత కాలపు ఫోటోలంటే తనకు ఎంతో ఇష్టమని దర్శకుడు గుర్తుచేసుకున్నారు. మన పూర్వీకులు కెమెరా ముందు ఎలాంటి కృత్రిమమైన ఫోజులు లేకుండా చాలా సహజంగా ఫోటోలు దిగేవారని చెప్పారు. అలాంటి కృత్రిమమైన లుక్ను రణబాలి పోస్టర్లో తీసుకురావాలని తాము ప్రయత్నించినట్లు రాహుల్ సాంకృత్యన్ తెలిపారు.రణబాలి పోస్టర్ గురించి దర్శకుడు ఇలా చెప్పారు. '1800ల కాలం నాటి నేపథ్యంలో ‘రణబాలి’ మూవీ ఉండనుంది. కాబట్టి, ఆ కాలపు గాంభీర్యం, మట్టి వాసన కనిపించేలా ఈ చిత్రంలో వివాహ వేడుకను డిజైన్ చేశాం. ఈ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో విజయ్, రష్మిక పెళ్లి దుస్తుల్లో వచ్చినప్పుడు వారిద్దరూ నిజంగానే మన పూర్వపు కాలంలోకి వెళ్ళిన వ్యక్తుల్లా కనిపించారు. ఫోటో లుక్లో కూడా వారిద్దరూ ఎలాంటి స్టైలిష్ ఫోజులు ఇవ్వలేదు. కేవలం సాధారణ వ్యక్తుల్లా వారిద్దరినీ కెమెరాతో బంధించాం. ఇదే ఈ పోస్టర్ ప్రత్యేకత. ఈ సినిమా పోస్టర్ విడుదల నాటికి వారిద్దరూ నిజ జీవితంలో ఒక్కటి కావడం ఆశ్చర్యంగా అనిపించింది. ఒక్కోసారి సినిమా, నిజ జీవితం రెండూ పలకరించుకుంటాయ్. ఈ పోస్టర్ చూస్తుంటే వారి గత జన్మకు సంబంధించిన పెళ్లి ఫోటోలా అనిపిస్తుంది.' అని రాహుల్ సాంకృత్యన్ ఎమోషనల్ స్టోరీ రాసుకొచ్చారు.STORY BEHIND THE WEDDING POSTERYesterday, we released the wedding poster of Ranabaali.But this wasn’t designed as a “poster.” It was a moment.I’ve always been fascinated by old photographs — our parents, grandparents… the way they stood before a camera. No posing. No… pic.twitter.com/ppuBj9tMjQ— Rahul Sankrityan (@Rahul_Sankrityn) March 1, 2026 -
విజయ్, రష్మిక మూడోసారి.. చిరు-త్రిష రెండోసారి.. జోడీ రిపీట్
వెండితెరపై ఓ హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కుదిరి, ఆ సినిమా హిట్ కూడా అయితే అప్పుడు ‘హిట్ పెయిర్’ అనిపించుకుంటారు. ఆ హిట్ పెయిర్ కాంబినేషన్కి ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న కొన్ని జోడీలు రిపీట్ అవుతున్నాయి. తొలిసారి జోడీగా నటించి, సక్సెస్ సాధించిన ఈ జంటకు సక్సెస్ రిపీట్ కావడం ఖాయం అనే అంచనాలున్నాయి. ఇక... రిపీట్ అవుతున్న జోడీల గురించి తెలుసుకుందాం. రెండోసారి... ఈ మధ్య చిరంజీవి హీరోగా నటించిన చిత్రాల్లో ‘విశ్వంభర’ మూవీ ఒకటి. ‘బింబిసార’ మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించారు. త్రిష మెయిన్ హీరోయిన్గా, ఆషికా రంగనాథ్ సెకండ్ హీరోయిన్గా నటించారు. చిరంజీవి, త్రిష కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘స్టాలిన్ ’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2006 సెప్టెంబరు 20న విడుదలై, హిట్గా నిలిచింది. ఆ చిత్రం తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రాలేదు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి జోడీ ‘విశ్వంభర’ సినిమాతో రిపీట్ అవుతోంది. ‘‘స్టాలిన్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి–త్రిష జోడీ ‘విశ్వంభర’తో రెండోసారీ అలరించనుంది. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్గా ఈ మూవీ రూపొందింది. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ఫై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంజీవి పుట్టినరోజుని పురస్కరించుకుని 2025 ఆగస్టు 22న విడుదల చేసిన ‘విశ్వంభర’ సినిమా గ్లింప్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ వేసవిలో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పనుల వల్ల సినిమా విడుదల ఆలస్యం అయింది. చందమామ కథలా సాగిపోయేటటువంటి అద్భుతమైన కథ ‘విశ్వంభర’. ముఖ్యంగా చిన్నపిల్లలకు, మరీ ముఖ్యంగా పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలను సైతం ఇది అలరిస్తుంది... వినోదపరుస్తుంది. ఈ వేసవికి ఈ సినిమా మీ ముందు ఉంటుంది. నాది భరోసా’’ అని చిరంజీవి పేర్కొన్న సంగతి తెలిసిందే. వందో చిత్రంలో... హీరో నాగార్జున, హీరోయిన్ టబు జోడీకి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరి పేరు చెప్పగానే ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా గుర్తొస్తుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో మొదటిసారి నటించారు నాగార్జున–టబు. 1996 అక్టోబరు 4న రిలీజైన ఈ చిత్రం సూపర్హిట్గా నిలిచింది. ఈ మూవీలో తమదైన నటనతో ఆడియన్స్ని ఆకట్టుకున్నారు నాగార్జున–టబు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగార్జున–టబు కలిసి నటించిన చిత్రం ‘ఆవిడా మా ఆవిడే’. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1998 జనవరి 14న విడుదలైంది. ఈ చిత్రంలోనూ మరోసారి సందడి చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ జోడీగా నటించలేదు. కానీ, ‘సిసింద్రి’ (1995) సినిమాలో మాత్రం ‘ఆటాడుకుందాం రా అందగాడా...’ అంటూ సాగే స్పెషల్ సాంగ్లో సందడి చేశారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున–టబు ముచ్చటగా మూడోసారి నటిస్తున్నారు. నాగార్జున కెరీర్లో 100వ సినిమాగా రూపొందుతోన్న చిత్రం ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్). ఈ మూవీకి తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్పై అక్కినేని నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నాగార్జున కెరీర్లో మైలురాయిలాంటి ఈ చిత్రంలో మరోసారి ఆయనకి జోడీగా టబు నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ మైసూర్లో జరుగుతోంది. మూడోసారి... హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికా మందన్నా జోడీకి పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ వంటి సినిమాల్లో జంటగా నటించిన వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. విజయ్–రష్మిక కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘గీత గోవిందం’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018 ఆగస్టు 15న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఆ మూవీ తర్వాత వీరిద్దరూ జోడీగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 జూలై 16న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఏడేళ్లకు విజయ్–రష్మిక కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ మూవీ తెరకెక్కించిన రాహుల్ సంకృత్యాన్ ‘రణబాలి’కి దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా వారి లైఫ్లో ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే.. రీల్ లైఫ్లో జోడీగా నటించిన విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా రియల్ లైఫ్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడమే. ఫిబ్రవరి 26న వీరి వివాహం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వీరి కాంబోలో రానున్న ‘రణబాలి’ మూవీపై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందుతోన్న ఈ మూవీలో విజయ్ రణబాలిగా, రష్మిక జయమ్మ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న రిలీజ్ కానుంది. సెకండ్ టైమ్ హీరో శర్వానంద్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ లది హిట్ జోడీ. ‘శతమానం భవతి’ మూవీలో ఫస్ట్ టైమ్ జోడీగా నటించిన ఈ జంట సెకండ్ టైమ్ ‘భోగి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా, డింపుల్ హయతి కీలక పాత్రలో నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందుతోన్న ఈ సినిమాలో తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి జోడీగా నటిస్తున్నారు శర్వానంద్–అనుపమ. వీరిద్దరూ ఫస్ట్ టైమ్ నటించిన చిత్రం ‘శతమానం భవతి’. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ మూవీ 2017 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీలో క్యూట్ జోడీగా ఆకట్టుకున్నారు శర్వా, అనుపమ. ఈసారి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘భోగి’లో నటిస్తున్నారు.1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 28న విడుదల కానుంది.ఈసారి భయపెడతారు ‘సామజ వరగమన’ సినిమాతో ప్రేక్షకులకు కడుపుబ్బా వినోదాలు పంచారు హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ రెబా మోనికా జాన్. వీరిద్దరూ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 జూన్ 29న విడుదలై, థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపించింది. ‘సామజవరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ నటించిన సెకండ్ మూవీ ‘మృత్యుంజయ్’. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. రమ్య గుణ్ణం సమర్పణలో సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ మూవీ కోసం రెండోసారి జోడీ కట్టారు శ్రీవిష్ణు–రెబా. తొలి చిత్రంలో ప్రేక్షకులకు నవ్వులు పంచిన ఈ జంట ‘మృత్యుంజయ్’లో మాత్రం భయపెట్టనున్నారు. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందింది. ‘సాంగ్స్, కామెడీ లేకుండా హానెస్ట్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. నా నటన కూడా సరికొత్తగా ఉంటుంది’’ అంటూ ఇటీవల శ్రీ విష్ణు తెలిపారు. ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కావాల్సి ఉంది. అయితే అదే రోజు శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘విష్ణు విన్యాసం’ మూవీ రిలీజ్ అవుతుండటంతో ఈ నెల 6కి ఈ మూవీ రిలీజ్ని వాయిదా వేశారు. బేబీ హిట్తో... ‘బేబీ’ మూవీతో ఓవర్నైట్ స్టార్స్ అయిపోయారు హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య. వారిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ‘బేబీ’. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై కల్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రత్యేకించి వీరి జోడీపై యూత్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ‘బేబీ’తో హిట్ పెయిర్ అనిపించుకున్న ఆనంద్– వైష్ణవి జంటగా నటిస్తున్న రెండో సినిమా ‘ఎపిక్’. ‘90స్’ (ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మి స్తున్నారు. కాగా ఎపిక్– ఫస్ట్ సెమిస్టర్ పేరుతో రిలీజ్ చేసిన ఈ మూవీ గ్లింప్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలాంటి అబ్బాయికి... సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోలాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ’ అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ‘బేబీ’ మూవీతో సూపర్హిట్ జోడీ అనిపించుకున్న ఆనంద్–వైష్ణవి కలిసి నటిస్తున్న ‘ఎపిక్’ మూవీపై మంచి క్రేజ్ నెలకొంది. రెండోసారి... ‘కోర్ట్’ సినిమాతో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా. ఈ ఇద్దరూ పరిచయమైన తొలి చిత్రం ‘కోర్ట్’. ఇప్పుడు రెండోసారి జంటగా నటించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. ప్రియదర్శి, శివాజీ, రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా 2025 మార్చి 14న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో తొలిసారి జోడీగా నటించిన హర్ష్ రోషన్–శ్రీదేవి హిట్ పెయిర్గా నిలిచారు. సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆడియన్స్లో వీరి జోడీకి ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో వీరు జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంపై ఫుల్ బజ్ నెలకొంది. -
విజయ్, రష్మికలకు సర్ప్రైజ్ గిఫ్ట్
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న నూతనంగా పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి సంతోషాన్ని రెట్టింపు చేసేందుకు రణబాలి మూవీ నుంచి స్పెషల్ వీడియోను విడుదల చేసి మేకర్స్ సర్ప్రైజ్ చేశారు. ఏందయ్య సామీ అంటూ సాగే ఒక గీతాన్ని ప్రోమోగా వదిలారు. సింగర్స్ శ్వేతా మోహన్, అజయ్ గోగవాలే ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ పాటలో కొత్తగా పెళ్లైన దంపతులుగా విజయ్, రష్మికలు కనిపిస్తున్నారు. 1854 - 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా రణబాలి చిత్రాన్ని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
విజయ్-రష్మిక పెళ్లి తర్వాత వచ్చే సినిమా ఇదే.. వీడియో రిలీజ్
గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు గానీ సరైన సక్సెస్ మాత్రం విజయ్ దేవరకొండకు దొరకట్లేదు. గతేడాది 'కింగ్డమ్'తో వచ్చాడు గానీ అదే సీన్ రిపీటైంది. ప్రస్తుతం రెండు మూవీస్ చేస్తున్నాడు. వాటిలో ఒకటి 'రౌడీ జనార్ధన' కాగా మరొకటి రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పీరియాడిక్ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇందులో విజయ్ సరసన రష్మిక హీరోయిన్గా నటిస్తుండటం విశేషం.విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు 'రణబాలి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 1876-78 మధ్య రాయలసీమ ప్రాంతంలో జరిగే స్టోరీతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ కాలంలో భారతదేశానికి వచ్చిన బ్రిటీషర్లు.. హిట్లర్ చేసిన దానికంటే ఎంత పెద్ద మారణహోమం సృష్టించారు. ఏకంగా 45 ట్రిలియన్ డాలర్లు దోచుకోవడం, 40 ఏళ్లలో 100 మిలియన్ల మంది చావులకు కారణమవడం.. ఇలాంటి చాలా విషయాలు సినిమాలో ఉండబోతున్నాయని అనౌన్స్మెంట్ వీడియోతో చెప్పకనే చెప్పేశారు.ఇందులో విజయ్.. బ్రిటీషర్లపై పోరాడిన రణబాలి అనే వీరుడిగా కనిపించనున్నాడు. రష్మిక.. జయమ్మ అనే పాత్ర పోషించింది. 'మమ్మీ' ఫేమ్ ఆర్నాల్డ్ ఓస్లో ... సర్ థియోడర్ హెక్టర్ పాత్ర చేశాడు. బాలీవుడ్ ఫేమ్ అజయ్ అతుల్ సంగీతమందిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 11న ఇది పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫిబ్రవరిలో విజయ్-రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే వీళ్లిద్దరూ భార్యభర్తలుగా నటించిన తొలి సినిమా ఇదే అవుతుంది. గతంలో వీళ్లిద్దరూ గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు జంటగా చేశారు.


