rambhupal reddy
-
‘సీమ’ ఆదాయం అమరావతిలో ఖర్చు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలని కడప, తిరుపతి, కర్నూలు, అనంతపురం జిల్లాలలో మూణ్ణెళ్లుగా ఉద్యమం జరుగుతోంది. ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు స్పందించ లేదు. ఈ ప్రాంతంపై ఆయనకు మంచి ఉద్దేశం లేకపోవడమే దీనికి కారణం. రాష్ట్రంలో దారుణంగా ఆర్థిక దుర్వినియోగం జరుగుతోంది. ‘సీమ’ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయం మొత్తాన్ని అమరావతిలో ఖర్చు చేస్తున్నారు..’ అని పలువురు నేతలు మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ను నిర్మించాలని ‘గ్రేటర్’ నేతలు మూడు నెలలుగా ఉద్యమిస్తున్న క్రమంలో నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ‘రాయలసీమ ప్రాజెక్టులు–సమాలోచనలు’ పేరుతో బుధవారం నంద్యాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఏమన్నారంటే... ‘కృష్ణా’పై నిర్మిస్తున్న ప్రాజెక్టులతో ‘సీమ’, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు భవిష్యత్తులో నీటి కష్టాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు చూపుతో రాయలసీమ లిఫ్ట్ పనులు ప్రారంభించగా అవి దాదాపు పూర్తయ్యాయి. రూ.200 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తయి సీమకు నీరందుతుంది. కానీ, రాజకీయ కారణాలతో చంద్రబాబు ఈ పనులు చేయడం లేదు. మన ప్రాంత ఆదాయాన్ని కూడా మన ప్రాంతానికి ఖర్చు చేయడం లేదు. కుప్పానికి నీళ్లిచ్చానని చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పం ప్రజలకు మాటిచ్చి, పనులుచేసి, ప్రారంభించారు. జగన్కు దక్కాల్సిన క్రెడిట్ కూడా చోరీ చేస్తున్నారు. రేవంత్ ప్రకటనపై బాబు స్పందించలేదు తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసమే చంద్రబాబును ఒప్పించి రాయలసీమ లిఫ్ట్ ఆపించానని రేవంత్రెడ్డి చేసిన ప్రకటనపై చంద్రబాబు ఇప్పటి వరకు స్పందించ లేదు. ఇక కర్ణాటకలోని ఆల్మట్టి, అప్పర్ భద్ర పూర్తయితే 138 టీఎంసీలు తగ్గిపోయి శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గుతుంది. శ్రీశైలానికి నీరు రాకముందే నెట్టెంపాడు వద్ద తెలంగాణ తోడేస్తోంది. రోజూ ఎనిమిది టీఎంసీలు తెలంగాణ తీసుకెళ్తే పోతిరెడ్డిపాడుకు చుక్కనీరు అందదు. అందుకే రాయలసీమ లిఫ్ట్ చేపట్టాం. దీని నిర్మాణం కోసం పార్టీలకతీతంగా అందరినీ కలుపుకుని ఉద్యమిస్తాం. ఈ అంశంలో రాజకీయాలకు అతీతంగా అంతా కలిసి రావాలి. చంద్రబాబు సీమకు ఎప్పుడూ న్యాయం చేయలేదు. ‘సీమ’ ఆదాయాన్ని చంద్రబాబు ముంపు ప్రాంతమైన అమరావతికి ఖర్చుచేస్తున్నారు. ఏ రోజుకైనా కృష్ణా పొంగడం, అమరావతి మునగడం ఖాయం. ‘సీమ’కు జరుగుతున్న అన్యాయాలపై వైఎస్సార్సీపీ మినహా ఎవ్వరూ ప్రశ్నించడంలేదు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన వ్యక్తి కూడా పత్తాలేడు... అని నేతలు అన్నారు. సభలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్థన్రెడ్డి, శైలజానాథ్, బుగ్గన రాజేంద్రనాథ్, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
అక్రమ మైనింగ్పై బాంబు పేల్చిన టీడీపీ ఎమ్మెల్సీ.. బాబుకు ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్పై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి బాంబు పేల్చారు. ‘అక్రమార్కులు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అపారమైన బెరైటీస్ ఖనిజ సంపదను దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతుల్లేవు, రాయల్టీ లేదు, అక్రమార్జనతో ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. బ్లాస్టింగ్ మెటీరియల్ విచ్చలవిడిగా లభిస్తోంది. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా వాడుతున్నారు’ అంటూ సీఎం చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి గురువారం ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.ఇంకా ఆ లేఖలో ఏం రాశారంటే.. ‘వేముల మండలం గొందిపల్లెలో సర్వే నంబర్ 275లోని 705.43 ఎకరాల్లో కృష్ణప్ప ఆజ్బెస్టాస్ అండ్ బెరైటీస్ కంపెనీకి గతంలో అనుమతులుండేవి. ప్రస్తుతం లీజు అనుమతులకు రెన్యువల్స్ లేకపోగా, రూ.6కోట్లు బకాయిలున్నాయి. అయినప్పటికీ కొందరు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. నిత్యం 100 టన్నులు ఖనిజాన్ని వెలికి తీస్తున్నారు. టన్ను రూ.35వేలు చొప్పున కడపలో ఉన్న పల్వరైజింగ్ మిల్స్కు విక్రయిస్తున్నారు. దీనిపై హక్కుదారులు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదు. వెల్ మైనింగ్లో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా విచ్చలవిడిగా బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఇదివరకూ అక్రమ మైనింగ్లో అయ్యవారిపల్లెకు చెందిన రామచంద్ర మృతి చెందాడు. కలసపాడు వద్ద బ్లాస్టింగ్ మెటీరియల్ కారణంగా గతంలో 10మంది కార్మికులు చనిపోయారు. విరివిగా దొరుకుతున్న జిలెటిన్ స్టిక్స్ వాడుకొని వి.కొత్తపల్లె గ్రామంలో నరసింహులును పేల్చి చంపారు’ అని వివరించారు.ఓ వైపు అక్రమ మైనింగ్, మరోవైపు దోపిడీ..‘వేముల, వేంపల్లె మండలాల్లో అక్రమ మైనింగ్ నిర్వహణే కాకుండా టిఫెన్ కంపెనీకు చెందిన రూ.10 కోట్లు విలువైన ఖనిజాన్ని దోపిడీ చేశారు. టిఫెన్ కంపెనీ ఇన్కం ట్యాక్స్ డిపార్టుమెంటుకు, ఇతర సంస్థలకు రూ.కోట్లలో బకాయి పడింది. దాంతో నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) స్వాధీనం చేసుకుంది. దాదాపు 15 ఏళ్ల నుంచి నిల్వ ఉన్న ఖనిజాన్ని ఎన్సీఎల్టీ వేలం వేయగా, ఎంబసీ గ్రూపు కొనుగోలు చేసింది. కోర్టు పరిధిలో ఉన్న ఆ ఖనిజాన్ని ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా దోపిడీ చేశారు. గూగుల్ చిత్రాలను పరిశీలిస్తే దోపిడీ స్పష్టంగా తెలుస్తుంది’ అని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. -
రిటైర్డ్ హెచ్ఎం రాంభూపాల్రెడ్డి ఔదార్యం
ఒంగోలు అర్బన్(ప్రకాశం జిల్లా): రాచర్ల మండలం యడవల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం మార్కాపురం రాంభూపాల్రెడ్డి తన పెన్షన్ సొమ్ముతో వెయ్యి మంది కార్మికులకు బీమా ప్రీమియం చెల్లించేందుకు ముందుకు వచ్చి ఔదార్యం చాటుకున్నారు. ఈ మేరకు సోమవారం స్పందన భవనంలో అంగీకార పత్రాన్ని కలెక్టర్ దినేష్కుమార్కు అందజేశారు. యడవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కార్మికులకు బీమా చెల్లిస్తానని అంగీకారం తెలిపారు. గతంలో రిటైర్మెంట్ బెన్ఫిట్స్ మొత్తం రూ.26 లక్షలు స్థానిక పోస్టాఫీస్లో డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో సుకన్య సమృద్ధి యోజన ఖాతాల ద్వారా సుమారు 100 మందికి పైగా పేద బాలికలకు జమ చేస్తున్ననాని తెలిపారు. దీనిపై దేశ ప్రధాని కూడా అభినందించిన విషయం గుర్తుచేశారు. సేవా భావంతో రిటైర్డ్ ఉద్యోగి పనిచేయడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. (క్లిక్: 100 మందికి సుకన్య సమృద్ధి యోజన) -
ఎమ్మెల్యే కాటసాని కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్
-
వైఎస్సార్సీపీలో జిల్లా నాయకుడికి కీలక బాధ్యతలు
కొల్లాపూర్ : జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు గుండ్రెడ్డి రాంభూపాల్రెడ్డికి అధిష్టానం కీలక బాధ్యతలు కట్టబెట్టింది. ఈయనను పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడి (ఈసీఈ) గా నియమించారు. మొదట్నుంచీ వైఎస్సార్ అనుచరుడిగా కొనసాగుతున్న రాంభూపాల్రెడ్డి పార్టీలో ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కొల్లాపూర్ మండలంలోని మంచాలకట్టకు చెందిన ఈయన కడప జిల్లాలో న్యాయవాద కోర్సు ^è దువుతూ వైఎస్సార్కు అనుచరుడిగా మారారు. ఆయన కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడిగా ఎంతో కాలం కొనసాగారు. యువజన నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఈయన కొల్లాపూర్ గ్రంథాలయ చైర్మన్గా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, డీసీసీ సభ్యుడిగా పనిచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా, ముంపు గ్రామాల పునర్నిర్మాణ కమిటీ వైస్చైర్మన్గా, సింగిల్విండో చైర్మన్గా, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ సభ్యుడిగా ఇలా వివిధ హోదాల్లో పనిచేశారు. 98 జీఓ అమలు కోసం పోరాడి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. వైఎస్సార్ మరణాంతరం జగన్ వెంట నడిచారు. ఈయన నియామకంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ పటì ష్టానికి కృషి సీఈసీ సభ్యుడిగా నియమితులైన రాంభూపాల్రెడ్డి శుక్రవారం హైదరాబాద్నుంచి ఫోన్లో మాట్లాడారు. పార్టీ పటిష్టానికి తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ మోసపూరిత విధానాలు ప్రజలకు అర్థమవుతున్నాయన్నారు. విద్యార్థి, యువజన, రైతు సంక్షేమం కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాడతామని చెప్పారు.


