breaking news
ramapuram checkpost
-
లాక్డౌన్ : అంబులెన్స్ డ్రైవర్ల కొత్త దందా
సాక్షి, హైదరాబాద్ : కరోనావైరస్ మహమ్మారి విస్తరించకుండా ముందు జాగ్రత్తగా తెలుగు రాష్ట్రాలలో లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజారవాణా మొత్తం బంద్ అయింది. అత్యవసర విభాగాలకు చెందిన వాహనాలను తప్ప వేటిని రోడ్లపైకి అనుమతించడం లేదు. ఇదే అదనుగా ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు రెచ్చిపోతున్నారు. పేషెంట్ల ముసుగులో ప్రయాణికులను తరలిస్తున్నారు. కోదాడ దగ్గర ఈ దందా బయటపడింది. పెషెంట్ల ముసుగులో హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణికులను తరలిస్తున్నారు. ఒక్కో ప్రయాణికుడి నుంచి అంబులెన్స్ డ్రైవర్లు వెయ్యి రూపాయిలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అంబులెన్స్ కావడంతో ప్రతి చెక్పోస్ట్ వద్ద పోలీసులు బారికేడ్లను తీసి పంపించారు. కానీ కోదాడ వద్ద పోలీసుల తనిఖీల్లో బయటపడ్డారు. అంబులెన్స్ డ్రైవర్లు డబ్బులు తీసుకొని ప్రయాణికులను రాష్ట్ర సరిహద్దు దాటిస్తున్నారన్న సమాచారంతో కోదాడ పోలీసులు రామపురం చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. అటుగా వచ్చిన మూడు అంబులెన్స్ను తనిఖీలు చేయగా ప్రయాణికులు బయటపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రయాణికులతో పాటు అంబులెన్స్ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే పబ్లిక్ ట్రాన్స్ పోర్టు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు ప్రైవేట్ వాహనాలను కూడా అడ్డుకోవడంతో కొత్త దందా షురూ అయ్యింది. అంబులెన్స్లో ప్రయాణికుల తరలింపు ఘటన వెలుగులోకి రావడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. ఇకపై హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో.. హైవే రోడ్లపై ఇకపై చెకింగ్ చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
వైఎస్ఆర్ కడప జిల్లాలోని రాజంపేట మండలం రామాపురం చెక్పోస్ట్ వద్ద అటవీ శాఖ అధికారులు ఆదివారం ఉదయం తనిఖీలు నిర్వహించారు.అందులోభాగంగా అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.దాంతో స్మగ్లర్లు భయపడి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో అటవీశాఖ అధికారులు వాహనాన్ని పోలీసులకు అప్పగించారు.వాహనాన్ని స్టేషన్కు తరలించి పోలీసులు సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్పు ప్రారంభించినట్లు చెప్పారు.పట్టుబడిన ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్లో రూ.20 లక్షలు ఉంటుందని వెల్లడించారు. అలాగే అదే జిల్లాలోని సుండుపల్లి మండలం గొల్లపల్లి వద్ద గత అర్థరాత్రి నుంచి పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.ఈ నేపథ్యంలో అధిక మొత్తంలో నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.