-
ఎమ్మెల్యే టిక్కెట్ పీఆర్కే!
సాక్షి ప్రతినిధి కడప : ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జమ్మలమడుగు పంచాయతీకి తెరపడినట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు అసెంబ్లీ టిక్కెట్ నాకు కావాలంటే నాకు కావాలంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పట్టుపట్టారు. దీంతో పంచాయతీ అధిష్టానం వద్దకు చేరింది. ఇద్దరితో మాట్లాడాలని మధ్యవర్తిగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఇద్దరికి మూడురోజులు గడుపు ఇచ్చి పంపారు. మూడు రోజులు పూర్తికావడంతో శుక్రవారం తిరిగి విజయవాడలో సీఎంతో భేటీ అయ్యేందుకు నాయకులు గురువారం రాత్రి వెళ్లారు. ఒకదశలో తమకే అసెంబ్లీ టిక్కెట్ కావాలని భీష్మించుకున్నారు. చివరకు సీఎం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిపైనే మొగ్గుచూపినట్లు తెలిసింది. దీంతో మంత్రి వర్గీయులు డైలమాలో పడ్డారు. దశాబ్దాలుగా కడప పార్లమెంట్ స్థానం వైఎస్ కుటుంబీకులకే జిల్లావాసులు కట్టబెడుతూ వస్తున్నారు.వారిని ఢీకొనేందుకు మంత్రి ఆది ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డిని, ఆయన కుమారుడు భూపేష్రెడ్డిలను ఎంపీ స్థానానికి పోటీ చేయాలంటూ కోరారు. ఓడిపోయే స్థానంలో తాము పోటీ చేయలేమంటూ నిర్మొహమాటంగా చెప్పడంతో మంత్రి డైలమాలో పడ్డారు. ప్రొద్దుటూరు టిక్కెట్ తనకుమారుడు సుధీర్రెడ్డికి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రిని అడిగినట్లు తెలుస్తోంది. డైలమాలో మంత్రి ఆది అనుచరులు... ఇంతకాలం దేవగుడి కుటుంబాన్ని నమ్ముకుంటూ వచ్చిన మంత్రి అనుచరులు ఇప్పుడు డైలమాలో పడ్డారు. వైఎస్సార్సీపీని వదిలి టీడీపీలోకి వెళ్లిన మంత్రి బాటలోనే నాయకులు, కార్యకర్తలు నడిచారు.ప్రస్తుతం భిన్నపరిస్థితులు తలెత్తాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా రామసుబ్బారెడ్డిని గెలిపించాలంటూ ఎలా ప్రచారం చేయాలని మదనపడుతున్నారు. ఇలా అయితే భవిష్యత్తులో తమ ఉనికి కొల్పోవాల్సి వస్తుందని నాయకులు చర్చించుకుంటున్నట్లు సమాచారం. -
మాకు రక్షణ కల్పించండి
జిల్లా కలెక్టర్, ఎస్పీలను కోరిన కౌన్సిలర్లు, ఎంపీటీసీలు కడప కార్పొరేషన్: జమ్మలమడుగు మున్సిపాలిటీకి, మండల పరిషత్కు ఎన్నిక పూర్తయ్యేవరకూ తమకు రక్షణ కల్పించాలని ఆ మున్సిపాలిటీకి చెందిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు కోరారు. ఆదివారం 9మంది కౌన్సిలర్లు, 22 మంది ఎంపీటీసీలు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ కె.సురేష్బాబు, జెడ్పీ ఛెర్మైన్ గూడూరు రవి, జమ్మలమడుగు, మైదుకూరు, కడప ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, రఘురామిరెడ్డి, అంజద్బాషాలతో కలిసి జిల్లా కలెక్టర్ కె. శశిధర్, ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్లను వారి బంగళాలలో కలిశారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 3, 4 తేదీలలో జమ్మలమడుగు మున్సిపాలిటీ ఎన్నికలో చోటు చేసుకొన్న సంఘటనలను వివరించారు. కౌన్సిలర్ జానీ ఉద్దేశపూర్వకంగానే ఎన్నికకు దూరమయ్యాడని చెప్పారు. ఇదే అదనుగా భావించిన టీడీపీ నేత రామసుబ్బారెడ్డి 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ రెండు వేలమందితో వ చ్చి అల్లర్లు సృష్టించారని, నాటుబాంబులు కూడా విసిరారన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి తాము 11 మంది, టీడీపీ సభ్యులు 10 మంది ఎన్నికలో పాల్గొన్నారన్నారు. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగి కోరం ఉన్నప్పటికీ అధికారులు ఎన్నిక జరపలేదన్నారు. సాయంత్రం వరకూ నాన్చి 4వ తేదీకి వాయిదా వేశారన్నారు. 4వ తేదీ కూడా 3 వేలమంది టిడీపీ నాయకులు ఆర్అండ్బి బంగళా వద్దకు చేరుకొని విధ్వంసం సృష్టించారని తెలిపారు. ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్మిట్టల్ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా కౌన్సిలర్ జానీని గోవాలో అదుపులోకి తీసుకున్నామని చెబుతూ సాయంత్రం 7 గంటల వరకూ ఆలస్యం చేశారన్నారు. ఎన్నిక నిర్వహించాల్సి వస్తుందని ఆర్టీవో బీపీ, షుగర్ అంటూ డ్రామా ఆడార ని ధ్వజమెత్తారు. ఈ నెల 13వ తేదీన ఎన్నిక నిర్వహిస్తామంటున్నారు, అప్పటి వరకూ మా కౌన్సిలర్లు, ఎంపీటీసీలకు ఎవరు రక్షణ కల్పిస్తారని ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ బస్సుల బోల్తా.. ముగ్గురి మృతి
- ఛాన్స్ వచ్చినా మోదీ బయోపిక్లో నటించను: సత్యరాజ్
- భారత సంతతి శాస్త్రవేత్తకు ‘షా’ అవార్డ్
- భూతల్లి పై ఒట్టేయ్...
- ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్లో..?
- World Para Athletics Championships 2024: దీప్తితో మాటామంతి
- పాలస్తీనా స్వతంత్ర దేశం
- ఇబ్రహీం రైసీకి ఇరాన్ వీడ్కోలు
- Delhi CM Arvind Kejriwal: ప్రధాని కావాలని లేదు
- ‘పంటల బీమా’కి రూ.3 వేల కోట్లు
Advertisement