breaking news
Rajiv Gandhi assassination case convict
-
రాజీవ్ హత్య కేసులో దోషులను విడుదల చేయండి: సీఎం స్టాలిన్
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులందరినీ జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాశారు. ఈ విషయమై తమిళ నాడు ప్రభుత్వం 2018లో చేసిన సిఫారసు లను ఆమోదించాలని కోరారు. నిందితులు మూడు దశాబ్దాలుగా జైలు జీవితం అనుభవి స్తున్నందున వారిని ముందుగానే విడుదల చేయాలని తాము కోరుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజాభిప్రాయం కూడా ఇదేనని తెలిపారు. ఈ నెల 19వ తేదీన రాసినట్లుగా ఉన్న ఈ లేఖ గురువారం మీడియాకు అందింది. రాజీవ్ హత్య కేసులో వి.శ్రీహరన్ అలియాస్ మురుగన్, అతని భార్య నళిని, శాంతన్, ఏజీ పెరియవాలన్, జయకుమార్, రాబర్ట్ పయాస్, రవిచంద్రన్ అనే దోషులకు విధించిన జైలు శిక్షను తగ్గించి ముందుగానే విడుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం 2018 సెప్టెంబర్లో గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్కు సిఫారసు చేసిందని స్టాలిన్ గుర్తు చేశారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరంబదూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీ ఎల్టీటీఈ ఆత్మాహుతి బాంబర్ దాడిలో అసువులు బాసిన విషయం తెలిసిందే. -
రాజీవ్ హంతకుడిపై జైల్లో దాడి
చెన్నై : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో మరణ శిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరరివలన్పై తోటి ఖైదీ ఇనుప రాడ్తో దాడి చేశాడు. వేలూరు జైల్లో యావజ్జీవ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న అతడిపై మంగళవారం ఉదయం ఈ దాడి జరిగింది. దాడిలో గాయపడిన పెరరివలన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీ రాజేశ్ కన్నా ఈ దాడికి పాల్పడినట్లు వెల్లూరు రేంజ్ జైళ్ల శాఖ డీఐజీ తెలిపారు. పెరిరవలన్కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. అతని నుదుటిపై గాయానికి నాలుగు కుట్లు పడినట్లు తెలిపారు. అయితే దాడికి గల కారణాలు తెలియరాలేదు. కాగా 9వోల్టుల బ్యాటరీద్వారా బాంబు పేల్చి రాజీవ్ను హత్య చేయడంలో పెరరివలన్ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే.