breaking news
Railway charges hike
-
పెరిగిన రైల్వే చార్జీలు
న్యూఢిల్లీ: కొత్త సంవత్సర ప్రారంభ రోజు నుంచే రైలు చార్జీలను పెంచుతున్నట్లు రైల్వేశాఖ మంగళవారం ప్రకటించింది. సబర్బన్ రైళ్లు తప్ప మిగిలిన అన్ని రకాల రైళ్లలో 2020 జనవరి 1 నుంచి చార్జీలు పెరగనున్నట్లు తెలిపింది. రోజూ సబర్బన్ రైళ్లలో ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకొని ఆ రైళ్లలో చార్జీలు పెంచట్లేదని తెలిపింది. సాధారణ నాన్ ఏసీ, నాన్ సబర్బన్ రైళ్లలో కిలోమీటరుకు 1 పైసా, మెయిల్/ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ రైళ్లలో కిలోమీటరుకు 2 పైసలు, ఏసీ క్లాసులకు కిలోమీటరుకు 4 పైసలు పెరిగాయి. ప్రీమియం రైళ్లైన శతాబ్ది, రాజధాని, దురంతో రైళ్లకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని చెప్పింది. ఢిల్లీ–కోల్కతాల మధ్య 1,447 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న రాజధాని రైల్లో కిలోమీటరుకు 4 పైసలు పెరగడంతో టికెట్ చార్జీకి రూ. 58 కలవనుంది. అయితే ఇప్పటికే బుక్ చేసిన టికెట్ల రిజర్వేషన్ ఫీజు, సూపర్ఫాస్ట్ చార్జీ వంటి వాటికి ఈ పెంపు వర్తించదని చెప్పింది. 7వ వేతన కమిషన్ భారం రైల్వేశాఖపై పడడంతో చార్జీలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. కాగా, రైల్వేబోర్డు చైర్మన్గా వీకే యాదవ్ మరో ఏడాదిపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు కేబినెట్ నియామక మండలి ఆయన పదవీ కాలాన్ని పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఆర్పీఎఫ్ పేరు మార్చిన రైల్వేశాఖ రైల్వే భద్రతా దళం (ఆర్పీఎఫ్) పేరును భారత రైల్వే భద్రతా దళం సర్వీస్గా (ఐఆర్పీఎఫ్ఎస్) మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు వ్యవస్థీకృత గ్రూప్–ఏ హోదా కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
నేటి నుంచే రైలు చార్జీల పెంపు అమలు
-
నేటి నుంచే రైలు చార్జీల పెంపు అమలు
* ‘మెట్రో’ ప్రయాణికులకు మాత్రం ఊరట * 80 కి.మీల వరకు సెకండ్ క్లాస్ సబర్బన్పై భారం లేదు * రైల్వే శాఖ తాజా నిర్ణయం న్యూఢిల్లీ: రైలు ప్రయాణం నేటినుంచి భారం కానుంది. ఇటీవల పెంచిన ప్రయాణ, రవాణా చార్జీలు ఈ రోజు(బుధవారం) నుంచే అమలు కానున్నాయి. అయితే, మెట్రో నగరాల రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చేలా.. 80 కి.మీల వరకు రెండో తరగతి సబర్బన్ రైలు ప్రయాణాలపై తాజా చార్జీల పెంపు వర్తించదని రైల్వే శాఖ మంగళవారం ప్రకటించింది. దీంతో ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై లాంటి మెట్రో నగరాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు 80 కిమీల మేర ప్రయాణించే లక్షలాది మందికి ప్రయోజనం చేకూరనుంది. రైళ్లలో ప్రయాణ చార్జీలను 14.2%, రవాణా చార్జీలను 6.5% పెంచుతూ కేంద్రం జూన్ 20న నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. కాగా, మహారాష్ట్రకు చెందిన బీజేపీ, శివసేన ఎంపీలు మంగళవారం రైల్వే మంత్రి సదానంద గౌడను కలిసి చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని కోరిన కొన్ని గంటల తరువాత రైల్వే శాఖ పలు సవరణలతో తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులోని వివరాలు.. 8 అన్రిజర్వ్డ్ విభాగంలో జూన్ 25 నుంచి కాకుండా జూన్ 28 నుంచి చార్జీల పెంపు అమల్లోకి వస్తుంది. 8 నెలవారీ పాసులు తీసుకునే ప్రయాణికులు.. గతంలో మాదిరి 30 ట్రిప్పులకు కాకుండా, 15 ట్రిప్పులకు మాత్రమే డబ్బులు చెల్లించి, ఒక నెలలో అపరిమితంగా ప్రయాణించవచ్చు. 8 {పధాన రైళ్లలో ప్రయాణానికి చార్జీల పెంపు కన్నా ముందే టికెట్లు కొనుగోలు చేసినవారు అదనపు రుసుమును చెల్లించనక్కరలేదు. 8 ముందుగా జారీ చేసిన రైల్వే టికెట్లకు కూడా చార్జీల పెంపు వర్తిస్తుంది. 8 చార్జీల పెంపు నిర్ణయం కన్నా ముందు ప్రయాణ టికెట్లు రిజర్వ్ చేసుకున్నవారు అదనపు రుసుమును బుకింగ్ లేదా రిజర్వేషన్ కౌంటర్ల వద్ద కానీ, టీటీఈ వద్ద కానీ చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ ఫీజు, సూపర్ ఫాస్ట్ సర్చార్జ్ లాంటి వాటిలో ఎలాంటి మార్పు లేదు.