-
మంత్రి ఈటలపై రైల్వే కేసు కొట్టివేత
కాజీపేట రూరల్: తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసుల్లో భాగంగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్తోపాటు మరో ఐదుగురు గురువారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. రైల్వే కోర్టు పోలీసులు, టీఆర్ఎస్ నాయకులు విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2011లో ఉప్పల్ రైల్వే స్టేషన్లో వంటావార్పు చేసినందుకు మంత్రి ఈటల రాజేందర్తోపాటు టీఆర్ఎస్ నాయకులు మాట్ల రమేష్, నవీన్కుమార్, బాలసాని కుమారస్వామి, కొలిపాక రాములు, పాక కుమారస్వామిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో వారు రైల్వే కోర్టుకు హాజరయ్యారు. కేసులను పరిశీలించిన మెజిస్ట్రేట్ రూ.800 చొప్పున ఆరుగురికి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పి, కేసు కొట్టివేసినట్లు వారు తెలిపారు. కేసులను కొట్టివేయాలి : ఈటల కోర్టు ప్రాంగణంలో ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అక్రమంగా నమోదు చేసిన కేసులను కేంద్రం వెంటనే కొట్టివేయాలని డిమాండ్ చేశారు. తనపై ఇంకా రెండు కేసులు ఉన్నాయని తెలిపారు. రైల్వే కేసులతో తెలంగాణవాదులు ఐదు ఏళ్ల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిపై పెట్టిన కేసులు కూడా చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు. రైల్వే కేసులను ఎత్తివేయాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
పరిష్కారమేదీ?
సాక్షి, నెల్లూరు : ‘రైల్వే పరిధి’ కేసులకు ఏళ్ల తరబడి పరిష్కారం లభించడం లేదు. అందుకే రైల్వే ట్రాక్, రైళ్లు నేరాలకు అడ్డాగా మారాయి. తరచూ రైళ్లలో దోపిడీలు, దొంగతనాలు జరుగుతున్నాయి. రైల్వే ట్రాక్పై ఆత్మహత్యలు, హత్యలు, ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటికి సంబంధించిన విచారణలో పురోగతి లేకపోవడంతో ఏడాదికి 80 శాతం కేసులు పరిష్కారాని కి నోచుకోలేకపోతున్నాయి. ఈ పరిణామాలే నేరాలకు వెసులుబాటు కల్పిస్తుం టే..బాధితులకు వేదన మిగులుస్తోంది. రెల్వేలో భద్రతను పర్యవేక్షించేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ) విభాగాలు పని చేస్తున్నాయి. ఆర్పీఎఫ్ రైల్వే ఆస్తుల పరిరక్షణ, ప్రయాణికుల భద్రత వంటి బాధ్యతను పర్యవేక్షిస్తుంటే.. జీఆర్పీ రైల్వే పరిధిలో జరిగే ప్రయాణికుల ఆస్తుల చోరీలు, దోపిడీలు, అనుమానాస్పద మరణాలు, ఆత్మహత్యలు, ప్రమాదాలపై విచారణ చేయాల్సి ఉంటుంది. జీఆర్పీ విభాగాన్ని పరిశీలిస్తే.. రైల్వే గణాంకాల ప్రకారం ఒక్కొక్క జీఆర్పీ స్టేషన్లో ఏడాదికి 40 నుంచి 50కి పైగా అనేక రకాల కేసులు నమోదవుతున్నాయి. ఇక నమోదుకాని కేసులు ఇంతకు రెండింతలు పైనే ఉన్నట్లు సమాచారం. జీఆర్పీ సబ్ డివిజనల్ (డీఎస్పీ స్థాయి) పరిధిలో నెల్లూరు, గూడూరు, కావలి, సూళ్లూరుపేట, బిట్రగుంట, కృష్ణపట్నం రైల్వేపోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఆయా స్టేషన్ల పరిధి విస్తృతంగా ఉండటం, సిబ్బంది, అధికారుల కొరత కారణంగా రైల్వేలో రోజురోజుకూ నేరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రైళ్లు, స్టేషన్లలో చైన్ స్నాచింగ్, నగదు దొంగతనం, తనిఖీల పేరుతో నకిలీ పోలీసుల దోపిడీలు జరుగుతున్నాయి. వీటితో పాటు రైల్వేట్రాక్లపై శవాలు కనిపిస్తుంటాయి. కొందరు ప్రమాదవశాత్తు, మరి కొందరు ఆత్మహత్యలకుపాల్పడుతున్న సంఘటనలు ఉన్నాయి. ఇక రైల్వే పరిధిలో కేసులకు పరిష్కారం లేకపోవడంతో క్రిమినల్స్ హత్యలు చేసి శవాలను రైల్వేట్రాక్లపై వేస్తున్నారు. ఈ తరహా కేసులు అధికమయ్యాయి. అక్రమ రవాణాకు రైళ్లు సేఫ్ రైళ్లలో తనిఖీలు, నిఘా లేకపోవడంతో అక్రమ రవాణాకు ఇవి సేఫ్గా మారాయి. నెల్లూరు మీదుగా దక్షిణ, ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలకు అనేక రైళ్లు వెళుతున్నాయి. నెల్లూరు కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు బంగారం, గంజాయి, బియ్యం, ఎర్రచందనం, ఇతర మాదక ద్రవ్యాలు, గుట్కాలు, ఆయిల్ తదితర వస్తువులు పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి బిల్లులు లేని అనేక విలువన వస్తువులు రవాణా అవుతున్నాయి. ఇటీవల నెల్లూరు రైల్వేస్టేషన్లో బిల్లుల్లేని సుమారు రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలు పట్టుబడటం చూస్తే రైళ్లలో ఏ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతుందో అర్థమవుతోంది. ఈ బంగారం అక్రమ రవాణా ఒక ప్రయాణికురాలి నగలు చోరీ జరగడంతో తనిఖీల్లో బయపడటం విశేషం. జనరల్ కంపార్ట్మెంట్లలో రద్దీగా ఎక్కువగా ఉండటంతో, తనిఖీలు లేకపోవడంతో యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతోంది. నిఘా కరువు ప్రధాన రైల్వేస్టేషన్లలో నిఘా కొరవడింది. సిబ్బంది కొరత దీనికి ప్రధానంగా కారణంగా చెప్పొచ్చు. గూడూరులో చాలా కాలంగా ఎస్సైపోస్టును భర్తీ చేయకపోవడంతో అనేక కేసులు పెండిగ్లో ఉండి పోయాయి. కనీసం సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అదుపు చేసే అవకాశం ఉన్నా.. రైల్వే శాఖ వాటిపై నిర్లక్ష్యం చూపుతుంది. ప్రధానంగా జిల్లాలో జంక్షన్ కేంద్రమైన గూడూరు రైల్వేస్టేషన్లో 6 ప్లాట్ఫారాలు ఉండగా వాటిల్లో కనీసం సీసీ కెమెరాలు లేవు. రెండేళ్ల క్రితమే సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆమోదం లభించినా ఇంత వరకూ ఏర్పాటు చేయలేదు. ఇక నెల్లూరు రైల్వేస్టేషన్లో 4 ప్లాట్ఫారాలు ఉండగా 18 సీసీ కెమెరాాలు ఏర్పాటు చేశారు. వీటిలో 8 కెమెరాలు పనిచేయడం లేదు. తమిళనాడు సరిహద్దులో ఉన్న సూళ్లూరుపేట స్టేషన్లో సైతం సీసీ కెమెరాలు లేవు. ఇక్కడికి సమీపంలో షార్తో పాటు కృష్ణపట్నం ఓడరేవు సైతం ఉంది. ఇక్కడ ఒక ఎస్సైని నియమించాల్సిన అవసరముంది. ప్రతిపాదన ఉన్నా అది అమలుకు నోచుకోలేదు. కావలిలోనూ సీసీలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే సవాలక్ష సమస్యలు ఉన్నాయి. ప్రతి స్టేషన్లోనూ ముఖ్యంగా టికెట్ కౌంటర్ల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి అయినా అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. పలుస్టేషన్ల పరిధిలో హెడ్కానిస్టేబుళ్ల కొరత ఉన్నట్లు సమాచారం. భర్తీ విధానం: రైల్వేలో ఆర్పీఎఫ్, జీఆర్పీ రెండు విభాగాలు ఉన్నాయి. ఆర్పీఎఫ్ నియామకాలను కేంద్ర ప్రభుత్వం స్వయంగా చేపడుతుంది. ఆర్పీఎఫ్లో క్రమం తప్పకుండా నియామకాలు జరుగుతున్నాయి. ఇక జీఆర్పీదే సమస్యంతా. తొలుత జీఆర్పీ నియామకాలను సైతం 1982 వరకు కేంద్ర ప్రభుత్వం జరిపేది. ఆ తరువాత ఈ విధానానికి స్వస్తి పలికింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన సివిల్ పోలీసులనే డిప్యుటేషన్పై రైల్వేకు పంపుతారు. రిటైర్ అయిన వారి స్థానాలతో పాటు డిప్యుటేషన్ ముగిసి తిరిగి సొంతగూటికి వెళ్లినవారి స్థానంలో ఖాళీలను భర్తీ చేయాలంటే సివిల్ నుంచి పోలీసులను రైల్వేకు పంపాల్సి ఉంది. కానీ సివిల్ పోలీసు అధికారులు సకాలంలో సిబ్బందిని ఇవ్వకపోవడంతో రైల్వేలో పోలీసు సిబ్బంది కొరత ఏర్పడిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో రైల్వేలో కేసులతో పాటు సమస్యల పరిష్కారం నత్తనడకన సాగుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement