breaking news
R narayanamurti
-
ఒక శకం ముగిసింది.. గద్దర్ మరణంపై ఆర్ నారాయణమూర్తి దిగ్భ్రాంతి
తెలంగాణ చైతన్య గీతిక, ప్రజల గొంతుక శాశ్వతంగా మూగబోయింది. ప్రజాగాయకుడు గద్దర్ అనారోగ్యంతో కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6) తుదిశ్వాస విడిచారు. గద్దర్ మరణంపై నటుడు, దర్శకనిర్మాత ఆర్ నారాయణ మూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఒక అన్నమయ్య పుట్టారు, దివంగతులయ్యారు. ఒక రామదాసు పుట్టారు, దివంగతులయ్యారు. ఒక పాల్ రబ్సన్ పుట్టారు, దివంగతులయ్యారు. ఒక గద్దర్ పుట్టారు, దివంగతులయ్యారు. ప్రజా వాగ్గేయకారులలో మరో శకం ముగిసింది' అంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్రావు. 1949లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని తుప్రాన్లో జన్మించారు. తన పాటలతో ఎంతో మందిని ఉత్తేజపరిచారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న గద్దర్కు ఇటీవలే గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితమే అపోలో ఆసుపత్రిలో గుండె చికిత్స చేయించుకున్నారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయినట్టు కూడా వైద్యులు ప్రకటించారు. ఇంతలోనే ఆయన మృతిచెందడంతో విషాదం నెలకొంది. చదవండి: విషాదం.. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత చిన్నతనంలోనే గద్దర్ మనసుకు గాయాలు.. ఎన్నెన్నో అవమానాలు -
అదే దాసరిగారికి ఇచ్చే అసలు నివాళి
‘‘కళాకారులు చిరంజీవులు. ఎప్పటికీ బతికే ఉంటారు. గురువుగారు దాసరి నారాయణరావుగారు ఇంకా మన ముందే ఉన్నట్లు అనిపిస్తోంది’’ అని దర్శక–నిర్మాత–నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి (మే 4) సందర్భంగా దాసరి మెమోరియల్ అవార్డ్స్ను హైదరాబాద్లో కళాకారులకు బహూకరించారు. దాసరి ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్, భీమవరం టాకీస్ సంస్థల నేతృత్వంలో నిర్మాత రామసత్యనారాయణ, రమణారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ దాసరి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆర్. నారాయణమూర్తికి అందజేశారు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య. శ్రీదాసరి ఎక్స్లెన్స్ అవార్డుకి దర్శకుడు పూరి జగన్నాథ్ ఎంపిక అయ్యారు. శ్రీ దాసరి నారాయణరావు అండ్ శ్రీ దాసరి పద్మ మెమోరియల్ అవార్డును రాజశేఖర్–జీవితలకు అందజేశారు. దాసరి టాలెంట్ అవార్డ్స్ దర్శకులు గౌతమ్ తిన్ననూరి, శశికరణ్ తిక్క, వెంకటేష్ మహా, వేణు ఊడుగుల, బాబ్జీలను వరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రోశయ్య మాట్లాడుతూ– ‘‘అన్ని రకాలుగా ప్రతిభ కనబరిచిన వ్యక్తి దాసరిగారు. కేంద్రమంత్రిగాను చేశారు. ఆయన ఎక్కడ ఉన్నా తనదైన ముద్ర వేస్తారు. దాసరిగారు ఇంకొంత కాలం బతికి ఉండాల్సింది. అవార్డుగ్రహీతలకు శుభాకాంక్షలు’’ అని అన్నారు. ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ – ‘‘దాసరిగారు వంద సినిమాలు తీసినప్పుడు ఆ వేడుకను ఎలా చేయాలి? అని నేను, మోహన్బాబు, మురళీమోహన్ చర్చించుకుంటున్నాం. అప్పుడు దర్శకులు కోడి రామకృష్ణగారు వచ్చి ఆ ఫంక్షన్ను తాను చేస్తానన్నారు. పాలకొల్లులో అత్యద్భుతంగా చేశారు. ఇప్పుడు దాసరిగారి పేరిట అవార్డులను ఇవ్వాలనే ఆలోచన చేసిన రామసత్యనారాయణగారికి ధన్యవాదాలు. దాసరిగారు నాలాంటి ఎందర్నో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. పేద కళాకారులకు భరోసా దాసరిగారు. ఇప్పుడు వారసత్వ సినిమాలు వస్తున్నాయి. కొత్తవారికి, పేద కళాకారులకు ఎక్కువగా ఇండస్ట్రీలో అవకాశం ఇవ్వడమే దాసరిగారికి మనం ఇచ్చే అసలు నివాళి. ఆంధ్ర ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించాలి. ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిందిగా అంబికా కృష్ణగారిని కోరుతున్నాను’’ అన్నారు. ‘‘దాసరిగారు వ్యక్తికాదు.. వ్యవస్థ. ఆయనలా ఎందరో దర్శకులు, హీరోలు, దర్శకులను పరిచయం చేసినట్లు ఏ ఇండస్ట్రీలో ఎవరూ చేయలేదు’’ అన్నారు దర్శకులు వీవీ వినాయక్. ‘‘దాసరిగారు ఫాదర్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. ఆయన అందర్నీ సమానంగా చూసేవారు’’ అన్నారు నటుడు రాజశేఖర్. ‘‘ఇవి బెస్ట్ అవార్డ్స్గా నేను భావిస్తున్నాను’’ అని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ‘‘దాసరిగారి యూనివర్సిటీలో నేనో చిన్న విద్యార్థిని. ఆయనతో కలిసి దాదాపు 40 సినిమాలు చేశాను’’ అని మురళీమోహన్ అన్నారు. ‘‘దాసరిగారి కుటుంబం చాలా పెద్దది. ఆయన అందరి గుండెల్లో బతికే ఉంటారు’’ అన్నారు ధవళ సత్యం. ‘‘గత ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశాం ’’ అన్నారు రామ సత్యనారాయణ. ‘‘దాసరిగారి పేరిట నెలకొల్పిన ఈ అవార్డుల వేడుకలో భాగస్వామ్యం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు రమణారావు. ‘‘నంది అవార్డులకు ఎంత ప్రాధాన్యం ఉందో భవిష్యత్లో దాసరి మెమోరియల్ అవార్డ్స్కు అంతే ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు ఏపీఎఫ్డీసీ చైర్మన్ అంబికాకృష్ణ. ‘‘దాసరిగారి రక్తంలోని ప్రతి కణంలో దర్శకత్వంపై ప్రేమ ఉంది’’ అని జొన్నవిత్తుల పేర్కొన్నారు. ‘‘దాసరిగారికి ఎవరూ సరిలేరు’’ అన్నారు రాజా వన్నెంరెడ్డి. ఈ కార్యక్రమంలో ‘మా’ అధ్యక్షుడు నరేశ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్లతోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
వ్యవసాయ భూములు లాక్కోవద్దు
దర్శకుడు, నటుడు ఆర్ నారాయణమూర్తి బొబ్బిలి: రాజధాని, పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో పచ్చని భూములు లాక్కోవడం సబబు కాదని, వ్యవసాయ భూముల్లో పరిశ్రమలు, ఇతర నిర్మాణాలు చేపట్టకూడదని ఇప్పటికే సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందని, దానిని పాలకులు గుర్తు పెట్టుకోవాలని సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రా అన్నపూర్ణ అని మన రాష్ట్రానికి ఎంతో పేరుందని, దానిని కాపాడుకోవవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలోని అనంతపురం జిల్లాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయని శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. దానిని ఆధారంగా చేసుకుని వాటి అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. సెక్షన్ 8 అమలు చేయడమంటే గవర్నర్ చేతిలో ప్రజాస్వామ్యాన్ని పెట్టడమేనన్నారు. ఈ సమావేశంలో ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు కూడా పాల్గొన్నారు.