-
ప్రశ్నపత్రమూ కాపీయే!?
పరీక్ష ఏదైనా.. ఈ కాలంలో కాపీలు, మాస్ కాపీలు, స్లిప్పులు సర్వసాధారణమయ్యాయి. అటువంటి ఉదంతాలు వెలుగు చూసినప్పుడు కేసులు.. విచారణలు.. తప్పదనుకుంటే పరీక్షలురద్దు చేయడమూ కొత్తేం కాదు..కానీ సమాధానాల సంగతటుంచితే.. ప్రశ్నపత్రాన్నే కాపీ కొట్టేయడం ఇప్పటివరకు ఎక్కడా వినుండం..అదేమిటి.. ప్రశ్నపత్రాన్ని ఎవరు కాపీ కొడతారు?.. అని ఆశ్చర్యపోతున్నారా.. దానివల్ల ఎవరికి ఉపయోగం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయా??..ప్రశ్నపత్రాన్ని కాపీ కొట్టడం నిజం.. గత ఐదు రోజులుగాజరిపిన స్టీల్ప్లాంట్ జూనియర్ ట్రైనీ పరీక్షల్లో ఈ విడ్డూరంచోటు చేసుకుంది.ప్రశ్నపత్రాల తయారీని తలకెత్తుకున్న ఓ ప్రైవేట్ ఏజెన్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలనే మక్కీకి మక్కీకి దించేసి ప్రశ్నపత్రాన్ని తయారు చేసేసింది.స్టీల్ప్లాంట్ రిక్రూట్మెంట్ అధికారులు దాన్నిపరిశీలించకుండానే.. ఆన్లైన్లో నిర్వహిస్తున్న జూనియర్ట్రైనీ పరీక్షలకు ఉపయోగించారు.ఈ పరిణామంతో పరీక్షలు రాసిన వేలాది అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్ప్లాంట్కు నియామకాల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొదట్లో పేపర్ లీకేజీలు, ఆ తర్వాత కోర్టు కేసులు, ఇప్పుడు మక్కా మక్కీ ప్రశ్నలు దించేశారన్న ఆరోపణలు. ఇలా చోటుచేసుకుంటున్న వరుస పరిణామలు స్టీల్ప్లాంట్ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. ఉద్యోగార్థుల ఆశలు గల్లంతు చేస్తున్నాయి. 850 జూనియర్ ట్రైనీ పోస్టుల భర్తీకి స్టీల్ప్లాంట్ నియామక ప్రక్రియ చేపట్టింది. ఈ పోస్టులకు సుమారు 65 వేల మందిఅభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ ఈనెల 9 నుంచి 14 వరకు రాష్ట్రంలోని వివిధ కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. అవే ప్రశ్నలు.. ఇక్కడా..! ఉద్యోగ నియామక పరీక్షలకు ప్రశ్నసత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలను ప్లాంట్ యాజమాన్యం ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తుంటుంది. జూనియర్ ట్రైనీ పరీక్షల విషయంలోనూ అదే చేసింది. ప్రశ్నపత్రాల తయారీ బాధ్యతను తలకెత్తుకున్న ప్రైవేట్ సంస్థ దాని కోసం ఎందుకు శ్రమపడాలనుకుందో ఏమో గానీ.. 2016, 2017 సంవత్సరాల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) నిర్వహించిన జూనియర్ ఇంజినీర్ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలను చాలావరకు కాపీ కొట్టేసి స్టీల్ప్లాంట్ జూనియర్ ట్రైనీ ప్రశ్నపత్రాలు తయారు చేసింది. ఆఫ్లైన్లో నిర్వహించిన ఎస్ఎస్సీ ప్రశ్నపత్రాలు చూసిన చాలామంది జూనియర్ ట్రైనీ ప్రశ్నపత్రంలో కనిపించాయని ఆరోపిస్తున్నారు. అవేంటంటే.. ఎస్.ఎస్.సి. 2016లో నిర్వహించిన జేఈ మెకానికల్ పరీక్ష సెట్–4ను ఈ నెల 9న ఉదయం జరిగిన స్టీల్ప్లాంట్ జేటి పరీక్షలో, సెట్–2ను అదే రోజు మధ్యాహ్నం పరీక్షలో, సెట్–3ని మే 12 ఉదయం పరీక్షలో, సెట్–6ను ఆరోజు మధ్యాహ్నం పరీక్షలో దాదాపు మక్కీకి మక్కీగా ఇచ్చేశారు. అదే విధంగా 2017 మార్చి 3న నిర్వహించిన ఎస్ఎస్సి పరీక్ష పేపర్ను సోమవారం(ఈ నెల 14) మధ్యాహ్నం పరీక్షలో యథాతథంగా దించేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీఐ అభ్యర్థులకు బీఈ ప్రశ్నలా.. ఐటిఐ అర్హతతో నిర్వహించిన జూనియర్ ట్రైనీ పరీక్షకు జూనియర్ ఇంజనీర్(బీఈ) స్థాయిలో ఇవ్వడమేంటని అభ్యర్థులు ఆందోళనతో ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్టీల్ ప్లాంట్ సీఐటీయూ నాయకులు ప్లాంట్ నియామకాల విభాగం అధికారులకు ఫిర్యాదు చేశారు. పరీక్షలు పూర్తయిన వెంటనే ఎస్.ఎస్.సి ప్రశ్నపత్రాలు, స్టీల్ప్లాంట్ ప్రశ్న పత్రాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఉత్పత్తికి తగ్గట్టు సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్న ప్లాంట్లో ఈ పరిణామాలు నియామకాల్లో మరింత జాప్యం జరిగి నష్టం వాటిల్లుతుందంటున్నారు. యాజమాన్యంఅసమర్థత వల్లే యాజమాన్యం అసమర్థత, అలక్ష్యం వల్ల నియామకాల ప్రక్రియలో వరుసగా తప్పులు జరుగుతున్నాయి. పరీక్షల నిర్వహణపై సరైన పర్యవేక్షణ లేకపోవడమే వీటన్నింటికీ కారణం. ఇలాగైతే ప్లాంట్ ఉత్పత్తికి మరిన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వెంటనే యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం – కె.ఎం. శ్రీనివాస్,స్టీల్ సీఐటీయూ నాయకుడు -
పరీక్షకు ముందే ప్రశ్నపత్రం
– తూతూ మంత్రంగా ‘పది’ ప్రీఫైనల్ పరీక్షలు అనంతపురం ఎడ్యుకేషన్ : నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు ప్రీఫైనల్ పరీక్షలకు సన్నద్ధమవుతూ కొంతమంది ఒక చోట కూర్చుని ప్రశ్నపత్రం పట్టుకుని జవాబులు వెతుకుతున్నారు. అనుమానం వచ్చిన టీచరు వారివద్దకు వెళ్లి చేతిలో ఉన్న ప్రశ్నపత్రాన్ని లాక్కున్నాడు. పరిశీలించగా అది గణితం (ఈ నెల 8న జరగాల్సిన పరీక్ష) పేపర్–2 ప్రశ్నపత్రం. గట్టిగా అడిగితే ఎవరో తమకు తెలిసిన వాళ్లు ఇచ్చారంటూ విద్యార్థులు చెప్పుకొచ్చారు. మొన్న జరిగిన అర్థ సంవత్సర పరీక్షల (సమ్మేటివ్ అసెస్మెంట్–2) నిర్వహణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రశ్నపత్రాలు జిరాక్స్ కేంద్రాలు, అంగళ్లలో లభించాయి. తాజాగా ప్రీపైనల్ పరీక్షల్లోనూ అదే పరిస్థితి. అన్ని ప్రశ్నపత్రాలు పరీక్షలకు ముందే లభిస్తున్నాయి. రహస్యం లేని పరీక్షలు తొలిసారి నిరంతర సమగ్ర మూల్యాంకం (సీసీఈ)∙విధానం అమలువుతుండడంతో అటు విద్యార్థులతో పాటు ఇటు ఉపాధ్యాయుల్లోనూ ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రీపైనల్ పరీక్షలు విద్యార్థుల సామర్థ్యాలు అంచనా వేసేందుకు చాలా ఉపయోగపతాయి. అయితే పరీక్షలకు ముందే ప్రశ్నపత్రాలు ఇలా బహిరంగంగా దొరుకుతుండడంతో ఆయా యాజమాన్యాలు, ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. విద్యార్థులు ఏయే సబ్జెక్టులో ఏమేరకు సామర్థ్యం ఉందో తెలుసుకునే వీలులేకుండా పోతోందని తల్లిదండ్రులు, యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నపత్రాల పంపిణీలో రహస్యమేదీ? వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహణ తేదీకి ముందే అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నపత్రాలు బండిళ్లు వారీగా ఆయా పాఠశాలలకు అందజేశారు. పాఠశాల యాజమాన్యం ఏ పరీక్ష రోజు ఆ పరీక్ష ప్రశ్నపత్రాల బండిల్ నేరుగా తరగతి గదిలో ఓపెన్ చేయాలి. అలాంటిది ముందే ఎవరో ఓపెన్ చేశారు. అవి విద్యార్థులకు ఎలా చేరాయన్నది అంతుచిక్కడం లేదు. ప్రశ్నపత్రం లీకైన విషయంపై డీఈఓ లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకెళ్లగా ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడుతున్నారోనని అసహనం వ్యక్తం చేశారు. విచారణ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ప్రశ్నపత్రమా...టీడీపీ కరపత్రమా!
– వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు అనంతపురం ఎడ్యుకేషన్ : కాకినాడ జేఎన్టీయూ బీటెక్ సెమిస్టర్ ప్రశ్నపత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను పేర్కొని వారి వ్యాపారాలను పొందుపరచడం చూస్తుంటే అది ప్రశ్నపత్రమా లేక తెలుగుదేశం పార్టీ కరపత్రమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సలాంబాబు అన్నారు. ప్రశ్నపత్రం తయారు చేసిన వీసీ, ప్రొఫెసర్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇలాంటి ప్రశ్నలు అడగడాన్ని ఆయన ఖండించారు. టీడీపీ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. జేఎన్టీయూ(కే) వీసీ ముఖ్యమంత్రి మెప్పు పొందేందుకు ఆయన కుటుంబ సభ్యులు, వారి వ్యాపారాల గురించి ప్రశ్నపత్రంలో రూపొందించారని ధ్వజమెత్తారు. ఇది విద్యార్థి లోకాన్ని అవమాన పరచడమేనన్నారు. దీనిపై రాష్ట్ర గవర్నర్కు విన్నవిస్తామన్నారు. విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, జిల్లా అధ్యక్షులు బండి పరుశురాం, కడప జిల్లా అధ్యక్షులు ఖాజా, యువజన విభాగం నగర అధ్యక్షులు మారుతీనాయుడు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నోటుతో ఓటుకు ఎర
ఓటింగ్ శాతం పెంపే లక్ష్యం
పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోండి
వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే స్వర్ణయుగం
No Headline
కందుకూరులో.. ఇక దూకుడే
సీఎం సవాల్ను స్వీకరించే దమ్ముందా చంద్రబాబూ?
బుర్రా సమక్షంలో టీడీపీ నాయకుల చేరిక
గెలిపించండి.. అండగా ఉంటా
నాడు – నేడుతో ప్రభుత్వ బడులకు కొత్త కళ
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement