-
క్యూ2లో ప్రైవేటు కంపెనీలకు లాభాల పంట
16 శాతం వృద్ధి: ఆర్బీఐ ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జూలై–సెప్టెంబర్)లో లిస్టెడ్ ప్రైవేటు కంపెనీల లాభాలు 16 శాతం మేర వృద్ధి చెందాయని ఆర్బీఐ తెలిపింది. అంతకుముందు త్రైమాసికంలో ఇది 11.2 శాతమేనని పేర్కొంది. తయారీ రంగంలోని కంపెనీలు అధిక నికర లాభాల ఆర్జనలో ముందున్నాయి. వడ్డీ వ్యయాల్లో ఎటువంటి మార్పు లేకపోవడం లాభాల పెరుగుదలకు దోహదం చేసింది. వరుసగా ఏడు త్రైమాసికాల క్షీణత తర్వాత ముడి సరుకుల వ్యయాలు రెండో త్రైమాసికంలో పెరిగినప్పటికీ, ఉద్యోగుల వ్యయాలు పెరిగినా కానీ లాభాలు వృద్ధి చెందడం విశేషం. తయారీ రంగ కంపెనీల విక్రయాలు సైతం రెండో త్రైమాసికంలో 3.7 శాతం వృద్ధి చెందాయి. ఇక సేవల రంగం (నాన్ ఐటీ)లోని కంపెనీల లాభాలు ఈ కాలంలో తగ్గిపోయాయి. ప్రభుత్వేతర నాన్ ఫైనాన్షియల్ కంపెనీల లాభాల వృద్ధి 1.9 శాతంగానే ఉంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరల తగ్గుదలకు బ్రేక్ పడడంతో ముడి సరుకు వ్యయాలు పెరిగాయని, లాభాలు తగ్గిపోవడానికి ఇదే కారణమని ఆర్బీఐ తెలిపింది. స్టాక్ ఎక్సేంజ్లలో లిస్ట్ అయిన 2,702 ప్రభుత్వేతర, నాన్ ఫైనాన్షియల్ రంగంలోని కంపెనీల సమాచారాన్ని సంక్షిప్తం చేసి ఆర్బీఐ ఈ వివరాలు వెల్లడించింది. -
అనిశ్చితిలో మార్కెట్..!
• అంతర్జాతీయ సంకేతాలతో కదలికలు • కంపెనీల క్యూ 2 ఫలితాల ప్రభావం • గురు నానక్ జయంతి సందర్భంగా నేడు సెలవు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అనూహ్య విజయం తదనంతర అంతర్జాతీయ సంకేతాల ప్రభావం ఈ వారం మార్కెట్పై ఉంటుందని నిపుణులంటున్నారు. ఈ వారంలో వెలువడే కంపెనీల క్యూ2 ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తదనంతరం ప్రభుత్వ చర్యలు కూడా స్టాక్ సూచీలపై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, డాలర్తో రూపారుు మారకం కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి తదితర అంశాల ప్రభావం కూడా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. గురు నానక్ జయంతి సందర్భంగా నేడు(సోమవారం) స్టాక్ మార్కెట్కు సెలవు. నేడు వెలువడే టోకు, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేస్తాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. సమీప భవిష్యత్తులో అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు, కంపెనీల క్యూ2 ఫలితాలు ప్రభావం చూపుతాయని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా పేర్కొన్నారు. అనిశ్చిత పరిస్థితుల్లోకి మార్కెట్ కదులుతోందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ చెప్పారు. ఐటీ, ఫార్మా, తదితర రంగాల పట్ల జనవరి దాకా అమెరికా కొత్త అధ్యక్షుడి విధానాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదని, అప్పటిదాకా అనిశ్చితి తప్పదని ఆయన అంచనా వేస్తున్నారు. మరోవైపు పెద్ద నోట్ల రద్దు... స్వల్ప కాలంలో వినియోగదారుల కొనుగోళ్ల తీరును ప్రభావితం చేయనున్నదని వివరించారు. ⇔ ఇక నేడు టాటా మోటార్స్, అరబిందో ఫార్మా కంపెనీలు, రేపు(మంగళవారం)గెరుుల్ ఇండియాలు సెప్టెంబర్ త్రైమాసికం(క్యూ2 )ఫలితాలను వెల్లడించనున్నారుు. ⇔ గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 455 పారుుంట్లు నష్టపోరుు 26,819 పారుుంట్ల వద్ద ముగిసింది. విదేశీ పెట్టుబడులు రెట్టింపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో ఈక్విటీల్లో విదేశీ పెట్టుబడులు రెట్టింపుకు మించి 450 కోట్ల డాలర్లకు పెరిగాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఇదే క్వార్టర్లో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు నికర అమ్మకందార్లుగా నిలిచారని ఈ నివేదిక వెల్లడించింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో ఏడు నెలల తర్వాత ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయని, ఇదే ధోరణి మూడో క్వార్టర్లో కూడా కొనసాగనున్నదని పేర్కొంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 170 కోట్ల డాలర్లు, రెండో త్రైమాసిక కాలంలో 450 కోట్ల డాలర్ల చొప్పున పెట్టుబడులు పెట్టారని వివరించింది. ఇక దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ క్యూ1లో 40 లక్షల డాలర్ల విలువైన పెట్టుబడులు పెట్టారని, కానీ, క్యూ2లో 150 కోట్ల డాలర్ల నికర అమ్మకాలు జరిపారని వివరించింది. క్యూ2లో మ్యూచువల్ ఫండ్స 70 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయని పేర్కొంది. పెట్టుబడుల్లో హెచ్చుతగ్గులు..: అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు తదితర అంశాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయని ఐసీఐసీఐ డెరైక్ట్ నివేదిక వివరించింది. యాక్సిస్ బ్యాంక్, యూపీఎల్, టాటా మోటార్స్, రిలయన్స, ఎల్ఐసీ హౌసింగ్ కంపెనీల్లో అధికంగా విదేశీ పెట్టుబడులు వచ్చాయని, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెరుుంట్స్ల్లో విదేశీ నిధుల ఉపసంహరణ జరిగిందని వెల్లడించింది. వాహన, లోహ, ఆర్థిక, ఇంధన తదితర దేశీయ ఆర్థిక కేంద్రీకృత రంగాల్లోని షేర్లలో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారని, ఫార్మా, ఐటీ వంటి విదేశీ సంబంధిత రంగాల్లోని షేర్లలో అమ్మకాలు జరిపారని నివేదిక పేర్కొంది. -
ఎస్బీఐపై మొండిబకాయిల బండ
• క్యూ2లో లాభం రూ.21 కోట్లే... 99.6 శాతం డౌన్ • స్థూల మొండిబకారుులు 7.14 శాతానికి జంప్... • భారీగా ఎగబాకిన ఎన్పీఏ కేటారుుంపులు... ముంబై: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కు మొండి బకారుులు(ఎన్పీఏ) షాకిచ్చారుు. బ్యాంక్ కన్సాలిడేటెడ్(అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభం ఘోరంగా పడిపోరుుంది. ఈ ఏడాది సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికం(2016-17, క్యూ2)లో బ్యాంక్ కేవలం రూ.20.7 కోట్ల లాభాన్ని మాత్రమే ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.4,992 కోట్లతో పోలిస్తే... ఏకంగా 99.6 శాతం దిగజారడం గమనార్హం. ప్రధానంగా ఎన్పీఏలకు కేటారుుంపులు(ప్రొవిజనింగ్) భారీగా పెరగడం, నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) స్వల్పంగానే వృద్ధి చెందడం లాభాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. ఇక క్యూ2లో కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.72,918 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో ఆదాయం రూ.66,829 కోట్లతో పోలిస్తే.. 9.1 శాతం వృద్ధి నమోదైంది. స్టాండెలోన్గా 35 శాతం తగ్గుదల... ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాల(స్టాండెలోన్) ప్రాతిపదికన ఎస్బీఐ నికర లాభం క్యూ2లో రూ.2,538 కోట్లకు తగ్గిపోరుుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 3,879 కోట్లతో పోలిస్తే 35 శాతం క్షీణించింది. ఆదాయం 8.2 శాతం పెరుగుదలతో రూ. 46,855 కోట్ల నుంచి రూ.50,743 కోట్లకు చేరింది. మార్కెట్ విశ్లేషకులు సెప్టెంబర్ క్వార్టర్లో బ్యాంక్ స్టాండెలోన్ లాభం రూ.2,697 కోట్లుగా, ఆదాయం రూ.57,421 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. రూ. లక్ష కోట్లకు దాటిన ఎన్పీఏలు... సమీక్షా కాలంలో బ్యాంక్ స్థూల ఎన్పీఏలు దాదాపు రెట్టింపు అయ్యారుు. మొత్తం రుణాల్లో 7.14 శాతానికి ఎగబాకారుు. గతేడాది క్యూ2లో ఇవి 4.15 శాతంగా ఉన్నారుు. నికర ఎన్పీఏలు కూడా 2.14 శాతం నుంచి 4.19 శాతానికి రెట్టింపయ్యారుు. విలువ పరంగా బ్యాంక్ స్థూల ఎన్పీఏలు రూ. లక్ష కోట్ల మార్కును దాటారుు. క్యూ2లో రూ.1.05,783 కోట్లకు పేరుకుపోయారుు. గతేడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ.56,834 కోట్లు మాత్రమే. ఇక నికర ఎన్పీఏలు సైతం రూ.28,592 కోట్ల నుంచి రూ.60,013 కోట్లకు దూసుకెళ్లారుు. కాగా, ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో బ్యాంక్ స్థూల ఎన్పీఏలు 6.94 శాతం, నికర ఎన్పీఏలు 4.05 శాతంగా ఉన్నారుు. మొండిబకారుులకు కేటారుుంపులు క్యూ2లో రూ.6,387 కోట్ల నుంచి రూ.8,686 కోట్లకు ఎగబాకారుు. కాగా, ఎస్బీఐ గ్రూప్ మొత్తం స్థూల ఎన్పీఏల నిష్పత్తి(జీఎన్పీఏ) రెట్టింపునకు పైగా ఎగసి 4.32 % నుంచి 8.49 శాతానికి చేరింది. నికర ఎన్పీఏలు 2.27% నుంచి 5.1 శాతానికి ఎగసింది. తాజా ఎన్పీఏలు రెట్టింపు... ఈ మూడు నెలల కాలంలో కొత్తగా రూ.10,341 కోట్ల విలువైన రుణాలు ఎన్పీఏలుగా మారారుు. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.5,875 కోట్లతో పోలిస్తే రెట్టింపయ్యారుు. మొండిబకారుులుగా మారే అవకాశం ఉన్న రుణాలకు సంబంధించి పరిశీలన జాబితా(వాచ్లిస్ట్) పరిమాణం రూ.25,951 కోట్లుగా నమోదైంది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ⇔ సెప్టెంబర్ క్వార్టర్లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 1.3% పెరిగి రూ.14,253 కోట్ల నుంచి రూ.14,437 కోట్లకు చేరింది. ⇔ ఇతర ఆదాయం 35.9% పెరిగి రూ.8,424 కోట్లుగా నమోదైంది. ⇔ బ్యాంక్ మొత్తం రుణాలు సెప్టెంబర్ చివరినాటికి రూ.14,81,831 కోట్లకు చేరారుు. క్రితం ఏడాది ఇదే కాలంలో రుణాలు రూ.13,37,153 కోట్లతో పోలిస్తే రుణ వృద్ధి 8.1%గా నమోదైంది. ⇔ మొత్తం డిపాజిట్ల పరిమాణం రూ.16,34,114 కోట్ల నుంచి రూ.18,58,999 కోట్లకు ఎగబాకారుు. 13.7 శాతం వృద్ధి చెందారుు. ⇔ ఎస్బీఐ షేరు ధర బీఎస్ఈలో శుక్రవారం 3 శాతం దిగజారి రూ.273 వద్ద స్థిరపడింది. ఎన్పీఏలకు కేటారుుంపులు 36 శాతం ఎగబాకడం లాభాలపై ప్రభావం చూపింది. ప్రధానంగా వాచ్లిస్ట్లోని రుణాల నుంచే కొత్త ఎన్పీఏలు జతయ్యారుు. వాచ్ లిస్ట్ పరిమాణం రానున్న కాలంలో మరో 5,000-7,000 కోట్లు తగ్గే అవకాశం ఉంది. ఇక రెండో త్రైమాసికంలో రుణవృద్ధి అనుకున్నదానికంటే చాలా నెమ్మదించింది. కొన్ని రంగాలకు రుణాల జారీ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించడమే దీనికి కారణం. అరుుతే, మూడో క్వార్టర్ నాటికి 11-12 శాతం రుణ వృద్ధి అంచనాలను చేరుకుంటామని భావిస్తున్నాం. ఇక టాటా గ్రూప్లో సైరస్ మిస్త్రీని చైర్మన్గా తొలగించిన తర్వాత నెలకొన్న విభేదాలపై మాకేమీ ఆందోళన లేదు(గ్రూప్ కంపెనీలకు ఎస్బీఐ భారీగానే రుణాలిచ్చింది). ఎందుకంటే సమర్థవంతమైన ప్రొఫె షనల్స్ ఉన్న టాటా గ్రూప్... ఈ తాత్కాలిక సమస్యలను వేగంగానే పరిష్కరించుకోగలదన్న విశ్వాసం ఉంది’. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ -
వేదాంత లాభం17 శాతం వృద్ధి
• క్యూ2లో రూ.1,251 కోట్లుఆదాయంలో తగ్గుదల • స్టీల్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు సిద్ధమని ప్రకటన న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ సెప్టెంబర్ త్రైమాసికంలో 1,251 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన రూ.1,069 కోట్లతో పోలిస్తే లాభంలో 17 శాతం వృద్ధి నమోదైంది. నిర్వహణ పనితీరు మెరుగుపడడం లాభాల వృద్ధికి కారణమైంది. ఆదాయం మాత్రం రూ.18,898 కోట్ల నుంచి రూ.18,029 కోట్లకు పడిపోయింది. భవిష్యత్తులో స్టీల్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు సిద్ధమని కంపెనీ ప్రకటించింది. నిర్వహణ పనితీరు కారణంగానే అధిక లాభం వచ్చినట్టు వేదాంత ప్రెసిడెంట్ (ఫైనాన్స్), గ్రూపు సీఎఫ్వో జీఆర్ అరుణ్కుమార్ వెల్లడించారు. అధిక ఇబిటా, మంచి ధరలు కూడా కలసివచ్చినట్టు చెప్పారు. కాగా, భారత్లో భవిష్యత్తులో స్టీల్ డిమాండ్ పెరిగితే తమ వ్యాపారానికి అదనపు విలువ చేకూర్చేందుకు వీలుగా ఆ అవకాశాలను పరిశీలిస్తామని వేదాంత లిమిటెడ్ సీఈవో టామ్ ఆల్బనీస్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం తమ ఐరన్వోర్ వ్యాపారం చాలా బలంగా ఉందని, ఈ దృష్ట్యా ఇతర అవకాశాలను కూడా పరిశీలిస్తామన్నారు. భారత్ 8-9 శాతం వృద్ధిని పదేళ్లపాటు నమోదుచేస్తే పెద్దఎత్తున స్టీల్ను వినియోగించే దేశంగా మారుతుందని వివరించారు. -
క్యూ2లో 10 శాతం పెరిగిన ఐటీసీ లాభం
• క్యూ2లో రూ.2,500 కోట్లు • కలసివచ్చిన సిగరెట్ల అమ్మకాలు న్యూఢిల్లీ: సిగరెట్ల అమ్మకాలు అధిక స్థాయిలో ఉండడంతో ఐటీసీ లిమిటెడ్ స్టాండలోన్ లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 10% వృద్ధి చెంది రూ.2,500 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన లాభం రూ.2,262 కోట్లుగా ఉంది. ఆదాయం 8 శాతం వృద్ధితో రూ.13,616 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ.12,611 కోట్లు. ఈ మేరకు ఐటీసీ స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమాచారం ఇచ్చింది. కేవలం సిగరెట్లు, ఎఫ్ఎంసీజీ ద్వారా ఆదాయం 8.51 శాతం వృద్ది చెంది రూ.11,200గా నమోదైంది. కేవలం సిగరెట్ల విక్రయాల ద్వారా ఆదాయం 7 శాతం పెరిగి రూ.8,528 కోట్లుగా నమోదైంది. ఇన్పుట్ వ్యయం పెరిగిపోవడం, అమ్మకాలపై ఒత్తిళ్లు, ఎఫ్ఎంసీజీ రంగంలో డిమాండ్ మందగించడం వంటి సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో స్థిరమైన ప్రదర్శన కనబరిచినట్టు ఐటీసీ తెలిపింది. రెండో త్రైమాసికంలో ఇబిటా 7.3 శాతం వృద్ధి చెందింది. మార్జిన్ల శాతం 26.8 శాతం నుంచి 26.7 శాతానికి తగ్గింది. ఐటీసీ హోటల్స్ వ్యాపారం 2.50 శాతం వృద్ధి సాధించింది. హోటల్స్ ద్వారా రూ.297 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అగ్రి వ్యాపారం ద్వారా ఆదాయం 2 శాతం వృద్ధితో రూ.1,880కోట్లుగా నమోదైంది. పేపర్ బోర్డ్, పేపర్, ప్యాకేజింగ్ ద్వారా వచ్చిన ఆదాయం పెద్దగా మార్పు ఏమీ లేకుండా రూ.1,331 కోట్లుగా నమోదైంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నందీశ్వరస్వామికి విశేషపూజలు
కేఎంసీలో పలువురు వైద్యుల బదిలీ
టీడీపీపై ప్రజల తిరుగుబాటు
నయవంచకుడు చంద్రబాబు
ప్రకృతి వ్యవసాయంతోనేల ఆరోగ్యం
బీసీ స్వగ్రామంలోనే టీడీపీకి షాక్
మాటిచ్చాడంటే.. చేస్తాడంతే
చంద్రబాబు కేరాఫ్ కరువు
కర్నూలు టీడీపీలో ‘పోల్ మేనేజ్మెంట్’ కేటుగాళ్లు!
మళ్లీ వచ్చేది ప్రజా ప్రభుత్వమే!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement