-
నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు
-
నెల్లూరు జిల్లాలో కంపించిన భూమి
సాక్షి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పలు గ్రామాల్లో సంభవించిన భూప్రకంపనలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చేజర్ల, ఆదూరుపల్లి, పుట్టుపల్లి, దాచూరు, కొల్లపనాయుడుపల్లిలలో భూప్రకంపనలు సంభవించినట్టు సమాచారం. గురువారం రాత్రి 10 గంటల సమయంలో పెద్ద శబ్దంతో భూమి కంపించడంతో ప్రజలు హడలిపోయారు. తెల్లవారుజాము వరకు ప్రకంపనలు కొనసాగినట్టు పల్లెవాసులు వెల్లడించారు. దాదాపు 8 సెకన్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లల్లో పైన ఉన్న వస్తువులు, వంట పాత్రలు కిందపడిపోయినట్టు తెలిపారు. ప్రాణ భయంతో పిల్లాపాపలతో కలిసి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశామని చెప్పారు. మంచాల మీద పడుకున్న వారు కిందకు పడిపోయినట్టు స్థానికుడొకరు వెల్లడించారు. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు గ్రామాల్లో పర్యటించారు. పెన్నా నది పరివాహక ప్రాంతం కావడంతో ఇలాంటివి సహజమని, ప్రజలు భయపడాల్సిన పనిలేదని భరోసాయిచ్చారు. శాస్త్రవేత్తలతో భూకంపన తీవ్రతను అంచనా వేయిస్తామన్నారు. భవిష్యత్తులో భూకంపం వచ్చే ప్రమాదం ఉందా, లేదా అనే దానిపై సమగ్ర పరిశీలన జరుపుతామన్నారు. అయితే ప్రజలు మాత్రం భయాందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. -
సీఎం పై 26 ఏళ్ల యువకుడి పోటీ
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి కొట్టాయం జిల్లా పుట్టుపల్లి నియోజకవర్గం పై పడింది. కేరళ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నాయకుడు ఉమెన్ చాందీపై 26 ఏళ్ల యువకుడు పోటీ చేయనున్నాడు. పోటీ చేసిన 10 సార్లు పుట్టుపల్లి నియోజక వర్గం నుంచి గెలుపొంది 11వ సారి చాందీ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. భారత దేశంలోనే యునైటెడ్ నేషన్స్ అవార్డ్ ఫర్ పబ్లిక్ సర్వీస్ అవార్డు అందుకున్న ఏకైక సీఎం చాందీ. అయినా ముఖ్యమంత్రి, మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలతో ఈ ఎన్నికలు చర్చనీయాంశమయ్యాయి. తనకు పుట్టుపల్లి నియోజకవర్గ ప్రజలకు అవినాభావసంబంధం ఉందని, నిరాధారమైన ఆరోపణలను వారు నమ్మరని చాందీ తెలిపారు. మరోవైపు 26 ఏళ్ల జేక్ సీ థామస్ను ,73 ఏళ్ల చాందీపై పుట్టుపల్లి నియోకవర్గం నుంచి సీపీఎం పోటీకి దింపింది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర యువజన విభాగం నాయకుడిగా ఉన్న థామస్ విద్యార్థి నాయకుడిగా 10 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నాడు. తొలిసారి ఏకంగా సీఎం పై పోటీకి దిగే అవకాశాన్ని సీపీఎం కల్పించింది. 'చాందీ పై వచ్చినన్ని అవినీతి ఆరోపణలు ఏ సీఎం పైనా రావడం ఇక్కడి ప్రజలు చూడలేదు. ప్రభుత్వం పనితీరుపై ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. పుట్టుపల్లిలో అభివృద్ది పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంది. ప్రజలు ఎవరికి ఓటు వేయాలో ఆలోచించుకోవడానికి ఇదే సరైన సమయం అని' థామస్ పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement