breaking news
punjab dgp
-
పంజాబ్ చరిత్రలోనే తొలిసారిగా..
చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికైన మొదటి మహిళగా విని మహాజన్ రికార్డు సృష్టించారు. కరణ్ అవతార్ సింగ్ స్థానంలో ఈమె నియమితులయ్యారు. 1987 బ్యాచ్కు చెందిన విని మహాజన్ శుక్రవారం పంజాబ్ సీఎస్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే పంజాబ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పోలీసు, సివిల్ రంగాలకు నేతృత్వం వహిస్తున్నది మహాజన్ దంపతులే కావడం విశేషం. పంజాబ్ రాష్ట్ర డీజీపీ దినకర్ గుప్తా భార్యే నూతన సీఎస్ విని మహాజన్. గత వారం రోజుల నుంచి ఈ నియామకంపై చర్చలు జరగ్గా రెండు రోజుల క్రితమే మహాజన్ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (భారత్ గట్టిగా పోరాడుతోంది: మోదీ ) అయితే దీని వెనుక భర్త దినకర్ గుప్తా లాబీయింగ్ ఉందన్న ఆరోపణలపై విని మహాజన్ ఘాటుగా స్పందించారు. డీజీపీ భార్య అయినంత మాత్రానా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తారా? దానికంటూ ఓ హోదా, అర్హత ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయి ఇలా నిరాధార ఆరోపణలు ఎలా చేస్తారంటూ మహాజన్ మండిపడ్డారు. అయితే 1987 బ్యాచ్కు చెందిన విని మహాజన్ ఆరుగురు ఇతర సహోద్యోగుల కంటే జూనియర్ కావడం గమనార్హం. రాష్ట్ర సీఎస్గా ఉన్న కరణ్ అవతార్ సింగ్ పదవీకాలం ఆగస్టు 31తో ముగియనుంది. అయితే గత కొంత కాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కరణ్ని పదవిలోంచి తొలగించాలని పలువురు కేబినెట్ మంత్రులు సైతం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీంతో పదవీకాలం ముగియకుండానే ఆయన్ని తప్పించినా మరికొన్ని నెలల్లోనే ప్రభుత్వంలో కీలక పదవి చేపట్టనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పంజాబ్ వాటర్ రెగ్యులేటరీ అథారిటీ చైర్పర్సన్ పోస్టుకు కరణ్ అవతార్ దరఖాస్తు చేస్తుకున్నట్లు తెలుస్తోంది. (అహ్మద్ పటేల్ ఇంటికి ఈడీ అధికారులు ) -
ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు, జీపీఎస్ పరికరాలు
దీనానగర్ పోలీసు స్టేషన్ మీద దాడిచేసిన ఉగ్రవాదులు భారీ ఎత్తున ఆయుధాలతో పాటు జీపీఎస్ పరికరాలు కూడా తీసుకొచ్చారు. ఈ విషయాన్ని పంజాబ్ డీజీపీ సుమేధ్ సింగ్ సైని తెలిపారు. ఉగ్రవాదులను హతమార్చేందుకు వచ్చిన బృందాలకు ఆయన స్వయంగా నాయకత్వం వహించారు. మొత్తం ఎన్కౌంటర్ ముగిసిన తర్వాత.. సైని విలేకరులతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... ఉగ్రవాదులు పాకిస్థాన్లోని నరోవల్ ప్రాంతం నుంచి వచ్చారు సుమారు 11 గంటల పాటు మొత్తం ఆపరేషన్ జరిగింది ఆపరేషన్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో డిటెక్టివ్ ఎస్పీ బల్జీత్ సింగ్, ముగ్గురు హోంగార్డులు మరణించారు. ముగ్గురు సామాన్య పౌరులను ఉగ్రవాదులు చంపేశారు. దీనానగర్ పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ గాయపడ్డారు వాళ్ల వద్ద భారీ సంఖ్యలో ఫైర్ ఆర్మ్లు, గ్రెనేడ్లు ఉన్నాయి ఉగ్రవాదుల వద్ద జీపీఎస్ సిస్టంలు కూడా ఉన్నాయి ఈ దాడి వెనక లష్కరే తాయిబా ఉండొచ్చు ఇప్పటివరకు ఏ గ్రూపూ తాము దాడి చేసినట్లు చెప్పుకోలేదు ఈ మొత్తం విషయం మీద లోతుగా దర్యాప్తు చస్తాం