Providence Equity
-
ఐడియా సెల్యులర్లో ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్నర్స్ వాటా విక్రయం
డీల్ విలువ రూ.1,288 కోట్లు న్యూఢిల్లీ: ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థ, ఐడియాలో తనకున్న మొత్తం 3.3 శాతం వాటాను విక్రయించింది. ఈ వాటాను బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా ప్రావిడెన్స్ సంస్థ అమ్మేసింది. ఈ విక్రయం విలువ రూ.1,288 కోట్లని అంచనా. ఐడియాలో వొడాఫోన్ విలీనమవుతోందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వాటా విక్రయం జరగడం విశేషం. ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థ, తన ఇన్వెస్ట్మెంట్ విభాగం పీ5 ఏషియా ఇన్వెస్ట్మెంట్ (మారిషస్) ద్వారా 12 కోట్ల షేర్లను విక్రయించిందని బీఎస్ఈ బల్క్ డీల్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ షేర్ల సగటు విక్రయ ధర రూ.107.32గాఉంది. -
ఐడియాలో 3.4 % వాటా విక్రయించిన ప్రావిడెన్స్ సంస్థ
న్యూఢిల్లీ: ఐడియా సెల్యులర్ కంపెనీలో 3.47% వాటాను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్నర్స్రూ.1,388 కోట్లకు విక్రయించింది. బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా మొత్తం 12.50 కోట్ల షేర్ల(3.47% వాటా)ను ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్నర్స్ తన ఇన్వెస్ట్మెంట్ విభాగం పీ5 ఏషియా ఇన్వెస్ట్మెంట్(మారిషస్) ద్వారా విక్రయించింది. మార్చి క్వార్టర్ నాటికి ఐడియా సెల్యులర్లో ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థకు 6.8% వాటా ఉంది. మరో వైపు మోర్గాన్ స్టాన్లీ ఏషియా(సింగపూర్) పీటీఈ సంస్థ ఐడియా సెల్యులర్కు చెందిన 6.66 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.736 కోట్లకు కొనుగోలు చేసింది. 2014, సెప్టెంబర్లో ప్రావిడెన్స్ సంస్థ 2.4% వాటాను రూ.1,414 కోట్లకు విక్రయించింది. భారత్లో మూడవ అతి పెద్ద టెలికం ఆపరేటర్గా ఉన్న ఐడియా సెల్యులర్ వినియోగదారుల సంఖ్య 16 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో కంపెనీ నికర లాభం 39 శాతం తగ్గింది.