breaking news
Progress of projects
-
పారిశ్రామిక ప్రగతి పరుగులు
ఏ పరిశ్రమ ఏర్పాటు కావాలన్నా అనుకూల వాతావరణంతోపాటు రవాణా సౌకర్యాలు, ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతో ముఖ్యం. ఇవన్నీ పుష్కలంగా ఉన్నచోట పరిశ్రమల ఏర్పాటుకు ఢోకా ఉండదు. అలాగే స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా మెండుగా దొరుకుతాయి. పై అంశాలన్నీ సమృద్ధిగా ఉన్న జిల్లాలోని మనుబోలు మండలంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోంది. మనుబోలు: గత కొన్నేళ్లుగా మనుబోలు మండలంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోంది. దీంతో స్థానికంగా ఉండే వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. మండల పరిధిలో 10 కిలోమీటర్లకు పైగా విస్తరించిన జాతీయ రహదారి, 15 కిలోమీటర్ల దూరంలో కృష్టపట్నం పోర్టు, స్థానికంగా రైల్వేస్టేషన్, 140 కిలోమీటర్ల దూరంలో చైన్నె మహానగరం ఉన్నాయి. దీంతో రోడ్డు, రైలు, జలమార్గాల ద్వారా రవాణా సౌకర్యాలకు అనువుగా ఉండడంతో పలు పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఈ నేపథ్యంలో బయట నుంచి వచ్చి చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పే వారిని మనుబోలు మండలం విశేషంగా ఆకర్షిస్తోంది. 70 శాతానికి పైగా స్థానికులే.. మనుబోలు మండల పరిధిలో పల్లవ గ్రానైట్ ఫ్యాక్టరీ, 765 కేవీ, 400 కేవీ పవర్ గ్రిడ్స్, ట్రాన్స్కో 400 కేవీ సబ్ స్టేషన్, జీడిపప్పు ఫ్యాక్టరీ, ఎస్వీఎస్ మినరల్స్, అట్టపెట్టెలు తయారు చేసే ఫ్యాక్టరీ, మెక్ డొనాల్డ్స్ ఫ్రాంచైజీ ఉన్నాయి. అలాగే హైవేకు ఇరువైపులా 5 పెట్రోల్ బంకులు, 4 దాబా హోటళ్లు ఉన్నాయి. వీటన్నింటిలో వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. పవర్ గ్రిడ్ మినహా మిగిలిన పరిశ్రమల్లో 70 శాతానికి పైగా స్థానికులే పనిచేస్తున్నారు. వీటితోపాటు త్వరలో శ్రీచక్ర ఎకోటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెద్ద పాలిస్టర్ పరిశ్రమ, ఎ టూ బి రెస్టారెంట్స్, ఎలక్ట్రిక్ కార్ చార్జింగ్ సెంటర్, స్టార్ బగ్స్లతోపాటు మరికొన్ని ఫ్రాంచైజీలు మండలంలో ఏర్పాటు కానున్నాయి. తద్వారా వందలాది మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. అన్నివిధాలా అనుకూలం మూడేళ్ల క్రితం మనుబోలు మండలంలోని అక్కంపేట సమీపంలో రోడ్డు పక్కన అకాజు ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభించాం. ముడి జీడి గింజలను దక్షణాఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటాం. హైవేకు దగ్గరగా ఉండడంతోపాటు కృష్ణపట్నం పోర్టు, చైన్నె పోర్ట్లకు కూడా రవాణా సౌకర్యం సులభతరంగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాం. మా పరిశ్రమలో ప్రస్తుతం 60 మంది పనిచేస్తున్నారు. అందరూ స్థానికులే. భవిష్యత్లో యూనిట్ను మరింత విస్తరించాలనుకుంటున్నాం. – ఆర్.శివాజీ, మేనేజింగ్ పార్టనర్, అకాజు ప్రాసెసింగ్ (ప్ర) లిమిటెడ్ మా కళ్ల ముందే ఎంతో మారిపోయింది మనుబోలు మండలం ఇటీవల కాలంలో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. దీంతో వ్యవసాయ భూముల ధరలు కూడా బాగా పెరిగాయి. ఇతర దేశాలు, రాష్టాల నుంచి ముడి సరుకులు దిగుమతి చేసుకోవాలన్నా, ఇక్కడ తయారైన ఉత్పత్తులను వాటిని ఎగుమతి చేయాలన్నా రవాణా సౌకర్యం ఎంతో ముఖ్యం. మనుబోలుకు హైవే, కృష్ణపట్నం, చైన్నై పోర్టులు, రైల్వేస్టేషన్ అనుకూలంగా ఉండడంతో పరిశ్రమలు అధికంగా ఏర్పాటవుతున్నాయి. – వెందోటి భాస్కర్రెడ్డి, రైతు,జట్ల కొండూరు అనుకూల వాతావరణం మనుబోలు మండలంలో అన్ని రకాలుగా అనుకూల వాతావరణం ఉండడంతోనే పరిశ్రమలు ఎక్కువగా ఏర్పాటవుతున్నాయని తెలుస్తోంది. రవాణా సౌకర్యాలతోపాటు పరిశ్రమలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, స్థానిక మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి సహాయ సహకారాలు ఉండడంతో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఎంతోమంది ముందుకొస్తున్నారని తెలుస్తోంది. -
కొత్త ఆయకట్టు 1.20లక్షల ఎకరాలు
ఖరీఫ్ ఆయకట్టు లక్ష్యాలపై దిశానిర్దేశం చేసిన మంత్రి హరీశ్రావు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సాగునీరందాల్సిన కొత్త ఆయకట్టుపై నీటి పారుదల శాఖ కసరత్తు కొలిక్కి వచ్చింది. పనులు పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్టుల కింద ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లోనూ 1.20 లక్షల ఎకరాల మేర సాగునీరందించి, రబీ నాటికి దాన్ని మరింత పెంచాలని లక్ష్యాలుగా పెట్టుకుంది. ఈ మేరకు దేవాదుల, మంథని, గూడెం సహా ఆదిలాబాద్ జిల్లాలోని పలు మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలోని కొత్త ఆయకట్టుపై అధికారులకు సాగునీటి శాఖ మంత్రి టి.హరీశ్రావు ఆదేశాలు జారీచేశారు. బుధవారం ఆయన రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలవల్ల వచ్చే నీటిని వ్యవసాయ భూములకు మళ్లింపు అంశంతోపాటు ఖరీఫ్ సాగుపై సమీక్షించారు. దేవాదుల ప్రాజెక్టు కింద చిన్న చిన్న పనులకు సంబంధించిన భూసేకరణ పూర్తిచేసి ఖరీఫ్లో 72వేల ఎకరాలకు సాగు నీరివ్వాలని ఆదేశించారు. కరీం నగర్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని మంథని ఎత్తిపోతల కింద 12వేల ఎకరాలకు, గూడెం ఎత్తిపోతల ద్వారా మరో 30వేల ఎకరాలకు నీరు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎల్లంపల్లి కింద 300 ఎకరాల భూసేకరణ పూర్తి చేస్తే వేములవాడలోని 50వేల ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశాలున్నాయని, దీనికోసం వెంటనే ప్రతిపాదనలు పూర్తి చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న నీల్వాయి ప్రాజెక్టు నుంచి 4 వేల ఎకరాలు, గొల్లవాగు నుంచి 5 వేల ఎకరాలు, కొమురంభీమ్ నుంచి 1,500 ఎకరాలకు నీరు అందించాలని సూచించారు. గూడెం ఎత్తిపోతల పథకం ట్రయల్న్ రవిజయవంతంగా పూర్తయినందున ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆరంభించడానికి రంగం సిద్ధం చేయాలని సూచించారు.