-
ఇంజనీంగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను తెలంగాణ ఉన్నత విద్యామండలి శనివారం విడుదల చేసింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి షెడ్యూల్ను ప్రకటించారు. జూన్ 12 నుంచి 21 వరకు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. జూన్ 16 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఈ నెల 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్లను మార్చుకొనేందుకు అవకాశం ఉందన్నారు. జూన్ 28న విద్యార్థులకు ఇంజనీరింగ్ సీట్లు కేటాయిస్తారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు 21 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పాపిరెడ్డి తెలిపారు. ఆయా కాలేజీల్లో విద్యార్థుల ప్రవేశానికి జూలై 3 వరకు గడువు విధించినట్ల షెడ్యూల్లో ప్రకటించారు. -
ర్యాగింగ్ నిరోధానికి చర్యలు చేపట్టండి
ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధానికి చర్యలు చేపట్టాలని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. ర్యాగింగ్ నిరోధానికి చర్యలు చేపట్టని కాలేజీలపై కఠిన చర్యలు చేపడతామన్నారు. హాస్టళ్లు ఉన్న కాలేజీలు, వర్సిటీల్లో రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ర్యాగింగ్పై సీనియర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, అవసరమైతే తొలి ఏడాదిలో చేరిన విద్యార్థులకు వేరుగా నివాస వసతి కల్పించాలని సూచించారు. బాలికల హాస్టళ్లల్లో మహిళా అధ్యాపకులు, బాలుర హాస్టళ్లలో పురుష అధ్యాపకులు రాత్రి వేళల్లో నిద్రించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. -
రాష్ట్రం వచ్చినా ఇంకా అసంతృప్తి
ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి తెలంగాణ రావడమే సర్వరోగ నివారిణి కాదు గత పాలకులు ఉన్నత విద్యను భ్రష్టు పట్టించారు: దేశపతి ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టాలి: కోదండరాం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా నిరుద్యోగ యువతలో అసంతృప్తి కనిపిస్తోందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం రావడం ఒక్కటే అన్ని సమస్యలకు సర్వరోగ నివారిణి కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ వికాస సమితి, తెలంగాణ సోషల్ ఫౌండేషన్, తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో ‘ఉన్న త విద్యా రంగంలో ప్రస్తుత సవాళ్లు- వాటి పరిష్కారానికి చర్యలు’ అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాపిరెడ్డి మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సిలబస్ను రూపొందించామని, దాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. తద్వారా యువతకు కొంత ఊరట లభిస్తుందన్నారు. ఉన్నత విద్యలో వివిధ కోర్సుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా సిలబస్ను రూపొందించినట్లు చెప్పారు. ఈ సదస్సులో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఆయా అంశాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించారు. తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు, సీఎం సలహాదారు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సోషల్ ఫౌండేషన్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు సుధీర్రెడ్డి ఈ సదస్సుకు అధ్యక్షులుగా వ్యవహరించారు. పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, ఆక్టా ప్రతినిధి డాక్టర్ శ్రీధర్రెడ్డి, న్యాయవాది భరత్కుమార్ తదితరులు సదస్సులో ప్రసంగించారు. ‘ప్రైవేటు’ చేతుల్లో ఉన్నత విద్య గత ప్రభుత్వాల 60 ఏళ్ల పాలనలో ఉన్నత విద్య ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. వారంతా విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారు. ప్రస్తుతం సంస్కరణలు అవసరం. యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాలి. ఖాళీలను భర్తీ చేయాలి. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశ పెట్టాలి. వర్సిటీలకు నిధులిచ్చి బలోపేతం చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ప్రైవేటు రంగాన్ని నియంత్రించాలి. - దేశపతి శ్రీనివాస్ నాటి పరిణామాలే కారణం 1990 నుంచి మొదలైన పరిణామాలే ప్రస్తుతం ఉన్నత విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం. అప్పట్నుంచే ఉన్నత విద్యలో పెట్టుబడులు పెట్టలేమని ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి. 1994 నుంచి మరీ ఎక్కువైంది. ప్రైవేటు భాగస్వామ్యం పెరిగింది. ఉన్నత విద్యను అత్యవసరంగా కాకుండా.. ఒక లగ్జరీగానే చూడాలని ప్రపంచ బ్యాంకు చెప్పడంతో సబ్సిడీలను 25 శాతం నుంచి 5 శాతానికి కేంద్రం తగ్గించింది. యూనివర్సిటీలను వదిలేసింది. 1989 తర్వాత ప్రొఫెసర్ల నియామకాలు లేవు. ప్రస్తుతం నియామకాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగం బలంగా తయారు కావాలి. వర్సిటీల్లో డెవలప్మెంట్ ప్లాన్ రూపొందించి అమలు చేయాలి. - ప్రొఫెసర్. కోదండరాం పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలి ప్రైవేటు రంగం కేవలం బోధన కే పరిమితమైంది. ప్రభుత్వ రంగం దెబ్బతింది. ఇప్పటికైనా పరిశోధన, అభివృద్ధికి (ఆర్అండ్డీ) ప్రభుత్వ రంగంలో చర్యలు మొదలు కావాలి. కొత్త రాష్ట్రం అయినందున ఈ దిశగా దృష్టి పెట్టాలి. ఉన్నత విద్యా రంగం దెబ్బతింటే అన్ని రంగాలకు అది సమస్యే అవుతుంది. - చెన్నమనేని రమేశ్, ఎమ్మెల్యే
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
ఈసీ నుంచి రాని అనుమతి.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
ఎన్నికల ప్రచారం ఎంత కష్టమో తెలిసింది: కంగనా రనౌత్
తప్పక చదవండి
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement