breaking news
process of transformations
-
రెవెన్యూలో టెన్షన్... టెన్షన్
సాక్షి, విశాఖపట్నం : రెవెన్యూలో బదిలీ లకు రంగం సిద్ధమవడంతో యంత్రాం గంలో గుబులు మొద లైంది. జీవో నెం-68 ప్రకారం బదిలీలుచేయాలని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ పరిపాలనా సౌలభ్యం పేరిట ఎవరినైనా కదిపే అవకాశముండడంతో ప్రతీఒక్కరిలో టెన్షన్ మొదలైంది. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి బదిలీ చేయాలంటూ గతంలో జీవో-57 జారీ చేశారు. ఈ జీవో ప్రకారం జిల్లాలో 659 మందికి బదిలీలకు అర్హులని లెక్కతేల్చారు. వీరిలో 470 మంది వీఆర్వోలకు కౌన్సెలింగ్ కూడా పూర్తి చేశారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని మాత్రమే స్థానచలనం కల్పించాలని జారీ చేసిన మార్గ దర్శకాలు మేరకు రెవెన్యూయేతర శాఖల్లో బదిలీలు జరిగాయి. ఆ తర్వాత జీవో నెం. 68ప్రకారం ప్రస్తుత రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలివ్వడం గందరగోళానికి దారితీసింది. ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారిని బదిలీచేయాలా? మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిరి కదపాలా లేక జీవో నెం.68 ప్రకారం 20 శాతానికి మించి బదిలీలు చేయకూడదో తెలియని మీమాంసలో రెవెన్యూ అధికారులు కొట్టుమిట్టాడు తున్నారు. 15వ తేదీకల్లా బదిలీ ప్రక్రియను పూర్తిచేయాలంటూ మూడో తేదీన జీవో జారీ చేసిన సర్కార్ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను మాత్రం ఇవ్వలేదు. దీంతో రెవెన్యూ యంత్రాంగంలో ఒకింత సందిగ్ధత కొనసాగుతోంది. పైరవీలు ప్రారంభం: మరోపక్క బదిలీలయ్యే వారే కాకుండా, కోరుకున్న పోస్టింగ్ కోసం కూడా రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ల నుంచి తహశీల్దార్ల వరకు పైరవీలు సాగిస్తున్నారు. ఇప్పటికే పరిపాలనా సౌలభ్యం పేరిట పన్నెండు మంది తహశీల్దార్లకు స్థాన చలనం కల్పించారు. తాజాగా బదిలీల ఉత్తర్వుల నేపథ్యంలో మరికొంత మంది తహశీల్దార్లతో పాటు డిప్యూటీ తహశీల్దార్లకు కూడా స్థానచలనం తప్పదని తెలుస్తోంది. తహశీల్దార్ స్థాయి అధికారులే కాదు ఇతర మినిస్టీరియల్ సిబ్బంది కూడా సొంత ప్రాంతాలు, కోరుకున్న పోస్టింగ్ల కోసం పైరవీలు సాగిస్తున్నారు. విశాఖ నగర పరిసర మండలాల్లో తహశీల్దార్లతో పాటు ఇతర కీలక పోస్టుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే వీరంతా మంత్రు లు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నారు. దీంతో వీరు ఇచ్చే సిఫార్సు లేఖలకు యమ గిరాకీ ఏర్పడింది. ఒకటి రెండ్రోజుల్లో మార్గదర్శకాలు విడుదలైతే బదిలీలపై క్లారిటీ వస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. -
బదిలీల కలవరం
ఎక్సైజ్ సీఐ, ఎస్ఐలకు తప్పని స్థానచలనం నేతల వద్దకు అధికారుల క్యూ చిత్తూరు డీసీగా నాగలక్ష్మి రాక? స్తబ్దతగా ఉన్న జిల్లా ఎక్సైజ్ శాఖలో బదిలీల ప్రక్రియ వేగవంతమైంది. దీంతో పైరవీలు ఊపందుకున్నాయి. వచ్చే నెల మొదటివారంలో అధికారులకు స్థాన చలనం తప్పనిసరి కానుంది. మరోవైపు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డెప్యూటీ కమిషనర్గా నాగలక్ష్మి రానున్నారనే వార్తలు అధికారుల్లో దడ పుట్టిస్తోంది. చిత్తూరు (అర్బన్): జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఈనెల 14న ఆదేశాలు వెలువడిన సంగతి తెలిసిందే. డెప్యూటీ కమిషనర్(డీసీ)గా కుళ్లాయప్పను, చిత్తూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్గా (ఈఎస్) నాగసుద్దయ్యను, తిరుపతి ఈఎస్గా శ్రీనివాసరావును బదిలీచేసిన విషయం విదితమే. తిరుపతిలో ఈఎస్గా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఇప్పటికే ఒంగోలులో బాధ్యతలు స్వీకరించారు. అయితే చిత్తూరుకు బదిలీ చేసిన ముగ్గురు అధికారులు ఇప్పటి వరకు ఇక్కడ బాధ్యతలు స్వీకరించకపోవడంతో కొత్తవారు ఇక్కడికి వస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అనారోగ్యం కారణంతో ఉన్న కుళ్లాయప్ప ఇక్కడ బాధ్యతలు స్వీకరించడం అనుమానంగా ఉంది. దీనికి తోడు కర్నూలు జిల్లా డీసీగా బాధ్యతలు చేపట్టిన నాగలక్ష్మికి ఉప ముఖ్యమంత్రి కేఈ.కృష్ణమూర్తి నుంచి అభయహస్తం లభించలేదని తెలిసింది. దీంతో కర్నూలు నుంచి చిత్తూరు డీసీగా రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు ఎక్సైజ్శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకో ఏమో గానీ నాగలక్ష్మి పేరు చెబితేనే జిల్లా ఎక్సైజ్శాఖలో పనిచేస్తున్న అధికారులకు దడ పుడుతోంది. ఆమె జిల్లాకు వస్తే ఇక్కడి నుంచి మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోవాల్సిందేనని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. 50 మందికి స్థాన చలనం... ఎక్సైజ్శాఖలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న పలువురు సీఐలు, ఎస్ఐలను బదిలీ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. చిత్తూరు, తిరుపతి ఎక్సైజ్ పరిధిల్లో మొత్తం 18 మంది సీఐలు, 40 మంది వరకు ఎస్ఐలు పనిచేస్తున్నారు. వీరిలో రెండేళ్లుగా ఒకే సర్కిల్లో పనిచేస్తున్న అధికారులను ఇతర సర్కిళ్లకు, ఐదేళ్లుగా జిల్లాలో పనిచేస్తున్న అధికారులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని ఇటీవల ఎక్సైజ్ శాఖ నుంచి మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఈ పద్ధతి ప్రకారం 15 మంది సీఐలు, 35 మంది ఎస్ఐలకు బదిలీలు తప్పనిసరిగా కనిపిస్తోంది. సీఐలు, ఎస్ఐల పనితీరు ఆధారంగా మార్కులు వేసి ఈ ఏడాది ఏప్రిల్ నాటికి వారికి గ్రేడింగ్లు సైతం ఇచ్చారు. బదిలీల్లో గ్రేడింగ్లతో పాటు అధికారపార్టీ నాయకుల నుంచి సిఫార్సు లేఖలు, మంత్రి నుంచి లెటర్ప్యాడ్లు పట్టుకెళ్లిన వారికి కోరుకున్న చోట పోస్టింగులు ఇవ్వనున్నట్లు ప్రచారం ఊపందుకోవడంతో అధికారులు.. రాజకీయ నాయకుల ఇళ్లచుట్టూ తిరుగుతున్నారు. మామూళ్లు సమర్పించుకోవడానికి సైతం కొందరు అధికారులు వెనుకాడటంలేదు.