-
మద్యం దుకాణాల ఏర్పాటుపై జనాగ్రహం
ఇళ్ల మధ్యలో వద్దంటూ ఆందోళనలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల మద్దతు ఉయ్యూరు :నివాసాల మధ్య మద్యం దుకాణాల ఏర్పాటుపై ప్రజాగ్రహం పెల్లుబికింది. మందు షాపులు మా మధ్యలో వద్దంటూ ప్రజాప్రతినిధులు, మహిళలు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆందోళన బాటపట్టాయి. ఈ అంశం ఎక్సైజ్ శాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు కొరకరానికొయ్యగా మారింది. ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా.. జాతీయ రహదారుల వెంట మద్యం షాపులు తీసివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మద్యం వ్యాపారులు తమ దుకాణాలను మార్చుకునే పనిలోకి దిగారు. ఈ క్రమంలోనే ప్రధాన సెంటర్లో ఉన్న రెండు మద్యం దుకాణాల వ్యాపారులు తమ దుకాణాలను 10, 12వ వార్డుల పరిధిలోకి వచ్చే కాలువకట్ల వెంట ఇళ్ల మధ్యలో పెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ చర్యలను స్థానికులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మద్దతుగా నిలిచాయి. తమ ప్రాంతాల్లో మద్యం షాపులు వద్దం టూ శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. శ్రీశ్రీనివాస విద్యాసంస్థల అధినేత డాక్టర్ పరుచూరి శ్రీనివాసరావు, 10, 12వ వార్డుల కౌన్సిలర్లు బొబ్బిలి నాగరాజు, అడపాక ఆదిలక్ష్మి, అడపాక రాంబాబు నేతృత్వంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మండలంలోని గండిగుంట గ్రామానికి చెందిన మహిళలూ ఇళ్ల మధ్యలో షాపు ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దంటూ ఎక్సైజ్ ఎస్ఐ మాధవిని కలిసి ఫిర్యాదు చేశారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సంతకాలు చేసి పాఠశాలలకు వెళ్లే రోడ్డుల్లో షాపుల ఏర్పాటుపై తమ నిరసన తెలియజేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాలేదని, ఇంకా షాపుల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వలేదని ఎక్సైజ్ అధికారులు ప్రజలకు సర్దిచెప్పి వెనక్కి పంపుతున్నారు. మద్యం షాపులకు వ్యతిరేకం : వైవీబీ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా మద్యం షాపుల ఏర్పాటుకు తాను పూర్తి వ్యతిరేకమని ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. కాలువకట్ట వాసులు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ను శుక్రవారం కలిసి తమ ప్రాంతంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యం గా ఉండే చోట షాపులు ఏర్పాటు చేస్తే సహించేది లేదన్నారు. ఎవ్వరికీ ఇబ్బంది కలగని చోట షాపులు ఏర్పాటు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఉదయం 5కే ‘ఇంటి’గంట!
చిన్నారులకు చలి కష్టాలు.. ఉదయం 8 కల్లా స్కూళ్లు తెరిచేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు చలిలో వణుకుతూ బడిబాట పడుతున్న పిల్లలు తొమ్మిది గంటలకే స్కూళ్లు తెరవాలన్న నిబంధన అమలుపై విద్యాశాఖ నిర్లక్ష్యం హైకోర్టు ఆదేశాలు సైతం గాలికి వదిలేస్తున్న పాఠశాలలు సాక్షి, హైదరాబాద్: ఉదయం 8 గంటలకే స్కూల్.. అంటే 7.45 గంటలకల్లా స్కూల్లో ఉండాలి. ఇంకేముంది ఉదయం 5 గంటలకే ఇంటి గంట మోగుతుంది.. వంటింట్లో హడావుడి మొదలవుతుంది. చిన్నారులను నిద్రలేపి.. రెడీ చేసి స్కూల్కు పంపే వరకు అంతే! సాధారణ సమయంలో అయితే ఫరవాలేదు.. కానీ ఇది చలికాలం. నిద్ర లేచేందుకు పిల్లలు మారాం చేస్తుంటారు. బలవంతంగా లేపి తయారు చేసినా అంత పొద్దున్నే పిల్లలు సరిగ్గా ఆహారం తీసుకోరు. అయిష్టంగా అయినా బడి సంచులు భుజానికి తగిలించి తల్లిదండ్రులు వారిని స్కూళ్లకు పంపుతున్నారు. చలిలో వణుక్కుంటూ ఆ చిన్నారులు పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. పెద్ద పిల్లలు కాస్త ఓర్చుకుంటున్నా.. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నుంచి ఐదో తరగతి వరకు చదివే చిన్నారులు ఇంట్లో నుంచి ఉదయం 7 గంటలకల్లా వణుక్కుంటూనే స్కూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. చిన్నపిల్లలకు అంత ఉదయమే స్కూలు అవసరమా అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నా.. అధికారులకు పట్టడం లేదు. యాజమాన్యాల్లో మార్పు రావడం లేదు. విద్యాశాఖ నిర్ణయించిన వేళల ప్రకారం ఉదయం 9 గంటల తర్వాతే పాఠశాలలు ప్రా రంభం కావాలని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని, గత సెప్టెంబర్ 25న హైకోర్టు చెప్పినా అధికారుల చెవికెక్కడం లేదు. రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో ఒకే తరహా వేళలను అమ లు చేయడంలో విద్యాశాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో 24 వేల ప్రైవేటు స్కూళ్లలో 54 లక్షల మంది విద్యార్థుల్లో దాదాపు 25 లక్షల మంది నర్సరీ నుంచి ఐదో తరగతి చదువుతున్న వారే ఉన్నారు. వారంతా ప్రస్తుతం చలిలో స్కూళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నా విద్యాశాఖకు పట్టడం లేదు. ఏమంటే ప్రభుత్వ స్కూళ్లు 9 గంటల తర్వాతే ప్రారంభమవుతున్నాయని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. ఒక్కో స్కూలు.. ఒక్కో టైం : ఒక్కో స్కూల్లో ఒక్కో రకమైన సమయం.. ఓ స్కూళ్లో ఉదయం 7:30 గంటలకే తరగతులు ప్రారంభమైతే.. మరొక స్కూల్లో 8 గంటలకు.. ఇంకొక స్కూల్లో 8:15 గంటలకే తరగతులు ప్రారంభిస్తున్నారు. దీంతో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ.. ఇలా ఐదో తరగతి వరకు చదివే చిన్నారులు ఉదయం స్కూళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడతున్నారు. పిల్లలే కాదు.. వారిని తయారు చేసి స్కూళ్లకు పంపించేం దుకు తల్లిదండ్రులు కూడా తంటాలు పడాల్సి వస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని కార్పొరేట్ స్కూళ్లు మొదలుకొని గ్రామీ ణ ప్రాంతాల్లోని చిన్నపాటి ప్రైవేటు స్కూళ్లు కూడా ఉదయం 8 గంటల వరకే తరగతులను ప్రారంభించేస్తున్నాయి. విద్యాశాఖ నేతృత్వంలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన విద్యా విషయక కేలండర్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు అన్నీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకే పనిచేయాలి. దీన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని గత సెప్టెంబరులో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్లను, విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement