breaking news
private lecturer
-
మోసపోయానని భావించి.. డెత్నోట్రాసి ప్రైవేట్ లెక్చరర్ బలవన్మరణం
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): రాష్ట్రంలో ఆన్లైన్ మోసాలు ఆగడం లేదు. తాజాగా బీదర్ జిల్లాలో ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు... బసవ కల్యాణ తాలూకా ఇస్లాంపురకు చెందిన ఆరతి (28) ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తోంది. ఇటీవల ఆన్లైన్లో రాజగోపాల్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. నగదు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో ఆరతి ఇతరుల వద్ద అప్పు తీసుకుని అతనికి విడతల వారీగా రూ. 2.5 లక్షల నగదు పంపింది. ఆ తరువాత అతని సెల్ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో మోసపోయినట్లు భావించిన ఆరతి డెత్నోట్ రాసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బసవకల్యాణ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: (ఉదయం ప్రేమవివాహం.. సాయంత్రానికి శవమైన సాఫ్ట్వేర్ ఇంజినీర్) -
జమ్మికుంటలో విషాదం: పోలీస్ సైరన్ విని.. పరిగెత్తి
సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): పోలీస్ సైరన్ ఓ వ్యక్తిని మృత్యుఒడికి చేర్చింది. రాత్రి సమయంలో స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా సైరన్ వినిపించడంతో పరిగెత్తి, ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ప్రకారం.. మోత్కులగూడెంకు చెందిన పొన గంటి వేణు(34) జమ్మికుంట మున్సిపాలిటీ పరిధి లోని దుర్గా కాలనీలో ఉంటున్నాడు. ఇతనికి భార్య స్వాతి, ఆరేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు అద్విక, కృత్రిక ఉన్నారు. వేణు ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్ పని చేస్తున్నాడు. దీంతోపాటు తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి తన ముగ్గురు స్నేహితులతో కలిసి, జమ్మికుంట ప్రధాన రహదారికి సమీపంలోని ఓ రెస్టారెంట్ ఎదురుగా మద్యం తాగుతున్నాడు. పెట్రోలింగ్ చే స్తున్న పోలీసులు సైరన్ మోగించడంతో నలుగురు నాలుగు దిక్కులకు పురుగులు పెట్టారు. దీంతో వేణు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయాడు. అక్కడికి దగ్గరలో ఉన్న పలువురికి బావిలో ఏదో పడిన శబ్ధం వినిపించడంతో వెంటనే వెళ్లారు. చదవండి: రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. అనంతరం నీళ్లులేని ట్యాంకులో పడేసి చీకట్లోనే ప్రమాదకరంగా ఉన్న బావిలో ముగ్గురు దూకి, గాలించారు. అయినా అతని ఆచూకీ లభించలేదు. కొక్కేలతో ఉన్న బకెట్కు తాగు కట్టి, వెతకగా వేణుకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో చాలాసేపు వెతికి అతన్ని బయటకు తీశారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వేణు (ఫైల్), వేణు కూతుళ్లు డాడీ.. లే డాడీ.. సోమవారం వేణు మృతదేహం ఇంటికి చేరింది. డాడీ.. లే డాడీ.. ఫోన్ చేస్తే వస్తున్న అన్నావు.. మమ్మీ.. డాడీ లేస్తలేడు చెప్పు.. అంటూ వేణు పెద్ద కూతురు తండ్రి మృతదేహంపై పడి, విలపించడం చూసి, స్థానికులు కంటతడి పెట్టారు. తండ్రి చితికి పెద్ద కూతురు అద్విక నిప్పంటించింది. ఇదే మండలంలో గతంలోనూ ఓ ఘటన ఇల్లందకుంట మండలంలోని మల్యాల శివారులో గతంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు మద్యం సేవిస్తుండగా పోలీస్ సైరన్ వినబడటంతో పరిగెత్తి, బావిలో పడి మృతిచెందాడు. కొన్ని సందర్భాల్లో అవసరం లేకున్నా పోలీసులు సైరన్ వేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని పలువురు అంటున్నారు. -
విద్యార్థినిని వేధించిన ప్రైవేట్ లెక్చరర్
తాళలేక ఆత్మహత్యాయత్నం మణుగూరు: ఖమ్మం జిల్లా మణుగూరు మండలం గుట్ట మల్లారంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో లెక్చరర్ వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి తండ్రి కథనం ప్రకారం... అశ్వాపు రం మండలం మల్లెమడుగు గ్రామానికి చెందిన విద్యార్థిని రోజూ కాలేజీ బస్సులో వస్తుంది. కళాశాలలో ఇంగ్లిష్ లెక్చరర్గా పనిచేస్తున్న అశ్వాపు రానికి చెందిన రాజారావు కూడా అదే బస్సులో వస్తూ విద్యార్థినిని మానసికంగా వేధిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వచ్చాక.. తనను లెక్చరర్ వేధిస్తున్నాడని, తాను ఆ కాలేజీకి వెళ్లనని సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగింది. గమనించిన తల్లిదండ్రులు ఆమెను భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. లెక్చరర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధితురాలి బంధువులు బుధవారం కళాశాల వద్ద ఆందోళన చేశారు. లెక్చరర్ పరారీలో ఉన్నాడు.