breaking news
Prevention road traffic accidents
-
ప్రమాదాల నివారణకు చర్యలు
దేవరకొండ/చింతపల్లి : రోజురోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్టు ఎస్పీ విక్రమ్జీత్దుగ్గల్ తెలిపారు. దేవరకొండ డివిజన్ పరిధిలోని పలు మండలాల పోలీస్స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది వివరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి క్రైమ్రేట్ ఏ విధంగా ఉందో తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర రహదారులపై అవసమున్న చోట త్వరలోనే పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించినట్టు వివరించారు. విద్యార్థులు, మహిళలను వేధించే పోకిరీల ఆగడాలను నిరోధించేందుకు షీటీమ్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సినిమా థియేటర్లు, కాలేజీలు, పార్కులతో పాటు పబ్లిక్ ప్రదేశాలలో మహిళలను వేధించే ఆకతాయిలు ఇకనుంచి జైలు ఊచలు లెక్కించాల్సిందేనన్నారు. జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేవని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్పీ చెప్పారు. గురువారం ఆయన దేవరకొండ పోలీస్స్టేషన్ను సందర్శించి మాట్లాడారు. సమస్యాత్మక ప్రాంతాలలో నిరంతర నిఘా ఉంటుందన్నారు. దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని నాంపల్లి, మర్రిగూడ, చింతపల్లి, చందంపేట, డిండి పోలీస్స్టేషన్లను తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు. అంతకు ముందు ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆయన వెంట దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్, సీఐ రవీందర్రెడ్డి, ఎస్ఐ మోహన్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
విజయనగరం క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు పటి ష్ట చర్యలు తీసుకోవాలని ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవాల్ పే ర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఎస్పీ గ్రేవాల్ పోలీసు అధికారులతో మాసాంతపు నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. రహదారి నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ సూచిం చారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తిం చి రోడ్లు, భవనాల శాఖ సహకారంతో హెచ్చరిక బో ర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగి వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చైన్ స్నానింగ్లు, దొంగతనాలు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టి నివారణ చర్యలు తీసుకోవాలన్నా రు. పట్టణ శివార్లలో ద్విచక్ర వాహనాలతో మఫ్టీలో సి బ్బందిని నియమించి వాహనదారులపై నిఘా ఉంచాలన్నారు. వైట్ కాలర్ నేరాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, ఆ తరహా నేరాపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. చిన్నపిల్లలపై లైంగిక వేధింపులకు పాల్ప డే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి సర్కిల్ పరిధిలో ఆస్తికి సంబంధించిన నేరాలను నియంత్రిం చేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగిం చాలని సూచించారు. ఇప్పటివరకు జరిగిన నేరాల్లో దొంగతానికి గురైన ప్రాపర్టీని తిరిగి రికవరి చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. బీట్ వ్య వస్థను పటిష్టపరచాలని ఆదేశించారు. సమావేశంలో అ దనపు ఎస్పీ ఎ.వి.రమణ, పార్వతీపురం ఎఎస్పీ రాహుల్దేవ్శర్మ, స్పెషల్బ్రాంచ్ డీఎస్పీ టి.త్రినాధ్, డీసీఆర్బీ డీఎస్పీ కె.ప్రవీణ్కుమార్, విజయనగరం డీఎస్పీ పి.వి.రత్నం, బొబ్బిలి డీఎస్పీ బి.వి.రమణమూర్తి, సీసీఎస్ డీఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.రాజేశ్వరరావు, అట్రాసిటీస్ డీఎస్పీ కె.కృష్ణప్రసన్న, ఏఆర్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు, సి.ఐలు ఆర్.శ్రీనివాసరావు, ఎ.రవికుమార్, కె.వైకుంఠరావు, కె.లక్ష్మణమూర్తి, సంజీవరావు, టి.సీతారాం, కె.వి.వి.విజయనాధ్, వి.చంద్రశేఖర్, జి.వేణుగోపాల్, వై.వి.శేషు, వి.నర్సింహమూర్తి, బి.లలిత, ఆర్.ఐలు ఎస్వీ అప్పారావు, పి.నాగేశ్వరరావు, డీపీఓ పరిపాలన అధికారి జి.త్రిమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేశవరరావు, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.