-
గెలాక్సీ గ్రానైట్లో ప్లాటినం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎంతో ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్లో అత్యంత విలువైన ప్లాటినం నిక్షిప్తమై ఉంది. విభిన్న రంగాలకు ఎంతో ఉపయుక్తమైన ఈ ఖనిజం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో లభ్యమవుతున్న గెలాక్సీ గ్రానైట్లో మిళితమై ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) లాంటి కేంద్ర సంస్థలు పరిశోధనలు నిర్వహించి ప్లాటినం లభ్యత ఏ స్థాయిలో ఉందనేది నిర్ధారిస్తే ప్రభుత్వానికి ఖనిజాదాయం పెరుగుతుంది. చీమకుర్తి మండలం రామతీర్థం పరిసరాల్లో 500 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో గెలాక్సీ గ్రానైట్ నిక్షిప్తమై ఉన్న సంగతి తెలిసిందే. గ్రానైట్ వెలికితీతకు ప్రభుత్వాలు 136 లీజులను మంజూరు చేయగా 32 మందికి పైగా లీజుదారులు 139 క్వారీలను నడుపుతూ గ్రానైట్ బ్లాక్లను తీస్తున్నారు. విభిన్న కారణాలరీత్యా పలు క్వారీల నుంచి బ్లాక్లు ఆశించిన స్థాయిలో రావడంలేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా నడుస్తున్న ఈ క్వారీలకు సంబంధించిన డంప్లు సుమారు 200 హెక్టార్లకు విస్తరించాయి. ఈ డంప్ల్లో 200 కోట్ల టన్నులకు పైగా గ్రానైట్ వేస్ట్ ఉంటుందనేది అంచనా. దక్షిణాఫ్రికాలో 80 శాతం వరకు... ప్రపంచంలో అత్యధికంగా దక్షిణాఫ్రికాలోని సుర్బురి బేసిన్లో 80 శాతం వరకు ప్లాటినం నిల్వలు ఉండగా, రష్యాలోని యురల్ పర్వత శ్రేణులు, అమెరికా, జింబాబ్వే, ఆస్ట్రేలియాలోనూ ఇది లభిస్తోంది. మన దేశంలో కర్ణాటకలోని హుట్టి బంగారు గనుల దిగువన, ఒడిశాలోని బౌలా–నౌషాహిలలో, తమిళనాడులోని సీతంపూడి గనులు, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లోనూ ‘ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ (పీజీఎం)’ లభ్యతను నిర్ధారిస్తూ పదేళ్ల కిందటే జీఎస్ఐతో సహా ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ పరిశోధనల ఫలితాలను వెల్లడించాయి. ఎన్నెన్నో ప్రయోజనాలు.. నిజానికి.. ప్లాటినం, పల్లాడియం, ఇరిడియం, రోడియం, రుథేనియం, ఓస్మియం ఖనిజాల మిళితాన్ని ‘ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ (పీజీఎం)’ అంటారు. ఈ ఆరు ఖనిజాలు భౌతిక, రసాయనిక గుణాల సారూప్యతను కలిగి ఉంటాయి. ఈ ఖనిజాల సమ్మిళితాన్ని ఇరిడియం, ప్లాటినం సబ్ గ్రూపులుగా విభజిస్తారు. ప్లాటినం, పల్లాడియం, రోడియం ఖనిజాలు శాస్త్ర సాంకేతిక, ఆరోగ్య రంగాలకు ఎంతగానో ఉపయుక్తమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే.. పెట్రోలియం రిఫైనరీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ (యాంటీ పొల్యూషన్ డివైజస్), ఫార్మాసూ్యటికల్స్, గ్లాస్, ఫెర్టిలైజర్స్, ఎక్స్పో్లజివ్స్, లాబ్స్ పరికరాల తయారీలో ప్లాటినం ఎంతగానో ఉపయోగపడుతుంది. జ్యువెలరీ రంగంలో ప్లాటినానిది ప్రత్యేక స్థానం. బంగారం, వెండి, రాగి లోహాలతో కూడిన అలంకరణ వస్తువుల తయారీలోనూ వినియోగిస్తారు. వైద్య రంగానికి సంబం«ధించి క్యాన్సర్ చికిత్సలో ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ కీమోథెరపీకి ప్రాథమికంగా ఉపయోగపడతాయి. పేస్మేకర్ తయారీకి, (డెంటిస్టరీ.. దంతసంబంధ వైద్యం) ఎగుడు దిగుడు దంతాలు, ఎత్తు దంతాలను సరిచేసి వాటిని ఒకేరీతిన అమర్చి అందాన్ని ఇనుమడింపజేయడంలోనూ ప్లాటినానిది ప్రధానపాత్ర. ఇక ప్లాటినం– ఇరిడియంలను బయోమెడికల్ పరికరాల తయారీకి విరివిగా వినియోగిస్తారు. ప్లాటినం–రోడియం కలిసిన ఖనిజాలు ఫ్లాట్ స్క్రీన్ టెలివిజన్, కంప్యూటర్ మోనిటర్, హార్డ్డిస్క్లు, సెల్ఫోన్లు, డిజిటల్ కెమెరాలు, డిస్ప్లే ప్యానల్స్, ఆటోమొబైల్ డిస్ప్లేల తయారీకి ఉపయోగపడతాయి. వంద గ్రాములు రూ.2.37 లక్షలు.. ప్లాటినం ధర కూడా ఎక్కువే. పలు సందర్భాలలో బంగారం ధరతో పోటీపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఒక గ్రాము ప్లాటినం ధర రూ.2,374లు. వంద గ్రాములు రూ.2.37 లక్షలకు పైగా పలుకుతోంది. ఆభరణాల తయారీ, అలంకరణలకు ప్లాటినం పెట్టింది పేరు. గ్రానైట్ డంప్ల నుంచి.. చీమకుర్తి గ్రానైట్లో ప్లాటినం ఉందనేది నిర్ధారితమైనందున ఇందులో ప్లాటినం సమ్మిళితాలు ఎంతశాతం.. ఎంతమేరకు లాభదాయకమనే స్పష్టత కోసం తదుపరి పరిశోధనలు నిర్వహించాలని గనుల శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలను కోరాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన జరగకముందు వరకు జీఎస్ఐ, ఓఎన్జీసీ, ఎన్జిఆర్ఐ, ఎన్ఎండీసీ, ఎంఇఎల్ఎల్ (మినరల్ ఎక్స్ల్పిరేషన్ కంపెనీ లిమిటెడ్), ఏఎండీ (అటావిుక్ మినరల్ డివిజన్), ఐబీఎం (ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్) తదితర కేంద్ర సంస్థలతో పాటు రాష్ట్ర పరిధిలోని అటవీ, జలవనరులు తదితర శాఖలతో సంయుక్తంగా స్టేట్ జియలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు సమావేశాలు జరిగేవి. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో తమకు కావాల్సిన సర్వేలు చేయాలని మైనింగ్ విభాగాలు కోరడంతో పాటు కేంద్ర సంస్థలు నిర్వహించిన ఖనిజాన్వేషణ నివేదికలను పొందేవి. తద్వారా మైనింగ్ రంగంలో ఏ రీతిన పురోగతి సాధించాలి, ఆదాయ సముపార్జన మార్గాల ప్రణాళిక సాధ్యమవుతుంది. ఇందులో భాగంగానే చీమకుర్తిలోని డంప్ల్లోని దాదాపు 200 కోట్ల టన్నుల గ్రానైట్ వేస్ట్ను ప్రాసెస్ చేయడానికి సాధ్యాసాధ్యాలపై దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
అక్రమ మైనింగ్కు చెక్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు /బేతంచెర్ల : జిల్లాలో అక్రమ మైనింగ్ను అణచివేయాలని ఎస్పీ ఆకె రవికృష్ణ పోలీసు అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా మైనింగ్ జరిపి విలువైన ఖనిజాన్ని తరలిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గనుల శాఖ అధికారులతో కలిసి అక్రమ మైనింగ్ జరగకుండా అడ్డుకట్ట వేయాలని సూచించారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి.. ఈ ప్రాంతాలో జరిగే సంఘటనలకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్హెచ్వో)దే బాధ్యతని ఎస్పీ స్పష్టం చేశారు. బుధవారం బేతంచెర్ల మండలంలోని గూటుపల్లె, హుసేనాపురం, పాపసాని కొట్టాల పరిసర ప్రాంతాల్లోని ఇనుప ఖనిజం గనులను ఆయన తనిఖీ చేశారు. ఆయన వెంట డోన్ డీఎస్పీ పీఎన్బాబు, బేతంచెర్ల సీఐ సుబ్రమణ్యం, ఎస్ఐ శ్రీధర్ ఉన్నారు. అక్రమ మైనింగ్ నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని డీఎస్పీ, సీఐ, ఎస్లను ఆయన ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారని, వాస్తవాలను దాయవద్దని వారికి సూచించారు. అక్రమ మైనింగ్ నిర్మూలనకు చర్యలు తీసుకోకపోతే మీపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఇంతవరకు ఎన్ని కేసులు నమోదు చేశారని, ఎన్ని వాహనాలను పట్టుకున్నారని ఆరా తీశారు. ఇప్పటికైనా అక్రమ మైనింగ్కు సంబంధించిన వివరాలు పంపాలని డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను ఆదేశించారు. రెవెన్యూ, మైనింగ్ శాఖ సమస్వయంతో అక్రమ మైనింగ్ నిర్మూలనకు చెక్పోస్టులు ఏర్పాటు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. మైనింగ్ అక్రమార్కులకు అడ్డుకట్ట వేయడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్నారు. అలాగే విధి నిర్వహణలో అలసత్వం వహించడం వల్లే నంద్యాల టూటౌన్ హెడ్ కానిస్టేబుల్ గురుప్రసాద్, కానిస్టేబుల్ మాబాషను సస్పెండ్ చేయడంతో పాటు ఎస్ఐ సురేంద్రనాథ్రెడ్డికి మెమో జారీ చేసినట్లు తెలిపారు. సొంత శాఖను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో చర్యలు చేపట్టామన్నారు. ఎస్హెచ్వోలదే పూర్తి బాధ్యత..! మరోవైపు అక్రమ మైనింగ్లో పోలీసులకూ వాటాలు అందుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అందుకే అక్రమంగా ఇనుప ఖనిజం తరలిపోతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలూ ఉన్నాయి. గతంలో డోన్ ప్రాంతంలో పనిచేసిన ఒక పోలీసు అధికారికి నెలవారీ మామూళ్లు ఇవ్వకపోవడంతో ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. నెలవారీ మామూళ్లు ఇంత ఇస్తేనే పట్టించుకోనని సదరు యాజమాన్యాలకు స్పష్టం చేశారు. లేనిపక్షంలో రోజూ ట్రాక్టర్లను సీజ్ చేస్తానని బెదిరించారు. చివరకు బేరం కుదిరిన తర్వాత యథావిధిగా ఇనుప ఖనిజం అక్రమ రవాణాను చూసీ చూడనట్టు వదిలేశారన్న ప్రచారమూ ఇప్పటికే ఉంది. అదేవిధంగా వెల్తుర్తి ప్రాంతంలో అధికార పార్టీ నేతలకు టన్నుకు రూ.250 చెల్లించలేదన్న కారణంగా ఒక కంపెనీకి వెళ్లే దారిని పూర్తిగా మూసివేశారు. దీనిపై న్యాయం చేయాలని అక్కడి పోలీసు అధికారులను ఆశ్రయిస్తే... కోర్టుకు వెళ్లి చూసుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఈ విధంగా మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లోని పోలీసులపై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఏకంగా చంపుతామంటూ గనులశాఖ అధికారులను బెదిరించిన నేపథ్యంలో ఎస్పీ సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ జరిగితే ఎస్హెచ్వోలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎస్పీ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా ఇనుప ఖనిజం తరలిపోతున్నా పట్టించుకోని పలువురు ఎస్హెచ్వోలకు ఎస్పీ మెమోలు జారీ చేసినట్టు సమాచారం. మరోవైపు తమకు ఎటువంటి బెదిరింపులు రాలేదని గనులశాఖ కర్నూలు అసిస్టెంటు డెరైక్టర్ (ఏడీ) నరసింహాచారి వివరణ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
సర్వీస్ అంటే ఇలా ఉంటుందా.. ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్
జితేందర్ రెడ్డి ట్రైలర్ విడుదల
వెళ్తూ వెళ్తూ...!
తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!
కేకేఆర్తో మ్యాచ్.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్
"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్
ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement