breaking news
pre matric scholarship
-
మైనారిటీ ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం పంపిణీ చేసే ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఆన్లైన్లో మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. ఈ నెల 25వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ అహ్మద్నదీమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉర్దూ వర్సిటీ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలోని దూరవిద్యా కేంద్రం విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల20 ఆఖరు తేదీగా నిర్ణయించారు. -
11వరకు ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ ఫీజు గడువు
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 4 నుంచి నిర్వహించే ఇంటర్మీడియెట్, ఎస్సెస్సీ పరీక్షలకు హాజరుకావాలనుకునే వారు ఇప్పటివరకు ఫీజు చెల్లించకపోతే.. వారు తత్కాల్ కింద ఈనెల 11వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించినట్లు సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లకు 10న తుది గడువు కేంద్ర ప్రభుత్వ ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ పొందేందుకు రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులు ఈనెల 10లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మైనారిటీ ఆర్థిక కార్పొరేషన్ వెబ్సైట్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.