breaking news
practise yoga
-
International Yoga Day 2024 : ఈ ఆసనాలతో ఎన్నిలాభాలో తెలుసా?
యోగా సాధనతో అనేక శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే అనే అవగాహన ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. మెరుగైన జీర్ణవ్యవస్థ మొదలు, గుండె జబ్బులు దాకా, ప్రశాంతమైన నిద్ర, బరువు తగ్గడం , అందం, ఆకర్షణ లాంటి ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు యోగా నిపుణులు. నిపుణులైన యోగ గురువుల సమక్షంలో కొన్ని ఆసనాలను సాధనం చేయడం ద్వారా చాలా ఆరోగ్య సమస్యలనుంచి ఉపశమనం పొందవచ్చు.యోగా సాధన ప్రయోజనాలు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.మెదడు పనితీరును మెరుగుపరుస్తుందిఒత్తిడిని దూరం చేస్తుందిఫ్లెక్సిబిలిటీని పెంచుతుందిరక్తపోటును తగ్గిస్తుందిఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందిఆందోళనను దూరం చేస్తుందిదీర్ఘకాలిక వెన్నునొప్పిని తగ్గిస్తుందిమధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెరస్థాయిలను తగ్గిస్తుందిసంతులనం భావాన్ని మెరుగుపరుస్తుందిఎముకలకు బలాన్నిస్తుంది. ఆరోగ్యకరమైన బరువుకు తోడ్పడుతుంది.గుండె జబ్బు, ఇతర కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందివజ్రాసనంఒత్తిడి, మలబద్ధకం లాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం వజ్రాసనం. మధ్యాహ్నం, రాత్రి భోజనం లేదా ఏదైనా తిన్న తర్వాత వజ్రాసనం చేయడం ద్వారా తిన్నది త్వరగా జీర్ణమవుతుంది. మలబద్ధకం,కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. శ్రద్ధగా, ఓపిగ్గా పాటిస్తే ఒత్తిడిని తరిమి కొట్టవచ్చు. అర్ధ మత్స్యేంద్రాసన,సుప్త మత్స్యేంద్రాసన, భుజంగాసనం, మర్జర్యాసనం- ఇలాంటివెన్నో జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. సుప్త బద్ధ కోణాసనంఅలసట, నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బాడీలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను ఈజీగా కరిగిస్తుంది. ముఖ్యంగా తొడలు, మోకాళ్లను నాజూకుగా చేస్తుంది. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను పెంచడం ద్వారా జీర్ణక్రియను సక్రియం చేస్తుంది.ఊర్ధ్వ ప్రసారిత పద్మాసనంఅవయవాల పనితీరును క్రమబద్దీకరిస్తుంది.. కడుపు సంబంధిత సమస్యలను నయం చేయడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది. కండరాలను బలపరుస్తుంది. వెన్నెముకకు శక్తినిస్తుంది. కాలేయం, మూత్రపిండాల పనీతీరును మెరుగుపరుస్తుంది. మార్జాలాసనంఈ ఆసనం తుంటి, వీపు, పొత్తికడుపులోని కండరాలను ఉత్తేజితం చేసి, బలపరుస్తుంది. అంతేకాక ఇది జీర్ణశయాంతర ప్రేగులతో సహా ఇతర అవయవాలను ప్రేరేపిస్తుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తుంది.తడాసానంభోజనం చేసిన తరువాత చేయడానికి ఇది ఉత్తమమైన ఆసనం. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. జీవక్రియను పెంచుతుంది.భుజంగాసనం సయాటికా నొప్పి, ఆస్తమాకు చికిత్సలో ఇది చాలా ఉపయోగపడుతుంది. వెన్నెముకను బలపరుస్తుంది కూడా. ఛాతీ, ఊపిరితిత్తులకు బలాన్నిస్తుంది. భుజాలు, పొట్ట, పిరుదుల్లోని కొవ్వును కరిగించి, దృఢ పరుస్తుంది.వీటితోపాటు పార్శ్వ సుఖాసనం, అర్ధ మత్స్యేంద్రాసన, సుప్త మత్స్యేంద్రాసన, అపానాసన, మర్జర్యాసనం-బితిలాసనం, ధనురాసనం లాంటివి చాలా ఉన్నాయి. నిపుణుడైన యోగా గురు పర్యవేక్షణలో ఆయా అవయవాల పనితీరు కోసం ప్రత్యేకంగా ఆచరించవచ్చు. -
యోగాకు సరిపోయే ఒళ్లేనా నీది?
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాని ఉద్దేశించి నితీశ్ కుమార్ వ్యాఖ్య యోగా దినోత్సవ సందర్భంగా పాట్నాలో జరిగే కార్యక్రమానికి అమిత్ షా బీహార్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ స్టంట్గా నితీశ్ అభివర్ణన పాట్నా: యోగా చేయడానికి సరిపోయే ఒళ్లేనా నీది.. అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఉద్దేశించి జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రతి రోజూ శ్రద్ధగా ఇంట్లోనే యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని సలహా ఇచ్చారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పాట్నాలో ఈనెల 21న జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొనబోతున్నారు. ఆయనను ఉద్దేశించే నితీష్ ఈ విమర్శలు చేశారు. తాను ఎన్నో ఏళ్లుగా ఇంట్లోనే యోగా చేస్తున్నానని, కానీ ఏ రోజూ పబ్లిసిటీ కోసం చేయలేదని నితీశ్ కుమార్ తెలిపారు. బీజేపీ మాత్రం యోగాను ఒక పబ్లిక్ స్టంట్లా చేస్తోందని విమర్శించారు. పాట్నాలో నిర్వహించే యోగా కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటున్న విషయం పేపర్లో చూస్తే తెలిసిందన్నారు. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ చేస్తున్న పొలిటికల్ స్టంట్ గా నితీశ్ అభివర్ణించారు.