breaking news
powerful persons list
-
2019 అత్యంత శక్తివంతులు వీరే!
న్యూఢిల్లీ : 2019 ఏడాదికి సంబంధించి ఇండియాలోనే అత్యంత శక్తివంతమైన ప్రముఖుల జాబితాను ఇండియా టుడే మ్యాగజైన్ వెల్లడించింది. ఆగస్టులో వెలువడనున్న ఇండియా టుడే మ్యాగజైన్లో రాజకీయ, సామాజిక, ఆర్థిక, సినిమా, క్రీడా మొదలైన రంగాలలో అత్యంత శక్తివంతులను ప్రాతిపదికగా ఎంచుకొని జాబితాను ప్రచురించింది. కాగా ఈ జాబితాలో 27 మంది వ్యాపారవేత్తలు, మహిళలు చోటు సంపాదించగా ఇందులో 22మంది గతేడాది చోటు సంపాదించిన వారే కావడం విశేషం. ఇక జాబితా విషయానికి వస్తే మొదటి 50 శక్తివంతమైన ప్రముఖలలో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. ఆయన కేవలం ఒక్క ఏడాదిలోనే 25 శాతం సంపదను పెంచుకున్నట్లు ఫోర్బ్స్ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. బిర్లా గ్రూఫ్ చైర్మన్ కుమారం మంగళం బిర్లా ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలవడం విశేషం. ఇక మూడవ స్థానంలో అదాని గ్రూఫ్ అధినేత గౌతమ్ అదానీ, కొటక్ మహీంద్ర బ్యాంక్ వైస్ చైర్మన్ ఉదయ్ కొటక్, మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర, టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా వరుసగా నాలుగు,ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. ఇక టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ జాబితాలో 7వ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత నటరాజన్ చంద్రశేఖరన్(టీసీఎస్), బిగ్బి అమితాబ్ బచ్చన్, హెచ్సీఎల్ చైర్మన్ శివ్ నాడార్లు వరుసగా 8,9,10 వస్థానాల్లో నిలిచారు. కాగా రాజకీయ రంగంలో ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకునిగా మొదటి స్థానాన్ని ఆక్రమించారు. 2019 లోక్సభ ఎన్నికలలో ఆయన ఒంటిచేత్తో తిరుగులేని మెజార్టీతో ఎన్డీయేను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చిన విషయం ఎవరూ మరిచిపోలేరు. ఇక, ఈ జాబితాలో మొదటి 10 మందిలో తొమ్మిది మంది బీజేపీకి చెందిన నేతలే ఉండడం గమనార్హం. ఈసారి జాబితాలో మహిళలకు కూడా పెద్ద ఎత్తున చోటు లభించడం విశేషం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, ఏక్తా కపూర్, మోనికా షెర్గిల్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ఇక సినీ ప్రముఖుల విషయానికి వస్తే బిగ్బి అమితాబ్ బచ్చన్(09), ‘ఖిలాడి’ అక్షయ్కుమార్(21), రణ్వీర్ సింగ్(27), కండల వీరుడు సల్మాన్ఖాన్(29), దీపికా పదుకొనే(42), నిర్మాత ఏక్తా కపూర్(48) జాబితాలో స్థానం సంపాదించారు. కాగా, తొలి 50 మంది ప్రముఖలు జాబితాలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ పౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్(17), ఈశా పౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్(40) చోటు సంపాదించడం గమనార్హం. -
అత్యంత శక్తిమంతుల జాబితాలో జగన్
-
అత్యంత శక్తిమంతుల జాబితాలో జగన్
దేశంలో 100 మంది అత్యంత శక్తిమంతుల జాబితా రూపొందించిన ‘ద ఇండియన్ ఎక్స్ప్రెస్’ మన రాష్ట్రం నుంచి జగన్, కేసీఆర్లకే చోటు 21వ స్థానంలో జగన్.. 2013లో 36వ స్థానం 66వ స్థానంలో నిలిచిన కేసీఆర్ 4 నుంచి 57వ స్థానానికి పడిపోయిన ప్రధాని తొలిస్థానంలో మోడీ, తర్వాత రాహుల్ సాక్షి, న్యూఢిల్లీ: అత్యంత శక్తిమంతులైన భారతీయుల జాబితాలో మన రాష్ట్రం నుంచి ఇద్దరికి చోటు లభించింది. ప్రముఖ దినపత్రిక ‘ద ఇండియన్ ఎక్స్ప్రెస్’ రూపొందించిన ఈ జాబితాలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి 21వ స్థానంలో నిలిచారు. 2013లో 36వ స్థానంలో నిలిచిన జగన్.. ఈ ఏడాది 21వ స్థానానికి ఎగబాకారు. తొలిస్థానంలో నరేంద్ర మోడీ, రెండోస్థానంలో రాహుల్ గాంధీ, మూడో స్థానంలో సోనియా గాంధీ, నాలుగో స్థానంలో కేజ్రీవాల్, ఐదో స్థానంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆరో స్థానంలో జయలలిత(తమిళనాడు సీఎం), ఏడో స్థానంలో మమతా బెనర్జీ(బెంగాల్ సీఎం), ఎనిమిదో స్థానంలో మాయావతి(బీఎస్పీ), తొమ్మిదో స్థానంలో చీఫ్ జస్టిస్ పి.సదాశివం, పదో స్థానంలో మోహన్ భగవత్(ఆర్ఎస్ఎస్), 11వ స్థానంలో రాజ్నాథ్ సింగ్(బీజేపీ), 12వ స్థానంలో శరద్ యాదవ్(జేడీయూ), 13వ స్థానంలో సుష్మా స్వరాజ్(బీజేపీ) నిలిచారు. ఆ తరువాతి స్థానాల్లో అరుణ్ జైట్లీ, ఎల్.కె.అద్వానీ, రఘురాం రాజన్, పి.చిదంబరం, అమిత్షా, ముఖేశ్ అంబానీ, నవీన్ పట్నాయక్, జగన్మోహన్రెడ్డి నిలిచారు. ఈ జాబితాలో ప్రధాని మన్మో హన్సింగ్ 57వ స్థానంలో నిలిచారు. ఆయన గత ఏడాది ప్రకటించిన జాబితాలో 4వ స్థానంలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ స్వీప్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంధ్రలో జగన్ స్వీప్ చేయనున్నారని, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ల కంటే మెరుగైన ఫలితాలు సాధించి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించనున్నారని ద ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. ఇతర పార్టీల నుంచి వైఎస్సార్ సీపీలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారని పేర్కొంది. ఇక రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు ఈ జాబితాలో 66వ స్థానం దక్కించుకున్నారు. గతేడాది జాబితాలో ఆయన పేరు లేదు. ఆయన ఈసారి తెలంగాణలో కింగ్ లేదా కింగ్మేకర్ అవుతారని ఆ దినపత్రిక పేర్కొంది.