breaking news
Poverty Conditions
-
2020లో పేదరికంలోకి 7 కోట్ల మంది.. భారత్లోనే 5.6 కోట్లు
వాషింగ్టన్: కోవిడ్-19 మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఈ వైరస్ కారణంగా దాదాపు అన్ని దేశాలు తీవ్ర ఆర్థిక, సామాజిక సంక్షోభంలోకి జారుకున్నాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఓ నివేదిక విస్తుపోయే వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చింది. కరోనా కారణంగా 2020లో ప్రపంచవ్యాప్తంగా 7.1 కోట్ల మంది నిరుపేదలుగా మారిపోయారు. అందులో 79 శాతం (5.6 కోట్లు) ఒక్క భారత్లోనే ఉండటం గమనార్హం. ‘పేదరికం, భాగస్వామ్య శ్రేయస్సు 2022’ అనే పేరుతో నివేదిక విడుదల చేసింది వరల్డ్ బ్యాంక్. కరోనా వైరస్ ప్రపంచ పేదరికంపై కోలుకోలేని దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది. వైరల్ ప్రభావంతో ప్రపంచ పేదరికం రేటు 2019లో 8.4గా ఉండగా అది 2020లో 9.3కి చేరినట్లు నివేదించింది. నివేదిక ప్రకారం.. 2020 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 7.1 కోట్ల మంది కడు పేదరికంలోకి వెళ్లారు. దీంతో మొత్తం పేదరికుల సంఖ్య 70 కోట్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. ప్రపంచ పేదరికం పెరుగుదలకు ప్రధానంగా అత్యధిక జనాభా కలిగిన దేశాలే కారణమని తెలిపింది. 7 కోట్ల మందిలో భారత్ నుంచి 5.6 కోట్ల మంది ఉన్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, ఆర్థికంగానూ భారత్ తీవ్రంగా నష్టపోయినట్లు వెల్లడించింది. మరోవైపు.. ప్రపంచంలోనే జనాభాలో తొలిస్థానంలో ఉన్న చైనా మాత్రం నామమాత్రంగానే ఉన్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్ -
పేదరికం అంచున అమెరికా బాల్యం
♦ దారిద్య్ర పరిస్థితులు ఎదుర్కొంటున్న సగం మంది చిన్నారులు ♦ 2008- 2014 మధ్య 18 శాతం పెరిగిన పేద పిల్లల సంఖ్య: నివేదిక న్యూయార్క్: అమెరికాలో సగం పిల్లలు దారిద్య్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఓ నివేదికలో వెల్లడైంది. వారందరికీ రోజువారీ అవసరాలు తీరడం కూడా కష్టంగా ఉందని పేర్కొంది. కొలంబియా వర్సిటీలోని జాతీయ పిల్లల పేదరిక కేంద్రం(ఎన్సీసీపీ) తాజాగా ఈ నివేదికను వెల్లడించింది. అమెరికాలోని సుమారు 3.1 కోట్ల మంది చిన్నారులు ఆర్థిక అస్థిరత, పేదరిక పరిస్థితుల మధ్య గడుపుతున్నారని నివేదికలో తెలిపారు. నివేదిక ప్రకారం.. 2008 నుంచి 2014 వరకు పేద చిన్నారుల సంఖ్య 18 శాతానికి పెరిగింది. తక్కువ ఆదాయం గల కుటుంబాల్లో ఉన్న పిల్లల సంఖ్య 10 శాతం పెరిగింది. 2014 లెక్కల ప్రకారం నలుగురు సభ్యులు(భార్య, భర్త, ఇద్దరు పిల్లలు) గల ఓ కుటుంబ సంవత్సర ఆదాయం 48,016 డాలర్లుగా ఉంటే ఆ కుటుంబం పేదరికంలో ఉన్నట్లు లెక్క. అయితే అంతకంటే 200 శాతం తక్కువ ఆదాయం ఆర్జిస్తున్న కుటుంబాలనే పేదరికంలో ఉన్నట్లు ఎన్సీసీపీ పరిగణనలోకి తీసుకొని లెక్కలు కట్టింది. ప్రతి పది మందిలో నలుగురి కన్నా ఎక్కువ మంది పిల్లలు దారిద్య్ర రేఖకు అత్యంత చేరువలో ఉన్నారు. 2014లో 18 ఏళ్లలోపు ఉన్నవారిలో 44 శాతం మంది తక్కువ ఆదాయం గల కుటుంబాల్లో, 21 శాతం మంది పేద కుటుంబాల్లో ఉన్నారు. ఐదేళ్లలోపు చిన్నారుల విషయంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వీరిలో 47 శాతం మంది చిన్నారులు తక్కువ ఆదాయం గల కుటుంబాల్లో ఉన్నారు.12 నుంచి 17 ఏళ్లలోపు వారిలో 40 శాతం చిన్నారులు పేద కుటుంబాల వారే. నల్లజాతి, హిస్పానిక్, అమెరికా జాతికి చెందిన పిల్లల్లో 60 శాతం మంది ి పేదరికంలో ఉండగా, ఆసియా, శ్వేతజాతివారిలో 30 శాతం పేదరికంలో ఉన్నారు.